వడదెబ్బతో నలుగురు మృతి
Published Fri, Apr 21 2017 11:07 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో శుక్రవారం జిల్లాలో నలుగురు మృతి చెందారు. పత్తికొండ మండలం ఆర్.మందగిరి గ్రామానికి చెందిన రైతు కటికే నాగేంద్రరావు(43), చాగలమర్రి వినాయక నగర్ కాలనీకి చెందిన కృష్ణయ్య (58), అవుకు గ్రామానికి చెందిన నడిపి సుబ్బయ్య (57), కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్కు చెందిన ఆటో కిష్టప్ప..మృత్యువాత పడ్డారు. వివిధ పనుల నిమిత్తం వీరు ఎండలో తిరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకుపోతుండగా ఇద్దరు..చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.
Advertisement
Advertisement