ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఐదు రోజులపాటు విదేశీపర్యటనకు వెళ్లనున్నారు.
హైదరాబాద్: ఎల్లుండి(బుధవారం) తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఐదు రోజులపాటు విదేశీపర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తైవాన్, హాంకాంగ్, మలేషియాలలో పర్యటించనున్నారు. జూన్ 3న విదేశీపర్యటనకు బయలుదేరి ఆయా దేశాల్లోని హార్డ్ వేర్ పార్కులు, కంపెనీలను మంత్రి సందర్శించనున్నారు.