ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 2న సమ్మె చేయనున్నట్టు రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి పెంకే సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
రేపు సార్వత్రిక సమ్మె
Aug 31 2016 9:01 PM | Updated on Sep 4 2017 11:44 AM
గాంధీనగర్ (కాకినాడ) :
ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 2న సమ్మె చేయనున్నట్టు రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి పెంకే సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తమ ఐదు డిమాండ్లు... వేతన సవరణ కోసం నియమించిన జి.ఓ 71 కమిటీ రిపోర్టు విడుదల చేసి వేతన సవరణ అమలు చేయాలని, పదవీ విరమణ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 60 సంవత్సారాలు కొనసాగించాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం రూ.5 లక్షలు ఇవ్వాలనీ, డీసీసీబీ ఖాళీ పోస్టులలో 50 శాతం సంఘ ఉద్యోగులతో సినియారిటీ ప్రతిపాదికన భర్తీ చేయాలని, సహకార ఉద్యోగులకు ఆరోగ్య, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement