friday
-
థియేటర్లలో గేమ్ ఛేంజర్.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!
అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్ చిత్రాలు..థియేటర్స్..గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10ఫతే(హిందీ సినిమా)-జనవరి 10ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్యాడ్ విటమ్- జనవరి 10బ్లాక్ వారెంట్ -జనవరి 10ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10డిస్నీ+ హాట్స్టార్గూస్బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10జీ5సబర్మతి రిపోర్ట్- జనవరి 10ఆహాహైడ్ అండ్ సీక్- జనవరి 10 హోయ్చోయ్నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10 -
వరలక్ష్మి కృపకు ఆఖరి శుక్రవారం...ముఖ్యంగా పెళ్లికాని పడతులకు
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండో శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, సకలశుభాలు కలగాలని ప్రార్థిస్తారు.చివరి రోజు మరింత ప్రత్యేకం..శ్రావణమాసం, శుక్రవారాలు ఎంత ప్రత్యేకమైనవో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే శుభప్రదమైన శ్రావణమాసంలో చివరి వారం కావడంతో బోలెడంత సందడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల లక్ష్మీ దేవి పూజకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఆఖరి రోజు వ్రతం చేస్తే:ఆఖరి రోజున ఉపవాసం పాటించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున యథావిధిగా రకరకాల పిండి వంటలు, క్షీరాన్నం, పళ్లు, పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ శుభసమయంలో శ్రీ యంత్రానికి పూజలు నిర్వహిస్తారు. రాత్రి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం.అలాగే వరలక్ష్మి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలను లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి, పూజ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే దీనివల్ల ఆర్థిక లబ్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది. పెళ్లికాని పడుచులకు వరం..పూజ చేసుకున్న వారి నుంచి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుంచి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. -
ఫ్రైడే ఫీలింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. దేవుని సొంత దేశం వయనాడ్ వండరింగ్స్ అంటూ 'ఫ్రైడే ఫీలింగ్' అని ట్యాగ్ చేసారు. ఇందులో అందమైన ప్రకృతిలో ఏపుగా పెరిగిన చెట్లు, మధ్యలో రోడ్డు కనువిందు చేస్తాయి. ఈ వీడియోని ఇప్పటికి వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ నుంచి విదేశాలకు ఐఫోన్స్.. చరిత్ర సృష్టించనున్న టాటా గ్రూప్ ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి వయనాడ్. కేరళలోని వయనాడ్ పచ్చని వాతావరణం, పర్వతాలు, నదులతో సందర్శకులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పురాతనమైన అలవాట్లు, ఆచారాలలు ఇప్పటికి కూడా కనిపిస్తాయి. Wayanad Wanderings. God’s own country. The stuff of an ideal weekend. #FridayFeeling pic.twitter.com/YqVgBbvj7g — anand mahindra (@anandmahindra) October 27, 2023 -
నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్కు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
శ్రీవారి సన్నిధిలో పలువురు ప్రముఖులు..!
-
ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్ను అతి త్వరలోనే పూర్తి చేయనున్నారట. ట్విటర్ కొనుగోలుకు సంబంధిత నిధులు సమకూర్చుకుంటున్న మస్క్ శుక్రవారం నాటికి కొనుగోలును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు సహ-పెట్టుబడిదారులకు మస్క్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీల్కు నిధులు సమకూర్చే బ్యాంకర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ట్విటర్ కొనుగోలు డీల్ను త్వరలోనే ముగించాలని మస్క్ నిర్ణయించినట్టు వార్త లొచ్చాయి. ముఖ్యంఆ సీక్వోయా క్యాపిటల్, బినాన్స్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ , ఇతరులతో సహా ఈక్విటీ పెట్టుబడిదారులు మస్క్ లాయర్ల నుండి ఫైనాన్సింగ్ కమిట్మెంట్కు సంబంధించిన పత్రాలను అందుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డెలావేర్ కోర్టు న్యాయమూర్తి గడువు నేపథ్యంలో శుక్రవారం నాటికి లావాదేవీని పూర్తి చేసేలా మస్క్ ప్లాన్ చేస్తున్నాడని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కొనుగోలు నిధులు సమకూర్చిన బ్యాంకులు తుది రుణ ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని బ్లూమ్బెర్గ్ నివేదించింది. అయితే తాజా పరిణామంపై, మస్క్ లాయర్లుగానీ, ట్విటర్ గానీ అధికారింగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
ఇళ్ల వద్దే శుక్రవారం నమాజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణ కోçసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్బోర్డు సీఈఓ హమీద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మసీదుల్లో జరిగే శుక్రవారం నమాజులో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మసీదులు శుక్రవారం నమాజుకు నోచుకోని పరిస్థితి ఉత్పన్నం కావద్దనే ఈ సడలింపునిస్తున్నామన్నారు. ముస్లింలందరూ ఇళ్ల వద్దే నమాజు చదువుకోవాలని, శుక్రవారం రోజు కూడా మసీదుకు రావొద్దని హైదరాబాద్లోని జామియా నిజామియా ఇస్లామిక్ వర్సిటీ ఉపకులపతి ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సీఈఓ గుర్తు చేశారు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆడిటర్లకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులను మసీదు కమిటీలకు చేరవేయాలని కోరారు. -
వద్దన్న పాట
పదమూడేళ్ల వయసులో రెబెక్కా బ్లాక్ పాడిన ‘ఫ్రైడే’ అనే పాటను ప్రపంచం తిరస్కరించింది! పాపం చిన్న పిల్ల కదా అని సరిపెట్టుకోకుండా ఛీ కొట్టింది. నీ ముఖం అంది. ‘ది వరస్ట్ సాంగ్ ఎవర్’ గా ఆ పాట లోక‘ప్రసిద్ధి’ చెందింది. రెబెక్కా ఆడి, పాడిన ఆ సింగిల్ సాంగ్ వీడియో పుట్టి తొమ్మిదేళ్లు. తొమ్మిదేళ్లుగా లోకం తిడుతున్న తిట్లను భరిస్తూనే జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంది రెబెక్కా. తిరస్కారాల నుంచే తనను తనను మలుచుకుంది. వద్దన్న పాట నుంచే భవిష్యత్తుకు కొత్త స్వరాలను సమకూర్చుకుంది. ప్రేమ దక్కని వాళ్లు చేయవలసిన పని ఇదే. జీవితానికి దగ్గరవడం. మాధవ్ శింగరాజు కొంచెం టైముందా! లేక.. ‘గాట్టా బి ఫ్రెష్. గాట్టా గో డౌన్స్టెయిర్స్.. ఇట్స్ ఫ్రైడే..’ మూడ్లో ఉన్నారా.. బెడ్రూమ్లోంచి దిగెళ్లి పళ్లు తోముకుని.. ఇంత తిని.. శుక్రవారపు సోమరి పరిమళాలను అందుకుని కిటికీలోంచి గాల్లో తేలిపోడానికి! ఇట్స్ వాలెంటైన్స్ డే కూడా కదా. ఎవరికీ అందకండి. ఇది మీ లైఫ్. శుక్ర–శని–ఆది.. మీదే లైఫ్. తర్వాతెలాగూ మీ లైఫ్ మీ బాస్ది. మీ లైఫ్ మీ ప్రిన్సిపాల్ది. మీ లైఫ్ మీ హెడ్మాస్టర్ది. ఒక్కమాట. వెళ్తూవెళ్తూనైనా యూట్యూబ్లో రెబెక్కా బ్లాక్ – ఫ్రైడే అని కొట్టి చూడండి. పదమూడేళ్ల అమ్మాయి తొమ్మిదేళ్ల క్రితం పాడిన వీడియో సాంగ్ అది. ఆమెను స్మరించుకుంటూ ప్రేమికుల రోజున ఈ పాటను చూడమని కాదు. ఆమె నిక్షేపంగా ఉన్నారు తన ఇరవై రెండేళ్ల వయసులో. రెబెక్కా బ్లాక్ తన పేరు. ‘ఫ్రైడే’ ఆ పాట పేరు. 3 నిముషాల 47 సెకన్లు ఉంటుంది. వాలెంటైన్స్ డే రోజు అంత టైమ్ని వృ«థా చెయ్యడం అన్యాయమే. బయట గులాబీ పూలకాడలు అయిపోయాయంటే.. వట్టి చేతుల్తో వెళ్లి ఐలవ్యూకి ముందు సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ కూడా ప్రేమ సిలబస్లో ఒక చాప్టరే. అలాగని బుంగమూతిని తెరిపించే పూలగుత్తేమీ కాదు కదా ‘సారీ’. వీడియో చూడకున్నా పర్లేదు. పైపై డీటెయిల్స్ చూడండి. పది లక్షలా పది వేల లైక్లు కనిపిస్తాయి. పక్కనే చూడండి. ముప్ఫై లక్షల అరవై వేల డిస్లైక్లు ఉంటాయి! రేటింగ్ చూడండి. ‘నో మెచ్యూర్ కంటెంట్’ అని ఉంటుంది. ఇక పాట చూడ్డానికేముంటుంది! చూసినా ఏం ఉంటుంది? ∙∙ ‘7 ఎ.ఎం. వేకింగ్ అప్ ఇన్ ది మార్నింగ్ గాట్టా బి ఫ్రెష్.. గాట్టా గో డౌన్ స్టెయిర్స్.. గాట్టా గెట్ డౌన్ టు ద బస్ స్టాప్.. గాట్టా క్యాచ్ మై బస్.. ఐ సీ మై ఫ్రెండ్స్..’ పాటంతా ఇదే తొందర. ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవాలన్న ఓ పదమూడేళ్ల అమ్మాయి తొందర.. రెబెక్కా బ్లాక్ ‘ఫ్రైడే’ సాంగ్ థీమ్. జీవితాన్ని ప్రేమిస్తే జీవితం మన చుట్టూ తిరుగుతుంది. వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. రెబెక్కా బ్లాక్.. జీవితాన్ని ప్రేమించింది. ప్రేమించి ఊరుకోలేదు. పాటతో ఆ ప్రేమను చూపించింది. ఎవరికీ అర్థం కాలేదు. ఇదేం పాట అన్నారు! ఇది పాటా అన్నారు. పాటలో కీట్స్ లేడు. షెల్లీ లేడు. బైరన్ లేడు. కనీసం కుర్రవృద్ధుడు జస్టిన్ బీబర్ లేడు. అసలు పొయెట్రీనే లేదు. శుక్రవారం రాగానే లేవడం, పార్టీలకు పరుగెత్తడం. ఏముంది ఇందులో? లోకం నిక్కచ్చి మాస్టారు. పదమూడేళ్ల పిల్లయినా గెలిచే తీరాలంటుంది. గెలవలేకపోతే ‘ఈ లోకంలోకి ఎందుకొచ్చావ్?’ అని అడుగుతుంది. పాడింది మాత్రమే రెబెక్కా. తన ఫీలింగ్స్ని వేరెవరికో చెప్పి తనకు కావలసినట్లు పాటను రాయించుకుంది. ప్రపంచంలోని ఒక్క లిరిక్ లవర్కి కూడా ఈ పాట నచ్చలేదు. పూర్ గర్ల్ అన్నారు. ‘ఎస్టర్డే వాజ్ థర్స్డే.. టుడే ఈజ్ ఫ్రైడే.. టుమారో ఈజ్ శాటర్ డే’ అని పాడుతుంది రెబెక్కా.. పాటలో ఓ చోట. ‘డే ఆఫ్టర్ టుమారో సండే కదా.. హహహా.. ఈ పిల్లలో విషయం లేదు. కసిగా ఏదో అవ్వాలనుకుని లోకం మీద విసురుగా పడింది’ అని కామెంట్స్. సిస్టమ్ని షట్ డౌన్ చేసేస్తే ఈ కామెంట్స్ అన్ని మాయమౌతాయి. కానీ స్కూల్ మాయమౌతుందా? సెలవులొచ్చే వరకు ఆన్లోనే ఉంటుంది. సెలవులయ్యాక మళ్లీ స్కూల్. పాటను యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన రోజు మొదలైన వెవ్వెవ్వేలు రెబెక్కాను టీనేజ్ అంతా వెంటాడాయి. స్కూల్లో టీచర్లు కూడా ఆమెను చూసి నోటికి చెయ్యి అడ్డుపెట్టి నవ్వుకున్నారు. ముడుచుకుపోయింది. స్కూల్లో పదిహేనవ యేట ఆమెతో మాట్లాడేవాళ్లు తగ్గిపోయారు. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కాలేజ్లో పదిహేడవ యేట.. అప్పుడే రెబక్కా ‘ఫ్రైడే’ను చూసి వచ్చినవాళ్లెవరో.. తింటున్న పీజాలు, బర్గర్లు ఆమె మీద విసిరేశారు. సగం చచ్చిపోయింది. పందొమ్మిదో యేట మ్యూజిక్ ప్రొడ్యూజర్లు, సాంగ్ రైటర్లు నిన్నసలు ఎప్పటికీ తీసుకునేదే లేదనేశారు. ఇంటికొచ్చి ఏడ్చేసింది రెబెక్కా. రోజూ ఏడుస్తూనే ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఒకటే ఏడుపు. తలుపులు వేసుకుని ఒంటరిగా ఏడుపు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు. ∙∙ టీనేజ్ దాటుతుండగా రెబెక్కా ఓ రోజు అద్దంలో తనని తను పరిశీలనగా చూసుకుంది. ఏడ్చినట్లుంది. తనేం ఏడ్వడం లేదు. కానీ ఏడ్చినట్లే ఉంది! కన్నీళ్లొస్తే చేతులతో తుడుచుకుంటాం. ఏడుపే రాకుండా కన్నీళ్లు కనిపిస్తుంటే.. తుడుచుకోవలసింది కళ్లను కాదు. కళ్లు మూసినా, కళ్లు తెరిచినా తనను ఏడిపిస్తున్న లోకాన్ని! అవును.. లోకాన్ని తన కళ్ల ముందు నుంచి తుడిచేయాలి. కళ్లు మూసుకుంది రెబెక్కా. రెప్పల మాటున అంతవరకు ఉంటూ వచ్చిన అవమానాలన్నీ ఒకటొకటిగా అదృశ్యం అయిపోవడం మొదలైంది. చివరికొక రూపం మిగిలింది. ఆ రూపం రెబక్కాదే. రెబక్కా అందంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ఉంది. ఒక కొత్త పాట కోసం తనని తను ట్యూన్ చేసుకుంటోంది! ఈ ఫిబ్రవరి 10 కి రెబెక్కా పాట ‘ఫ్రైడే’.. పదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. దీనిపై ఇన్స్టాగ్రామ్లో చిన్న పోస్ట్ పెట్టింది రెబెక్కా. ‘మీరేమిటన్నది మీ గురించి మీకేం తెలుసో అదే కానీ.. మీ గురించి ఎవరేమనుకుంటున్నారో అది కాదు మీరు’ అని. ఇంకా చాలా రాసింది. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాక.. ఈ సాయంత్రం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ పోస్ట్ను చదవండి. మీరు జీవితాన్ని ప్రేమిస్తున్నారో, వ్యక్తిని ప్రేమిస్తున్నారో మీ కనురెప్పల లోపలి స్క్రీన్పై కనిపిస్తుంది. తర్వాత మీరు.. రెబెక్కా ఇన్నేళ్లలోనూ సొంతంగా, ఎవరి సహాయమూ లేకుండా చేసిన మిగతా సింగిల్స్ని (సింగిల్ సాంగ్స్) కూడా వెతకడం మొదలు పెడతారు. ఆమెదే కొద్దిగా ఫిల్మోగ్రఫీ ఉంది. డిస్కోగ్రఫీ ఉంది. అన్నీ తనకు తానుగా చేసుకున్నవే. జీవితాన్ని ప్రేమించేవారు ఏదైనా సొంతంగా చేసుకోగలరు. దేన్నయినా సొంతంగా సాధించగలరు. మన జీవితమే మనకు వాలంటైన్. -
శుక్రవారం... మధ్యాహ్నం మాత్రమే!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం శుక్రవారం... అది కూడా మధ్యాహ్నం పూట... ప్రార్థనలకు వెళ్లే యజమానుల దుకాణాలే టార్గెట్... సగం దింపిన షట్టర్ను ఎత్తి ఏది దొరికితే అది ఎత్తుకుపోతారు... ఈ పంథాలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులకు వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి వాహనం, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు ఆదివారం తెలిపారు. పాతబస్తీ, ఫలక్నుమా పరిధిలోని వట్టేపల్లికి చెందిన మహ్మద్ అక్రమ్ వెల్డింగ్ వర్కర్గా, మహ్మద్ పాషా కూలీగా పని చేసేవారు. దురలవాట్లకు బానిసైన అక్రమ్ అందుకు అవసరమైన డబ్బు సంపాదించడానికి కొన్నాళ్ల క్రితం నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల కోసం వెళ్లే వ్యాపారులు తమ దుకాణాల షట్టర్స్ సగం వరకే కిందికి దించుతుంటారు. దీనిని గుర్తించిన అక్రమ్ ఆయా షాపుల్లోకి దూరి అందినకాడికి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లేవాడు. తస్కరించిన నగదుతో పాటు చోరీ వస్తువుల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. గతంలో అతడిపై షాహినాయత్గంజ్, కుల్సుంపుర, మైలార్దేవ్పల్లి ఠాణాల పరిధిల్లో కేసులు నమోదయ్యాయి. అక్రమ్ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. 2018 జూన్లో జైలు నుంచి బయటికి వచ్చిన అతను ఏడాది తర్వాత భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మరో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది అక్టోబర్ 1న జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా తన పంథా మార్చుకోని అక్రమ్ ఈసారి ముఠా కట్టి పంజా విసరాలని భావించాడు. తన స్నేహితుడైన పాషాకు విషయం చెప్పడంతో సహకరించడానికి ముందుకు వచ్చాడు. ఆ నెల మొదటి వారంలో తన స్నేహితుడు ఖాలీద్తో కలిసి రెండు రోజుల పాటు బీదర్లో ‘పర్యటించిన’ అక్రమ్ ఓ ద్విచక్ర వాహనం చోరీ చేసి తీసుకువచ్చాడు. పాషాతో కలిసి దీనిపై తిరుగుతూ నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరూ కలిసి చోరీ బైక్పై సంచరిస్తూ ఓ చెత్త వాహనం డ్రైవర్ను గమనించారు. అతడు తన ఫోన్ను వాహనం సీటుపై ఉంచి ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించిన వీరు ఫోన్ తస్కరించారు. నిందితులు అక్రమ్, పాషా అదే నెల ఆఖరి వారంలో అదే చోరీ బైక్పై టోలిచౌకి ప్రాంతంలో సంచరించారు. ఆ సమయంలో నవాజ్ చికెన్ షాప్ షట్టర్ సగం దించిన యజమాని ప్రార్థనల కోసం వెళ్లారు. దీనిని గమనించిన అక్రమ్ వాహనాన్ని కొద్దిదూరంలో ఆపాడు. పాషాను దాని సమీపంలోనే ఉంచి యజమాని రాకను గమనించమని చెప్పాడు. అక్రమ్ నేరుగా దుకాణంలోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.85 వేల నగదు, సెల్ఫోన్ చోరీ చేశాడు. ఈ డబ్బును ఇద్దరూ కలిసి ఖర్చు చేశారు. ఈ రెండు ఉదంతాలకు సంబం«ధించి బాధితుల ఫిర్యాదుతో స్థానిక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని ఛేదించేందుకు పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్ ముజఫర్, పి.మల్లికార్జున్, ఎన్.రంజిత్కుమార్లతో కూడిన బృందం చోరీ జరిగిన దుకాణం సమీపంలోని సీసీ కెమెరాల ఫీడ్ను సేకరించి అధ్యయనం చేసింది. ఫలితంగా అనుమానితుల జాడ తెలియడంతో లోతుగా దర్యాప్తు చేసింది. ఆదివారం అక్రమ్, పాషాలను పట్టుకుని వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను గోల్కొండ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. -
శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు
-
అసలే 13...ఆపైన శుక్రవారం
జనాలకు కొన్ని వింత నమ్మకాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వంటివి. ఇలానే ప్రజల్లో ఇంకా చాలా మూఢ నమ్మకాలే ఉన్నాయి. ఒక్కోసారి ఏమైనా సంఘటనలు యాధృచ్చికంగా ఏర్పడినా.. అవి ఈ మూఢ నమ్మకాల వల్లే ఏర్పడ్డాయని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల కొన్ని సార్లు మంచి జరుగుతుంది, కొన్ని సార్లు చెడు జరుగుతుంది. అలాంటి ఒక వింత నమ్మకమే 13ను దురదృష్టంగా భావించడం. అవును ప్రపంచంలో చాలా దేశాల్లో 13ను దురదృష్ట సంఖ్యగా నమ్ముతారట. అలాంటి 13 వ తారీఖు కనుక శుక్రవారం వస్తే దానంత దరిద్రమైన రోజు మరొకటి ఉండదని అనుకుంటారట. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఈ రోజు శుక్రవారం 13వ తేదీ. 13వ తేదీని ఎందుకు దురదృష్ట సంఖ్యగా చెబుతారో సరైన కారణాలు తెలియదు కానీ, ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. ఏసు క్రీస్తును సిలువ వేయడానికి ముందు రోజు జరిగిన ముఖ్య ఘట్టం లాస్ట్ సప్పర్. దీనిలో పాల్గొన్నవారు 13 మంది. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం క్రీస్తును సిలువ వేశారు. ఆ రోజున ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు గుడ్ఫ్రైడేగా జరుపుకుంటారు. ఇటువంటి బాధకరమైన సంఘటనలు జరిగాయి కాబట్టే ఏ నెలలోనైనా ఈ రెండు కలిసి వస్తే అంటే 13వ తేదీ శుక్రవారం వస్తే ఆ రోజు తప్పకుండా ఏదైనా చెడు జరుగుతుందని బఫ్ఫేలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆంత్రాపాలజీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఫిల్ స్టివెన్స్ తెలిపారు. ఏజేసీ.కామ్లోని యూదుల ఇస్కారియట్ ప్రకారం క్రీస్తును మోసం చేసి సైనికులకు అప్పగించిన శిష్యుడు భోజన బల్ల వద్ద 13వ స్థానంలో కూర్చున్నాడని.. అందుకే 13 అనే అంకెను చెడు సంఖ్యగా భావిస్తారని తెలిసింది. కారణాలు ఏవైనా చాలా మంది మాత్రం 13 సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. ఆ తేదీన ఎవ్వరూ గృహప్రవేశం చేయరు. పెద్ద పెద్ద భవనాలలో కూడా 13వ నంబరు అంతస్తు ఉండదు. ఒకవేళ 13వ అంతస్తు ఉన్నా.. ఆ మొత్తం అంతస్తును ఖాళీగా ఉంచుతారు. ఆ రోజున ఎవరూ వివాహం కూడా చేసుకోరు. గతంలో కూడా 13వ తేదీ శుక్రవారం వచ్చిన సందర్భాల్లో అనేక అనూహ్యమైన చెడు సంఘటనలు సంభవించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే కొంతమంది 13వ తేదీ, శుక్రవారం రెండు కలసిరావడం చాలా అదృష్టంగా భావిస్తారట. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుందని, కాబట్టి ఈ రోజంతా మంచి జరగాలని ఆశించి, రోజు చివరలో ఏం జరిగిందో విశ్లేషించుకోండని అంటున్నారు న్యూమరాలజిస్ట్లు. మరో విషయం ఏంటంటే నేడు శుక్రవారం 13వ తేదీ అనంతరం ఈ ఏడాదిలో జూలై నెలలో కూడా 13వ తేదీ శుక్రవారంతో కలిసి రాబోతోంది. మరి ఈ రెండు రోజుల్లో ఏమైనా వింత విశేషాలు జరుగుతాయేమో చూడాలి. -
పాహిమాం...
జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్థలతో ఆచరించారు. అమ్మవారి ఆలయాలు వేకువ జాము నుంచే కిక్కిరిసిపోయాయి. కుంకుమ పూజలు చేసి ముత్తైదువలకు వాయినాలు అందజేశారు. జిల్లాలో ప్రధాన ఆలయాలైన అన్నవరంలోని వనదుర్గ అమ్మవారు, ద్రాక్షారామం, పాదగయ తదితర ఆలయాలు కిటకిటలాడాయి. -
బాసర సరస్వతీ ఆలయంలో అపచారం
-
విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలో విద్యారంగాన్ని పటిష్టం చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపడానికి డీఈఓ కృషి చేయాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. డీఈఓ ఆర్ఎస్ గంగాభవానీకి రాష్ట్రస్థాయి అవార్డు లభించిన సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గంగాభవానీని కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విద్యా ప్రమాణాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ ఏడీ ఏవీ వెంకటరమణ, సూపరింటెండెంట్లు పురుషోత్తం, అజీజ్, రీజనల్ స్పోర్ట్స్ కో– ఆర్డినేటర్ పీఎస్ సుధాకర్, పాండు రంగారావు, డి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు సాగు నీటి అవసరాల నిమిత్తం మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గురువారం పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేశారు. మొదటి రోజు కావడంతో తొలుత 100 క్యూసెక్కులు, దశలవారీగా 500 క్యూసెక్కులకు పెంచారు. శుక్రవారం ఉదయం రెండు వేల క్యూసెక్కు లు విడుదల చేసిన అధికారులు క్రమేణా సాయంత్రానికి మరో వెయ్యి క్యూసెక్కులు పెంచి విడుదల చేస్తున్నారు. శనివారం నుంచి ఏ కాలువకు ఎంత నీరు విడుదల చేస్తున్నామో షెడ్యూలు వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 3,400 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పు, సెంట్రల్ డెల్టాలకు రెండు వందల క్యూసెక్కుల చొప్పున, పశ్చిమ డెల్టాకు 3 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 13.78 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట నీటిసామర్థ్యం కంటే అదనంగా నీరు నిల్వ ఉండడంతో ధవళేశ్వరం ఆర్మ్లో ఐదు గేట్లు, విజ్జేశ్వరం ఆర్మ్లో మూడు గేట్లను 0.20 మీటర్లు ఎత్తులేపి 4,825 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. -
దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి
ఏలూరు అర్బన్ : వేసవిలో చల్లగాలి కోసం చాలామంది ప్రజలు ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకోకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. శుక్రవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్పీ ప్రజలతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. సమస్యలు విని సంబంధిత అధికారులకు ప్రజల ఫిర్యాదులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఇళ్ల దొంగతనాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. వాటిని నిరోధించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అయితే దొంగతనాలు అడ్డుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. దానిలో భాగంగా ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో తలుపులకు తాళాలు వేసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకూ ఇళ్లలో విలువైన నగలు, పెద్దమొత్తంలో నగదు ఉంచుకోవద్దని సూచించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసుకుని పొరుగూరు వెళ్లే క్రమంలో సదరు విషయాన్ని సంబంధిత పోలీస్స్టేషన్ లో తెలిపితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 28 మంది ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి. తణుకు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్, బైక్ రేసింగ్లు జరుగుతున్నాయని నిరోధించాలని కోరాడు. ఏలూరు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి తంగెళ్లమూడి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ఆకతాయిల ఆగడాలను నిరోధించాలని ఫిర్యాదు చేశాడు. చింతలపూడి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో కోడి పందేలు, పేకాటలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, వాటిని పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. -
‘యనమదుర్రు’ ప్రక్షాళనకు చర్యలు
భీమవరం టౌ న్ : యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళన దిశగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించారు. యనమదుర్రు డ్రెయి న్ జలాలు నిర్జీవంగా మారడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో యనమదుర్రు డ్రెయి న్ ను ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గొంతేరు డ్రెయి న్ ను మరో యనమదుర్రు కానివ్వబోమని గోదావరి మెగా ఆక్వాఫుడ్పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఉద్యమిస్తున్న నేపథ్యంలో గతనెల 25న భీమవరంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శిక్షణ పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళనకు ప్రణాళిక సిద్ధం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఇలా అన్ని వర్గాల నుంచి యనమదుర్రు డ్రెయి న్ కాలుష్యానికి పరిశ్రమలు, మున్సిపాలిటీలు గ్రామాల నుంచి వస్తున్న మురుగు, చెత్త కారణమంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు పర్యావరణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావుతో కలిసి యనమదుర్రు డ్రెయి న్ ను పరిశీలించారు. ట్రీట్మెంట్ ప్లాంట్లపై చర్చ యనమదుర్రు డ్రెయి న్ లో మురుగునీరు కలిసే చోట సావేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎక్కడెక్కడ అవసరమో పరిశీలించారు. దెయ్యాలతిప్ప ప్రాంతంలో, భీమవరం పట్టణం రెస్ట్హౌస్ రోడ్డు శివారు గంగానమ్మ గుడి ప్రాంతంలో, అందరికీ ఇళ్లు నిర్మాణానికి కేటాయించిన 82 ఎకరాల స్థలం వద్ద ఎస్టీపీలు నిర్మాణంపై చర్చించారు. అమృత్ పథకంలో 5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు వివరించారు. మరో 5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు బృందం యనమదుర్రు డ్రెయి న్ లో మురుగు కలుస్తున్న ప్రాంతాల ఫొటోలు తీసుకున్నారు. డ్రెయి న్ ప్రక్షాళనకు సంబంధించి మున్సిపల్ అధికారులతో చర్చించారు. మున్సిపల్ డీఈ శ్రీకాంత్, టౌ న్ ప్లానింగ్ అధికారులు వారి వెంట ఉన్నారు. -
చిన వెంకన్నకు కల్యాణ శోభ
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో వేంకటేశ్వర స్వామి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు శుక్రవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. చినవెంకన్న భక్తులకు శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి నుదిటిన కల్యాణ తిలకం, బుగ్గనచుక్కతో పెళ్లి కూమారుడిగా శోభిల్లారు. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెళ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యారు. ఆలయ పండితులు, అర్చకులు ఈ తంతును వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణలతో చిన వెంకన్న క్షేత్రం మార్మోగింది. వేదికపై ఏర్పాటు చేసిన రజత సింహాసనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ వేడుకలను తిలకించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మెుదటి రోజున జరిగే గజ వాహన సేవకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. స్వామి వైభవాన్ని చాటే ఈ వాహనసేవను శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. రాజగోపురం మీదుగా పుర వీధులకు పయనమైన స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రీహరికళాతోరణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
ఉద్యోగులు ప్రజలతో మమేకం కావాలి
ఏలూరు (మెట్రో) : ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న వ్యతిరేక భావం పోవాలంటే ఉద్యోగులు ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలని, వారితో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కొందరు ఉద్యోగుల పట్ల ప్రజల్లో సరైన అభిప్రాయం లేదని పదిమందికీ మేలు చేసే కార్యక్రమాల్లో కొన్ని విషయాలు ఇబ్బంది అనిపించినా కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేస్తే పరవాలేదన్నారు. వ్యక్తి కోసం చట్టాన్ని అతిక్రమించి ఎవరు పనిచేసినా సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా శాఖా పరంగా ఇబ్బందులు పడుతుంతే తన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు, ఎన్జీవో నాయకులు చోడగిరి శ్రీనివాస్, రమేష్కుమార్, శ్రీధర్, సత్యనారాయణ, ఐవీఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. న్యాయమూర్తి గోపి బాధ్యతల స్వీకరణ ఏలూరు(సెంట్రల్) : జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా జి.గోపి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయనను ఇటీవలే జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఆటో బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
కైకరం (ఉంగుటూరు) : జాతీయ రహదారిపై కైకరం వద్ద శుక్రవారం తెల్లవారు జూమున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి, డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని భవానీపురానికి చెందిన ఆకుమళ్ల రమణారెడ్డి(29) గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో వాషింగ్మెషీన్లు, కూలర్లలోడుతో తణుకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కైకరం వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. డ్రైవర్ రమణారెడ్డి అక్కడక్కిడే మృతిచెందాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వ్యాయామ కళాశాలకు మినీ స్టేడియం
దెందులూరు : రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలకు మరోసారి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. కళాశాలకు మినీ స్టేడియం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలను జారీ చేసింది. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మ న్ మాగంటి నారాయణ ప్రసాద్ శుక్రవారం మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, అధికారుల కృషి, సహాయ, సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం మినీ స్టేడియం మంజూరు చేసిందని తెలిపారు. స్టేడియం మంజూరు ద్వారా వ్యాయామ కళాశాలకు మరింత కీర్తి ప్రతిష్టలు రావటమే కాకుండా, శిక్షణ పొందే వ్యాయామ అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులకు మరెంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తన సొంత వ్యయంతో కళాశాలలో రెండో సంవత్సరం వ్యాయామ విద్యనభ్యసిస్తున్న ఐదుగురికి ప్రతి సంవత్సరం ఫీజులు చెల్లిస్తానన్నారు. ఇంట్రామ్యూరల్ ఆటల పోటీలు ప్రారంభం.. వ్యాయామ కళాశాలలో శుక్రవారం ఇంట్రామ్యూరల్ ఆటల పోటీలను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మ న్ మాగంటి నారాయణ ప్రసాద్ ప్రారంభించారు. ఇంట్రామ్యూరల్ డైరెక్టర్ వి.శ్యామలా ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీల్లో 16 గ్రూపులకు చెందిన డీపీఈడీ, బీపీఈడీ వ్యాయామ అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో గ్రూపులో 25 మంది ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మ న్ మాగంటి మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న వ్యాయామ అధ్యాపకులు పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో వ్యాయామ అభివృద్ధి, రాష్ట్ర, జాతీయ స్థాయి విభాగాల్లో ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలన్నారు. తొలుత వాలీబాల్ సర్వీస్ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ఆకర్షణ గా నిలిచింది. -
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు
పెదనిండ్రకొలను (నిడమర్రు): సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ విమర్శించారు. శుక్రవారం పెదనిండ్రకొలనులో జరిగిన గడప గడపకూ వైఎస్సార్లో ఆయన పాల్గొని స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిపై పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్ట్లు చేస్తున్నారన్నారు. పాలనపై అసహనంతో ఉన్న యువత సోషల్ మీడియా ద్వారా తమ భావాలను ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. అది కూడా నేరంగా వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండిస్తే ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్పై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై యువత స్పందన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పొలిటికల్ సెటైర్ డిజైనర్ అరెస్ట్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు. మే 1,2 తేదీల్లో జగన్ దీక్ష మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి సమస్యలపై జగన్ పోరాడతారని భరోసా ఇచ్చారు. వచ్చే నెల 1,2 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో జరగాలి్సన దీక్ష వాయిదాపడిందన్నారు. రైతు దీక్షకు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. శ్రీధర్ వెంట ఆపార్టీ ఉంగుటూరు కన్వీనర్ పుప్పాల వాసుబాబు , మండల కన్వీనర్లు సంకు సత్యకుమార్, రావిపాటి సత్యశ్రీనివాస్, మరడా వెంకట మంగారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కచ్చాల నాగేశ్వరరావు, తుమ్మగంటి రంగ, రామిశెట్టి శ్రీను, పులిచర్ల కృష్ణారావు, ఎంపీటీసీలు కోడూరి రాంబాబు, సునీత మానసింగ్, ఆర్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇదేనా.. పనిచేసే తీరు
ఏలూరు (మెట్రో) : కాలువలు మూసివేసిన తర్వాత ఇప్పుడు గుర్రపు డెక్క, తూడు తొలగింపు విషయంలో టెండర్లు పిలుస్తారా అంటూ ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయాలనే ఆలోచన ఉంటే ముందుగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారని, పని చేయకూడదనే ఆలోచన ఉంటేనే ఇటువంటి పనులు చేస్తారని మండిపడ్డారు. ఇటువంటి పద్ధతి విడనాడాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తీరుపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సాగునీటి కాలువ మరమ్మతులు, డెల్టా ఆధునికీకరణ కార్యక్రమాలు, కాలువలు మూసి వేసిన తరువాత చేపట్టాల్సి ఉన్నప్పటికీ కాలువలు తెరిచిన తరువాత పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న పనుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. చీఫ్ ఇంజనీర్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి వాటి అనుమతులు పొందుతామని తెలిపారు. పోలవరం ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసినట్టు కాగితంపై చూపిస్తే కుదరదనీ, డాక్టర్లు, సిబ్బంది నియామకానికి తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. సిబ్బందిని మంజూరు చేయిస్తానని జిల్లా వైద్యాధికారి కోటేశ్వరికి చెప్పారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలో కష్టపడి పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకొచి్చన పంచాయతీరాజ్ ఏఈ మాణిక్యాన్ని కలెక్టర్ అభినందించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ కట్టా హైమావతి, డీపీఓ సుధాకర్, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు. -
ఆటోలోనూ నగదు రహిత ప్రయాణం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నగదురహిత ఆటో ప్రయాణానికి రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. రవా ణాశాఖ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఆటోల్లో ప్రయాణించే వారు నగదుతో సంబంధం లేకుండా ప్రత్యేక యాప్ ద్వారా ఆటో చార్జీలు చెల్లించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. మంత్రి పితాని సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఏలూరు మేయర్ నూర్జహా న్ కొద్దిదూరం ఆటోలో ప్రయాణించారు. ఆటో చార్జీల కోసం చిల్లర సమస్య తలెత్తకుండా నేరుగా ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాకు సొమ్ము జమయ్యేలా రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ వల్ల ఎక్కడా నగదు సమస్య తలెత్తబోదని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడతారని, రాబోయే రెండేళ్లలో ఈ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి పితాని చెప్పారు. ఆటో డ్రైవర్ ఖాతాకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు ఖాతా నుంచి రూ.50 సొమ్మును ఆ న్లై న్లో పంపించారు. దశల వారీగా ఆటో సేవలను విస్తరించనున్నారు. -
భళా.. వేంగి కళ
చారిత్రక నగరం హేలాపురిలో వేంగి కళా ఉత్సవాలు శుక్రవారం మొదలయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల శాస్త్రీయ, జానపద నృత్య కళారీతులను ప్రదర్శిస్తున్నారు. గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్య విన్యాసమిది. గజ్జె ఘల్లున.. గుండె ఝల్లున ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరానికి చెందిన శ్రీ లలితా కామేశ్వరి నృత్య సదనం ఆధ్వర్యంలో నాట్యాచారిణి ఘండికోట అలివేలు ఉష నిర్వహణలో శుక్రవారం ప్రారంభమైన వేంగి కళా ఉత్సవాలు అలరించాయి. అంతర్జాతీయ స్థాయి నృత్య కళాకారుల నృత్యప్రదర్శన కళాకారులను రంజింపజేశాయి. నవీ ముంబైకి చెందిన అపేక్ష ముందర్జీ భరతనాట్యం, గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్యం నగరవాసులను విపరీతంగా అలరించాయి. అలాగే చెన్నైకి చెందిన అమర్నాథ్ ఘోష్ కథక్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
గ్యాస్ లీకై తాటాకిల్లు దగ్ధం
వెంకట్రామన్నగూడెం (తాడేపలి్లగూడెం రూరల్) : గ్యాస్ లీకై తాటాకిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని వెంకట్రామన్నగూడెంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని జయ మహంకాళి పౌల్ట్రీ ఎదురుగా బత్తుల శ్రీనివాసరావు నివాసముంటున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి పనులు ముగించుకుని ఇంటిల్లిపాది నిద్రించారు. శుక్రవారం తెల్లవారు జామున గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు చూసి కేకలు పెట్టారు. ఈ హడావుడికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు లేచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఇంటితో పాటు బీరువాలోని రూ.2.50 లక్షల నగదు, ఇతర సామగ్రి, ఇంటి ఆవరణలోని పల్సర్ మోటారు సైకిల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం ఆస్తినష్టం సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇన్చార్జి ఫైరాఫీసర్ వి.భాస్కర్రాజు ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు. -
చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థి మృతి
ముద్దనూరు: స్థానిక పాత సినిమా థియేటర్ వెనుకభాగంలో నివసిస్తున్న లక్షుమయ్య(19) అనే వ్యక్తి కిరోసిన్ స్టవ్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఏఎస్ఐ జయరాముడు సమాచారం మేరకు.. ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం పూర్తయిన లక్షుమయ్య ఈనెల 8వతేదీన రాత్రి నీళ్లు కాచుకోవడానికి కిరోసిన్ స్టవ్ అంటించాడు. స్టవ్ పంపు కొడుతుండగా ప్రమాదవశాత్తు కిరోసిన్ ఒంటిపై పడడంతో మంటలు చెలరేగి లక్షుమయ్య శరీరం తీవ్రంగా కాలింది. చికిత్స నిమిత్తం అదేరోజు లక్షుమయ్యను కడప రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతికి అనంతరం తమిళనాడులోని వేలూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. -
క్రికెట్ బెట్టింగ్లపై కఠినంగా వ్యవహరిస్తాం
ఏలూరు అర్బన్ : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించినా బుకీలుగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ భాస్కర్భూషణ్ ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. వాడపల్లి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి వాడపల్లి ఇసుక ర్యాంపులో లోడింగ్ చార్జీలు విపరీతంగా వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భీమవరం నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో ఆటో వాలాలు ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్నారని, వారిని నిరోధించాలని ఫిర్యాదు చేశారు. పెదపాడు నుంచి ఫోన్ చేసిన ఓ మహిళ గ్రామంలో కొందరు అక్రమంగా చీటీ పాటలు నిర్వహిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం నుంచి ఫోన్చేసిన వ్యక్తి పట్టణంలో ప్రార్థ్ధనాలయాల వద్ద పెద్ద శబ్దాలతో మైకులు ఉపయోగిస్తున్నారని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా 37 మంది పలు సమస్యలకు సంబంధించి చేసిన ఫిర్యాదులపై ఎస్పీ స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
డీటీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ధర్నా
ఏలూరు సిటీ : ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ విడుదల చేసి ఫ్రీజింగ్ నిబంధనలు తొలగించకపోవటంతో రాష్ట్రంలోని ఎయిడెడ్ ఉపాధ్యాయులు జీతాల, డీఏ బకాయిలు అందక తీవ్రఇబ్బందులు పడుతున్నారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీవీ నరసింహారావు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఆర్థికశాఖకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, ఎస్టీవో కార్యాలయాల వద్ద మెరుపు ధర్నాకు పిలుపునిచి్చంది. ఇందులో భాగంగా శుక్రవారం ఏలూరు డీటీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్రీజింగ్ను ఎత్తివేసి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు, డీఏ బకాయిలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్.రవికుమార్, ఏలూరు రూరల్ ప్రధాన కార్యదర్శి ఎన్ .రాంబాబు, ఎయిడెడ్ ఉపాధ్యాయ నాయకులు జీఎస్ఆర్సీ మూర్తి, సీఆర్ఆర్ కళాశాల ఆప్టా నాయకులు పీఎన్వీ ప్రసాదరావు, కె.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
వైఫై జోన్గా కలెక్టరేట్
ఏలూరు (మెట్రో) : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని వైఫై జోన్గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ కనెక్షన్, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. జిల్లాలో 12,361 ప్రభుత్వ కార్యాలయాలకు తొలిదశగా ఫైబర్ గ్రిడ్ అనుసంధాన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. రూ.149కే ఫైబర్ నెట్ కనెక్షన్ను జిల్లాలో 6,274 ఆఫీసులకు, రూ.299 ఫ్యాకేజీ కింద 5,628 కార్యాలయాలకు, రూ.1,499 ప్యాకేజీ కింద 206, రూ.2499లకు ప్యాకేజీ కింద 253 ప్రభుత్వ ఆఫీసులకు అందించనున్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం వేగవంతంగా కలుగుతుందన్నారు. సమావేశంలో ఫైబర్ గ్రిడ్ ప్రతినిధి సతీష్, డీఎంహెచ్వో డాక్టర్ కె.కోటేశ్వరి, ఐసీడీఎస్ ఆర్జేడీ విద్యావతి, డీఈవో ఆర్ఎస్.గంగాభవాని, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు, డీపీవో కె.సుధాకర్ పాల్గొన్నారు. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పల్లెల్లో శనివారం నుంచి నెలరోజులు పాటు పర్యటించనున్నట్టు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో పంచాయతీ పన్నుల వసూలు, బయోమెట్రిక్ హాజరు, శానిటేషన్, డంపింగ్ యార్డుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఏడాదిన్నరగా పల్లెల ప్రగతికి నిరంతరం వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించానని క్షేత్రస్థాయిలో ఏం ప్రగతి జరిగిందో, చేపట్టిన సంస్కరణల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయా? లేదా? అని స్వయంగా పరిశీలన చేస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో కచ్చితంగా పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం వేళ టెలికాన్ఫరె న్స్ నిర్వహిస్తానని ఏప్రిల్ మాసమంతా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాలు ఉండబోవని చెప్పారు. గ్రామాల్లో నివాసం ఉండని పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డీల ఉద్యోగం ఆ రోజులో సమాప్తమవుతుందన్నారు. ఏలూరు డివిజన్ పంచాయతీ అధికారి సీహెచ్ రాజ్యలక్ష్మి పనితీరు పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో డీపీవో కె.సుధాకర్, డివిజనల్ పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, అమ్మాజీ, సూర్యనారాయణ, శ్రీరాములు పాల్గొన్నారు. -
భూ సేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాలు మానుకోవాలి
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): భూ సేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అపరాల మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం గొర్ల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2103లో భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజల ఆస్తులకు గ్యారంటీ లేని పరిస్థితిని సృష్టించిందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ అవసరాలకు భూమిని సేకరించాలంటే కచ్చితంగా 4 రెట్లు పరిహారం అందించాలన్నారు. ఏప్రిల్ 7,8 తేదీలలో ఉపాధి హామీపై ఆందోళన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
3 వేల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యం
జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్) : జిల్లాలో రబీ పూర్తయ్యాక మూడు వేల ఎకరాల్లో అపరాల సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. జగన్నాథపురం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వేసవిలో అపరాలు సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ ఈ వేసవిలో మినుము, పిల్లిపెసర, జీలుగు, పెసలు సాగు చేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. తద్వారా రైతుకు కొంత ఆదాయం సమకూరుతుందన్నారు. ఆయా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జగన్నాథపురం బాడవాకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదన్నారు. అనంతరం పలువురు రైతులు రుణమాఫీ విషయాన్ని జేడీ దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్ ముత్యాల వీవీ సత్యనారాయణ, నవాబ్పాలెం సొసైటీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు, తాడేపల్లిగూడెం ఏడీఏ ఎన్.శ్రీనివాస్, మండల వ్యవసాయా«ధికారి కె.వేణుగోపాల్ పాల్గొన్నారు. -
బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం
భీమవరం: వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధ రేటు సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ఆరోపించారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం కౌలు రైతుల సంఘం జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులున్నారని తెలిపారు. 80 శాతం భూములను వీరే సాగు చేస్తున్నా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. కౌలు రైతులు, రైతుమిత్ర, జేఎల్ గ్రూపుల రుణమాఫీకి నిధులు కేటాయించక పోవడం వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి ఉన్నచిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని చెప్పారు. రుణమాఫీ కోసం రూ.3600 కోట్లు కేటాయించినా అవి వ్యవసాయం చేయని భూస్వాములకే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 ఆఖరునాటికి కౌలు రైతులు, రైతు మిత్ర, జేఎల్ గ్రూపులకు ఇచ్చిన రూ.594 కోట్ల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వడ్డీలేని పంట రుణాలకు కేవలం రూ.177 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కేటాయింపులకు ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందని, కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేటపట్టడం లేదని విమర్శించారు. కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వంతులవారీ విధానంలో పూర్తి స్థాయిలో నీరందిస్తామని అధికారులు చేసిన ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నర్సింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు ధనికొండ శ్రీనివాస్, జొజ్జవరపు శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు మామిడిశెట్టి రామాంజనేయులు, పెచ్చెట్టి నర్సింహమూర్తి, కవల వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉగాది కానుకగా ఫైబర్నెట్ కనెక్షన్లు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా ప్రజలకు ఉగాది కానుకగా రూ.149కే కేబుల్ కనెక్షన్ తో పాటు ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కోరారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటా కేబుల్ కనెక్షన్ అమలు తీరును ఆయన శుక్రవారం అధికారులు, కేబుల్ నెట్వర్క్ ప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం రూ.160 నుంచి రూ.275 వరకూ కేబుల్ కనెక్షన్ కు వసూలు చేస్తున్నారని, ఇకపై ఫైబర్ గ్రిడ్ ద్వారా నాణ్యమైన అన్ని ఛానల్స్నూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని, ఉచితంగా టెలిఫోన్ సౌకర్యం కూడా దీని ద్వారా కలుగుతుందన్నారు. ఏలూరు కార్పొరేషన్ తో పాటు 8 మున్సిపల్ పట్టణాల్లో స్టాకును అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఫైబర్నెట్ ప్రతినిధి హరికృష్ణ, ఎంఎస్వోలు, ఏసీటీ ప్రతినిధి రామకృష్ణ, భీమవరం ఎంఎస్వో పైడిరాజు, జిల్లా అధికారులు డీపీవో కె.సుధాకర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు, డీఎంహెచ్వో డాక్టర్ కె.కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
‘విజిట్’లో టెక్నో ఫెస్టివల్ ఉత్సవ్–2కె17
తెలికిచెర్ల (నల్లజర్ల) : కళాశాలలో ఎంతమంది చేరారన్నది ముఖ్యం కాదు వారిలో దేశానికి ఉపయోగపడేవారిని ఎంతమందిని తయారు చేయగలిగామన్నదే తమ ధ్యేయమని విజిట్ కళాశాల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. కళాశాలలో శుక్రవారం టెక్నో ఫెస్టివల్ ఉత్సవ్–2కె 17ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానం అందించకుండా కేవలం సర్టిఫికెట్లకే పరిమితం చేయడం దేశద్రోహంగా భావిస్తానని చెప్పారు. అలా విద్యాభ్యాసం చేసిన వారు దేశ ప్రగతికి అవరోధంగా, భారంగా మారుతున్నారన్నారు. అలా చేయడం తన విధానానికి విరుద్ధమని చెప్పారు. తొలుత జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్య కమిటీ సభ్యులు గ్రంధి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు దేశభక్తి, సేవానిరతి, గౌరవభావం పెంపొందించుకోవాలని వారు ఉద్భోదించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గ్రంధి సాయిబాబా వరప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఆనంద్కుమార్, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ రాంబాబు, ఎంబీఏ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ సత్యప్రకాష్, సివిల్ విభాగాధిపతి ప్రొఫెసర్ సోమశేఖర్రాజు, ఈఈఈ విభాగాధిపతి కె.రాజేంద్ర, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ హసన్ పాల్గొన్నారు. -
కనులపండువగారథోత్సవం
నత్తా రామేశ్వరం (పెనుమంట్ర) : నత్తా రామేశ్వరంలో గోస్తనీ తీరాన కొలువైన రామేశ్వరస్వామి ఆలయం నిర్మిం చిన నాటి నుంచి ఆచారంగా వస్తున్న స్వామివారి కల్యాణ ర«థోత్సవం శుక్రవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. రామేశ్వరస్వామి పార్వతీ సమేతుడై ప్రత్యేక అలంకరణలో రథంలో కొలువుదీరారు. రథాన్ని అరటిగెలలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. హరహరమహాదేవ శంభోశంకర అంటూ భక్తులు స్వామివారి రథాన్ని లాగారు. కాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ రథోత్సవానికి హాజరయ్యారు. వేలాది మంది భక్తుల సందడి నడుమ మేళతాళాలతో రథోత్సవం వైభవంగా సాగింది. వైభవంగా ఆచంటేశ్వరుని రథోత్సవం ఆచంట : మహాశివరాత్రి పర్వదినం సం దర్భంగా ప్రసిద్ధిగాంచిన ఆచంటేశ్వరాలయం భక్తులతో పోటెత్తింది. ఆచంట పరిసర గ్రామాలకు చెందిన భక్తులు కోడేరులోని వశిష్ట గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మధ్నాహ్నం మూడు గంటలకు పురవీధులగుండా స్వామివారి రథోత్సవం కనుల పండువగా సాగింది. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మ న్ గొడవర్తి కృష్ణ భగవాన్, ఈవో దండు వెంకట కృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ముగిసిన టెన్నిస్ టోర్నీ
భీమవరం : క్రీడల నిర్వహణపై వివిధ సంస్థలు చూపిస్తున్న ఆసక్తి ప్రశంసనీయమని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేష న్ సీఈవో, గౌరవ ప్రధాన కార్యదర్శి హెచ్.చటర్జీ పేర్కొన్నారు. భీమవరం కాస్మోపాలిట న్ క్లబ్, స్పోర్ట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్స్లో క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. సభలో ముఖ్యఅతిథిగా చటర్జీ మాట్లాడారు. దాతల సహకారంతో మరిన్ని క్రీడలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పోటీలకు అల్లూరి పద్మరాజు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రామరాజు, తట వర్తి కృష్ణబాబు, గౌరవాధ్యక్షుడు రుద్రరాజు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చటర్జీని క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు. విజేతలు వీరే : పురుషుల సింగిల్స్ ఫైనల్స్ : కునాల్ విజ్రాని (మహారాష్ట్ర)పై దక్షిణేశ్వర్ సురేష్ (తమిళనాడు) 6–1, 7–5 తేడాతో గెలుపొందారు. డబుల్స్ : కునాల్ విజ్రాని (మహరాష్ట్ర), యాష్ యాదవ్ (మధ్యప్రదేశ్) జోడిపై అనురాగ్ నెన్వాని (ఢిల్లీ), రోహ న్ భాటియా (మహారాష్ట్ర) జోడి 6–2, 6–3 స్కోరుతో గెలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్ : నిత్యరాజ్బాబు (తమిళనాడు)పై ఈటె మెహతా (గుజరాత్) 6–1, 6–1 తేడాతో గెలిచింది. డబుల్స్ : సాయిదీప్య (తెలంగాణ), యమలపల్లి సహజ (ఏపీ) జోడిపై ఈటె మెహతా (గుజరా త్), వి.సౌమ్య (గుజరాత్) జోడి 6–0, 6–2 తేడాతో గెలిచింది. -
వైఎస్సార్ సీపీలో 150 మంది చేరిక
లింగపాలెం : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్బాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకూ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో గుర్రాల వెంకటేశ్వరరావు(గడ్డియ్య), కత్తి వెంకటేశ్వరరావు, కె.సోమయ్య, కె.సత్యనారాయణ, గుర్రాల ఏసోబు, జి. వీరబాబు, కె.శ్రీను, కె.మారేశ్వరరావు, కత్తి నాగేశ్వరరావు, కె.కాశియ్య, నక్కా సత్యనారాయణ, కత్తి దుర్గారావు, కాసగాని శ్రీనివాసరావు, ఎన్కృష్ణారావు, వీరి అనుచరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముసునూరి వెంకటేశ్వరావు, సీనియర్ నాయకులు ఏపూరి సూరిబాబు, మందలపు సాయిబాబు, కోటగిరి పాపారావు, కాసగాని ఆంజనేయులు, వడ్లాని లలిత, పొనగంటి సత్యనారాయణ, కొల్లి వీరభద్రరావు, వడ్లాని హరినాథరాజు, వడ్లాని యేసోబు, తోకల సత్యనారాయణ పాల్గొన్నారు. -
గోకార్టింగ్ చాంపియ న్ షిప్ పోటీలు ప్రారంభం
భీమవరం : భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి గోకార్టింగ్ చాంపియ న్ షిప్ పోటీలు శుక్రవారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు కేవలం తరగతి గదుల్లో విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా వివిధ నూతన ఆవిష్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి ఈ పోటీలు వేదిగా నిలుస్తాయననారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో ఆరు రాష్ట్రాల నుంచి 31 జట్లు పాల్గొంటున్నాయన్నారు. అనంతరం ఎస్పీని దుశ్శాలువాతో సత్కరించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆరిఫ్, విష్ణు విద్యా సంస్థల డైరెక్టర్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చాగల్లులో షుగర్ ఫ్యాక్టరీ సీజ్
చాగల్లు (కొవ్వూరు) : చాగల్లులో జైపూర్ షుగర్ ఫ్యాక్టరీని శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రెండేళ్లగా ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. కొంతకాలంగా రైతులు తమకు రావలసిన బకాయిల కోసం పోరాటం చేస్తున్నారు. యాజమాన్యం బకాయిలు కొంతమేర చెల్లించినా ఇంకా రూ.19.04 కోట్లు రైతులకు బకాయి పడింది. దీంతో రైతులు రెవిన్యూ అధికారులను ఆశ్రయించడంతో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఫ్యాక్టరీ అస్తులు వేలం వేయటానికి పలు దఫాలు నోటీసులు జారీ చేశారు. ఐదుసార్లు వేలం నిర్వహించినా పాటదారులు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఫ్యాక్టరీని సీజ్ చేశారు. తిరిగి ఈ నెల 23వ తేదీన ఫ్యాక్టరీ అస్తులకు వేలం నిర్వహించనున్నారు. ఈ ఘటనతో ఫ్యాక్టరీలో పని చేసే 600 మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. -
బీ–న్యూ లో సంక్రాంతి ఆఫర్లు
భీమవరం : నవ్యాంధ్రలోని అన్ని వర్గాల ప్రజలకు సెల్ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు బీ–న్యూ సంస్థ ..సంక్రాంతి సందర్భంగా వినూత్న ఆçఫర్లను అందిస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ ఆర్థికæ లావాదేవీలు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే బీ–న్యూ సంస్థ వినియోగదారులకు అందుబాటులోకి ఉంచిందన్నారు. సంక్రాంతి సందర్భంగా విభిన్న మోడళ్ల సెల ఫోన్లపై ఆఫర్లు అందిస్తున్నామన్నారు. రూ.699 డ్యూయల్ సిమ్ ఫోన్ కొనుగోలుపై లంచ్ బాక్స్, రూ.999 ఫోన్పై ట్రావెల్æ బ్యాగ్, రూ.1,399 ఫోన్తో పాటు టేబుల్ఫ్యాన్, రూ.4,499 4జీ స్మార్ట్ఫోన్కు జియో సిమ్, రూ. 9,999 స్మార్ట్ఫోన్తో పాటు ఎల్æఈడీ టీవీ, రూ.16,999 జియోనీ ఫో¯న్పై ల్యాప్టాప్, రూ.19,999కే యాపిల్ 5 ఎస్, రూ.15,499కే లెనోవో కే-6 నోట్బుక్తో పాటు బ్లూటూత్ హెడ్ సెట్æ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై బ్లూ టూ™త్, పవర్ బ్యాంక్, హెడ్ సెట్æ, మెమరీ కార్డులను ఉచితంగా పొందవచ్చన్నారు. వివిధ మోడళ్ల ఫోన్లకు బజాజ్ ఫైనాన్స్ ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించే సదుపాయం ఉందన్నారు. అన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసే సదుపాయం ఉందన్నారు. -
ఘనంగా మావుళ్లమ్మ ఉత్సవాలు ప్రారంభం
భీమవరం(ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవ ఉత్సవాలు శుక్రవారం కలశస్థాపన పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి గ్రామోత్సవంను ప్రారంభించారు. పురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం, కొడమంచిలి కొప్పేశ్వరరావు, మద్దిరాల మల్లికార్జునరావు అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రవీంద్రనా«థ్రెడ్డి మావుళ్లమ్మ అమ్మవారిని శుక్రవారం కమలాపురం ఎమెల్యే ఎల్ రవీంద్రనాథ్రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో నేడు మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు బల్లిపాడుకు చెందిన ఆధ్మాత్మిక వేత్త ఆకుల ఆప్పారావు ఉపన్యాసం, 5 గంటలకు తాడేపల్లి గూడెంకు చెందిన యడమిల్లి బ్రదర్స్ బుర్రకథ, రాత్రి 8 గంటలకు తణుకుకు చెందిన గీతామందిరి వారి దేవీ కటాక్షం నాటకం ప్రదర్శితం కానున్నాయి. -
ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్–17 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నాకౌట్ దశకు చేరుకున్నాయి. బాలికల విభాగంలో లీగ్దశలో విజయం సాధించి కేరళ, పంజాజ్, తమిళనాడు, బీహర్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, హర్యానా జట్లు నాకౌట్కు చేరుకున్నాయి. బాలుర విభాగంలో కేరళ, ఉత్తరాఖండ్, ధిల్లీ, కర్నాటక, గుజరాత్, యూపీ, బీహర్, హర్యానా జట్లు నాకౌట్కు దశకు చేరుకున్నాయని నిర్వాహకులు ఆదిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. -
వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా ప్రవీణ్
రామాపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ కువైట్ కమిటీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా జి.ప్రవీణ్కుమార్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కువైట్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి తనకు నియామకపు పత్రం అందజేశారన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మేడపాటి వెంకట్, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ల సహకారంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. అంతేకాక కువైట్ కమిటీ కోకన్వీనర్లు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులకు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు. -
ఫ్లోఫుట్బాల్ మ్యాచ్ విజేత నరసాపురం
తణుకు టౌన్ : కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్లోఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా శుక్రవారం స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో తణుకు–నరసాపురం జట్ల మధ్య పోటీ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 2–1 గోల్ తేడాతో నరసాపురం విజయం సాధించినట్లు ఫ్లో సీఈవో రాజేష్ రావూరి తెలిపారు. తొలుత ఈ మ్యాచ్ను మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు కడియాల సూర్యనారాయణ ప్రారంభించారు. శ్యామ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. ఈ సందర్భంగా లావా మొబైల్ సంస్థ నిర్వహించిన లక్కీడిప్లో జి. ఏసురాజు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు. మ్యాచ్ కో-ఆర్డినేటర్ డి. రంగారావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్యాంబాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకులు వెంకటేశ్వరరావు, వైఎస్ సేవాదళ్ నాయకుడు అంబటి రాఘవ, లావా మొబైల్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు మ్యాచ్ను తిలకించారు. ఫొటోరైటప్: 06టీఎన్కెసియూఎల్ 06– హోరాహోరీగా తలపడుతున్న నరసాపురం, తణుకు జట్లు -
గోదావరివాసుల అప్యాయత ఎంతో ఇష్టం
కొవ్వూరు : గోదావరివాసులు అప్యాయత ఎంతో ఇష్టమని సినీనటి, టీవీ యాంకర్ ఝాన్సీ తెలిపారు. కొవ్వూరులో విక్టర్ సూపర్ బజార్ ప్రారంభోత్సవానికి శుక్రవారం వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు సుమారు 50 సినిమాలు, ఐదు వేలకు పైగా సీరియల్స్, టీవీ ప్రోగ్రాంలలో పాల్గొన్నట్టు చెప్పారు. మూడు వందల సినిమాల్లో నటించానని గౌతంరాజు తెలిపారు. తన కుమారుడు కృష్ణంరాజు హీరోగా 'లక్ష్మీదేవి సమర్పించే నేడే చూడండి' అనే సినిమా ఈ నెల 30న విడుదల కానున్నట్టు చెప్పారు. తనను ఆధారించినట్టే తన కొడుకు కృష్ణంరాజును ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. -
ఆర్టీసీ బస్సుల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు
పులివెందుల రూరల్ : బస్సుల్లో నగదు రహిత చెల్లింపులు చేసుకొనేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చెంగల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జిల్లాకు కొత్త బస్సులు రానున్నాయని తెలిపారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్నారు. పెద్ద నోట్లరద్దు కారణంగా ఆర్టీసీకి మరింత నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం అజ్మతుల్లా, ట్రాఫిక్ సూపరింటెండెంట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
షిర్డీకి పర్యాటక రైలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : మధురై నుంచి కాట్పాడి, చెన్నై, సెంట్రల్, రేణిగుంట, గుంతకల్ మీదుగా షిర్డీకి పర్యాటక రైలు నడుపుతున్నట్లు రేణిగుంట ఐఆర్సీటీసీ మేనేజర్ మధుసూధన్రావు, కడప స్టేషన్ మేనేజర్ నాజరుద్దీన్ తెలిపారు. శుక్రవారం వారు సాక్షితో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ రాత్రి మధురైలో ఈ రైలు బయలుదేరుతుందన్నారు. చెన్నై సెంట్రల్, రేణిగుంట, గుంతకల్ మీదుగా 30వ తేదీన షిర్డీ చేరుతుందన్నారు. 31 రాత్రి బాబాను దర్శనం చేసుకోవచ్చన్నారు. అనంతరం పండరీపురం, మంత్రాలయంలో దైవ దర్శనం చేసుకోవచ్చన్నారు. .ఈ రైలులో మొత్తం 15 బోగీలు ఉంటాయన్నారు. స్లీపర్ క్లాస్కు రూ 5855 చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9701374932, 9701360620 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతి ప్రదానం
ఏలూరు సిటీ : ఏపీ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(అపుస్మా) ఆధ్వర్యంలో ఏలూరు జోన్ స్పోర్ట్స్ మీట్–16కు సంబందించి బహుమతి ప్రదానోత్సవ వేడుక స్థానిక వైఎంహెచ్ఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ–2 ఎంహెచ్ షరీఫ్, జిల్లా విద్యాశాఖాధికారి డి.మదుసూధనరావు, డీఎస్డీవో ఎండీ సిరాజ్, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ హాజరయ్యారు. స్పోర్ట్స్మీట్లో ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. 25 పాఠశాలల నుంచి 2,305 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్లలో పోటీపడ్డారు. అలాగే అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అపుస్మా 15 మంది రైతులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరుకాగా అపుస్మా జోన్ అధ్యక్షుడు ఎంఎన్.శ్రీకాంత్, సెక్రటరీ కె.విజయలక్ష్మి, కోశాధికారి ఎస్.రాజ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ఆర్కేఎ ప్రసాద్, జోనల్ కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ ఇన్చార్జి జి.రవిశంకర్ పాల్గొన్నారు. -
డోలారే.. డోలారే..
ఏలూరు సిటీ : సీఆర్ఆర్ మహిళా కళాశాలలో సాంస్కృతిక వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు విద్యార్థినులకు డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జి.రాజేష్, జి.లీలావతి, టి.భవాని వ్యవహరించారు. విద్యార్థినులు డ్యాన్స్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. థిమ్ డ్యాన్స్లో డీవీఎస్ఎస్ లక్ష్మి ప్రథమ, సీహెచ్ రూపారాణి ద్వితీయ, సుప్రియ గ్రూప్ తృతీయ స్థానాల్లో నిలిచారు. క్లాసికల్ డ్యాన్స్లో మేఘన ప్రథమ, బి.కీర్తిక ద్వితీయ, సీహెచ్ మహేశ్వరి గ్రూప్ తృతీయస్థానాలు, ఫోక్ డ్యాన్స్లో పి.మీనాక్షి గ్రూప్ ప్రథమ, ఎన్.కనకరత్నం గ్రూప్ ద్వితీయ, జాతీయ సమైక్యత నృత్యంలో ప్రేమ కుమారి గ్రూప్ విజేతలుగా నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ శైలజ పర్యవేక్షించారు. -
ఐదుగురు విద్యార్థినులకు గాయాలు
వల్లూరు: కడప తాడిపత్రి ప్రధాన రహదారిపై మండలంలోని తప్పెట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మోడల్ స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. స్థానికులందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగాయపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులు రోజూ లాగే సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా టైర్ పంక్చర్ అయింది. దీంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుని వెళ్లి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న లేబాకకు చెందిన భవాని, చందన, బుజ్జి, సౌజన్య, శ్రీవిద్య గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భాస్కర్రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనం ద్వారా వారిని కడప రిమ్స్కు తరలించారు. బాధితులను ప్రిన్సిపాల్తోపాటు పలువురు ఉపాధ్యాయులు పరామర్శించారు. కాగా ఆటో బ్రిడ్జి దిగిన తరువాత పంక్చర్ కావడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. కేవలం 40 మీటర్ల ముందు వున్న బ్రిడ్జిపై ప్రమాదం జరిగి వుంటే ఎక్కువ నష్టం జరిగేది. -
హౌస్బిల్డింగ్ సొసైటీలో సీఐడీ విచారణ
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక వైఎంఆర్ కాలనీలోని సహకార గృహ నిర్మాణ సంఘ కార్యాలయంలో శుక్రవారం సీఐడీ అధికారులు విచారణ చేశారు. తిరుపతి సీఐడీ సీఐ కళావతితోపాటు సిబ్బంది విచారణ నిర్వహించారు. టూటౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో ఉన్న కందుల బాలనారాయణరెడ్డి కాలనీ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెళ్లాయి. 479 ప్లాట్లలో సుమారు 200కు పైగా థర్డ్ పార్టీకి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రేటు ప్రకారం ప్లాట్లకు డబ్బు చెల్లించి, వచ్చిన ఆదాయాన్ని పక్కదారి పట్టించారనేది ప్రధాన అభియోగం. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల డీఎల్సీఓ రమేష్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఎంత మంది బినామీలు ఉన్నారు, ఆదాయం ఎంత వచ్చిందనే విషయమై సీఐడీ సీఐ విచారణ చేయడానికి వచ్చారు. విచారణ వివరాలను ఆయన వెల్లడించలేదు. -
గణితశాస్త్రం, కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉన్నతస్థితి
ఏలూరు సిటీ : గణితశాస్త్రం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉంటే మెరుగైన జీతాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చని వరంగల్ నిట్ ప్రొఫెసర్ డీవీఎల్ఎల్ సోమయాజులు అన్నారు. స్థానిక సీఆర్ఆర్ అటానమస్ కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గణితశాస్త్రంలో అధునాతన పద్ధతులు అనే అంశంపై ప్రారంభమైన జాతీయ సెమినార్ రెండోరోజు శుక్రవారం ఆసక్తికంగా సాగింది. ముఖ్యవక్తగా హాజరైన సోమయాజులు మాట్లాడుతూ గణితశాస్త్రంతో సామాజిక వ్యవస్థ ముడిపడి ఉందన్నారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఫ్రొఫెసర్ బి.మిశ్రా మాట్లాడుతూ కాస్మలాజికల్ మోడల్ అనే అంశంపై వివరణ ఇస్తూ గణితంతో విశ్వంలో దాగి ఉన్న డార్క్ ఎనర్జీని లెక్కించి, కనుమరుగవుతున్న శక్తి వనరులకు బదులుగా ఈ శక్తిని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ మ్యాథ్స్ స్టాటస్టిక్స్ డీన్ ప్రొఫెసర్ బి.పద్మావతి మాట్లాడుతూ గణితం అభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. దేశవిదేశాల్లో ఉన్నత సంస్థల్లో అత్యున్నత స్కాలర్షిప్లు, మిలియన్ డాలర్ ప్రైజ్లున్నాయని తెలిపారు. నోబుల్ బహుమతితో సమానమైన అవార్డులు గణిత విద్యార్థులకు అందుతున్నాయని ఆమె తెలిపారు. మ్యాథ మెటికల్ మోడలింగ్–ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే అంశంపై తిరుపతి వేంకటేశ్వర యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎన్.భాస్కరరెడ్డి అవగాహన కల్పించారు. ముగింపు సభకు సీఆర్ఆర్ విద్యాసంస్థల పాలకమండలి అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు, కార్యదర్శి ఎన్వీకే దుర్గారావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వీర్రాజు చౌదరి, పీజీ కరస్పాండెంట్ వి.రఘుకుమార్, డైరెక్టర్ సి.అరుణకుమారి, అధ్యాపకులు పీసీ స్వరూప్, వి.రామబ్రహ్మం, కె.చలపతిరావు, బి.శ్రీనివాసరావు, కె.హేమలత, ఎన్.అను, కె.శైలజ, వి.లక్ష్మీకుమారి, ఆయా కళాశాలల అధ్యాపకులు, ఇతియోపియా దేశం నుంచి, ఏయూ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకులు హాజరయ్యారు. -
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.260 కోట్లు
చింతలపూడి : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం రూ.260 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానంలో శుక్రవారం ఖేలో ఇండియా నియోజకవర్గస్థాయి పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులతో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, మొగల్తూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రెండోదశలో జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ ఏడాది ఉత్తమ పీఈటీగా ఎంపికైన కలరాయనగూడెం జెడ్పీ హైస్కూల్ పీఈటీ ఎండీ యూసుఫ్ను మంత్రి సభలో సత్కరించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఏ అజీజ్, సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, వైస్ ఎంపీపీ గుత్తా వెంకులు, తహసీల్దార్ టి.మైఖేల్రాజ్ పాల్గొన్నారు. -
వైభవంగా సామూహిక వ్రతాలు
కాళ్ల : గ్రామంలోని స్వయంభూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సుమారు 450 మంది పాల్గొని స్వామివారి వ్రతాలు ఆచరించారు. తాడినాడ గ్రామానికి చెందిన వేగేశ్న వెంకట సూర్య సత్యనారాయణ రాజు– సూర్య లక్ష్మి దంపతులు వ్రతాల్లో పాల్గొన్న వారికి అన్నవరం స్వామివారి ప్రసాదం, ప్రతిమ అందజేశారు. గూట్లపాడుకు చెందిన ఆరేటి సత్యనారాయణ, నాగ పుష్పావతి ప్రసాద వినియోగం ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ అడ్డాల వెంకట గణపతిరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏలూరు (మెట్రో) : జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ను తూర్పు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎన్జీవో నాయకులు, జిల్లా ఎన్జీవో ఎన్నికల అధికారి ఉల్లి కృష్ణ శుక్రవారం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఇలా 15 పోస్టులతో కూడిన జిల్లా కమిటీకి సంబంధించి 25వ తేదీ మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేస్తారు. అనంతరం జాబితాను విడుదల చేస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే 26వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చి 26న తుదిజాబితా ప్రకటిస్తారు. ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేష¯ŒS వస్తే 25నే నూతన జిల్లా ఎన్జీవో కమిటీని ప్రకటిస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే డిసెంబర్ 4న మధ్యాహ్నం వరకూ ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలోని 15 తాలూకాలకు చెందిన 277 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేసులో రెవెన్యూశాఖ : జిల్లా ఎన్జీవో అధ్యక్ష పదవి కోసం జిల్లా రెవెన్యూ శాఖ తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ శాఖ తమ నుంచి ఏలూరు ఎన్జీవో తాలూకా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్కుమార్ను అభ్యర్థిగా ప్రకటించింది. అదే విధంగా పే అండ్ అకౌంట్స్, ఇరిగేష¯ŒS శాఖల నుంచి హరనాథ్, చోడగిరి శ్రీనివాసరావు కూడా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. -
బ్యాంకులో వృద్ధుడి నుంచి రూ.49వేలు చోరీ
కొయ్యలగూడెం : పాతనోట్లు మార్చుకునేందుకు కన్నాపురం ఆంధ్రాబ్యాంకుకు వచ్చిన ఒక వృద్ధుడి నుంచి ఇద్దరు యువకులు రూ.49వేలు దొంగిలించి పరారైన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బుట్టాయగూడెం మండలం కోట రామచంద్రపురానికి చెందిన బర్రె విజయరాజు కొద్దినెలల కిందట పొలం అమ్మగా సుమారు రూ.3.50 లక్షలు వచ్చాయి. ఇందులో అప్పులు తీర్చగా పోను రూ.49వేలను దాచుకున్నాడు. ప్రస్తుతం పెద్దనోట్లను రద్దు చేయడంతో వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి భార్య భద్రమ్మతోపాటు వచ్చాడు. క్యూలో నిలుచుని ఉన్న విజయరాజును మంచినీరు పోయాల్సిందిగా ఇద్దరు యువకులు కోరారు. దీంతో ఆయన పక్కనే ఉన్న వాటర్టిన్ను గ్లాసులోకి వంచుతుండగా, ఇద్దరూ విజయరాజు పైజేబులో ఉన్న సొమ్మును లాక్కుని పరారయ్యారు. విజయరాజు వృద్ధుడు కావడంతో వారిని వెంబడించలేకపోయాడు. బ్రాంచి మేనేజర్ సూచన మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పాలకొల్లు అర్బన్/యలమంచిలి : చించినాడ బైపాస్ రోడ్డులోని కాజ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పాలకొల్లు రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. పూలపల్లికి చెందిన కోలా అజయ్ (14), యలమంచిలి మండలం ఊటాడ గ్రామానికి చెందిన భారతి సుబ్బారావు ఇద్దరూ స్కూటర్పై చించినాడ వైపు వెళ్తుండగా అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎల్వీఆర్ ట్రావెల్ బస్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదస్థలంలో పడిఉన్న అజయ్, సుబ్బారావును సీఐ చంద్రశేఖర్ తన జీపులో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అజయ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుబ్బారావు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అజయ్ కాలు బస్సు బాయ్నెట్లో విరిగిపోయి ఉండడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. అజయ్ లజపతిరాయపేట మాంటిస్సోరీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. సుబ్బారావు తన తండ్రి కృష్ణతో కలిసి రొయ్యల చెరువులపై పనిచేస్తున్నాడు. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జనావేధన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు.. చిల్లర నోట్లు, కొత్త నోట్లు తీసుకునేందుకు బ్యాంకుల ఎదుట జనం పెద్దఎత్తున క్యూ కడుతూనే ఉన్నారు. అడుగడుగునా అవస్థలతో వేదనకు గురవుతుంటే.. మరోవైపు వారిని మోసం చేసే ముఠాలు చెలరేగిపోతున్నాయి. కొయ్యలగూడెం మండలం కె.కన్నాపురంలో ఆంధ్రాబ్యాంక్ వద్ద ఓ వృద్ధుణ్ణి మోసం చేసి రూ.49 వేల పాత నోట్లను దొంగలు అపహరించుకుపోయారు. ఆ గ్రామానికి చెందిన విజయరాజు అనే వృద్ధుడు తన వద్ద ఉన్న నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చాడు. బల్లమీద కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు మీ వస్తువులు పడిపోయాయని చెప్పి అతని వద్ద ఉన్న నోట్లను దొంగిలించి పారిపోయారు. మరోవైపు ఒకరి ఆధార్ కార్డు నంబర్ను ఉపయోగించి వేరేవారు డబ్బులు మార్చుకుపోయిన ఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి. ఆధార్కార్డు జిరాక్స్ తీసుకుని బ్యాంకుకు వెళ్లి రూ.4వేల పాత నోట్లను మార్చుకునేం దుకు ప్రయత్నించగా ఇప్పటికే మీ ఆధార్ నంబర్తో సొమ్ములు మార్చుకున్నారన్న సమాధానం రావడంతో విస్తుపోయిన ఘటనలు ఏలూరులో చోటుచేసుకున్నాయి. జిరాక్స్ తీయిస్తున్న సమయంలో మరో కాపీ తీసుకున్నారా, లేకపోతే సిమ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన జిరాక్స్ కాపీలను దుర్వినియోగం చేస్తున్నారో తెలియని పరిస్థితి పలుచోట్ల ఉంది. తెరుచుకోని ఏటీఎంలు మరోవైపు శుక్రవారం కూడా ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ప్రాంగణాల్లో ఉన్న ఏటీఎంలు మాత్రం కొద్దిసేపు పనిచేయగా, బహిరంగ ప్రాంతాల్లోని ఏటీఎంలు పూర్తిగా మూసి ఉంచారు. అక్కడక్కడా కొన్ని ఏటీఎంలు తెరుచుకున్నా తక్కువ మొత్తంలో రూ.100 నోట్లు మాత్రమే పెట్టారు. రూ.2 వేల నోట్లు ఏటీఎంలలో పెట్టడానికి సాంకేతిక సమస్య ఉందని, దానిని సరిచేస్తేగాని వాటిని ఏటీఎం సెంటర్లలో అందుబాటులో ఉంచలేమని అధికారులు ప్రకటించారు. రూ.2000 నోట్లు, రూ.50 నోట్లు పెట్టాలంటే సాఫ్ట్వేర్ మార్చాల్సి ఉంటుందని, అందువల్ల జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. మరోవైపు ఏలూరు పెద్ద పోస్టాఫీసు వద్ద రూ.500, రూ.1000 నోట్లు చిల్లర ఉన్నా మార్చుకోవడం లేదంటూ ప్రజలు ధర్నాకు దిగారు. చిల్లర సమస్యతో పెట్రోల్ బంక్లు శనివారం నుంచి మూసివేయనున్నట్టు ప్రచారం జరగడంతో వాటివద్ద రద్దీ పెరిగింది. రూ.లక్ష విసిరేసి వెళ్లిన వ్యక్తి ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్ష విలువైన పాత వెయ్యి నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. అవి నిజమైన నోట్లా.. కాదా.. అన్న సందేహంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. ఇదిలావుంటే మొదటి రోజు కంటే రెండో రోజున బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద జనం రద్దీ పెరిగింది. బారులు తీరి నగదు బదిలీ కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఎంతో కొంత పెద్ద నోట్లను వదిలించుకోవడమే చాలన్నట్టుగా పేద, మధ్యతరగతి వర్గాలు ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులకు పెద్ద నోట్లను చెల్లించారు. -
‘గడపగడపకూ వైఎస్సార్’తో బెదిరిన టీడీపీ
కొయ్యలగూడెం : గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ప్రజలకు చేరువకావడంలో పార్టీ శ్రేణులు విజయం సాధించాయని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా టీడీపీ జనచైతన్య యాత్రలు నిర్వహిస్తూ జనం చేత చీత్కారాలకు గురైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి యర్రంపేటలో మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలు లేని ప్రాంతాల్లో టీడీపీ జన చైతన్యయాత్రలు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు రక్షణ కవచంలా నిలబడుతుందని, వారిపై దాడులు సహిస్తే ముందుగా నేనే టీడీపీ శ్రేణులను ఎదుర్కోవడానికి సైనికుడిని అవుతానని ఆళ్ల నాని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసే కాలం దగ్గరల్లోనే ఉందని చెప్పారు. ముందుగా పొంగుటూరులో సర్పంచ్ల ఛాంబర్ మండల అధ్యక్షురాలు కాసగాని వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాశం రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, సీనియర్ నాయకులు తాడికొండ మురళీకృష్ణ, సర్పంచ్ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవీగంజిమాల, స్థానిక నాయకులు కంఠమణి సుబ్బారాయుడు, గద్దే సురేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చింతలపూడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు చినవెంకన్న తెప్పోత్సవం
ద్వారకా తిరుమల : క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చినవెంకన్న తెప్పోత్సవం నేత్రపర్వంగా జరగనుంది. ఇందుకు క్షేత్రంలోని పుష్కరణి వద్ద సరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏటా ఈ ఉత్సవాన్ని శ్రీవారి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడు కూడా వేడుకను నేత్రపర్వంగా జరిపేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీవారి పుష్కరణిని, గట్లును అలంకరించారు. పుష్కరణి పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పుష్కరణి ముందు స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ను ఏర్పాటు చేస్తున్నారు. తెప్పను హంసగా ముస్తాబు చేస్తున్నారు. ఈ తెప్పోత్సవ వేడుక శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమౌతుందని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
బస్తాకు రూ.1,500 మద్దతు ధర ఇవ్వాలి
ఏలూరు (మెట్రో) : ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,500 మద్ధతు ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. ధాన్యం మార్కెట్లోకి వచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, అయినకాడికి దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం మద్దతు ధర, స్వామినాథ¯ŒS కమిటీ సిఫార్సుల అమలు అంశంపై స్థానిక ఐఏడీపీ హాలులో శుక్రవారం రాష్ట్ర కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న రంగారావు మాట్లాడుతూ మిల్లర్లు, దళారులు కలిసి తేమశాతం, తాలు శాతం పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. ఈ సదస్సులో రిటైర్డ్ జెడిఎ జి.ప్రసాదరావు, రైతు నాయకులు నల్లిమిల్లి వీరరాఘవరెడ్డి, అట్లూరి రాధాకృష్ణ, జుజ్జవరపు శ్రీనివాస్, పిచ్చెట్టి నరశింహమూర్తి, వాడపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 95 శాతం సెటాప్ బాక్స్ల ఏర్పాటు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో 95 శాతం వరకూ సెటాప్ బాక్స్లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వినియోగదారుల అసోసియేషన్ ప్రతినిధులు, ఎంఎస్ఒలతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే ఫోర్త్ ఫేజ్లో 95శాతం సెటప్ బాక్స్లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని డిసెంబరు 31వ తేదీనాటికి నూరు శాతం మంతి పూర్తి చేసుకుంటారని చెప్పారు. -
11 నుంచి ‘మన గుడి’
ఏలూరు (ఆర్ఆర్పేట) : హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 8వ విడత మన గుడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్. దుర్గాప్రసాద్, ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు ఎంవీఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో టీఎస్.రవికుమార్, కెవీ.నరసింహాచార్యులు, ఎస్ఎస్.చక్రధర్, జీవీ.నాగేశ్వరరావు, సీహెచ్. సత్యనారాయణరాజు పాల్గొన్నారు. -
2020 నాటికి కోటిపల్లి రైల్వేలైన్కు ఓ రూపు
నరసాపురం : కోటిపల్లినరసాపురం రైల్వేలైన్కు 2020 నాటికి ప్రాథమికంగా ఓ రూపు వస్తుందని దక్షణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. శుక్రవారం నరసాపురం రైల్వేస్టేషన్ను తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటిపల్లి రైల్వేలైన్కు సంబంధించి మూడు బ్రిడ్జిల నిర్మాణం ముందుగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. గౌతమి నదిపై రైల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వైనతేయి, వశిష్ట నదులపై రైలు వంతెనల నిర్మాణాలపై ఎలాంటి కదలిక లేదన్నారు. ఈ మూడు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తవ్వడానికే 30, 40 నెలలు పడుతుందని పేర్కొన్నారు. నరసాపురం రైల్ కం బ్రిడ్జి లేదు నరసాపురంలో రైల్ కం వంతెన నిర్మాణ ప్రతిపాదనలు లేవన్నారు. కోటిపల్లి రైల్వేలైన్కు సంబంధించి నరసాపురంలో రైల్ కమ్ బ్రిడ్జి లింక్ ఉండదన్నారు. చించినాడ బ్రిడ్జి వద్దే సమాంతరంగా రైల్ బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా రైల్కమ్బ్రిడ్జిల ప్రతిపాదనలు లేవని చెప్పారు. అలాగే ఆర్వోబీల నిర్మాణాల ప్రతిపాదనలు కూడా లేవన్నారు. ఆయన వెంటన రైల్వే డీజీఎం (విజయవాడ) అశోక్కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
పురుగుమందుల గిడ్డంగిపై విజిలెన్స్ దాడులు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో ఎటువంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న పురుగుమందుల గిడ్డంగిపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. విజిలెన్స్ ఏవో ఎం. శ్రీనివాసకుమార్, డీసీటీవో జి.జయకుమార్, ఎస్ఐ ఎస్.రామకృష్ణ, మండల వ్యవసాయాధికారి ఎస్.చెన్నకేశవు సంయుక్తంగా గిడ్డంగిలో తనిఖీలుచేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుమందులను గుర్తించారు. గిడ్డంగిలో ప్లాస్టిక్ కవర్లతోపాటు, కొన్ని లేబుళ్లు లభ్యం కావడం, ఆ లేబుళ్లపై ఫార్మోలేటెడ్బై ఎన్జీ గూడెం అని ఉండడంతో అధికారులు నాగులగూడెం కూడా తనిఖీకి వెళ్లారు. అక్కడ మందులు తయారు చేస్తున్నారనే అనే అంశంపై ఆరా తీశారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్రమంగా సరుకు నిల్వ ఉంచిన గిడ్డంగి లైసెన్సు కె.రాజేశ్వరి పేరుమీద ఉందని చెబుతున్నారని, ఇక్కడ పురుగుమందుల నిల్వకు, విక్రయాలకు అనుమతులు లేవని విజిలెన్స్ అధికారులు చెప్పారు. గిడ్డంగిలోని రూ.ఆరులక్షల71వేల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై 6ఏ కేసుతోపాటు, అనధికార నిల్వపై మరో కేసు నమోదుచేసినట్టు వివరించారు. -
7న గోదావరికి మహా నీరాజనం
కొవ్వూరు :తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 7న గోదావరికి మహా నీరాజనం కనుల పండువగా నిర్వహించనున్నట్టు ఆర్డీవో బి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గోష్పాదక్షేత్రం స్నానఘట్టానికి ప్రతి కార్తీక సోమవారం భక్తుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరికి మహా నీరాజనం సమర్పించేందుకు స్నానఘట్టం వద్ద నదిలో మూడు పంట్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. టీటీడీ నుంచి తెచ్చిన భూదేవి, శ్రీ దేవి సమేత కలియుగ వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గోదావరిలో పెరిగిన ఒండ్రు మట్టి, చెత్త చెదారం తొలగింపునకు కలెక్టర్ రూ.లక్ష మంజూరు చేసినట్టు చెప్పారు. పారిశుధ్యం మెరుగ్గా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్కి సూచించారు. భక్తులకు తాగునీరు, రక్షణ తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
డిజైన్ ఖరారుకాని భవనాలకు శంకుస్థాపన
-
నేడు కౌన్సిల్ సమావేశం
రాయచోటిటౌన్: రాయచోటి మున్సిపల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్రాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ రాయచోటి మున్సిపాలిటీని ప్రభుత్వం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించిందని, ఇందుకోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. పట్టణ పరిధిలోని అనేక అభివద్ధి పథకాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కౌన్సిలర్లు తప్పకుండా హాజరు కావాలని కోరారు. -
ఇంటి గోడల నుంచి వెండి నాణేల లభ్యం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో పాడుపడిన ఇంటిlగొడలను శుక్రవారం కూల్చివేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. ఇంటి యజమాని ఇంటిని పొక్లైనర్తో పడగొడుతున్న సమయంలో గోడల్లో నుంచి కుండలు బయల్పడ్డాయి. కిందపడిన ఈ కుండలు పగలడంతో వెండి నాణేలు బయటకు వచ్చాయి. ఇంటి యజమాని వెంటనే పనులు నిలుపుదల చేయించి పొక్లైనర్ను పంపించి వేశారు. ఇంటి పరిసరాల్లో తవ్వకాలు చేస్తే మరిన్ని నాణేలు బయటపడే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆశావహులు ఆ పరిసరాల్లో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని పడగొట్టిన ఇంటి ప్రాంతంలోనే జాగారం చేస్తున్నారు. ఈ వెండి నాణేలు 1907 సంవత్సరం కాలం నాటి రూపాయి నాణేలు, పులిబొమ్మ , బ్రిటిష్ రాజు, ఓంకారం ఉన్న నాణేలు లభ్యమైనట్టు స్థానికులు తెలిపారు. అయితే ఎన్ని నాణేలు ఉన్నాయో తెలియలేదు. దీనిపై అధికారులకు కూడా ఎటువంటి సమాచారం లేదు. కొందరు చిన్నారులు కొన్ని నాణేలను తీసుకెళ్లారని, కుండలో వెండి నాణేలతో పాటు బంగారు నాణేలు కూడా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. -
ముగిసిన మహా కుంభాభిషేకం
పాలకొల్లు సెంట్రల్ : స్థానిక ఉమా క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం మహా కుంభాభిషేకం వైభవోపేతంగా ముగిసింది. కలశపూజ చేసిన పవిత్ర జలాలతో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ ఆలయ శిఖరానికి అభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని అన్నారు. కుంభాభిషేకం వల్ల సమృద్ధిగా వర్షాలు పడి పాడిపంటలు తులతూగుతాయన్నారు. ఈవిధంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పూజా కార్యక్రమాలు జరి గితే రాష్ట్రం అభివృద్ధితో విరాజిల్లుతుందని అన్నారు. సుమారు పది వేల మంది భక్తులు కుంభాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, అవభృధస్నానము, శాంతి కల్యాణం, పంచ హారతులు, మహదాశీర్వచన, పండిత సత్కారం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం చండీ ఉపాసకులు మాడుగుల శివశ్రీ శర్మ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. -
జిల్లాలో 32 కరువు మండలాలు
- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో 32 మండలాలను కరువు కింద ప్రకటిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైరుతి రుతు పవనాల వల్ల జిల్లాలో ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. ఖరీఫ్లో వర్షాధారంపై సాగు చేసిన పంటలు దాదాపుగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 1.34 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 97 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వేరుశనగ, పత్తి, కంది, పెసర, మినుము తదితర పంటలు ఎండిపోయాయి.వేరుశనగ పంట ఊడలు దిగే సమయంలో వాన ముఖం చాటేసింది. ప్రభుత్వ రెయిన్గన్ల ప్రయోగం ఫలితాలివ్వలేకపోయింది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని 32 మండలాలను కరువు కింద ప్రకటించాలంటూ కలెక్టర్ కేవీ సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత బుధవారం రాష్ట్ర స్థాయి డ్రాట్ కమిటీ వివిధ జిల్లాల నుంచి ప్రతిపాదనలను పరిశీలించింది. కలెక్టర్ పంపిన ప్రతిపాదనల మేరకు అన్ని మండలాలను కరువు కింద గుర్తిస్తూ జీఓ నెం. 9 విడుదల చేసింది. జిల్లాలో కరువు సహాయక చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఇవీ.. – ఏదైనా మండలాన్ని కరువు కింద ప్రకటించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను అనుసరిస్తుంది. ఇందులో వర్షపాతలోటు ప్రధానమైంది. సంవత్సర సాధారణ వర్షపాతం 750 మిల్లీ మీటర్లు ఉన్న మండలాల్లో 15 శాతం వర్షపాత లోటు ఉండాలి. జిల్లా సాధారణ వర్షపాతం 700మిల్లీమీటర్లు కనుక ఈ నిబంధన వైఎస్సార్ జిల్లాకు వర్తిస్తుంది. ఈ ఖరీఫ్లో ఈ నిబంధన ప్రకారం పరిశీలిస్తే 32 మండలాల్లో వర్షపాత లోటు నమోదైంది. – ప్రధాన పంటల సాధారణ సాగు విస్తీర్ణం 50 శాతానికి మించి తగ్గిపోవాలి. – ఐదు సంవత్సరాల సగటు పంట దిగుబడులతో పోలిస్తే 33 శాతం దిగుబడి నష్టం ఉండాలి. – పంటలను ప్రభావితం చేసే డ్రై స్పెల్స్ నమోదు ఉండాలి. – నార్మలైజ్డ్ విజిటేటివ్ డిఫరెన్షియల్ ఇండెక్స్ – పై నిబంధనలలో వర్షపాత లోటు తప్పనిసరిగా ఉండాలి. మిగతా వాటిల్లో ఏదేని రెండు వర్తిస్తే ప్రభుత్వం వాటిని కరువు మండలాల కింద ప్రకటిస్తుంది. కరువు మండలాలు ఇవీ కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, తొండూరు, చక్రాయపేట, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బ్రహ్మంగారిమఠం, గోపవరం, బద్వేలు, అట్లూరు, కొండాపురం, మైలవరం, పెద్దముడియం, రాజుపాలెం, బి.కోడూరు, ముద్దనూరు, వేముల, వీరపునాయునిపల్లె, కమలాపురం, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వేంపల్లె, రామాపురం, వీరబల్లి. -
దొంగల ముఠా అరెస్ట్
ఏలూరు(సెంట్రల్) : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ భూషణ్ శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక వన్టౌన్లోని మోతేపల్లి వారి వీధి రామాలయం వద్ద నివాసం ఉండే గొల్లపల్లి నాగ మల్లేశ్వరరావు అలియాస్ మల్లి, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు గ్రామానికి చెందిన షేక్ అజీజ్లిద్దరూ కలిసి ఏలూరు సబ్డివిజన్ పరిధిలోని భీమడోలు, ఏలూరు రూరల్, టూటౌన్, చేబ్రోలు, దెందులూరు, ఉండ్రాజువరం పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఈ కేసుల దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం భీమడోలు, ఏలూరు రూరల్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. భీమడోలు రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న గొల్లపల్లి నాగమల్లేశ్వరరావుతోపాటు, అతని బాబాయ్లు గొల్లపల్లి నాగరాజు, దాసరి బోసురాజును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నాగమల్లేశ్వరరావు, అజీజ్లిద్దరూ కలిసి పలు దొంగతనాలకు పాల్పడినట్టు, వారికి నాగరాజు, బోసురాజు, అజీజ్ భార్య సమీరా, తల్లి అస్లాంబేగ్, తండ్రి మస్తాన్ సాహెబ్ సహకరించినట్టు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు కాజులూరు వెళ్లి అజీజ్ భార్య సమీరా, తల్లి స్లాంబేగ్ను అరెస్ట్ చేశారు. మస్తాన్ సాహెబ్ పరారాయ్యాడు. అరెస్టయిన ఐదుగురు నిందితుల వద్ద పోలీసులు రూ. 21 లక్షల 76 వేలు నగదు, 440 గ్రాముల బంగారం, కిలో వెండి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు, లారీ రికార్డులు స్వాధీనం చేసున్నారు. ఈ సొత్తు విలువ రూ.60 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. మొత్తం 17 చోరీలు గొల్లపల్లి నాగమల్లేశ్వరరావు, షేక్ అజీజ్ కలిసి ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 17 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసు విచారణలో తెలింది. ఈ చోరీల్లో సుమారు రూ.64 లక్షలు విలువైన సొత్తును దొంగిలించినట్టు తెలిసింది. వీరిద్దరూ కొన్ని చోరీల అనంతరం డబ్బు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పంచుకుంటారని, కొంతకాలం ఖాళీగా ఉండి తిరిగి దొంగతనాలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. చోరీ సొత్తుతో ఇళ్ల స్థలాలు, లారీ కొనుగోలు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. షేక్ అజీజ్ ఇళ్ల స్థలాలు, లారీ కొన్నట్టు తేలింది. అతను చోరీ సొమ్ముతో భార్య సమీరా, తండ్రి మస్తాన్ సాహేబ్ పేరిట రూ.15 లక్షలతో నర్సీపట్నంలో ఐదు సెంట్లు ఇళ్ల స్థలం కొన్నాడు. మరోచోట ఇళ్లస్థలం కొనేందుకు రూ.3 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాడు. రూ.6 లక్షలతో ఓ లారీనీ కొన్నాడు. అతని బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఉంది. దీనిని పోలీసులు సీజ్ చేశారు. చోరీ సొత్తును దాచిపెట్టడానికి అజీజ్కు తల్లి అస్లాంబేగ్, భార్య సమీరా, తండ్రి మస్తాన్ సహకరించేవారు. నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం కాజులూరు వెళ్లి అజీజ్ భార్య షేక్ సమీరా, తల్లి షేక్ అస్లీమబేగంను అరెస్ట్ చేశారు. అజీజ్ తండ్రి షేక్ మస్తాన్ సాహేబ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో అరెస్టయిన అజీజ్ నెల రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. హత్యకేసుల్లోనూ నిందితుడు అరెస్టయిన నాగమల్లేశ్వరరావు చోరీ సొత్తును అతని బాబాయ్లు ఏలూరు తూర్పువీధికి చెందిన గొల్లపల్లి నాగరాజు, జంగారెడ్డిగూడెంకు చెందిన దాసరి బోసురాజు వద్ద దాచేవాడు. నాగ మల్లేశ్వరరావుపై విశాఖపట్నం జిల్లాలో రెండు హత్య కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఫిర్యాదు సక్రమంగా ఇవ్వాలి ఎక్కడైనా చోరీ జరిగితే బాధితులు ఫిర్యాదులో పోయిన వస్తువులు, నగదు వివరాలు సక్రమంగా ఇవ్వాలని ఎస్పీ భాస్కర్భూషణ్ కోరారు. ఇటీవల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఫిర్యాదుదారు తన ఇంట్లో రూ.10వేలు చోరీకి గురైతే రూ.3లక్షలు పోయినట్టు ఫిర్యాదు ఇచ్చారని, ఇలా చేయడం వల్ల విచారణ సరిగా సాగదని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన భీమడోలు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై బి.వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్సై ఎం.వి.సుభాష్, హెడ్కానిస్టేబుళ్లు షేక్ అమీర్, బండారు నానిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ భాస్కరరావు, సీఐ చిన్ని కొండలరావు పాల్గొన్నారు. -
బాణసంచా అక్రమ తయారీపై కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. ఆయన శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగను ప్రజలంతా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీనికోసం పోలీసుశాఖ రక్షణ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. అక్రమ బాణసంచా తయారీ కేంద్రాలపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫోన్కాల్స్ను స్వీకరించిన ఆయన ప్రజల సమస్యలను విన్నారు. బుట్టాయిగూడెం నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి గ్రామంలో పేకాట యథేచ్ఛగా సాగుతోందని, దానిని నిరోధించాలని కోరారు. ఏలూరులో ట్రాఫిక్ నియంత్రించాలని మరో వ్యక్తి విజ్ఞప్తి చేశారు. కైకరంలో ఒకవ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆ గ్రాముస్తడు ఫిర్యాదు చేశారు. దెందులూరులో ఆటోలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. -
జిల్లాలో డెంగీ మరణాలు లేవు
ఏలూరు అర్బన్ : జిల్లాలో డెంగీ మరణాలు లేవని జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్. కె.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం yీ సీహెచ్ఎస్ శంకరరావు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గడచిన పది నెలల కాలంలో 800 మంది జ్వరపీడితులకు డెంగీ పరీక్షలు నిర్వహించగా వారిలో కేవలం 13 మందికి డెంగీ ఉందని నిర్ధారణ జరిగిందన్నారు. వారు కూడా చికిత్సల అనంతరం సాధారణ స్థితికి వచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయన డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చికిత్సల అనంతరం కోలుకుంటున్న జ్వరపీడితులను పరామర్శించారు. అనంతరం తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులకు, పుట్టుకతోనే కామెర్ల బారిన పడిన చిన్నారులకు నవజాత శిశు విభాగంలో అందుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఐవో డాక్టర్ మోహనకృష్ణ తదితరులు ఉన్నారు. -
దసరా నుంచే.. తీన్మార్
కొత్త జిల్లాలు ముహూర్తం ఖరారు సిద్దిపేటలోకి మరో మండలం బెజ్జెంకిని కలపాలని ప్రతిపాదనలు తుది నోఫికేషన్కు సర్వం సిద్ధం సిద్దిపేటకు ఖరారైన కలెక్టర్ అధికారిక ఉత్తర్వులే తరువాయి మెదక్ జిల్లాలో కొత్తగా ఐదు మండలాలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:దసరా నుంచే కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొచ్చే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మెదక్ జిల్లాను మూడు జిల్లాలు చేయడంపై శుక్రవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తొలి ముసాయిదా తరువాత నిర్ణయం తీసుకున్న రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు అవసరమైన చట్ట సవరణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ను తేవాలని క్యాబినేట్ నిర్ణయించింది.‡ తాజా పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో అదనంగా మరో మండలం కలవబోతోంది. కరీంనగర్ జిల్లాలోని పాత బెజ్జంకి మండల కేంద్రంతో పాటు మరి కొన్ని గ్రామాలను కలుపుకొని బెజ్జంకి మండలం పేరుతో సిద్దిపేట జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు పంపారు. ఈ నిర్ణయంపై రెండు జిల్లాల మంత్రులతో పాటు, కలెక్టర్లు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బెజ్జెంకి మండలంలోని గ్రామాలను రెండుగా విభజన చేసి కరీంనగర్కు సమీపంగా ఉన్న గ్రామాలకు వడ్లూరు (బేగంపేట) లేదా గన్నేరువరం మండల కేంద్రం చేసి కరీంనగర్ జిల్లాలో చేరుస్తారు. ఇక మిగిలిన జెజ్జంకి, తోటపల్లి, పోతారం, గాగిల్లాపూర్, గుగ్గిల్ల, వేములపల్లి, లక్ష్మీపూర్, దేవక్కపల్లి, దాచారం, వీరాపూర్, గూడెం, కల్లెపల్లి, ముత్తన్నపేట, చిలాపూర్, రేగులపల్లి గ్రామాలు, ఇల్లంతకుంట మండలంలో గుండారం, రేపాక గ్రామాలు, కోహెడ మండలంలోని ఇంకొన్ని గ్రామలను కలిపి బెజ్జంకి మండల కేంద్రం చేసి సిద్దిపేటలో కలుపుతున్నారు. 19 జిల్లాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. తాజాగా ఈ సంఖ్య 23 మండలాలకు చేరుతుంది. నాగిరెడ్డిపేటపై వీడని సందిగ్ధత:.... తొలి నోటిఫికేషన్లో 14 మండలాలతో ఏర్పాటు చేయదలిచిన మెదక్ జిల్లాలో 20 మండలాలకు పెరిగింది. నర్సాపూర్ ప్రజల విజ్ఞప్తి మేరకు నర్సాపూర్కు రెవెన్యూ డివిజన్ హోదా కల్పిస్తూ మెదక్ జిల్లాలో చేర్చారు. నిజాంపేట, మనోహరాబాద్, నార్సింగి, హవేళిఘణపురం, పిడిచేడ్ గ్రామాలకు మండల కేంద్రం హోదా కల్పించారు. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూన్నారు. పోచారం, మాల్తుమ్మెద, వాడి, చీనూరు తదితర గ్రామాలకు చెందిన నలుగురు యువకులు మూకుమ్మడిగా పోచారం డ్యాంలో దూకి ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలు కోరుకుంటే నాగిరెడ్డిపేట మండలంలోని మెదక్ సమీప గ్రామాల ప్రజలు మెదక్ జిల్లాలో కలపవచ్చని ఇటీవల జరిగిన ప్రజాప్రతినిధలు భేటీలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో పై నాలుగు గ్రామాలు మెదక్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే పోచారం గ్రామం వస్తే ఈ గ్రామ పంచాయతీలోని జలప్రాజెక్టు (పోచారం)కూడా మెదక్ జిల్లాలోకి వస్తుంది కాబట్టి, కామారెడ్డి ప్రజా ప్రతినిధులు పోచారంను మెదక్లో కలపకుండా అడ్డం పడుతున్నట్లు సమాచారం. సిద్దిపేట కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి! సిద్దిపేట జిల్లా తొలి కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారిక ఉత్తర్వులు వెలువడటమే తరువాయి. ప్రస్తుతం మెదక్ జాయింట్ కలెక్టర్ పని చేస్తున్న ఆయనకు పూర్తిస్థాయి కలెక్టర్గా పదోన్నతి కల్పిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ర్రూం పథకం ఇళ్లకు వెంకట్రామిరెడ్డి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఇళ్ల నిర్మాణంలో వ్యయప్రయాసాలు ఉన్నప్పటికీ జేసీ పట్టుదలతో అనుకున్న సమయానికే ప్రాజెక్టు దాదాపు పూర్తి చేసి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్శించారు. -
వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఏపీ
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి.టక్కర్ తిరుచానూరు : దేశంలోనే అత్యంత వ్యాపార అనుకూలత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా శ్రమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి.టక్కర్ తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో శుక్రవారం భారతదేశ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన, పరిశ్రమల పురోగతిపై సమీక్ష జరిగింది. రాయలసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 15ఏళ్ల పాటు రెండెంకల వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించుకుందన్నారు. 25వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల మౌలిక వసతులు 30రోజుల్లోపు కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనలో జాప్యం వహించరాదని హెచ్చరించారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తుల్లో 2014లో 8.3శాతం నమోదయ్యిందని, 2015లో 10.99శాతం నమోదవ్వగా ఈ ఆర్థిక సంవత్సరంలో 15.99శాతంగా నమోదయ్యిందని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేకాధికారి కృష్ణయ్య, అమరరాజ బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, సీఐఐ చైర్మన్ శివకుమార్, సీఐఐ తిరుపతి ప్రతినిధి ఎం.విజయనాయుడు, డైరెక్టర్ జీఎస్.రతి, జాయింట్ కలెక్టర్ గిరీషా, తిరుపతి మున్సిపల్ కమిషనర్ వినయ్చంద్, సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల, పరిశ్రమల జోనల్ అధికారులు, 300మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
190 చక్రాల ట్రాలీ
జీలుగుమిల్లి : రహదారిపై 190 చక్రాల భారీ వాహనం(ట్రాలీ) నెమ్మదిగా కదులుతూ చూపరులను ఆకర్షించింది. ఇటువంటివి రెండు వాహనాలు ముంబాయి నుంచి జంగారెడ్డిగూడెంలో గల 132 కేవీ సబ్స్టేషన్కు రెండు(పీటీఆర్) పవర్ ట్రాన్స్ ఫారమ్లను తీసుకుని బయలుదేరాయి. శుక్రవారం ఇవి జంగారెడ్డిగూడెంకు 14 కిలోమీటర్ల దూరంలోని జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురానికి చేరుకున్నాయి. -
190 చక్రాల ట్రాలీ
జీలుగుమిల్లి : రహదారిపై 190 చక్రాల భారీ వాహనం(ట్రాలీ) నెమ్మదిగా కదులుతూ చూపరులను ఆకర్షించింది. ఇటువంటివి రెండు వాహనాలు ముంబాయి నుంచి జంగారెడ్డిగూడెంలో గల 132 కేవీ సబ్స్టేషన్కు రెండు(పీటీఆర్) పవర్ ట్రాన్స్ ఫారమ్లను తీసుకుని బయలుదేరాయి. శుక్రవారం ఇవి జంగారెడ్డిగూడెంకు 14 కిలోమీటర్ల దూరంలోని జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురానికి చేరుకున్నాయి. -
గోదావరి వరద తగ్గుముఖం
కొవ్వూరు : గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలో నీటి మట్టాలు క్రమేణా తగ్గుతున్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 5,46,150 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రం ఆరు గంటలకు 4,30,682 క్యూసెక్కులకు తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 5,800 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మిగిలిన 4,24,882 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువున భద్రచలంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు 35.40 అడుగులుగా ఉన్న నీటిమట్టం 30.50 అడుగులకు తగ్గింది. ఇప్పటి వరకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గేట్లు పూర్తిగా ఎత్తివేసిన అధికారులు వరద తీవ్రత తగ్గడంతో గేట్లు నియంత్రణలో పెట్టారు. ధవళేశ్వరం ఆర్మ్ వద్ద ఉన్న 70 గేట్లలలో 30 గేట్లను అరమీటరు ఎత్తు, 40 గేట్లను మీటరు ఎత్తులేపారు. ర్యాలీలో 43, మద్దూరులోని 23 గేట్లును 1.50 మీటర్లు ఎత్తు, విజ్జేశ్వరం ఆర్మ్లోని 39 గేట్లును మీటరు ఎత్తులేపి వరద నీటిని గోదావరి నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకి శుక్రవారం సాయంత్రం నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ఏలూరు కాలువకు 379, నరసాపురం కాలువకు 304,, జీఅండ్వీ కాలువకు 231, అత్తిలి కాలువకు 204 క్యూసెక్కుల చొప్పున నీటిని విడిచిపెడుతున్నారు. ఉండి కాలువకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులపై సత్వర చర్యలు
– జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ చిత్తూరు (కలెక్టరేట్) : ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసులపై చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ సిద్ధార్థ్జైన్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే చర్యలు తీసుకుని దోషులకు శిక్ష పడేలా పోలీసులు వ్యవహరించాలన్నారు. అట్రాసిటీ యాక్టును అమెండ్ చేస్తూ ఇన్విస్టిగేషన్ కాలపరిమితి 30 నుంచి 60 రోజులకు పెంచారని, ఈ లోగా చర్యలు తీసుకుని చార్జీషీటు ఫైల్ చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించేందుకు సబ్ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో కేసులు పెండింగ్లో ఉంటే సత్వర చర్యల కోసం లేఖ రాయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ నెల 26వ తేది మధ్యాహ్నం స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో వర్క్షాపు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం 15 రోజులకు ముందే డివిజన్, మండల స్థాయి కమిటీలను నిర్వహించాలన్నారు. నారాయణవనంలో 30 ఏళ్ల పాటు సాగు చేసుకుంటున్న ఎస్టీలకు పట్టాలివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుపై కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిందన్నారు. వారి క్లైయిమ్లకు ఆధారాలు పొంది పట్టాలివ్వాలన్నారు. కార్వేటినగరం చాకలివానిగుంటలో గిరిజనులకు పట్టాలు అందకపోవడంపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టాలు అందని గిరిజనులుంటే వారి క్లైయిములు పరిశీలించి వారికి పట్టాలిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో చంద్రగిరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, తిరుపతి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నారాయణస్వామి, సునీల్కుమార్, సుగుణమ్మ, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు శ్రీనివాస్, జయలక్ష్మి, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీశాఖల అధికారులు, ఎస్సీ,ఎస్టీల నాయకులు పాల్గొన్నారు. -
బిందుసేద్యంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం
చిత్తూరు కలెక్టరేట్: బిందుసేద్యం అమలులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ట్రైబల్ సబ్ ప్లాన్, వెట్టిచాకిరీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కొళాయిలు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించాలన్నారు. రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలన్నారు. దళితవాడల్లో రోడ్డు సౌకర్యం తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వెట్టిచాకిరి కేసులు గుర్తించి ఇందులో బాధితులను రక్షించే చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో విజయచందర్, జడ్పీ సీఈవో పెంచలకిశోర్, ఆర్డీవో కోదండరామిరెడ్డి, సీపీఓ భాస్కర్శర్మ, వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వేణు, హార్టికల్చర్ జేడీ ధర్మజ, డీఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో
దువ్వ (తణుకు) : తణుకు మండలం దువ్వ సమీపంలో పదహారో నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఏలూరు నుంచి తణుకు వైపునకు వెళ్తున్న తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అదే మార్గంలో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆటో ఎక్కిన తణుకు పట్టణానికి చెందిన హుచ్చానాయక్ మహీంద్ర, ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన కాసాని తాతయ్యబాబు, తాడేపల్లిగూడెం మండలం ఉప్పాకపాడు గ్రామానికి చెందిన షేక్ మీరాబీ, విజయవాడకు చెందిన వేలమూరి వెంకటేశ్వరశాస్త్రి గాయపడ్డారు. వీరితోపాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రై వర్ పరారీలో ఉన్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1.01 లక్షల విరాళం
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చిన వెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు శుక్రవారం రూ.1,01,116 విరాళాన్ని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మాటూరి రంగనాథ్ అమ్మ కన్స్ట్రక్షన్స్ పేరిట అందించారు. చెక్కును ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావుకు అందజేశారు. దాతకు బాండ్ పత్రాన్ని చైర్మన్ అందించి అభినందించారు. -
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడోత్సవం
-
శ్రీవారి ఆలయంలో రెండో కొప్పెర
సాక్షి, తిరుమల:తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు కానుకలు సమర్పించేందుకు శుక్రవారం రెండో కొప్పెర(హుండీ) ఏర్పాటు చేశారు. పౌర్ణమి పర్వదినంలోని శుభ గడియాల్లో ఈ కొత్త కొప్పెర ప్రారంభించారు. ఆలయ సన్నిధిలో జయ–విజయలకు పక్కనే ఈశాన్యదిశలో నాటికాలం నుండి కొప్పెర ఉంది. ఇందులోనే భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా ఏటా రూ.1000 కోట్లు నగదు కానుకలు, రూ.300 కోట్ల విలువైన బంగారం, వెండి, ఇతర విలువైన రంగురాళ్లు లభిస్తున్నాయి. హుండీలో కానుకలు సమర్పించేందుకు భక్తుల రద్దీ పెరిగింది. వారి మధ్యతోపులాటలు జరుగుతున్నాయి. మరికొన్ని సార్లు హుండీ కానుకలు కూడా చోరీకి గురవుతున్నాయి. దీన్ని గుర్తించిన టీటీడీ ఈవో సాంబశివరావు కొత్త హుండీ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. దీనికి ఆగమ పండితులు, అర్చకులు పచ్చజెండా ఊపారు. దీంతో ప్రస్తుతం ఉన్న హుండీకి సమీపంలోనే మరో హుండీ ఏర్పాటు చేశారు. ఆగమ శాస్రంతోపాటు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయటంతో భక్తులు కూడా సులభంగా కానుకలు, ముడుపులు సమర్పిస్తున్నారు. -
వైభవంగా గరుడోత్సవం
–మలయప్ప దర్శనంతో భక్తకోటి తన్మయత్వం – మాదిరి బ్రహ్మోత్సవాల తరహాలో వాహన ఊరేగింపు సాక్షి,తిరుమల: తిరుమలలో శుక్రవారం గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా పురవీ«ధుల్లో మలయప్ప గరుడవాహనంపై దర్శనమివ్వటం ఆలయ సంప్రదాయం. సాయంసంధ్యాసమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపంలో వేంచేపు చేశారు. వేయి నేతిదీపాల వెలుగులో సహస్ర దీపాలంకారసేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేశారు. భక్తాగ్రేసుడైన గరుడుడిపై ఆశీనులైన మలయప్పను అర్చకులు విశేష ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. రాత్రి 7 గంటలకు భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ ప్రారంభమైన ఊరేగింపు రాత్రి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధులో ్ల సాగింది. భక్తుల హారతి నడుమ స్వామివారు దర్శనమిస్తూ కనువిందు చేశారు. భక్తులు అశేష సంఖ్యలో హాజరై ఉత్సవర్లను దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. మాదిరి బ్రహ్మోత్సవంలా వాహన ఊరేగింపు అక్టోబరు 3 నుండి 11 వ తేది వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన గరుడ వాహనాన్ని మాదిరి బ్రహ్మోత్సవం తరహాలో ఊరేగించారు. ఇందుకోసం భారీ పోలీసు బలగాలు, విజిలెన్స్ సిబ్బందిని బందోబస్తు నిర్వహించారు. వాహనాన్ని అటుఇటు తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించేలా టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. ఉత్సవం అద్యంతం కోలాహలంగా సాగింది. నేటి నుండి తిరుమల శనివారాలు (పెరటాశి మాసం) కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
కాంటూర్ కుదింపు ఎప్పుడు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కొల్లేరు అభయారణ్యం పరిధిని 5 నుంచి 3వ కాంటూర్కు కుదిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడాది దాటిపోయినా పట్టించుకోవడం లేదని కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెరువులను ధ్వంసం చేయడంతో జీవనోపాధి కరువై తామంతా పిల్లలు, వృద్ధులను గ్రామాల్లో వదిలేసి పరాయి రాష్ట్రాలకు వలస వెళ్లామని వాపోయారు. భీమడోలు మండలంలో కొల్లేరు గ్రామమైన ఆగడాల లంకలో శుక్రవారం గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఇంటింటికీ వెళ్లిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబుకు కొల్లేరు వాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆగడాలలంక ఛానల్ రోడ్డు నరకప్రాయంగా మారిందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టిస్తామని మాట తప్పారు 2014లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన ఇల్లు కాలిపోయిందని, ప్రజాప్రతినిధులు వచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి రెండేళ్లయినా పట్టించుకోలేదని మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు పంచాయతీ గ్రామానికి చెందిన మహిళ అవేదన వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆ గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు డ్వాక్రా రుణమాఫీ అమలు కాలేదని వాపోయారు. ఒక్క పేదవాడికీ ఇల్లు రాలేదు టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టలేదని పెంటపాడు మండలం పరిమెళ్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారి పింఛన్లు రద్దుచేసి టీడీపీ నాయకులు వారి బంధువులకు, అనుచర వర్గానికి ఇచ్చుకున్నారని వాపోయారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైందని తాడేపల్లిగూడెం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. పెంటపాడు మండలం పరిమెళ్ల, యానాలపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. రోడ్లు మరిచారు తమ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో రహదారులు, డ్రెయినేజీ సమస్యల్ని విస్మరించారని, వర్షం పడితే కాలనీ ముంపునకు గురవుతోందని ఆచంట మండలం భీమలాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, వీరవాసరం ఎంపీపీ కౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమలాపురంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. -
మహిళా వర్సిటీకి ఉన్నత హోదా
–నాక్– ఏ గ్రేడ్ గుర్తింపు –వర్శిటీ వర్గాల్లో ఆనందం యూనివర్సిటీ క్యాంపస్ : శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అధికారుల కృషి ఫలించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ (నాక్) ఏ–గ్రేడ్ను సాధించింది. 3.11 గ్రేడ్ పాయింట్లతో ఈ హోదా సొంతమైంది. తాజాగా ఎస్వీయూ, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సరసన ఈ వర్శిటీ కూడా చేరింది. మహిళా విశ్వవిద్యాలయంలో తమిళనాడులోని భారతీదాసన్ యూనివర్సిటీ మాజీ వీసీ కె.మీణ నేతృత్వంలోని కమిటీ జూలైలో పర్యటించింది. విశ్వవిద్యాలయంలోని బోధన, పరిశోధన, విస్తరణ, మౌలిక వసతులను పరిశీలించింది. కమిటీ తన నివేదికను బెంగళూరులోని నాక్కు సమర్పించింది. నాక్ గురువారం 17వ స్టాడింగ్కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఏ–గ్రేడ్ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం రాత్రి ఫలితాలను ప్రకటించింది. మహిళా వర్సిటీ 3.11 పాయింట్లతో ఎ–గ్రేడ్ సాధించింది. బీ నుంచి ఏకు శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం 2009లో బి–గ్రేడ్సాధించి రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2012 నుంచి2015 వరకు వీసీగా ఉన్న రత్నకుమారి యూనివర్సిటీని అభివృద్ధి చేశారు. అనేక భవన నిర్మాణాలు చేపట్టారు. మౌలిక వసతులు పెంచారు. 24 అధ్యాపక పోస్టులను భర్తీ చేశారు. 2015లో వీసీగా నియమితులైన దుర్గాభవాని బోధన, పరిశోధన అంశాల్లో నాణ్యత పెంచేందుకు ప్రయత్నించారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూ)లు కుదుర్చుకుంది. ఇవన్నీ ఏ–గ్రేడ్ రావడంలో దోహదపడ్డాయి. ఎ–గ్రేడ్దక్కడంతో వర్సిటీలో ఆనందోత్సహాలు విరిశాయి. యూనివర్సిటీలోని అధ్యాకులు, విద్యార్థులు, సిబ్బంది చేసిన కృషికి ఫలితం దక్కిందని వీసీ ప్రొఫెసర్ వి.దుర్గాభవాని వ్యాఖ్యానించారు. బోధన, పరిశోధన ,విస్తరణ, మౌలిక రంగాల్లో చేసిన కృషికి ఫలితం దక్కిందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి పేర్కొన్నారు. -
సూరంపూడిలో హీరో శర్వానంద్ సందడి
ఇరగవరం : మండలంలోని సూరంపూడిలో శుక్రవారం సినీ షూటింగ్ సందడి నెలకొంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో శర్వానంద్ హీరోగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. హీరోపై పలు సన్నివేశాలను యువ దర్శకుడు వేగేశ్న సతీష్ చిత్రీకరించారు. శర్వానంద్గా జోడీగా హీరోయిన్ అనుపమ నటిస్తున్నట్టు చెప్పారు. మరో రెండు రోజులు గ్రామంలో షూటింగ్ జరపనున్నట్టు చిత్ర బృం దం తెలిపింది. -
నిడదవోలు రైల్వేగేటు మూసివేత
నిడదవోలు :ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన రాకపోకల కోసం ఏర్పాటుచేసిన నిడదవోలు రైల్వేగేటును శుక్రవారం అధికారులు మూసివేశారు. రైల్వే టెక్నికల్ ఇంజినీరింగ్ విభాగంకు చెందిన గ్యాంగ్ ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 22 వరకు వారం రోజుల పాటు గేటు మూసి ఉంటుంది. పోలీసులు వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు. రెండేళ్లకు ఒక్కసారి గేటు వద్ద ట్రాక్ మరమ్మతులు చేపడతారు. రైల్వేగేటు ఇరువైపులా తాత్కాలిక గేట్లను ఏర్పాటుచేసి హెచ్చరిక బోర్డులను ఉంచారు. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు గేటు మూసివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. బస్సులో ప్రయాణించేవారికి మాత్రం కాస్త ఉపశమనం ఉంది. ఇటు తాడేపల్లిగూడెం నుంచి అటు రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి బస్సులను ఆర్టీసీ గేటు వరకూ నడుపుతోంది. గేటు వద్ద ప్రయాణికులు బస్సు దిగి ఆవలివైపున ఉన్న మరో బస్సు ఎక్కుతున్నారు. అయితే తాత్కాలిక గేటులతో సహా మొత్తం నాలుగు గేట్ల కింద నుంచి వంగి ప్రయాణికులు ట్రాక్ దాటడానికి ఇబ్బందులెదుర్కొంటున్నారు. వద్ధులు, చంటి పిల్లల తల్లులు ఆపసోపాలు పడుతున్నారు. రైల్వే సిబ్బంది గేటు వద్దనే ఉండి ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకల సమాచారం అందిస్తూ ట్రాక్ దాటే ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. మోటారు సైకిల్ వంతెన దాటించేందుకు రూ. రైల్వేగేటు మూసివేయడంతో రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే కాలిబాట వంతెనపై విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. తాడేపల్లిగూడెం, తాళ్లపాలెం, శెట్టిపేట, నందమూరు తదితర ప్రాంతాలకు వెళ్లడానికి మోటారు సైకిలిస్ట్లు కాలిబాట వంతెనను ఆశ్రయిస్తున్నారు. స్థానిక యువకులు ప్రయాణికుల వద్ద రూ.20 నుంచి రూ.30 వరకూ తీసుకుని మోటారు సైకిళ్లను వంతెన దాటిస్తున్నారు. -
ఆసక్తికరంగా పాల పోటీలు
ద్వారకా తిరుమల : రాష్ట్రస్థాయి గోవుల పాలపోటీల్లో భాగంగా శుక్రవారం పాల సేకరణను నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డులో వివిధ జాతుల గోవులు, గేదెల నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటల పాల ఉత్పత్తులను సేకరించారు. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సేకరణ దాదాపు గంటసేపు సాగింది. సేకరణ అనంతరం పాల ఉత్పత్తులను అధికారుల సమక్షంలో రైతులు తూకం వేయించి, నమోదు చేయించారు. అలాగే శనివారం ఉదయం సైతం ఇదే తరహాలో పాలను సేకరించి మూడుపూటల లభించిన ఉత్పత్తుల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. ఉదయం మార్కెట్యార్డులో ఉన్న గో జాతులను ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత మేకా శేషుబాబు సందర్శించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్ర«థమ బహుమతిగా రూ. 50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 30 వేలు, తతీయ బహుమతిగా రూ. 20 వేలు అందచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు, తతీయ బహుమతిగా రూ. 10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నామన్నారు. శనివారం మద్యాహ్నం నుంచి జరిగే అందాల పోటీల్లో గెలుపొందే వాటికి తగు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. విజేతలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు చేతులు మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. -
బంద్ను జయప్రదం చేయండి
పాలకొల్లు టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి తలొగ్గి ప్యాకేజీ వైపు మొగ్గుచూపడం దారుణమని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా రాకపోతే యువత నిరుద్యోగంతో పాటు రైతులు, ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం శనివారం తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రవ్యాప్త బంద్లో వర్తక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
బైక్లను కాల్చిన ఆకతాయిలు
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు మోటార్ బైక్లను గుర్తు తెలియని దుండగులు కాల్చారు. కోనేటికాల్వ వీధిలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న ప్రకాష్ తన స్పెలండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని రాత్రి సమయాల్లో ఇంటి ముందు పార్కింగ్ చేస్తారు. ఈ క్రమంలో గురువారం రాత్రి పార్కింగ్ చేయగా శుక్రవారం వేకువ జామున 2.45 సమయంలో రహదారి మీదుగా వెళ్లే వ్యక్తులు బైక్ కాలుతోందని కేకలు వేశారు. దీంతో ప్రకాష్ పరుగెత్తుకుంటూ బయటికి రాగా తన బైక్ మంటల్లో తగలబడి పోతోంది. వెంటనే నీళ్లు పోసి మంటలను ఆర్పారు. ఈ మేరకు ప్రకాష్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే భావనారుషి ఆలయం సమీపంలోనూ, ప్రకాష్నగర్లలో కూడా రెండు బైక్లను ఆకతాయిలు కాల్చారు. అయితే వాటి యజమానుల నుంచి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రత్యేక హోదా కోరుతూ న్యాయవాదుల ధర్నా
నిడదవోలు : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు శుక్రవారం న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. న్యాయవాదుల ఐక్యత వర్థిల్లాలని నినదించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ విజయకమార్, ఎం.అర్జునుడు, యామన శ్రీనివాసరావు, ఎస్వీ సూర్యనారాయణ, దేవులపల్లి రవిశంకర్, జి.రవి, కోడి శ్రీను, ఎన్.భాస్కరరావు, కొనకళ్ల వెంకటేశ్వరరావు, పి. పోసిబాబు, పి.వీరాంజనేయ, విపర్తి ప్రభాకర్, ఎండీ మహబూబ్, కమల్బాబు, పి.సుబ్రహ్మణ్యం, డి.మహేష్, కె.సత్యనారాయణ, సోమరాజు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని బిస్మల్లాబాదు గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొని రామిరెడ్డి(48) శుక్రవారం దుర్మరణం చెందాడు. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు... హనుమనుగుత్తి గ్రామానికి చెందిన రామిరెడ్డి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఆయన పని మీద గ్రామం నుంచి బైక్పై పోట్లదుర్తికి వెళ్లాడు. పని ముగించుకుని మళ్లీ హనుమనుగుత్తికి బయలుదేరాడు. మార్గంమధ్యలో ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
ఏజెన్సీ బంద్ సంపూర్ణం
పోలవరం : జిల్లాలోని ఏజన్సీ మండలాల్లో సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని, పీసా చట్టాన్ని అమలు చేయాలని, అన్ని గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య వ్యవస్థను మెరుగుపర్చాలని, ఏజెన్సీలో విద్యార్థుల సంఖ్య తగ్గారంటూ పాఠశాలలు మూసివేస్తున్న ప్రభుత్వ తీరు మారాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ చేపట్టారు. ఉదయం నుంచి కూడా పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో బంద్ స్పష్టంగా కనబడింది. జనజీవనం స్తంభించింది. బంద్ సందర్భంగా పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బుట్టాయగూడెంలో జరిగిన ర్యాలీలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సీతారామ్ పాల్గొన్నారు. బంద్ సందర్భంగా పోలవరంలో దుకాణాలు, వ్యాపార ‡సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. బంద్ నిర్వాహకులు ఏటిగట్టు సెంటర్లో మానవహారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిర్వహించారు. బస్సులు యథావిధిగా తిరిగాయి. ఏజెన్సీకి వెళ్లే బస్సులు మాత్రం బంద్ నిర్వాహకులు అడ్డుకున్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎ.రవి, మండల సీపీఎం కార్యదర్శి గుడెల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. l -
పంట ఎండె.. గుండె మండె!
ఘణపురం నీళ్ల లొల్లి వరి పంట ఎండుముఖం కట్టలు తెగిన ఆవేదన షట్టర్లు తెరచిన దిగువ రైతులు ఠాణాకు చేరిన వివాదం పాపన్నపేట: ఘణపురం దిగువ రైతులు తిరగబడ్డారు. సాగు నీళ్ల కోసం ఆనకట్ట గేట్లు ఎత్తారు. ఎండుతున్న పొలాలకు నీళ్లందించేందుకు తెగించిన 200 మంది రైతులు శుక్రవారం ఆనకట్ట రెండు షట్టర్లను బలవంతంగా తెరిచి కిందకు నీళ్లు వదిలారు. అవి పొలాలకు చేరే వరకు అక్కడే కూర్చున్నారు. ఇంకోవైపు షట్టర్లు తెవరటం అన్యాయమంటూ కాల్వ కింద రైతులు ఎగువ రైతుల మీదకు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది.ఘనపురం ప్రాజెక్టు కింద ఫతేనహర్, మహబూబ్ నహర్ కాలువలు ఉన్నాయి. ఈ రెండు కాలువల కింద 23 వేల ఎకరాల సాగు భూమి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వానలు పడక ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టు కింద పంటలు వేసుకోవద్దని ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండేళ్లుగా రైతులు పంటలు వేయటం లేదు. ఈ ఏడాది కూడా వర్షాభావం నెలకొనడం.. తిండి గింజలకూ కరువైన పరిస్థితుల్లో దాదాపు 3 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. పొట్ట దశలో ఉన్న వరి పొలాలు.. నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇదే సమయంలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి హరీశ్రావు చొరవతో సింగూరు నుంచి 0.35 టీఎంసీల జలాలను ఘనపురం ప్రాజెక్టులోకి విడిచారు. అయితే నది మధ్యలో ఉన్న మడుగులు ఆ నీటిని మింగేశాయి. అదృష్టవశాత్తు వెనువెంటనే ఎగువన కురిసిన వర్షాల వల్ల ఘనపురం ప్రాజెక్టులోకి 6.5 అడుగుల మేర నీరు వచ్చింది.ఈ నీటిని డిప్యూటీ స్పీçకర్ బుధవారం ఎంఎన్, ఎఫ్ఎన్ కాల్వల్లోకి వదిలారు. మా గతేం కావాలి.. అయితే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు సాగు నీరందటం లేదు. తమ పొలాలు ఎండి పోతున్నాయని ప్రాజెక్టు కింది రైతులు ఆందోళనకు గురయ్యారు. కనీసం తమకు కొన్ని నీళ్లు వదిలితే ఇసుకలో నీరింకి మంజీర నదిలో తాము వేసుకున్న ఊటబావుల్లో నీరు చేరుతుందని, తమ పొలాలు జీవం పోసుకుంటాయని వారంటున్నారు. అలాగే మంజీర నదిలో ఉన్న పొడిచన్పల్లి, కొత్తపల్లి, కుర్తివాడ రక్షిత మంచినీటి పథకాల్లో కూడా నీరు చేరి ప్రజల దాహార్తి తీరుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఈ నెల 4న రాత్రి ఘనపురం ప్రాజెక్టు షట్టర్లను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తడంతో నీరంతా దిగువన ఉన్న మంజీర నదిలోకి వెళ్లిపోయింది. ఈ మేరకు ఎగువన కాల్వల కింద ఉన్న రైతులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు రాత్రిపూట షట్టర్ల వద్ద కాపలా ఉంటున్నారు. తాజాగా పాపన్నపేట, మెదక్ మండలాలకు చెందిన సుమారు 200 మంది రైతులు శుక్రవారం ఘనపురం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి షట్టర్లను తెరిచి నీళ్లు వదిలారు. ఈ నీళ్లు తమ పొలం చేరేవరకు ఇక్కడే ఉంటామని బైఠాయించారు. కాగా కాల్వల కింద ఉన్న రైతులు ఈ చర్యలను నిరసిస్తున్నారు. కాల్వల ద్వారానే నీరు: - ఈఈ యేసయ్య ప్రస్తుతానికి ఘనపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న పరిస్థితిని బట్టి కాల్వల ద్వారానే పొలాలకు వదులుతున్నాం. ప్రాజెక్టు కిందకు నీరు వదిలే పరిస్థితి లేదు. -
మహిళ హ్యాండ్ బ్యాగ్లో నుంచి రూ. లక్షా 35 వేలు చోరీ
-లబోదిబోమన్న బాధితులు -పోలీసులకు ఫిర్యాదు -దొంగల కోసం పోలీసుల ముమ్మర గాలింపు -నర్సాపూర్ బస్టాండ్లో సంఘటన నర్సాపూర్రూరల్: బస్సు ఎక్కుతుండగా మహిళ హ్యాండ్ బ్యాగ్లో నుంచి రూ. లక్షా 35 వేల నగదును దొంగలు చోరీ చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు మండలంలోని నాగులపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త కేశన్నగారి విజయ, లక్ష్మణ్ దంపతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం హైదరాబాద్లో బంగారం కొనేందుకు భార్యాభర్తలు విజయ, లక్ష్మణ్లు రూ.లక్షా 50 వేలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తమ గ్రామం నుంచి నర్సాపూర్ బస్టాండ్ వరకు వచ్చి హైదరాబాద్ వెళ్లేందుకు కొద్దిసేపు వేచి ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు వెళ్లనున్న మెదక్ డిపోకు చెందిన బస్సు వచ్చింది. దీంతో విజయ హ్యాండ్బ్యాగ్ వేసుకొని ముందు డోర్ నుంచి బస్సు ఎక్కింది. భర్త లక్ష్మణ్ వెనుక డోర్ నుంచి ఎక్కాడు. బస్సులో ఎక్కిన అనంతరం ఇద్దరూ ఒకే సీటులో కూర్చున్నారు. నర్సాపూర్ శివారు దాటుతున్న సమయంలో హ్యాండ్ బ్యాగ్ బరువు తగ్గి ఉండడాన్ని గమనించి, వెంటనే దాన్ని తెరిచేందుకు జిప్ లాగబోయారు. కానీ అప్పటికే జిప్ తెరిచి ఉంది. బ్యాగ్లో ఉండాల్సిన రూ. లక్షా 50 వేలకుగాను రూ. 15 వేలు మాత్రతే ఉండగా మిగతా రూ. లక్షా 35 వేలు లేకపోవడంతో లబోదిబోమన్నారు. దీంతో బస్సు కండక్టర్, డ్రైవర్లు వెంటనే వారిని నర్సాపూర్కు తీసుకువచ్చారు. నర్సాపూర్ బస్టాండ్లోనే దొంగతనం జరిగి ఉండవచ్చని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వెంకటరాజాగౌడ్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా పుటేజ్ను పరిశీలించగా విజయను ముగ్గురు మహిళలు బస్సు ఎక్కుతున్న సమయంలో అనుసరించిన విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. దీంతో దొంగల కోసం ఎస్సై వెంకటరాజాగౌడ్ సిబ్బందితో గాలింపు చర్యలు ముమ్మరం చేశాడు. కూతురు పెళ్లికి బంగారం కొనేందుకు వెళ్తున్నాం ప్రస్తుతం తమ కూతురు ఇంటర్మీడియెట్ చదువుఽతోందని విజయ, లక్ష్మణ్ దంపతులు బోరున విలపిస్తూ తెలిపారు. తాను అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నానని వేతనంలో వచ్చిన కొంత సొమ్మును కూడబెట్టుకోవడంతోపాటు ఇటీవల తన భర్తకు సంబంధించిన ఎల్ఐసీ పాలసీకి సంబంధించిన కొంత డబ్బు వచ్చిందన్నారు. మరికొంత డబ్బు తన తమ్ముడు సేనాధిపతి ఇచ్చారన్నారు. మొత్తం రూ. లక్షా 50 వేలు పోగుకావడంతో ఆ డబ్బుతో తన కూతురు పెళ్లికోసం బంగారం కొనిపెట్టుకుందామన్న ఆలోచనతో హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలిపారు. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము దొంగలు ఇలా లూటీ చేయడంతో ఏమీ తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
వరసిద్దునికి అష్టోత్తర అభిషేకం
–కన్నుల పండుగగా శతకలశ క్షీరాభిషేకం –సిద్ధి బుద్ది సమేత దేవేరులను వీక్షించేందుకు పోటెత్తిన భక్తులు కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి అత్యంత వైభవంగా చిన్న పెద్ద శేషవాహన సేవలు నిర్వహించారు. ఈక్రమంలో ఉదయం స్వామి వారి ఉత్సవ మూర్తులకు నేత్ర పర్వంగా అష్టోత్తర శతకలశ పంచామృతాది అభిషేకాలు జరిపారు. ఉత్సవ ఉభయదారులు అభిషేకాన్ని శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం అష్టోత్తర శత కలశాలను మణికంఠేశ్వర స్వామి ఆలయం నుంచి కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పాలు, నెయ్యి, తేనె, పెరుగు, విభూది, సుగంధ ద్రవ్యాలతో ఆశేష భక్తజనం వీక్షిస్తుండగా సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అలంకరించి వేదమంత్రోచ్ఛారణల నడుమ దూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులందరికీ ఈఓ పూర్ణచంద్రారావు, ఆలయ సిబ్బంది స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు పెద్దెత్తున పాల్గొన్నారు.ఆలయ ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్లు, ఉత్సవకమిటీసభ్యులు, ఉభయ దారులు పాల్గొన్నారు. -
రేపు డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం
ఏలూరు సిటీ : డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక వన్టౌన్ హాయ్ హోటల్ రోడ్డులోని గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో నిర్వహించనున్నట్టు సంఘం నాయకులు సాయిరామ్ ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని అభ్యర్థులకు తెలియజేసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్టికెట్ నెంబర్లతో విధిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. వివరాలకు 97047 25013, 89851 03482 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
రేపు డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం
ఏలూరు సిటీ : డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక వన్టౌన్ హాయ్ హోటల్ రోడ్డులోని గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో నిర్వహించనున్నట్టు సంఘం నాయకులు సాయిరామ్ ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని అభ్యర్థులకు తెలియజేసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్టికెట్ నెంబర్లతో విధిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. వివరాలకు 97047 25013, 89851 03482 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సరిపల్లిలో చెడుగుడు పోటీలు ప్రారంభం
నరసాపురం రూరల్ : కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల స్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారం సరిపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సర్పంచ్ కేదాసు రమా కాసుమణి యోగేంద్ర ప్రారంభించారు. తొలి రోజు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. వైఎన్ కళాశాల, పెదగరువు టీముల మధ్య పోటీ జరగగా వైఎన్ కళాశాల టీము విజయం సాధించింది. ఈ పోటీలకు రిఫరీగా మహేష్నాయుడు వ్యవహరిస్తున్నారు. -
సమ్మె సక్సెస్
‘కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. హృదాంతరాళం గర్జిస్తూ..’ అన్నరీతిన జిల్లాలోని కార్మికులు సర్కారు తీరుపై గర్జించారు. సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాలో విజయవంతమైంది. అన్ని కార్మిక సంఘాలు, పలు ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. పలుచోట్ల కార్మికులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్ పేట) : జాతీయస్థాయిలో కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. ఈ సమ్మెకు దాదాపు అన్ని సంఘాలూ మద్దతు పలికాయి. ఏలూరు కార్పొరేషన్, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలతో పాటు మెట్ట ప్రాంతంలోనూ కార్మికులు ఉదయం నుంచి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి మూయించివేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మూయించివేశారు. కార్మిక సంఘాల సమ్మెకు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపి ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాయి. ఐద్వా, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ సంఘాలు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆయా సంఘాల నాయకులు ప్రధాన కూడళ్లలో ప్రసంగాలు, నినాదాలు చేశారు. పోలీసుల సహాయంతో బస్సులు తిరిగాయి. తొలుత సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు మద్దతు పలికినా గురువారం లేబర్ కమిషన్ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు అదేశాలు జారీ చేయటంతో శుక్రవారం జరిగిన సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొనలేదు. -
శాంతి.. మానవత్వమే మతం
సర్వమత సమ్మేళనంలో వక్తలు రాజమహేంద్రవరం కల్చరల్ : మానవత్వాన్ని, శాంతిని కోరుకునేదే మతమని సర్వమత సమ్మేళనంలో వక్తలు ఉద్ఘాటించారు. జమాతె ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్లోని బిలాల్ ఫంక్షన్హాల్లో సర్వమత సమ్మేళనం నిర్వహించారు. సంస్థ జాతీయ కార్యదర్శి ఇక్బాల్ ముల్లా అధ్యక్షత వహించారు. కార్యక్రమ కన్వీనర్ అక్బర్బాషా మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు దేశవ్యాప్తంగా ‘శాంతి–మానవత’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ హిందూమతంపై మాట్లాడుతూ.. అందరం కలసి నడుస్తూ, ఒకేమాటపై నిలబడాలని హిందూ మతం చెబుతోందని విశదీకరించారు. ఏ ఒక్కరూ దుఃఖంతో రోదించకూడదని వేదమంత్రాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. హిందూ మతం ప్రపంచశాంతిని కోరుతోందని చెప్పారు. బౌద్ధమతంపై వీపూరి సుదర్శన్ మాట్లాడుతూ మానవుని దుఃఖ నివారణకు రాజ్యాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడు బుద్ధుడని పేర్కొన్నారు. ప్రేమ, కరుణ, మైత్రి, సర్వమానవ సౌభ్రాతృత్వం బౌద్ధంలోని ప్రధాన లక్షణాలని వివరించారు. సిక్కుమతంపై ధరంసింగ్ గ్రాంతి మాట్లాడుతూ అన్ని మతాలకూ దేవుడు ఒక్కడేనని, మనిషి దేవునికి దూరంగా తొలగి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఇస్లాంపై సంస్థ నగర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ ఇస్లాం మానవత్వానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఒక ప్రాణిని హతమారిస్తే, యావత్ మానవాళిని హతమార్చినట్టేనని, అలాగే ఒక ప్రాణిని రక్షిస్తే, అందరినీ రక్షించినట్టేనని ఇస్లాం చెబుతోందన్నారు. క్రైస్తవ మతంపై రెవరెండ్ విజయ సారథి మాట్లాడుతూ దేవుడు తనలాగే జీవించాలని మనిషిని సృష్టించినట్టు పేర్కొన్నారు. ఆయనకు ప్రతిరూపంగా పుట్టిన మనం.. దేవుని వ్యతిరేకశక్తులకు లోబడి, దుర్గుణాలను అలవర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందరిపై ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుడు మనలను సృష్టించిన లక్ష్యం నెరవేరుతోందని వివరించారు. -
ఎరువుల పంపిణీలో నగదు బదిలీ తగదు
పెదపాడు : ఎరువుల పంపిణీలో నగదు బదిలీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీలో తీసుకువస్తున్న నగదుబదిలీ విధానం వల్ల వాస్తవ సాగుదారులకు ఎరువుల ధరలు పెరిగి నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో వ్యవసాయం చేయని భూయజమానులకే సబ్సిడీ వెళుతుందని, కౌలు రైతులు నట్టేట మునుగుతారని చెప్పారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి పంటల పండించలేక ప్రైవేట్ అప్పుల కోసం తిరుగుతున్నారని, అధిక వడ్డీల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను రక్షించుకోవడానికి ఉపయోగించే రెయిన్గన్స్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతు సంఘం మండల అధ్యక్షుడు జి.సురేష్ పాల్గొన్నారు. -
విష్ణు ఫార్మసీలో ఇండో–గల్ఫ్ అంతర్జాతీయ సదస్సు
భీమవరం : భీమవరం విష్ణు ఫార్మసీ కళాశాల, అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ ఇండో–గల్ఫ్ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన సౌదీ అరేబియా జజాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ భక్తిభూషణ్ బారిక్ నానోటెక్నాలజీ బేసెడ్ గ్రడ్ డెవివరి సిస్టమ్స్ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం సదస్సుకు హాజరైన వివిధ కళాశాలల విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సదస్సులో హైదరాబాద్ మహేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధర్, ఎపీపీ ప్రెసిడెంట్ డాక్టర్ చెన్నుపాటి సురేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విష్ణు ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ డి.బసవరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రసాద్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రసాదరాజు పాల్గొన్నారు. -
గోదావరిలో పెరిగిన ఇన్ఫ్లో
కొవ్వూరు :ఎగువన వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరదనీరు స్వల్పంగా పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆగస్టు 27న ఇన్ఫ్లో 43,266 క్యూసెక్కులకు తగ్గింది. దీనిలో ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాల పరిధిలోని కాలువలకు విడిచిపెట్టగా మిగిలిన 28,766 క్యూసెక్కులు మిగులు జలాలు మాత్రమే సముద్రంలోకి విడిచిపెట్టేవారు. ఇటీవల క్రమేణా వరద పెరుగుతోంది. శుక్రవారం ఉదయం గోదావరి నుంచి 2,36,507 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 11,400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకి 5 వేల క్యూసెక్కులు జిల్లాలో ప్రస్తుతం చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండడంతో పశ్చిమ డెల్టా కాలువకు నీటి విడుదలను రెండు రోజుల నుంచి తగ్గించారు. శుక్రవారం 5 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. దీనిలో ఏలూరు కాలువకు 1,079 క్యూసెక్కులు, ఉండి కాలువకు 543, నరసాపురం కాలువకు 1,808, జీ అండ్ వీ కాలువకు 357, అత్తిలి కాలువకు 720 క్యూసెక్కుల చొప్పున నీటిని విడిచిపెడుతున్నారు. -
నేటితో వేరుశనగకు తడులు పూర్తిచేస్తాం
– మంత్రి నారాయణ చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో ఎండిపోయిన వేరుశనగ పంటకు శుక్రవారం సాయంత్రం లోపు మొదటి దశ తడులివ్వడం పూర్తిచేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మంత్రి సిద్ధారాఘవరావు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో కలసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. గత పదిరోజులుగా ఎండిపోయిన వేరుశనగ పంటకు రెయిన్ గన్స్ సాయంతో రోజుకు 2వేల హెక్టార్ల మేరకు తడులిస్తున్నామన్నారు. గురువారం నాటికి 17,739 ఎకరాలకు గాను 8,353 ఎకరాలకు తడులు పూర్తిచేశామని, మిగిలిన 9,386 ఎకరాలకు శుక్రవారం సాయంత్రానికి పూర్తి చేస్తామన్నారు. ఆలస్యంగా వేరుశనగ పంట వేసుకున్న రైతులకు ఈనెల 5 నుంచి తడులు ఇస్తామని, ఇప్పటివరకు పూర్తి చేసిన మొదటి విడత పంటలకు 15వతేదీ నుంచి రెండో విడత తడులిస్తామన్నారు. వేరుశనగ పంటను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చేపడుతున్న చర్యలపై అవగాహన పొందేందుకు వివిధ నియోజకవర్గాలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం జిల్లాకు విచ్చేయనున్నారని తెలిపారు. ఆ తర్వాత వారు తమ ప్రాంతాల్లో రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపడుతారన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ సిద్ధార్థ్జైన్, జేసీ గిరీషా, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రేపు సార్వత్రిక సమ్మె
గాంధీనగర్ (కాకినాడ) : ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 2న సమ్మె చేయనున్నట్టు రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి పెంకే సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తమ ఐదు డిమాండ్లు... వేతన సవరణ కోసం నియమించిన జి.ఓ 71 కమిటీ రిపోర్టు విడుదల చేసి వేతన సవరణ అమలు చేయాలని, పదవీ విరమణ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 60 సంవత్సారాలు కొనసాగించాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం రూ.5 లక్షలు ఇవ్వాలనీ, డీసీసీబీ ఖాళీ పోస్టులలో 50 శాతం సంఘ ఉద్యోగులతో సినియారిటీ ప్రతిపాదికన భర్తీ చేయాలని, సహకార ఉద్యోగులకు ఆరోగ్య, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. -
బ్యాంకులు, ఫ్యాక్టరీలు బంద్..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు శుక్రవారం రోజు మూతపడనున్నాయి. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏడవ వేతన సంఘ సిపారసులను తమకు వర్తింపచేయాలని కనీసం వేతనం నెలకు రూ.18,000లకు పెంచాలనే ప్రధాన డిమాండ్తో పాటు 12 డిమాండ్ల సాధనకు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగ్గనున్నాయి. ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్ల తెరుస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు శుక్రవారం ఈ సమ్మె చేయనున్నాయి. . మరోవైపు ట్రేడ్ యూనియన్ల నిర్వహించబోయే ఈ బంద్ను ఎలాగైనా ఆపాలని కేంద్రప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ విషయంపై ప్రధాని మోదీ నేడు ఎమర్జెన్సీ మీటింగ్ను నిర్వహించారు. ప్రధాని నిర్వహించబోయే ఈ మీటింగ్లో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కార్మికశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం విఫలమవ్వడంతో ప్రధాని మోదీ ఈ మీటింగ్ నిర్వహించారు. మరో 48 గంటల్లో కార్మిక సంఘాలను సంప్రదించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల వివిధ యూనియన్లు కూడా శుక్రవారం జరగబోయే బంద్లో పాల్గొనబోతుండటంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు తీవ్ర అంతరాయం కలుగనుంది. అయితే ట్రేడ్ యూనియన్లు నిర్వహించబోయే ఈ బంద్లో రైల్వే ఉద్యోగులు పాల్గొనే సంకేతాలు లేకపోవడంతో, రైళ్లు యథాతథంగా తిరగనున్నట్టు సమాచారం.ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ సమ్మెపై తీవ్ర ఇరకాటంలో పడింది. సమ్మెకు మద్దతిస్తే ప్రభుత్వ పక్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు విమర్శలు వస్తాయని ఆలోచిస్తోంది. -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
సాక్షి తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 48,141 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 20 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 10 గంటలు, 8 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 6 గంటలు సమయం తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీలు లేవు. శ్రీవారి హుండీ కానుకలు రూ.3.26 కోట్లు లభించింది. -
చింతలపూడి పనులను అడ్డుకున్న రైతులు
చింతలపూడి : రైతులకు ఆమోదయోగ్యమైన నష్టపరిహారం ఇచ్చే వరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జరగనివ్వమని రైతు నాయకులు అన్నారు. వెలగలపల్లి, శెట్టివారిగూడెం గ్రామాల్లో ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా భూసేకరణకు సర్వే చేయడానికి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ జరపాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయనివ్వకుండా సర్వే సిబ్బందిని అడ్డుకుని వెనక్కు పంపారు. ఈ సందర్భంగా రైతు నాయకులు గోలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తొలుత తమ భూములకు ఎకరానికి ఎంత నష్ట పరిహారం అందిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ టి.మైఖేల్రాజ్కు వినతిపత్రం అందచేశారు. ఆందోళనలో రైతులు తాళం మాధవరావు, చిలకబత్తుల సత్యనారాయణ, ఎం.నర్సయ్య, చిలుకూరి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
వేడుకగా వెంకన్న ఉట్లోత్సవం
సాక్షి,తిరుమల: శ్రీకృష్ణజన్మాష్టమి పురస్కరించుకుని శుక్రవారం మధ్యాహ్నం తిరుమల ఆలయం వద్ద ఉట్లోత్సవం (శిక్యోత్సవం) వేడుకగా జరిగింది. మలయప్ప, శ్రీకృష్ణస్వామి వేర్వేరు వాహనాలపై ఆలయ పురవీధుల్లో ఊరేగారు. తొలుత పెద్ద జీయర్మఠంలోనూ, తర్వాత హథీరామ్మఠంలోనూ, చిన జీయర్మఠం, కర్ణాటకా సత్రాల వంటి మొత్తం 16 ప్రాంతాల్లో ప్రత్యేక çపూజలందుకున్నారు. ఆయా ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో టీటీడీ ఉద్యోగులు, మఠం సిబ్బంది, స్థానికంగా ఉండే యువత ఉట్టికొట్టేందుకు ఉత్సాహం చూపారు. ఈసందర్భంగానే ¿¶ క్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు, డెప్యూటీఈవో కోదండరామారావు, హథీరాంమఠం మహంత్ అర్జున్దాస్ పాల్గొన్నారు. -
శ్రావణలక్ష్మీ నమోస్తుతే..
-
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
జంగారెడ్డిగూడెం : స్థానిక సీఎస్టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సెట్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో వందలాది మంది అభ్యర్థులు పాల్గొన్నట్టు సెట్వెల్ మేనేజర్ కేఎస్ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీలో చేరడానికి కావలసిన శిక్షణను 30 రోజుల పాటు అందిస్తామని చెప్పారు. తదుపరి ఎంపికలు ఈ నెల 29న ఏలూరులో నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్జేకే నరేంద్రకుమార్ మాట్లాడుతూ ఇటువంటి రిక్రూట్మెంట్ అవకాశాలను అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం నిర్వహింని ర్యాలీలో వివిధ రకాల పరీక్షల అనంతరం సుమారు 250 మందిని ఎంపిక చేసినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. -
చినవెంకన్న క్షేత్రంలో పెళ్లిళ్ల సందడి
ద్వారకాతిరుమల : చినవెంకన్న క్షేత్రంలో భారీగా జరిగిన వివాహాలతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. గురు, శుక్రవారాల్లో వందలాది జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, కల్యాణ మండప ఆవరణతో పాటు ఆలయ ప్రధాన రాజగోపుర మెట్లదారిలో సైతం వివాహాలు జరిగాయి. శేషాచలకొండపై ఉన్న కల్యాణ మండపాలు, ప్రై వేటు సత్రాల్లోనూ పెళ్లి సందడి నెలకొంది. వివాహాల అనంతరం శుక్రవారం ఉదయం నూతన వ«ధూవరులు, వారి బంధువులు శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. -
మహాలక్ష్మీ నమోస్తుతే..
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నేత్రపర్వంగా సాగాయి. శ్రావణమాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు 15 వందల మంది మహిళలు వ్రతాలు ఆచరించారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వరలక్ష్మీ దేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. వేదిక ముందు వందల సంఖ్యలో మహిళలు దేవస్థానం అందచేసిన పూజా సామగ్రితో కూర్చున్నారు. ఆలయ అర్చకులు, పండితులు, పురోహితులు మహిళలతో పూజా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిపించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినా«థరావు దంపతులు కూడా పాల్గొని పూజలు నిర్వహించారు. క్షేత్రపాలకుని ఆలయంలో వరుణజపాలు వర్షాలు సమద్ధిగా కురవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన వెంకన్న క్షేత్రంలో వరుణ జపాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పండితులు ఈ జపాలను జరిపారు. తొలుత ఆలయ ముఖ మండపంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచన, కలశస్థాపనను నిర్వహించారు. 28న శివదేవునికి సహస్ర ఘటాభిషేకాన్ని జరుపనున్నట్టు ఈవో తెలిపారు. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉదయం శేషాచలకొండపై ఉన్న గోసంరక్షణ శాలలోని ఒంగోలు, కపిల ఆవులకు పండితులు, పురోహితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ భక్తులు విశేష పూజలు చేశారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని సప్తగోకులంలో శ్రీకృష్ణునికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగ నిర్వహించనున్నట్టు ఈవో చెప్పారు. దీనిలో భాగంగా ఉభయదేవేరులతో శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారని తెలిపారు. -
మహాలక్ష్మీ నమోస్తుతే..
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నేత్రపర్వంగా సాగాయి. శ్రావణమాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు 15 వందల మంది మహిళలు వ్రతాలు ఆచరించారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వరలక్ష్మీ దేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. వేదిక ముందు వందల సంఖ్యలో మహిళలు దేవస్థానం అందచేసిన పూజా సామగ్రితో కూర్చున్నారు. ఆలయ అర్చకులు, పండితులు, పురోహితులు మహిళలతో పూజా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిపించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినా«థరావు దంపతులు కూడా పాల్గొని పూజలు నిర్వహించారు. క్షేత్రపాలకుని ఆలయంలో వరుణజపాలు వర్షాలు సమద్ధిగా కురవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన వెంకన్న క్షేత్రంలో వరుణ జపాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పండితులు ఈ జపాలను జరిపారు. తొలుత ఆలయ ముఖ మండపంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచన, కలశస్థాపనను నిర్వహించారు. 28న శివదేవునికి సహస్ర ఘటాభిషేకాన్ని జరుపనున్నట్టు ఈవో తెలిపారు. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉదయం శేషాచలకొండపై ఉన్న గోసంరక్షణ శాలలోని ఒంగోలు, కపిల ఆవులకు పండితులు, పురోహితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ భక్తులు విశేష పూజలు చేశారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని సప్తగోకులంలో శ్రీకృష్ణునికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగ నిర్వహించనున్నట్టు ఈవో చెప్పారు. దీనిలో భాగంగా ఉభయదేవేరులతో శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారని తెలిపారు. -
పాఠశాలల్లో దొంగల హల్చల్
గోపాలపురం : పాఠశాలలు, పంచాయతీరాజ్ ఏఈ కార్యాలయాల్లో శుక్రవారం తెల్లవారుజాములన దొంగలు హల్చల్చేశారు. తాళాలు పగలకొట్టి చోరీకి యత్నించారు. స్థానిక జిల్లాపరిషత్, మండలపరిషత్ కార్యాలయంలోని జెడ్పీ ఎంపీపీ పాఠశాలలు, పంచాయతీరాజ్ ఏఈ కార్యాలయంలో దొంగలు పడి తాళాలు పగలకొట్టారు. పాఠశాలల్లో బీరువాలు పగలకొట్టారు. అయితే నగదేమీ దోచుకెళ్లలేదు. శనివారం జెడ్పీ హైస్కూలు హెచ్ఎం వేసంగి సత్యనారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైటర్ జి.కృష్ణప్రసాద్ తెలిపారు. -
హేట్సాఫ్.. సింధు !
ఉద్విగ్న క్షణాలు వీడాయి. ‘జయహో సింధు’ నినాదాలు మిన్నంటాయి. విశ్వ క్రీడా వేదికపై బాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు ప్రదర్శించిన పోరాట పటిమకు ‘పశ్చిమ’ ప్రజానీకం జేజేలు పలికింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డులకు ఎక్కిందని తెలిసి సంబరాలు జరుపుకుంది. సింధు పూర్వీకులు మన జిల్లా వాసులే. ఆమె తాతయ్య ఏలూరు నగరానికి చెందిన వారు. ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు వెళ్లారు. సింధు తండ్రి పుసర్ల వెంకటరమణ అక్కడే జన్మించారు. విద్యుత్ శాఖలో ఇంజినీర్గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు. అయినప్పటికీ మన జిల్లాతో ఆ కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సింధు, ఆమె కుటుంబ సభ్యులు ఏటా రెండు మూడుసార్లు పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆలయానికి వస్తుంటారు. ఆ కుటుంబానికి రాట్నాలమ్మ అంటే ఎనలేని భక్తిభావం. సింధు రియో ఒలింపిక్స్కు వెళ్లడానికి ముందు జూన్ 19న కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె తండ్రి వెంకటరమణ శుక్రవారం కూడా ఈ ఆలయానికి వచ్చారు. రాట్నాలమ్మ ఆశీస్సులు, కోట్లాదిమంది భారతీయుల దీవెనలే రియోలో సింధు రజత పతకాన్ని సాధించడానికి కారణమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈనెల 25 లేదా 26వ తేదీన సింధుతో కలిసి అమ్మవారి దర్శనానికి వస్తామని చెప్పారు. జయహో సింధు ఏలూరు (ఆర్ఆర్పేట)ఫఒలింపిక్ పోటీల్లో భారత దేశం తరపున తెలుగు బిడ్డ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం సాధించడంతో నగరంలో యువత సంబరాలు చేసుకున్నారు. శేఖర్ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్ కమ్ముల సోమశేఖర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. అలాగే పీవీ సింధు రూపాన్ని నగరానికి చెందిన సూక్ష్మ కళారూపాల శిల్పి మేతర సురేష్ బాబు అగ్గిపుల్లపై చెక్కారు. -
రైల్వే గేటును ఢీకొన్న లారీ
నిడదవోలు : లారీ ఢీకొట్టడంతో రైల్వే గేటు విరిగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. శనివారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న ఊక లారీ వేగంగా వచ్చి స్థానిక రైల్వే గేటును ఢీకొట్టింది. దీంతో గేటు రెండు ముక్కలైంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినడంతో పలు రైళ్లు రెండు నిమిషాల పాటు ఆలస్యంగా నడిచాయి. పట్టణ ఎస్సై డి.భగవాన్ ప్రసాద్, రైల్వేస్టేçÙన్ మేనేజర్ ఆకుల ప్రభాకరరావు, ఆర్పీఎఫ్ ఎస్సై వసంతరావు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. గేటు విరగడంతో నిడదవోలు వైపు పోలీస్స్టేçÙన్ వరకు, మరోవైపు శెట్టిపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే సిగ్నల్ వ్యవస్థ తాత్కాలికంగా పనిచేయకపోవడంతో ఔటర్లో పలు రైళ్లను నిలిపివేసి ట్రాఫిక్ క్లియర్ అయిన తరువాత పంపించారు. రైల్వే టెక్నికల్ సిబ్బంది చేరుకుని తాత్కలిక గేటును అమర్చారు. రైల్వే టెక్నికల్ సిబ్బంది శ్రమించి సాయంత్రం 7.30 వరకు మరమ్మతు పనులు పూర్తి చేశారు. తాత్కలిక గేటు ఏర్పాటు చేసి సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించారు. మెయిల్, లింక్, షిర్డీ, కోణార్క్, తిరుమల, శేషాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు రైల్వే గేటు కారణంగా రెండేసి నిమిషాల పాటు ఆలస్యంగా నడిచాయి. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సూరపురాజుపల్లె(రైల్వేకోడూరు రూరల్): సూరపురాజుపల్లె సమీపంలోని ఏటి పక్కనున్న ఓ మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై రమేష్బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉండవచ్చు. మృతదేహం పూర్తిగా కుళ్లి పోయి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఒంటిపై ఆకుపచ్చ టీ షర్టు ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రైల్వేకోడూరులో ఇటీవల ఎవరూ అదృశ్యం కాలేదు. అన్ని రకాల కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సూరపురాజుపల్లె(రైల్వేకోడూరు రూరల్): సూరపురాజుపల్లె సమీపంలోని ఏటి పక్కనున్న ఓ మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై రమేష్బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉండవచ్చు. మృతదేహం పూర్తిగా కుళ్లి పోయి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఒంటిపై ఆకుపచ్చ టీ షర్టు ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రైల్వేకోడూరులో ఇటీవల ఎవరూ అదృశ్యం కాలేదు. అన్ని రకాల కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వైభవంగా పవిత్రావరోహణ
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు శుక్రవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ తెలియక జరిగిన తప్పులకు ప్రాయఃశ్చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు నాలుగురోజుల పాటు ఘనంగా సాగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూర్ణాహుతి హోమాన్ని, మహదాశీర్వచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి మూలవిరాuŠ‡, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లపైన, ఉత్సవమూర్తులపైన ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాలు సందర్భంగా నాలుగు రోజులుగా నిలిచిన ఆర్జిత సేవలు, నిత్యార్జిత కల్యాణాలు శనివారం నుంచి తిరిగి పునరుద్ధరించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
వైభవంగా పవిత్రావరోహణ
ద్వారకా తిరుమల: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు శుక్రవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ తెలియక జరిగిన తప్పులకు ప్రాయఃశ్చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు నాలుగురోజుల పాటు ఘనంగా సాగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూర్ణాహుతి హోమాన్ని, మహదాశీర్వచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి మూలవిరా, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లపైన, ఉత్సవమూర్తులపైన ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాలు సందర్భంగా నాలుగు రోజులుగా నిలిచిన ఆర్జిత సేవలు, నిత్యార్జిత కల్యాణాలు శనివారం నుంచి తిరిగి పునరుద్ధరించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
సాహస విద్యర్థిని నర్సమ్మకు ఘన స్వాగతం
కొల్చారం:దక్షిణాప్రికాలోని కిలిమాంజారో పర్వతారోహణం ముగించుకొని శుక్రవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట స్వగ్రామానికి చేరుకున్న విద్యార్థిని నర్సమ్మకు ఘన స్వాగతం లభించింది. ఈ నెల 8న దక్షిణాఫ్రికాలోని కిలిమాంజారో పర్వతారోహణకు బయలుదేరిన జిల్లాకు చెందిన పది మందిలో నర్సమ్మ అతి చిన్న వయస్కురాలు. కొల్చారంలోని కేజీబీవీ లో 8వ తరగతి చదువుతోన్న ఆమె.. తన బృందంతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కిలిమాంజారో పర్వతంపై జాతీయ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. నర్సమ్మ రాక సందర్భంగా రంగంపేటలో కోలాహలం నెలకొంది. పాఠశాలలకు చెందిన విద్యార్థులు, గ్రామస్తులు, ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలు నర్సమ్మ రాకకోసం ఎదురు చూశారు. మధ్యాహ్నం 2 గంటలకు రంగంపేటకు నర్సమ్మకు టెస్కోడైరెక్టర్ అరిగెరమేష్, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఖాదిర్హుస్సేన్, రాంచంద్రం, సీనియర్ పాత్రికేయులు గామని జైపాల్, ప్రజలు పూలమాలలతో సత్కరించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నర్సమ్మను విద్యార్థులు, గ్రామానికి చెందిన యువజన సంఘాల నేతలు, ప్రజలు శాలువాలతో సత్కరించారు. పూలమాలలు వేసి భారతమాతకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని నర్సమ్మ తాను చదువుతున్న పాఠశాల ఆవరణలో మొక్క నాటింది. పర్వతారోహణతో ఆత్మవిశ్వాసం పెరిగింది పర్వతారోహణ కావడంతో ముందస్తుగా కొంత భయం ఏర్పడినా శిక్షణ సమయంలో ఉపాధ్యాయులు ఇచ్చిన మనోధైర్యం నాలో ఆత్మవిశ్వాసాన్ని పూర్తి స్థాయిలో పెంచింది. పర్వతం ఎక్కేముందు రెండుసార్లు కొంత ఇబ్బంది ఎదురైనా తోటి విద్యార్థుల ప్రోత్సాహం, జిల్లా కలెక్టర్ తనపై ఉంచిన నమ్మకం పర్వతంపైకి ఎక్కించేందుకు ఎంతగానో తోడ్పడింది. ఆత్మ విశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చనేది పర్వతారోహణ ద్వారా తెలిసింది. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. - నర్సమ్మ, విద్యార్థి -
సింధు విజయం సాధించాలని విద్యార్థుల ర్యాలీ
దుబ్బాక రూరల్:ఒలింపిక్ బ్యాట్మింటన్ పోటీలో ఫైనల్ మ్యాచ్లో పోటీ పడుతున్న సింధు విజయం సాధించాలని కోరుతూ ఆమెకు మద్దతుగా శుక్రవారం సిద్ధార్థ కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు దుబ్బాకలో ర్యాలీ నిర్వహించారు. సింధు విజయం సాధించాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు, జాతీయ జెండా పట్టుకుని పట్టణంలోని ప్రతి వీధి తిరిగారు. విజయం సాధించి భారతీయుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.రవీందర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మిరుదొడ్డి: బ్యాడ్మింటన్లో సింధు గెలుపొందాలని కోరుతూ శుక్రవారం మిరుదొడ్డిలో పలు క్రీడాకారులు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గొట్టం భైరయ్య, పురోహితులు విఠాల రాజపున్నయ్య శర్మ, క్రీడాకారులు వేణు, ప్రధీప్, దశరథం, బాల్రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతాలు
నిజామాబాద్కల్చరల్ : శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా నగరంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించగా, ఇళ్లల్లో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అందంగా అలంకరించి శ్రద్ధాసక్తులతో పూజలు చేశారు. కిషన్గంజ్లోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు వేలేటి గౌరిశంకరశర్మ ఆధ్వర్యంలో వందలాది మంది సుహాసినులు(ముల్తైదువులు) సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తల్లి సువర్ణ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొండ వీరశేఖర్గుప్తా, పార్శి మహేశ్వర్గుప్తా, కోశాధికారి రాజేశ్వర్గుప్తాతోపాటు పెద్దసంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. అలాగే న్యాల్కల్రోడ్లోని శృంగేరి శంకర మఠం– శ్రీలలితాదేవి ఆశ్రమాలయంలో వరలక్ష్మి వ్రతం, సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. -
దేశాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకం
– తిరుపతి ఐఐటీ ఇన్చార్జి సత్యనారాయణ యూనివర్సిటీక్యాంపస్: దేశాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకమని తిరుపతి ఐఐటీ ఇన్చార్జి సత్యనారాయణ పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం ఇన్స్పైర్ సైన్స్క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, చైనాలు అతి పెద్ద జనాభా కలిగివుండడంతో పాటు శాస్త్రీయ నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటున్నాయన్నారు. భారతదేశానికి సవాల్గా మారిన జనాభా పెరుగుదల నేడు వరంగా మారిందని చెప్పారు. మనదేశంలో అత్యధికంగా యువత వుందని, ఈ మానవ వనరులకు సరైన నైపుణ్యాలు కల్పిస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే సైన్స్పరిశోధన పట్ల ఆసక్తి ప్రదర్శించాలని చెప్పారు. నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ వీరయ్య మాట్లాడుతూ ఇంటర్ తర్వాత విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్, లా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులపై దృష్టి పెడుతున్నారన్నారు. ఇన్స్పైర్ క్యాంప్ ద్వారా యువతకు పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. చాలా మంది శాస్త్రవేత్తలు 19–22 ఏళ్ల మధ్య అనేక ఆవిష్కరణలు చేశారని చెప్పారు. ఎస్వీయూ రెక్టార్ ఎం.భాస్కర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డీఎస్టీ ద్వారా 5 వేల మంది విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారన్నారు. సైన్స్ అభివృద్ధితోనే ఏదేశమైనా సంస్థ అయినా అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ దేవరాజులు, ఇన్స్పైర్ క్యాంప్ కోఆర్డినేటర్ దేవప్రసాద్రాజు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.అబ్బయ్య పాల్గొన్నారు. -
పనుల్లో నాణ్యత లేకే సాగునీటి సమస్య
మొగల్తూరు : డెల్టా ఆధునికీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే చేలల్లో నీరు నిలిచిపోతోందని డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొత్తూరి రామరాజు చెప్పారు. శుక్రవారం మండలంలోని కాలువలు, చేలను పరిశీలించి అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాలువలకు పూర్తిస్థాయిలో నీరు వదిలితే చేలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిన్నూరు కాలువ శివారు భూములకు నీరందక పోవడానికి కారణం అనధికార తూములేనని, కాలువకు 120 క్యూసెక్కులు వదలాల్సి ఉండగా 167 క్యూసెక్కులు వదిలామని, అయినా శివారు భూములకు నీటి ఎద్దడి ఉందన్నారు. రామన్నపాలెం అడవిపర్ర ప్రాంతంలో నీరు నిలిచిపోతుందని, దీనికి సంబంధించి దర్బరేవు డ్రెయిన్పై కొత్తకాయలతిప్ప వద్ద రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉందన్నారు. వచ్చే వేసవిలో ఈ పనులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో సుమారు 90 శాతం వ్యవసాయ పనులు పూర్తయ్యాయని, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోనే సాగు ఆలస్యమవుతుందన్నారు. శివారు ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలకు నీరందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శిథిలావస్థకు చేరుకున్న మొగల్తూరు లాకు స్థానంలో నూతనంగా లాకు ఏర్పాటు చేయటానికి రూ.36 లక్షల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. -
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం
అత్తిలి : ‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం.. శ్రీరంగ ధామేశ్వరీం.. దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం’ అంటూ మహిళా లోకం సిరుల తల్లిని కీర్తించింది. ‘శ్రీలక్ష్మి.. జయలక్ష్మి.. జయము నీయవే. సతతము నిను అర్చింతుము సిరులనివ్వవే’ అంటూ ప్రార్థించింది. వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం ఇంటింటా ఘనంగా నిర్వహించారు. అత్తిలిలోని విజయ చాముండేశ్వరి అమ్మ వారిని లక్ష్మీదేవి రూపంలో అలంకరించిన దృశ్యమిది. -
8 గంటల్లో శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 42,934 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 15 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 8 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 6 గంటలు సమయం తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. శ్రీవారి హుండీ కానుకలు రూ.3.14 కోట్లు లభించాయి. శ్రీవారి ట్రస్టులకు రూ.18 లక్షల విరాళం తిరుమల శ్రీవారి ట్రస్టులకు శుక్రవారం రూ.18 లక్షలు విరాళంగా అందింది. ఇందులో నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 లక్షలు, వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.5 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు రూ.లక్ష, సిమ్స్ ట్రస్టుకు రూ.10 లక్షలు ఇచ్చారు. భక్తులు డీడీలు స్థానిక దాతల విభాగంలో అధికారులకు అందజేశారు. -
బేల్దారి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక వైఎస్ నగర్లోని సత్యపురంలో బేల్దారి మూడె శివకుమార్ నాయక్(22) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య సుకన్య, రెండేళ్ల కుమార్తె పూజిత ఉన్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శివకుమార్ నాయక్ మూడేళ్ల క్రితం సుకన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతను బేల్దారి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించే వాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తాగుడుకు బానిసై పనికి సరిగా వెళ్లడం లేదు. అధిక వడ్డీకి అప్పు చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా అతన్ని పట్టించుకోవడం లేదు. శుక్రవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : స్వాతంత్య్రదిన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలని డీఈవో డి.మధుసూదనరావు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ నెల 16న 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాల చిత్రలేఖనం పోటీలు, 17న స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్ర అనే అంశంపై 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 18న దేశభక్తి పాటల పోటీలు, 19న స్వాతంత్య్రోద్యమంపై సాంస్కృతిక నాటిక పోటీలు, 20న స్వాతంత్య్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు పోరాటం అనే అంశంపై 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. 21న 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీరసైనికుల చిత్రాల చిత్రలేఖనం పోటీలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జాతీయ సమైక్యతపై నినాదాలు రాసే పోటీలు, 23న ఉదయం ఫ్రీడమ్ రన్ నిర్వహించి, బహిరంగ కూడలిలో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. -
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : స్వాతంత్య్రదిన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలని డీఈవో డి.మధుసూదనరావు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ నెల 16న 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాల చిత్రలేఖనం పోటీలు, 17న స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్ర అనే అంశంపై 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 18న దేశభక్తి పాటల పోటీలు, 19న స్వాతంత్య్రోద్యమంపై సాంస్కృతిక నాటిక పోటీలు, 20న స్వాతంత్య్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు పోరాటం అనే అంశంపై 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. 21న 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీరసైనికుల చిత్రాల చిత్రలేఖనం పోటీలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జాతీయ సమైక్యతపై నినాదాలు రాసే పోటీలు, 23న ఉదయం ఫ్రీడమ్ రన్ నిర్వహించి, బహిరంగ కూడలిలో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. -
ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (యూటీఎఫ్) 17వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో విద్యా ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా యూటీఎఫ్ ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందన్నారు. విద్యాహక్కు చట్టం కోసం పోరాటాలు పార్లమెంట్లో చట్టం ఆమోదించేలా కృషి చేసిందన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు జాతీయస్థాయిలో కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్రస్థాయిలో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోసం దేశవ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించి ప్రధానమంత్రికి అందిస్తామని, ఈ మేరకు నవంబర్ 29న చలో పార్లమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పీవీ నరసింహరావు, అసోసియేట్ అధ్యక్షులు వి.కనకదుర్గ, ఆడిట్ కమిటీ కన్వీనర్ జీవీ. సూరపరాజు, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ఎస్. బేగం బీబీ, నగర నాయకులు కెవీ. అప్పారావు, జీ.సాయిశ్రీనివాస్, స్వర్ణలత, రూరల్ మండల నాయకులు నంబూరి రాంబాబు, డి.లింగేశ్వరరావు, మాణిక్యాలరావు పాల్గొన్నారు. -
బెల్టుషాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఏలూరు అర్బన్ : జిల్లావ్యాప్తంగా బెల్ట్షాపులు, నియమిత వేళలు పాటించని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం విస్తృతంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.బి. భాస్కరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు ఏలూరు, భీమవరం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం, నరసాపురం ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని బెల్ట్షాపులు, నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై దాడులు చేసినట్టు వివరించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 47మద్యం బాటిళ్లు, పది బీరు సీసాలు స్వా«ధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదే సందర్భంలో సారా విక్రయిస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈదాడుల్లో అసిస్టెంట్ కమిషనర్ బి.శ్రీలత నేతృత్వంలో ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వై.శ్రీనివాసచౌదరి, కె. శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారని వివరించారు. -
పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కులు విడుదల
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకి 7 వేల క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నారు. జిల్లాలో ఏలూరు కాలువకి 1,180 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,714, నరసాపురం కాలువకి 2,020, గోస్తనీ (జీఅండ్ వీ)కి1,035, అత్తిలి కాలువకి 578 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 13,800 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం ఆరుగంటలకు గోదావరి నుంచి 3,57,496 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సాయంత్రానికి కాస్త ఇన్ఫ్లో తగ్గడంతో ఆరుగంటల నుంచి 2,54,048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 10.20 అడుగులుగా నమోదైంది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లును అరమీటరు ఎత్తు లేపి వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రచలంలో నీటిమట్టం 24 అడుగులకు తగ్గింది. దీంతో రానున్న రెండు రోజుల్లో వరద తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
14న బీఈడీ, డిగ్రీ ప్రవేశ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ, బీఈడీ (స్పెషల్), డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీలో ప్రవేశం కోసం ఈనెల 14న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు ఆ యూనివర్సిటీ సీఆర్ఆర్ కళాశాల స్టడీ సెంటర్ ప్రిన్సిపాల్ ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బీఈడీ, డిగ్రీ ప్రవేశపరీక్ష జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బీఈడీ (స్పెషల్) ప్రవేశపరీక్ష జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఎఓయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. -
నేడు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
– సాయంత్రం స్వర్ణర థోత్సవం తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రత మండపాన్ని ఆలయ, ఇంజినీరింగ్ అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం, ఆస్థానమండపాన్ని పచ్చని తోరణాలు, వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. సాయంత్రం 6గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా శుక్రవారం అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్సేవలను రద్దు చేశారు. టికెట్లకు పోటెత్తిన భక్తులు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కౌంటర్లో గురువారం వరలక్ష్మీ వ్రతం టికెట్లు భక్తులకు విక్రయించారు. వ్రతం టికెట్లు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు ఇవ్వనున్నట్లు ముందస్తుగా ప్రకటించారు. 200 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, సిఫార్సులతో సంబంధం లేకుండా ముందు వచ్చిన వారికే టికెట్లు ఇస్తామని చెప్పడంతో భక్తులు ఉదయం 5 గంటల నుంచి బారులు తీరారు. గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తరువాతనే భక్తులకు టికెట్లు జారీ చేశారు. గంటల సమయంలో క్యూలో వేచి ఉండి టికెట్లు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, బాలాజీ, పవన్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వరుడు
-
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు
సంగమేశ్వరం(కొత్తపల్లి): సప్తనదీ తీరాన వెలసిన శ్రీలలితా సంగమేశ్వరుడు 571రోజులపాటు పూజలందుకొని శుక్రవారం అర్ధరాత్రి కృష్ణమ్మ ఒడిలో ఒదిగి పోయాడు. శనివారం ఉదయం సప్తనదుల నదీ జలాలతో శ్రీలలితాసంగమేశ్వరుని ఆలయ మహాశిఖరంపై అర్చకుడు తెల్కపల్లి రఘురామశర్మ ఈ ఏడాదికిగాను చివరి పర్యాయంగా హోమం నిర్వహించి సప్తనదీ జలాలతో స్వామివారి మహాశిఖరానికి వేదమంత్రాల మధ్య అభిషేకం నిర్వహించారు. అనంతరం లలితా సంగమేశ్వరునికి మహామంగళహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రావణమాసం శుక్రవారం రోజున కృష్ణాజలాల్లో శ్రీలలితాసంగమేశ్వరుడు ఒదిగిపోవటం, కృష్ణాజలాల్లో సంగమేశ్వరుడు ఒదిగిన దినాన్నే(శుక్రవారం) కృష్ణాపుష్కరాలు కూడా ప్రారంభం కావటం అద్భుతమన్నారు. పుష్కరాల సందర్భంగా ఈనెల 22న శ్రీలలితా సంగమేశ్వరునికి అంగరంగ వైభోవంగా కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎగువప్రాంతాల నుంచి అత్యధికంగా వచ్చి చేరుతున్న కష్ణాజలాలతో సంగమేశ్వరాలయంలో పుష్కరఘాట్లు మునిగిపోయాయి. ప్రస్తుతం ఎగువ స్నానఘాట్లో పదిమెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. -
మత బోధకుని ముసుగులో..
నిడదవోలు: క్రైస్తవ మత బోధకుని ముసుగులో చోరీకి పాల్పడిన ఓ వ్యక్తిని నిడదవోలు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ ఎం.బాలకృష్ణ ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన జయవరపు కృష్ణ క్రై స్తవ మత బోధకునిగా చెప్పుకుంటూ ప్రార్థనలు చేస్తానని ఊరూరా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఈనెల 3న ఉదయం నిడదవోలు పట్టణంలో గాంధీనర్ మునిసిపల్ పార్క్ సమీపంలో ఉన్న కాకి సూర్యారావు ఇంటికి వెళ్లాడు. అక్కడ అతని భార్య అచ్చియమ్మ పక్షవాతంతో బాధపడుతుండటం గమనించి ఆమె స్వస్థతకు ప్రార్థనలు చేస్తానని చెప్పాడు. ఆ సమయంలో ఆ భర్త బయటకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన బోధకుడు ప్రార్థనకు మెడలో ఉన్న మంగళసూత్రాలు అడ్డు అని చెప్పి వాటిని తీయించి పక్కనే ఉన్న టీపాయి మీద పెట్టించాడు. ఆమెను కళ్లుమూసుకోమని చెప్పి మంగళ సూత్రాలు తీసుకుని పరారయ్యాడు. ఆమె కళ్లు తెరిచి చూసేటప్పటికి బోధకునితోపాటు మంగళసూత్రాలు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం నిందితుడిని మండలంలోని శెట్టిపేట వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మూడున్నర కాసుల మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ బాలకష్ణ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో పట్టణ ఎస్సై భగవాన్ ప్రసాద్, సిబ్బంది ఎండి షరీప్, ప్రభాకరరావు, అనిల్, టి.శ్రీనివాసరావు, ఎల్.బాబురావు, రామారావు పాల్గొన్నారు. -
గోదావరిలో పడి ఇసుక కార్మికుడి మృతి
కొవ్వూరు : గోదావరిలో ఇసుక సేకరణకు పడవపై పనిచేసే ఓ వ్యక్తి పడవ చెక్క విరిగిపోవడంతో నదిలో పడిపోయాడు. దీంతో అతను మృతిచెందాడు. ఈ ఘటన ఔరంగాబాద్ ర్యాంపులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విజ్జేశ్వరం గ్రామానికి చెందిన బొంబోతుల త్రిముర్తులు(33) ఇసుక సేకరణకు తోటి కూలీలతో కలిసి శుక్రవారం పడవపై వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడవ చెక్క విరిగిపోవడంతో నదిలో పడిపోయాడు. సహకార్మికులు అతడిని వెలికితీసి కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టణ ఎసై ్స ఎస్.ఎస్.ఎస్.పవన్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హోదా కోరుతూ వామపక్షాల దీక్షలు
ఏలూరు(సెంట్రల్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్ట హామీలు అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ డిమాండ్ చేశారు. స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్లో శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష శిబిరాన్ని బలరామ్, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన వాగ్ధానాలకు విరుద్ధంగా నేడు మాట్లాడుతోందని విమర్శించారు. నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడులు ప్రత్యేక హోదా తెచ్చేది– ఇచ్చేది మీమే అని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు గుడిపాటి నరసింహారావు, పి.కన్నబాబు, పి.కిషోర్, బి.సోమయ్య, రెడ్డి శ్రీనివాస్ డాంగే, కె.కృష్ణమాచార్యులు, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు ప్రత్యేక హోదా బిల్లును లోక్సభలో ఆమోదించాలని కోరుతూ జిల్లా కోర్టులోని న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ భవనం వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్కుమార్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం విధులు బహిష్కరించడం జరిగిందన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు బీజే రెడ్డి, జనరల్ సెక్రటరీ సీహెచ్ రాజేంద్రప్రసాద్, న్యాయవాదులు కారే బాబురావు, రాజనాల రామ్మోహన్, బీవీ కృష్ణారెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు, ఏలూరు వెంకటేశ్వరరావు, జిజ్జువరపు ప్రతాప్కుమార్. రంగరావు పాల్గొన్నారు. -
కొవ్వూరులో బ్యాడ్మింటన్ సందడి
కొవ్వూరు : రియో ఒలింపిక్స్నకు ముందే కొవ్వూరులో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల సందడి మొదలైంది. గురువారం ప్రారంభమైన ఈ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు రాకెట్లతో షటిల్కాక్ కే చెమటలు పట్టించారు. వినూత్నమైన షాట్లతో సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్లను మరిపించారు. కోర్టు నలుదిక్కుల షార్ట్లు కొడుతూ క్రీడాభిమానులకు కనువిందు చేశారు. కొవ్వూరు సత్యవతినగర్లోని అల్లూరి వెంకటేశ్వరరావు, మునిసిపల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులో రాష్ట్రస్థాయిæబ్యాడ్మింటన్ అండర్–17 పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి 63 మంది క్రీడాకారులు హాజరు కాగా ఎనిమిది మందిని రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలకు, డబుల్స్ విభాగంలో ఎనిమిది జట్లును ఎంపిక చేసినట్టు టోర్నమెంట్ చీఫ్ రిఫరీ, నేషనల్ రిఫరీ కె.రమేష్ తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నట్టు చెప్పారు. శని, ఆదివారాలు కూడా పోటీలు కొనసాగుతాయని బ్యాడ్మింటన్ అసోసియోషన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్, పొట్రు మురళీకృష్ణ తెలిపారు. సింగిల్స్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఎస్.అబ్దుల్ రెహమాన్(వైఎస్సార్ కడప), ఎం.సాయికిరణ్, పి.చంద్రరాజ్ పట్నాయక్ (విశాఖ పట్నం), బి.రోహిత్కుమార్(విశాఖపట్నం), ఎ.వంశీకష్ణంరాజు, ఎస్వీ రాయుడు (తూర్పుగోదావరి), పి.చంద్ర గోపీనాథ్, కె.చరణ్నాయక్(గుంటూరు) ఎంపికయ్యారు. డబుల్స్ విభాగంలో... కె.వరప్రసాద్ (విజయనగరం), ఎం.శ్రీకర్(శ్రీకాకుళం), ఎం.సాయికిరణ్(విశాఖపట్నం), పి.గోపీనాథ్(ప్రకాశం), బి.రోహిత్కుమార్, ఎస్.సౌరభ్కుమార్(విశాఖపట్నం), పి.సునీల్, టి.పార్ధసారథి( తూర్పుగోదావరి), కె.చరణ్ నాయక్, పి.విజయసాయి రెడ్డి(గుంటూరు), ఎ.వంశీ కష్ణ, ఎస్.శైలేష్కుమార్(పశ్చిమ గోదావరి), పి.చంద్ర గోపీనా«థ్(గుంటూరు), ఎస్వీ రాయుడు(తూర్పుగోదావరి) ఎంపికయ్యారు. -
నేత్రానందం తెప్పోత్సవం
– పాల్గొన్న వేలాది మంది భక్తులు –– ధర్మకర్తల మండలి సభ్యులకు దక్కని అవకాశం శ్రీకాళహస్తి : సుబ్రమణ్యస్వామి తెప్పోత్సవం శుక్రవారం రాత్రి శ్రీకాళహస్తిలో వేడుకగా జరిగింది. ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఇంద్రవిమానంపై ఊరేగిన శ్రీవళ్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి రాత్రి పట్టణంలోని నారదపుష్కరిణిలో తెప్పలపై తిరుగాడారు. కుమారస్వామి కొండకు దిగువభాగంలో ఉన్న నారదపుష్కరిణిలో తెప్పలను పూలతో, మామిడి తోరణాలతో,అరటిచెట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుత్దీప కాంతులతో మెరిసిపోతున్న తెప్పోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించారు. కోనేరులో స్వామి అమ్మవారు తెప్పలపై ఆరు సార్లు ప్రదక్షిణలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు ఉత్సవాన్ని తిలకించారు. భక్తులు కోనేరులో దీపాలు పెట్టి మొక్కులు చెల్లించకున్నారు. మరికొందరు భక్తులు బెల్లం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు,ఈవో భ్రవురాంబ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టవేలు జయగోపాల్, పీఎం చంద్ర, ఉభయదారులు పాల్గొన్నారు. తెప్పలపై ఆలయ చైర్మన్ దంపతులు,ఈవో, ఇద్దరు అర్చకులు, ఇద్దరు వేద పండితులు అవకాశం లభించింది. ఏడుగురు మాత్రమే తెప్పలపై ఎక్కడానికి వీలుందని ఇరిగేషన్ అధికారులు ముందే సూచించారు. దీంతో ఆలయ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఆరు ఘాట్లకే అనుమతి
యలమంచిలి : మండలంలోని లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి, అబ్బిరాజుపాలెం, యలమంచిలి, చించినాడ పుష్కరఘాట్లలో మాత్రమే అంత్య పుష్కరాలలో పుణ్య స్నానాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తహసీల్దార్ చాగలకొండు గురు ప్రసాదరావు, ఎస్సై పాలవలస అప్పారావు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. ఆ ఘాట్లలో మాత్రమే పోలీసులు, అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. మిగిలిన కనకాయలంక, పెదలంక, ఏనుగువానిలంక, యలమంచిలిలంక, గంగడుపాలెం, కంచుస్తంభంపాలెం, బాడవ గ్రామాలలోని పుష్కరఘాట్లలో ఎటువంటి వసతులు కల్పించడం లేదన్నారు. ఈ ఘాట్లలో పుష్కర స్నానాలను నిషేధించామని, యాత్రికులెవరూ ఈ ఘాట్లలో స్నానాలు చేయవద్దని వారు హెచ్చరించారు. -
పుష్కర భక్తులకు ఇబ్బంది రానివ్వకండి
జంగారెడ్డిగూడెం : అంత్యపుష్కరాల ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్(జేసీ) పి.కోటేశ్వరరావు ఆదేశించారు. పట్టిసీమ, గూటాల పుష్కర ఘాట్లలో అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమీక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు బాగుండాలని, చిన్న చిన్న పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రత్యేకంగా పారిశుధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. రెండు ఘాట్లలోను 12 బోట్లు, 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్టు జేసీ తెలిపారు. మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచి, ఒక స్పీడ్ బోటును కూడా సిద్ధం చేయాలని సూచించారు. గోదావరిలో ఒకవేళ నీటి మట్టం తగ్గినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు ఘాట్లలోను పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు అవసరమైన ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. అవసరమైతే బస్సులను కూడా పెంచాలని సూచించారు. ఘాట్ల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మద్యం దుకాణం లేకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి నదిలో భక్తులు వేసే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. గోదావరిలో బోట్లలో నిరంతరం పహరా నిర్వహించాలన్నారు. భక్తులు పూజలు నిర్వహించుకునేందుకు అవసరమైన పురోహితులను కూడా నియమించాలని సూచించారు. ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు, మద్ది ఈవో పి.వివ్వనాథరాజు, అసిస్టెంట్ ఎంవీఐ శ్రీనివాస్, పోలవరం తహసీల్దార్ ముక్కంటి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.