friday
-
థియేటర్లలో గేమ్ ఛేంజర్.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!
అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్ చిత్రాలు..థియేటర్స్..గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10ఫతే(హిందీ సినిమా)-జనవరి 10ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్యాడ్ విటమ్- జనవరి 10బ్లాక్ వారెంట్ -జనవరి 10ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10డిస్నీ+ హాట్స్టార్గూస్బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10జీ5సబర్మతి రిపోర్ట్- జనవరి 10ఆహాహైడ్ అండ్ సీక్- జనవరి 10 హోయ్చోయ్నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10 -
వరలక్ష్మి కృపకు ఆఖరి శుక్రవారం...ముఖ్యంగా పెళ్లికాని పడతులకు
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండో శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, సకలశుభాలు కలగాలని ప్రార్థిస్తారు.చివరి రోజు మరింత ప్రత్యేకం..శ్రావణమాసం, శుక్రవారాలు ఎంత ప్రత్యేకమైనవో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే శుభప్రదమైన శ్రావణమాసంలో చివరి వారం కావడంతో బోలెడంత సందడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల లక్ష్మీ దేవి పూజకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఆఖరి రోజు వ్రతం చేస్తే:ఆఖరి రోజున ఉపవాసం పాటించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున యథావిధిగా రకరకాల పిండి వంటలు, క్షీరాన్నం, పళ్లు, పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ శుభసమయంలో శ్రీ యంత్రానికి పూజలు నిర్వహిస్తారు. రాత్రి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం.అలాగే వరలక్ష్మి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలను లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి, పూజ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే దీనివల్ల ఆర్థిక లబ్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది. పెళ్లికాని పడుచులకు వరం..పూజ చేసుకున్న వారి నుంచి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుంచి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. -
ఫ్రైడే ఫీలింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. దేవుని సొంత దేశం వయనాడ్ వండరింగ్స్ అంటూ 'ఫ్రైడే ఫీలింగ్' అని ట్యాగ్ చేసారు. ఇందులో అందమైన ప్రకృతిలో ఏపుగా పెరిగిన చెట్లు, మధ్యలో రోడ్డు కనువిందు చేస్తాయి. ఈ వీడియోని ఇప్పటికి వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ నుంచి విదేశాలకు ఐఫోన్స్.. చరిత్ర సృష్టించనున్న టాటా గ్రూప్ ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి వయనాడ్. కేరళలోని వయనాడ్ పచ్చని వాతావరణం, పర్వతాలు, నదులతో సందర్శకులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పురాతనమైన అలవాట్లు, ఆచారాలలు ఇప్పటికి కూడా కనిపిస్తాయి. Wayanad Wanderings. God’s own country. The stuff of an ideal weekend. #FridayFeeling pic.twitter.com/YqVgBbvj7g — anand mahindra (@anandmahindra) October 27, 2023 -
నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్కు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
శ్రీవారి సన్నిధిలో పలువురు ప్రముఖులు..!
-
ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్ను అతి త్వరలోనే పూర్తి చేయనున్నారట. ట్విటర్ కొనుగోలుకు సంబంధిత నిధులు సమకూర్చుకుంటున్న మస్క్ శుక్రవారం నాటికి కొనుగోలును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు సహ-పెట్టుబడిదారులకు మస్క్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీల్కు నిధులు సమకూర్చే బ్యాంకర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ట్విటర్ కొనుగోలు డీల్ను త్వరలోనే ముగించాలని మస్క్ నిర్ణయించినట్టు వార్త లొచ్చాయి. ముఖ్యంఆ సీక్వోయా క్యాపిటల్, బినాన్స్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ , ఇతరులతో సహా ఈక్విటీ పెట్టుబడిదారులు మస్క్ లాయర్ల నుండి ఫైనాన్సింగ్ కమిట్మెంట్కు సంబంధించిన పత్రాలను అందుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డెలావేర్ కోర్టు న్యాయమూర్తి గడువు నేపథ్యంలో శుక్రవారం నాటికి లావాదేవీని పూర్తి చేసేలా మస్క్ ప్లాన్ చేస్తున్నాడని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కొనుగోలు నిధులు సమకూర్చిన బ్యాంకులు తుది రుణ ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని బ్లూమ్బెర్గ్ నివేదించింది. అయితే తాజా పరిణామంపై, మస్క్ లాయర్లుగానీ, ట్విటర్ గానీ అధికారింగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
ఇళ్ల వద్దే శుక్రవారం నమాజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణ కోçసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్బోర్డు సీఈఓ హమీద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మసీదుల్లో జరిగే శుక్రవారం నమాజులో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మసీదులు శుక్రవారం నమాజుకు నోచుకోని పరిస్థితి ఉత్పన్నం కావద్దనే ఈ సడలింపునిస్తున్నామన్నారు. ముస్లింలందరూ ఇళ్ల వద్దే నమాజు చదువుకోవాలని, శుక్రవారం రోజు కూడా మసీదుకు రావొద్దని హైదరాబాద్లోని జామియా నిజామియా ఇస్లామిక్ వర్సిటీ ఉపకులపతి ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సీఈఓ గుర్తు చేశారు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆడిటర్లకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులను మసీదు కమిటీలకు చేరవేయాలని కోరారు. -
వద్దన్న పాట
పదమూడేళ్ల వయసులో రెబెక్కా బ్లాక్ పాడిన ‘ఫ్రైడే’ అనే పాటను ప్రపంచం తిరస్కరించింది! పాపం చిన్న పిల్ల కదా అని సరిపెట్టుకోకుండా ఛీ కొట్టింది. నీ ముఖం అంది. ‘ది వరస్ట్ సాంగ్ ఎవర్’ గా ఆ పాట లోక‘ప్రసిద్ధి’ చెందింది. రెబెక్కా ఆడి, పాడిన ఆ సింగిల్ సాంగ్ వీడియో పుట్టి తొమ్మిదేళ్లు. తొమ్మిదేళ్లుగా లోకం తిడుతున్న తిట్లను భరిస్తూనే జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంది రెబెక్కా. తిరస్కారాల నుంచే తనను తనను మలుచుకుంది. వద్దన్న పాట నుంచే భవిష్యత్తుకు కొత్త స్వరాలను సమకూర్చుకుంది. ప్రేమ దక్కని వాళ్లు చేయవలసిన పని ఇదే. జీవితానికి దగ్గరవడం. మాధవ్ శింగరాజు కొంచెం టైముందా! లేక.. ‘గాట్టా బి ఫ్రెష్. గాట్టా గో డౌన్స్టెయిర్స్.. ఇట్స్ ఫ్రైడే..’ మూడ్లో ఉన్నారా.. బెడ్రూమ్లోంచి దిగెళ్లి పళ్లు తోముకుని.. ఇంత తిని.. శుక్రవారపు సోమరి పరిమళాలను అందుకుని కిటికీలోంచి గాల్లో తేలిపోడానికి! ఇట్స్ వాలెంటైన్స్ డే కూడా కదా. ఎవరికీ అందకండి. ఇది మీ లైఫ్. శుక్ర–శని–ఆది.. మీదే లైఫ్. తర్వాతెలాగూ మీ లైఫ్ మీ బాస్ది. మీ లైఫ్ మీ ప్రిన్సిపాల్ది. మీ లైఫ్ మీ హెడ్మాస్టర్ది. ఒక్కమాట. వెళ్తూవెళ్తూనైనా యూట్యూబ్లో రెబెక్కా బ్లాక్ – ఫ్రైడే అని కొట్టి చూడండి. పదమూడేళ్ల అమ్మాయి తొమ్మిదేళ్ల క్రితం పాడిన వీడియో సాంగ్ అది. ఆమెను స్మరించుకుంటూ ప్రేమికుల రోజున ఈ పాటను చూడమని కాదు. ఆమె నిక్షేపంగా ఉన్నారు తన ఇరవై రెండేళ్ల వయసులో. రెబెక్కా బ్లాక్ తన పేరు. ‘ఫ్రైడే’ ఆ పాట పేరు. 3 నిముషాల 47 సెకన్లు ఉంటుంది. వాలెంటైన్స్ డే రోజు అంత టైమ్ని వృ«థా చెయ్యడం అన్యాయమే. బయట గులాబీ పూలకాడలు అయిపోయాయంటే.. వట్టి చేతుల్తో వెళ్లి ఐలవ్యూకి ముందు సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ కూడా ప్రేమ సిలబస్లో ఒక చాప్టరే. అలాగని బుంగమూతిని తెరిపించే పూలగుత్తేమీ కాదు కదా ‘సారీ’. వీడియో చూడకున్నా పర్లేదు. పైపై డీటెయిల్స్ చూడండి. పది లక్షలా పది వేల లైక్లు కనిపిస్తాయి. పక్కనే చూడండి. ముప్ఫై లక్షల అరవై వేల డిస్లైక్లు ఉంటాయి! రేటింగ్ చూడండి. ‘నో మెచ్యూర్ కంటెంట్’ అని ఉంటుంది. ఇక పాట చూడ్డానికేముంటుంది! చూసినా ఏం ఉంటుంది? ∙∙ ‘7 ఎ.ఎం. వేకింగ్ అప్ ఇన్ ది మార్నింగ్ గాట్టా బి ఫ్రెష్.. గాట్టా గో డౌన్ స్టెయిర్స్.. గాట్టా గెట్ డౌన్ టు ద బస్ స్టాప్.. గాట్టా క్యాచ్ మై బస్.. ఐ సీ మై ఫ్రెండ్స్..’ పాటంతా ఇదే తొందర. ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవాలన్న ఓ పదమూడేళ్ల అమ్మాయి తొందర.. రెబెక్కా బ్లాక్ ‘ఫ్రైడే’ సాంగ్ థీమ్. జీవితాన్ని ప్రేమిస్తే జీవితం మన చుట్టూ తిరుగుతుంది. వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. రెబెక్కా బ్లాక్.. జీవితాన్ని ప్రేమించింది. ప్రేమించి ఊరుకోలేదు. పాటతో ఆ ప్రేమను చూపించింది. ఎవరికీ అర్థం కాలేదు. ఇదేం పాట అన్నారు! ఇది పాటా అన్నారు. పాటలో కీట్స్ లేడు. షెల్లీ లేడు. బైరన్ లేడు. కనీసం కుర్రవృద్ధుడు జస్టిన్ బీబర్ లేడు. అసలు పొయెట్రీనే లేదు. శుక్రవారం రాగానే లేవడం, పార్టీలకు పరుగెత్తడం. ఏముంది ఇందులో? లోకం నిక్కచ్చి మాస్టారు. పదమూడేళ్ల పిల్లయినా గెలిచే తీరాలంటుంది. గెలవలేకపోతే ‘ఈ లోకంలోకి ఎందుకొచ్చావ్?’ అని అడుగుతుంది. పాడింది మాత్రమే రెబెక్కా. తన ఫీలింగ్స్ని వేరెవరికో చెప్పి తనకు కావలసినట్లు పాటను రాయించుకుంది. ప్రపంచంలోని ఒక్క లిరిక్ లవర్కి కూడా ఈ పాట నచ్చలేదు. పూర్ గర్ల్ అన్నారు. ‘ఎస్టర్డే వాజ్ థర్స్డే.. టుడే ఈజ్ ఫ్రైడే.. టుమారో ఈజ్ శాటర్ డే’ అని పాడుతుంది రెబెక్కా.. పాటలో ఓ చోట. ‘డే ఆఫ్టర్ టుమారో సండే కదా.. హహహా.. ఈ పిల్లలో విషయం లేదు. కసిగా ఏదో అవ్వాలనుకుని లోకం మీద విసురుగా పడింది’ అని కామెంట్స్. సిస్టమ్ని షట్ డౌన్ చేసేస్తే ఈ కామెంట్స్ అన్ని మాయమౌతాయి. కానీ స్కూల్ మాయమౌతుందా? సెలవులొచ్చే వరకు ఆన్లోనే ఉంటుంది. సెలవులయ్యాక మళ్లీ స్కూల్. పాటను యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన రోజు మొదలైన వెవ్వెవ్వేలు రెబెక్కాను టీనేజ్ అంతా వెంటాడాయి. స్కూల్లో టీచర్లు కూడా ఆమెను చూసి నోటికి చెయ్యి అడ్డుపెట్టి నవ్వుకున్నారు. ముడుచుకుపోయింది. స్కూల్లో పదిహేనవ యేట ఆమెతో మాట్లాడేవాళ్లు తగ్గిపోయారు. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కాలేజ్లో పదిహేడవ యేట.. అప్పుడే రెబక్కా ‘ఫ్రైడే’ను చూసి వచ్చినవాళ్లెవరో.. తింటున్న పీజాలు, బర్గర్లు ఆమె మీద విసిరేశారు. సగం చచ్చిపోయింది. పందొమ్మిదో యేట మ్యూజిక్ ప్రొడ్యూజర్లు, సాంగ్ రైటర్లు నిన్నసలు ఎప్పటికీ తీసుకునేదే లేదనేశారు. ఇంటికొచ్చి ఏడ్చేసింది రెబెక్కా. రోజూ ఏడుస్తూనే ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఒకటే ఏడుపు. తలుపులు వేసుకుని ఒంటరిగా ఏడుపు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు. ∙∙ టీనేజ్ దాటుతుండగా రెబెక్కా ఓ రోజు అద్దంలో తనని తను పరిశీలనగా చూసుకుంది. ఏడ్చినట్లుంది. తనేం ఏడ్వడం లేదు. కానీ ఏడ్చినట్లే ఉంది! కన్నీళ్లొస్తే చేతులతో తుడుచుకుంటాం. ఏడుపే రాకుండా కన్నీళ్లు కనిపిస్తుంటే.. తుడుచుకోవలసింది కళ్లను కాదు. కళ్లు మూసినా, కళ్లు తెరిచినా తనను ఏడిపిస్తున్న లోకాన్ని! అవును.. లోకాన్ని తన కళ్ల ముందు నుంచి తుడిచేయాలి. కళ్లు మూసుకుంది రెబెక్కా. రెప్పల మాటున అంతవరకు ఉంటూ వచ్చిన అవమానాలన్నీ ఒకటొకటిగా అదృశ్యం అయిపోవడం మొదలైంది. చివరికొక రూపం మిగిలింది. ఆ రూపం రెబక్కాదే. రెబక్కా అందంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ఉంది. ఒక కొత్త పాట కోసం తనని తను ట్యూన్ చేసుకుంటోంది! ఈ ఫిబ్రవరి 10 కి రెబెక్కా పాట ‘ఫ్రైడే’.. పదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. దీనిపై ఇన్స్టాగ్రామ్లో చిన్న పోస్ట్ పెట్టింది రెబెక్కా. ‘మీరేమిటన్నది మీ గురించి మీకేం తెలుసో అదే కానీ.. మీ గురించి ఎవరేమనుకుంటున్నారో అది కాదు మీరు’ అని. ఇంకా చాలా రాసింది. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాక.. ఈ సాయంత్రం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ పోస్ట్ను చదవండి. మీరు జీవితాన్ని ప్రేమిస్తున్నారో, వ్యక్తిని ప్రేమిస్తున్నారో మీ కనురెప్పల లోపలి స్క్రీన్పై కనిపిస్తుంది. తర్వాత మీరు.. రెబెక్కా ఇన్నేళ్లలోనూ సొంతంగా, ఎవరి సహాయమూ లేకుండా చేసిన మిగతా సింగిల్స్ని (సింగిల్ సాంగ్స్) కూడా వెతకడం మొదలు పెడతారు. ఆమెదే కొద్దిగా ఫిల్మోగ్రఫీ ఉంది. డిస్కోగ్రఫీ ఉంది. అన్నీ తనకు తానుగా చేసుకున్నవే. జీవితాన్ని ప్రేమించేవారు ఏదైనా సొంతంగా చేసుకోగలరు. దేన్నయినా సొంతంగా సాధించగలరు. మన జీవితమే మనకు వాలంటైన్. -
శుక్రవారం... మధ్యాహ్నం మాత్రమే!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం శుక్రవారం... అది కూడా మధ్యాహ్నం పూట... ప్రార్థనలకు వెళ్లే యజమానుల దుకాణాలే టార్గెట్... సగం దింపిన షట్టర్ను ఎత్తి ఏది దొరికితే అది ఎత్తుకుపోతారు... ఈ పంథాలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులకు వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి వాహనం, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు ఆదివారం తెలిపారు. పాతబస్తీ, ఫలక్నుమా పరిధిలోని వట్టేపల్లికి చెందిన మహ్మద్ అక్రమ్ వెల్డింగ్ వర్కర్గా, మహ్మద్ పాషా కూలీగా పని చేసేవారు. దురలవాట్లకు బానిసైన అక్రమ్ అందుకు అవసరమైన డబ్బు సంపాదించడానికి కొన్నాళ్ల క్రితం నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల కోసం వెళ్లే వ్యాపారులు తమ దుకాణాల షట్టర్స్ సగం వరకే కిందికి దించుతుంటారు. దీనిని గుర్తించిన అక్రమ్ ఆయా షాపుల్లోకి దూరి అందినకాడికి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లేవాడు. తస్కరించిన నగదుతో పాటు చోరీ వస్తువుల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. గతంలో అతడిపై షాహినాయత్గంజ్, కుల్సుంపుర, మైలార్దేవ్పల్లి ఠాణాల పరిధిల్లో కేసులు నమోదయ్యాయి. అక్రమ్ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. 2018 జూన్లో జైలు నుంచి బయటికి వచ్చిన అతను ఏడాది తర్వాత భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మరో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది అక్టోబర్ 1న జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా తన పంథా మార్చుకోని అక్రమ్ ఈసారి ముఠా కట్టి పంజా విసరాలని భావించాడు. తన స్నేహితుడైన పాషాకు విషయం చెప్పడంతో సహకరించడానికి ముందుకు వచ్చాడు. ఆ నెల మొదటి వారంలో తన స్నేహితుడు ఖాలీద్తో కలిసి రెండు రోజుల పాటు బీదర్లో ‘పర్యటించిన’ అక్రమ్ ఓ ద్విచక్ర వాహనం చోరీ చేసి తీసుకువచ్చాడు. పాషాతో కలిసి దీనిపై తిరుగుతూ నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరూ కలిసి చోరీ బైక్పై సంచరిస్తూ ఓ చెత్త వాహనం డ్రైవర్ను గమనించారు. అతడు తన ఫోన్ను వాహనం సీటుపై ఉంచి ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించిన వీరు ఫోన్ తస్కరించారు. నిందితులు అక్రమ్, పాషా అదే నెల ఆఖరి వారంలో అదే చోరీ బైక్పై టోలిచౌకి ప్రాంతంలో సంచరించారు. ఆ సమయంలో నవాజ్ చికెన్ షాప్ షట్టర్ సగం దించిన యజమాని ప్రార్థనల కోసం వెళ్లారు. దీనిని గమనించిన అక్రమ్ వాహనాన్ని కొద్దిదూరంలో ఆపాడు. పాషాను దాని సమీపంలోనే ఉంచి యజమాని రాకను గమనించమని చెప్పాడు. అక్రమ్ నేరుగా దుకాణంలోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.85 వేల నగదు, సెల్ఫోన్ చోరీ చేశాడు. ఈ డబ్బును ఇద్దరూ కలిసి ఖర్చు చేశారు. ఈ రెండు ఉదంతాలకు సంబం«ధించి బాధితుల ఫిర్యాదుతో స్థానిక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని ఛేదించేందుకు పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్ ముజఫర్, పి.మల్లికార్జున్, ఎన్.రంజిత్కుమార్లతో కూడిన బృందం చోరీ జరిగిన దుకాణం సమీపంలోని సీసీ కెమెరాల ఫీడ్ను సేకరించి అధ్యయనం చేసింది. ఫలితంగా అనుమానితుల జాడ తెలియడంతో లోతుగా దర్యాప్తు చేసింది. ఆదివారం అక్రమ్, పాషాలను పట్టుకుని వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను గోల్కొండ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. -
శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు
-
అసలే 13...ఆపైన శుక్రవారం
జనాలకు కొన్ని వింత నమ్మకాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వంటివి. ఇలానే ప్రజల్లో ఇంకా చాలా మూఢ నమ్మకాలే ఉన్నాయి. ఒక్కోసారి ఏమైనా సంఘటనలు యాధృచ్చికంగా ఏర్పడినా.. అవి ఈ మూఢ నమ్మకాల వల్లే ఏర్పడ్డాయని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల కొన్ని సార్లు మంచి జరుగుతుంది, కొన్ని సార్లు చెడు జరుగుతుంది. అలాంటి ఒక వింత నమ్మకమే 13ను దురదృష్టంగా భావించడం. అవును ప్రపంచంలో చాలా దేశాల్లో 13ను దురదృష్ట సంఖ్యగా నమ్ముతారట. అలాంటి 13 వ తారీఖు కనుక శుక్రవారం వస్తే దానంత దరిద్రమైన రోజు మరొకటి ఉండదని అనుకుంటారట. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఈ రోజు శుక్రవారం 13వ తేదీ. 13వ తేదీని ఎందుకు దురదృష్ట సంఖ్యగా చెబుతారో సరైన కారణాలు తెలియదు కానీ, ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. ఏసు క్రీస్తును సిలువ వేయడానికి ముందు రోజు జరిగిన ముఖ్య ఘట్టం లాస్ట్ సప్పర్. దీనిలో పాల్గొన్నవారు 13 మంది. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం క్రీస్తును సిలువ వేశారు. ఆ రోజున ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు గుడ్ఫ్రైడేగా జరుపుకుంటారు. ఇటువంటి బాధకరమైన సంఘటనలు జరిగాయి కాబట్టే ఏ నెలలోనైనా ఈ రెండు కలిసి వస్తే అంటే 13వ తేదీ శుక్రవారం వస్తే ఆ రోజు తప్పకుండా ఏదైనా చెడు జరుగుతుందని బఫ్ఫేలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆంత్రాపాలజీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఫిల్ స్టివెన్స్ తెలిపారు. ఏజేసీ.కామ్లోని యూదుల ఇస్కారియట్ ప్రకారం క్రీస్తును మోసం చేసి సైనికులకు అప్పగించిన శిష్యుడు భోజన బల్ల వద్ద 13వ స్థానంలో కూర్చున్నాడని.. అందుకే 13 అనే అంకెను చెడు సంఖ్యగా భావిస్తారని తెలిసింది. కారణాలు ఏవైనా చాలా మంది మాత్రం 13 సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. ఆ తేదీన ఎవ్వరూ గృహప్రవేశం చేయరు. పెద్ద పెద్ద భవనాలలో కూడా 13వ నంబరు అంతస్తు ఉండదు. ఒకవేళ 13వ అంతస్తు ఉన్నా.. ఆ మొత్తం అంతస్తును ఖాళీగా ఉంచుతారు. ఆ రోజున ఎవరూ వివాహం కూడా చేసుకోరు. గతంలో కూడా 13వ తేదీ శుక్రవారం వచ్చిన సందర్భాల్లో అనేక అనూహ్యమైన చెడు సంఘటనలు సంభవించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే కొంతమంది 13వ తేదీ, శుక్రవారం రెండు కలసిరావడం చాలా అదృష్టంగా భావిస్తారట. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుందని, కాబట్టి ఈ రోజంతా మంచి జరగాలని ఆశించి, రోజు చివరలో ఏం జరిగిందో విశ్లేషించుకోండని అంటున్నారు న్యూమరాలజిస్ట్లు. మరో విషయం ఏంటంటే నేడు శుక్రవారం 13వ తేదీ అనంతరం ఈ ఏడాదిలో జూలై నెలలో కూడా 13వ తేదీ శుక్రవారంతో కలిసి రాబోతోంది. మరి ఈ రెండు రోజుల్లో ఏమైనా వింత విశేషాలు జరుగుతాయేమో చూడాలి. -
పాహిమాం...
జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్థలతో ఆచరించారు. అమ్మవారి ఆలయాలు వేకువ జాము నుంచే కిక్కిరిసిపోయాయి. కుంకుమ పూజలు చేసి ముత్తైదువలకు వాయినాలు అందజేశారు. జిల్లాలో ప్రధాన ఆలయాలైన అన్నవరంలోని వనదుర్గ అమ్మవారు, ద్రాక్షారామం, పాదగయ తదితర ఆలయాలు కిటకిటలాడాయి. -
బాసర సరస్వతీ ఆలయంలో అపచారం
-
విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలో విద్యారంగాన్ని పటిష్టం చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపడానికి డీఈఓ కృషి చేయాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. డీఈఓ ఆర్ఎస్ గంగాభవానీకి రాష్ట్రస్థాయి అవార్డు లభించిన సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గంగాభవానీని కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విద్యా ప్రమాణాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ ఏడీ ఏవీ వెంకటరమణ, సూపరింటెండెంట్లు పురుషోత్తం, అజీజ్, రీజనల్ స్పోర్ట్స్ కో– ఆర్డినేటర్ పీఎస్ సుధాకర్, పాండు రంగారావు, డి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు సాగు నీటి అవసరాల నిమిత్తం మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గురువారం పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేశారు. మొదటి రోజు కావడంతో తొలుత 100 క్యూసెక్కులు, దశలవారీగా 500 క్యూసెక్కులకు పెంచారు. శుక్రవారం ఉదయం రెండు వేల క్యూసెక్కు లు విడుదల చేసిన అధికారులు క్రమేణా సాయంత్రానికి మరో వెయ్యి క్యూసెక్కులు పెంచి విడుదల చేస్తున్నారు. శనివారం నుంచి ఏ కాలువకు ఎంత నీరు విడుదల చేస్తున్నామో షెడ్యూలు వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 3,400 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పు, సెంట్రల్ డెల్టాలకు రెండు వందల క్యూసెక్కుల చొప్పున, పశ్చిమ డెల్టాకు 3 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 13.78 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట నీటిసామర్థ్యం కంటే అదనంగా నీరు నిల్వ ఉండడంతో ధవళేశ్వరం ఆర్మ్లో ఐదు గేట్లు, విజ్జేశ్వరం ఆర్మ్లో మూడు గేట్లను 0.20 మీటర్లు ఎత్తులేపి 4,825 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. -
దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి
ఏలూరు అర్బన్ : వేసవిలో చల్లగాలి కోసం చాలామంది ప్రజలు ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకోకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. శుక్రవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్పీ ప్రజలతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. సమస్యలు విని సంబంధిత అధికారులకు ప్రజల ఫిర్యాదులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఇళ్ల దొంగతనాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. వాటిని నిరోధించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అయితే దొంగతనాలు అడ్డుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. దానిలో భాగంగా ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో తలుపులకు తాళాలు వేసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకూ ఇళ్లలో విలువైన నగలు, పెద్దమొత్తంలో నగదు ఉంచుకోవద్దని సూచించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసుకుని పొరుగూరు వెళ్లే క్రమంలో సదరు విషయాన్ని సంబంధిత పోలీస్స్టేషన్ లో తెలిపితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 28 మంది ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి. తణుకు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్, బైక్ రేసింగ్లు జరుగుతున్నాయని నిరోధించాలని కోరాడు. ఏలూరు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి తంగెళ్లమూడి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ఆకతాయిల ఆగడాలను నిరోధించాలని ఫిర్యాదు చేశాడు. చింతలపూడి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో కోడి పందేలు, పేకాటలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, వాటిని పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. -
‘యనమదుర్రు’ ప్రక్షాళనకు చర్యలు
భీమవరం టౌ న్ : యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళన దిశగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించారు. యనమదుర్రు డ్రెయి న్ జలాలు నిర్జీవంగా మారడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో యనమదుర్రు డ్రెయి న్ ను ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గొంతేరు డ్రెయి న్ ను మరో యనమదుర్రు కానివ్వబోమని గోదావరి మెగా ఆక్వాఫుడ్పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఉద్యమిస్తున్న నేపథ్యంలో గతనెల 25న భీమవరంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శిక్షణ పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళనకు ప్రణాళిక సిద్ధం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఇలా అన్ని వర్గాల నుంచి యనమదుర్రు డ్రెయి న్ కాలుష్యానికి పరిశ్రమలు, మున్సిపాలిటీలు గ్రామాల నుంచి వస్తున్న మురుగు, చెత్త కారణమంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు పర్యావరణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావుతో కలిసి యనమదుర్రు డ్రెయి న్ ను పరిశీలించారు. ట్రీట్మెంట్ ప్లాంట్లపై చర్చ యనమదుర్రు డ్రెయి న్ లో మురుగునీరు కలిసే చోట సావేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎక్కడెక్కడ అవసరమో పరిశీలించారు. దెయ్యాలతిప్ప ప్రాంతంలో, భీమవరం పట్టణం రెస్ట్హౌస్ రోడ్డు శివారు గంగానమ్మ గుడి ప్రాంతంలో, అందరికీ ఇళ్లు నిర్మాణానికి కేటాయించిన 82 ఎకరాల స్థలం వద్ద ఎస్టీపీలు నిర్మాణంపై చర్చించారు. అమృత్ పథకంలో 5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు వివరించారు. మరో 5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు బృందం యనమదుర్రు డ్రెయి న్ లో మురుగు కలుస్తున్న ప్రాంతాల ఫొటోలు తీసుకున్నారు. డ్రెయి న్ ప్రక్షాళనకు సంబంధించి మున్సిపల్ అధికారులతో చర్చించారు. మున్సిపల్ డీఈ శ్రీకాంత్, టౌ న్ ప్లానింగ్ అధికారులు వారి వెంట ఉన్నారు. -
చిన వెంకన్నకు కల్యాణ శోభ
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో వేంకటేశ్వర స్వామి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు శుక్రవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. చినవెంకన్న భక్తులకు శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి నుదిటిన కల్యాణ తిలకం, బుగ్గనచుక్కతో పెళ్లి కూమారుడిగా శోభిల్లారు. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెళ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యారు. ఆలయ పండితులు, అర్చకులు ఈ తంతును వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణలతో చిన వెంకన్న క్షేత్రం మార్మోగింది. వేదికపై ఏర్పాటు చేసిన రజత సింహాసనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ వేడుకలను తిలకించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మెుదటి రోజున జరిగే గజ వాహన సేవకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. స్వామి వైభవాన్ని చాటే ఈ వాహనసేవను శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. రాజగోపురం మీదుగా పుర వీధులకు పయనమైన స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రీహరికళాతోరణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
ఉద్యోగులు ప్రజలతో మమేకం కావాలి
ఏలూరు (మెట్రో) : ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న వ్యతిరేక భావం పోవాలంటే ఉద్యోగులు ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలని, వారితో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కొందరు ఉద్యోగుల పట్ల ప్రజల్లో సరైన అభిప్రాయం లేదని పదిమందికీ మేలు చేసే కార్యక్రమాల్లో కొన్ని విషయాలు ఇబ్బంది అనిపించినా కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేస్తే పరవాలేదన్నారు. వ్యక్తి కోసం చట్టాన్ని అతిక్రమించి ఎవరు పనిచేసినా సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా శాఖా పరంగా ఇబ్బందులు పడుతుంతే తన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు, ఎన్జీవో నాయకులు చోడగిరి శ్రీనివాస్, రమేష్కుమార్, శ్రీధర్, సత్యనారాయణ, ఐవీఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. న్యాయమూర్తి గోపి బాధ్యతల స్వీకరణ ఏలూరు(సెంట్రల్) : జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా జి.గోపి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయనను ఇటీవలే జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఆటో బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
కైకరం (ఉంగుటూరు) : జాతీయ రహదారిపై కైకరం వద్ద శుక్రవారం తెల్లవారు జూమున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి, డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని భవానీపురానికి చెందిన ఆకుమళ్ల రమణారెడ్డి(29) గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో వాషింగ్మెషీన్లు, కూలర్లలోడుతో తణుకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కైకరం వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. డ్రైవర్ రమణారెడ్డి అక్కడక్కిడే మృతిచెందాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వ్యాయామ కళాశాలకు మినీ స్టేడియం
దెందులూరు : రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలకు మరోసారి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. కళాశాలకు మినీ స్టేడియం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలను జారీ చేసింది. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మ న్ మాగంటి నారాయణ ప్రసాద్ శుక్రవారం మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, అధికారుల కృషి, సహాయ, సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం మినీ స్టేడియం మంజూరు చేసిందని తెలిపారు. స్టేడియం మంజూరు ద్వారా వ్యాయామ కళాశాలకు మరింత కీర్తి ప్రతిష్టలు రావటమే కాకుండా, శిక్షణ పొందే వ్యాయామ అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులకు మరెంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తన సొంత వ్యయంతో కళాశాలలో రెండో సంవత్సరం వ్యాయామ విద్యనభ్యసిస్తున్న ఐదుగురికి ప్రతి సంవత్సరం ఫీజులు చెల్లిస్తానన్నారు. ఇంట్రామ్యూరల్ ఆటల పోటీలు ప్రారంభం.. వ్యాయామ కళాశాలలో శుక్రవారం ఇంట్రామ్యూరల్ ఆటల పోటీలను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మ న్ మాగంటి నారాయణ ప్రసాద్ ప్రారంభించారు. ఇంట్రామ్యూరల్ డైరెక్టర్ వి.శ్యామలా ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీల్లో 16 గ్రూపులకు చెందిన డీపీఈడీ, బీపీఈడీ వ్యాయామ అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో గ్రూపులో 25 మంది ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మ న్ మాగంటి మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న వ్యాయామ అధ్యాపకులు పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో వ్యాయామ అభివృద్ధి, రాష్ట్ర, జాతీయ స్థాయి విభాగాల్లో ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలన్నారు. తొలుత వాలీబాల్ సర్వీస్ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ఆకర్షణ గా నిలిచింది. -
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు
పెదనిండ్రకొలను (నిడమర్రు): సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ విమర్శించారు. శుక్రవారం పెదనిండ్రకొలనులో జరిగిన గడప గడపకూ వైఎస్సార్లో ఆయన పాల్గొని స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిపై పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్ట్లు చేస్తున్నారన్నారు. పాలనపై అసహనంతో ఉన్న యువత సోషల్ మీడియా ద్వారా తమ భావాలను ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. అది కూడా నేరంగా వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండిస్తే ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్పై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై యువత స్పందన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పొలిటికల్ సెటైర్ డిజైనర్ అరెస్ట్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు. మే 1,2 తేదీల్లో జగన్ దీక్ష మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి సమస్యలపై జగన్ పోరాడతారని భరోసా ఇచ్చారు. వచ్చే నెల 1,2 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో జరగాలి్సన దీక్ష వాయిదాపడిందన్నారు. రైతు దీక్షకు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. శ్రీధర్ వెంట ఆపార్టీ ఉంగుటూరు కన్వీనర్ పుప్పాల వాసుబాబు , మండల కన్వీనర్లు సంకు సత్యకుమార్, రావిపాటి సత్యశ్రీనివాస్, మరడా వెంకట మంగారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కచ్చాల నాగేశ్వరరావు, తుమ్మగంటి రంగ, రామిశెట్టి శ్రీను, పులిచర్ల కృష్ణారావు, ఎంపీటీసీలు కోడూరి రాంబాబు, సునీత మానసింగ్, ఆర్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇదేనా.. పనిచేసే తీరు
ఏలూరు (మెట్రో) : కాలువలు మూసివేసిన తర్వాత ఇప్పుడు గుర్రపు డెక్క, తూడు తొలగింపు విషయంలో టెండర్లు పిలుస్తారా అంటూ ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయాలనే ఆలోచన ఉంటే ముందుగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారని, పని చేయకూడదనే ఆలోచన ఉంటేనే ఇటువంటి పనులు చేస్తారని మండిపడ్డారు. ఇటువంటి పద్ధతి విడనాడాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తీరుపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సాగునీటి కాలువ మరమ్మతులు, డెల్టా ఆధునికీకరణ కార్యక్రమాలు, కాలువలు మూసి వేసిన తరువాత చేపట్టాల్సి ఉన్నప్పటికీ కాలువలు తెరిచిన తరువాత పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న పనుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. చీఫ్ ఇంజనీర్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి వాటి అనుమతులు పొందుతామని తెలిపారు. పోలవరం ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసినట్టు కాగితంపై చూపిస్తే కుదరదనీ, డాక్టర్లు, సిబ్బంది నియామకానికి తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. సిబ్బందిని మంజూరు చేయిస్తానని జిల్లా వైద్యాధికారి కోటేశ్వరికి చెప్పారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలో కష్టపడి పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకొచి్చన పంచాయతీరాజ్ ఏఈ మాణిక్యాన్ని కలెక్టర్ అభినందించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ కట్టా హైమావతి, డీపీఓ సుధాకర్, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు. -
ఆటోలోనూ నగదు రహిత ప్రయాణం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నగదురహిత ఆటో ప్రయాణానికి రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. రవా ణాశాఖ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఆటోల్లో ప్రయాణించే వారు నగదుతో సంబంధం లేకుండా ప్రత్యేక యాప్ ద్వారా ఆటో చార్జీలు చెల్లించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. మంత్రి పితాని సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఏలూరు మేయర్ నూర్జహా న్ కొద్దిదూరం ఆటోలో ప్రయాణించారు. ఆటో చార్జీల కోసం చిల్లర సమస్య తలెత్తకుండా నేరుగా ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాకు సొమ్ము జమయ్యేలా రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ వల్ల ఎక్కడా నగదు సమస్య తలెత్తబోదని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడతారని, రాబోయే రెండేళ్లలో ఈ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి పితాని చెప్పారు. ఆటో డ్రైవర్ ఖాతాకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు ఖాతా నుంచి రూ.50 సొమ్మును ఆ న్లై న్లో పంపించారు. దశల వారీగా ఆటో సేవలను విస్తరించనున్నారు. -
భళా.. వేంగి కళ
చారిత్రక నగరం హేలాపురిలో వేంగి కళా ఉత్సవాలు శుక్రవారం మొదలయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల శాస్త్రీయ, జానపద నృత్య కళారీతులను ప్రదర్శిస్తున్నారు. గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్య విన్యాసమిది. గజ్జె ఘల్లున.. గుండె ఝల్లున ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరానికి చెందిన శ్రీ లలితా కామేశ్వరి నృత్య సదనం ఆధ్వర్యంలో నాట్యాచారిణి ఘండికోట అలివేలు ఉష నిర్వహణలో శుక్రవారం ప్రారంభమైన వేంగి కళా ఉత్సవాలు అలరించాయి. అంతర్జాతీయ స్థాయి నృత్య కళాకారుల నృత్యప్రదర్శన కళాకారులను రంజింపజేశాయి. నవీ ముంబైకి చెందిన అపేక్ష ముందర్జీ భరతనాట్యం, గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్యం నగరవాసులను విపరీతంగా అలరించాయి. అలాగే చెన్నైకి చెందిన అమర్నాథ్ ఘోష్ కథక్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
గ్యాస్ లీకై తాటాకిల్లు దగ్ధం
వెంకట్రామన్నగూడెం (తాడేపలి్లగూడెం రూరల్) : గ్యాస్ లీకై తాటాకిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని వెంకట్రామన్నగూడెంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని జయ మహంకాళి పౌల్ట్రీ ఎదురుగా బత్తుల శ్రీనివాసరావు నివాసముంటున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి పనులు ముగించుకుని ఇంటిల్లిపాది నిద్రించారు. శుక్రవారం తెల్లవారు జామున గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు చూసి కేకలు పెట్టారు. ఈ హడావుడికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు లేచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఇంటితో పాటు బీరువాలోని రూ.2.50 లక్షల నగదు, ఇతర సామగ్రి, ఇంటి ఆవరణలోని పల్సర్ మోటారు సైకిల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం ఆస్తినష్టం సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇన్చార్జి ఫైరాఫీసర్ వి.భాస్కర్రాజు ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు. -
చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థి మృతి
ముద్దనూరు: స్థానిక పాత సినిమా థియేటర్ వెనుకభాగంలో నివసిస్తున్న లక్షుమయ్య(19) అనే వ్యక్తి కిరోసిన్ స్టవ్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఏఎస్ఐ జయరాముడు సమాచారం మేరకు.. ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం పూర్తయిన లక్షుమయ్య ఈనెల 8వతేదీన రాత్రి నీళ్లు కాచుకోవడానికి కిరోసిన్ స్టవ్ అంటించాడు. స్టవ్ పంపు కొడుతుండగా ప్రమాదవశాత్తు కిరోసిన్ ఒంటిపై పడడంతో మంటలు చెలరేగి లక్షుమయ్య శరీరం తీవ్రంగా కాలింది. చికిత్స నిమిత్తం అదేరోజు లక్షుమయ్యను కడప రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతికి అనంతరం తమిళనాడులోని వేలూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. -
క్రికెట్ బెట్టింగ్లపై కఠినంగా వ్యవహరిస్తాం
ఏలూరు అర్బన్ : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించినా బుకీలుగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ భాస్కర్భూషణ్ ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. వాడపల్లి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి వాడపల్లి ఇసుక ర్యాంపులో లోడింగ్ చార్జీలు విపరీతంగా వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భీమవరం నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో ఆటో వాలాలు ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్నారని, వారిని నిరోధించాలని ఫిర్యాదు చేశారు. పెదపాడు నుంచి ఫోన్ చేసిన ఓ మహిళ గ్రామంలో కొందరు అక్రమంగా చీటీ పాటలు నిర్వహిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం నుంచి ఫోన్చేసిన వ్యక్తి పట్టణంలో ప్రార్థ్ధనాలయాల వద్ద పెద్ద శబ్దాలతో మైకులు ఉపయోగిస్తున్నారని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా 37 మంది పలు సమస్యలకు సంబంధించి చేసిన ఫిర్యాదులపై ఎస్పీ స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
డీటీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ధర్నా
ఏలూరు సిటీ : ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ విడుదల చేసి ఫ్రీజింగ్ నిబంధనలు తొలగించకపోవటంతో రాష్ట్రంలోని ఎయిడెడ్ ఉపాధ్యాయులు జీతాల, డీఏ బకాయిలు అందక తీవ్రఇబ్బందులు పడుతున్నారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీవీ నరసింహారావు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఆర్థికశాఖకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, ఎస్టీవో కార్యాలయాల వద్ద మెరుపు ధర్నాకు పిలుపునిచి్చంది. ఇందులో భాగంగా శుక్రవారం ఏలూరు డీటీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్రీజింగ్ను ఎత్తివేసి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు, డీఏ బకాయిలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్.రవికుమార్, ఏలూరు రూరల్ ప్రధాన కార్యదర్శి ఎన్ .రాంబాబు, ఎయిడెడ్ ఉపాధ్యాయ నాయకులు జీఎస్ఆర్సీ మూర్తి, సీఆర్ఆర్ కళాశాల ఆప్టా నాయకులు పీఎన్వీ ప్రసాదరావు, కె.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
వైఫై జోన్గా కలెక్టరేట్
ఏలూరు (మెట్రో) : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని వైఫై జోన్గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ కనెక్షన్, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. జిల్లాలో 12,361 ప్రభుత్వ కార్యాలయాలకు తొలిదశగా ఫైబర్ గ్రిడ్ అనుసంధాన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. రూ.149కే ఫైబర్ నెట్ కనెక్షన్ను జిల్లాలో 6,274 ఆఫీసులకు, రూ.299 ఫ్యాకేజీ కింద 5,628 కార్యాలయాలకు, రూ.1,499 ప్యాకేజీ కింద 206, రూ.2499లకు ప్యాకేజీ కింద 253 ప్రభుత్వ ఆఫీసులకు అందించనున్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం వేగవంతంగా కలుగుతుందన్నారు. సమావేశంలో ఫైబర్ గ్రిడ్ ప్రతినిధి సతీష్, డీఎంహెచ్వో డాక్టర్ కె.కోటేశ్వరి, ఐసీడీఎస్ ఆర్జేడీ విద్యావతి, డీఈవో ఆర్ఎస్.గంగాభవాని, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు, డీపీవో కె.సుధాకర్ పాల్గొన్నారు. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పల్లెల్లో శనివారం నుంచి నెలరోజులు పాటు పర్యటించనున్నట్టు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో పంచాయతీ పన్నుల వసూలు, బయోమెట్రిక్ హాజరు, శానిటేషన్, డంపింగ్ యార్డుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఏడాదిన్నరగా పల్లెల ప్రగతికి నిరంతరం వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించానని క్షేత్రస్థాయిలో ఏం ప్రగతి జరిగిందో, చేపట్టిన సంస్కరణల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయా? లేదా? అని స్వయంగా పరిశీలన చేస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో కచ్చితంగా పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం వేళ టెలికాన్ఫరె న్స్ నిర్వహిస్తానని ఏప్రిల్ మాసమంతా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాలు ఉండబోవని చెప్పారు. గ్రామాల్లో నివాసం ఉండని పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డీల ఉద్యోగం ఆ రోజులో సమాప్తమవుతుందన్నారు. ఏలూరు డివిజన్ పంచాయతీ అధికారి సీహెచ్ రాజ్యలక్ష్మి పనితీరు పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో డీపీవో కె.సుధాకర్, డివిజనల్ పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, అమ్మాజీ, సూర్యనారాయణ, శ్రీరాములు పాల్గొన్నారు. -
భూ సేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాలు మానుకోవాలి
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): భూ సేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అపరాల మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం గొర్ల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2103లో భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజల ఆస్తులకు గ్యారంటీ లేని పరిస్థితిని సృష్టించిందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ అవసరాలకు భూమిని సేకరించాలంటే కచ్చితంగా 4 రెట్లు పరిహారం అందించాలన్నారు. ఏప్రిల్ 7,8 తేదీలలో ఉపాధి హామీపై ఆందోళన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
3 వేల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యం
జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్) : జిల్లాలో రబీ పూర్తయ్యాక మూడు వేల ఎకరాల్లో అపరాల సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. జగన్నాథపురం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వేసవిలో అపరాలు సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ ఈ వేసవిలో మినుము, పిల్లిపెసర, జీలుగు, పెసలు సాగు చేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. తద్వారా రైతుకు కొంత ఆదాయం సమకూరుతుందన్నారు. ఆయా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జగన్నాథపురం బాడవాకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదన్నారు. అనంతరం పలువురు రైతులు రుణమాఫీ విషయాన్ని జేడీ దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్ ముత్యాల వీవీ సత్యనారాయణ, నవాబ్పాలెం సొసైటీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు, తాడేపల్లిగూడెం ఏడీఏ ఎన్.శ్రీనివాస్, మండల వ్యవసాయా«ధికారి కె.వేణుగోపాల్ పాల్గొన్నారు. -
బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం
భీమవరం: వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధ రేటు సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ఆరోపించారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం కౌలు రైతుల సంఘం జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులున్నారని తెలిపారు. 80 శాతం భూములను వీరే సాగు చేస్తున్నా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. కౌలు రైతులు, రైతుమిత్ర, జేఎల్ గ్రూపుల రుణమాఫీకి నిధులు కేటాయించక పోవడం వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి ఉన్నచిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని చెప్పారు. రుణమాఫీ కోసం రూ.3600 కోట్లు కేటాయించినా అవి వ్యవసాయం చేయని భూస్వాములకే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 ఆఖరునాటికి కౌలు రైతులు, రైతు మిత్ర, జేఎల్ గ్రూపులకు ఇచ్చిన రూ.594 కోట్ల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వడ్డీలేని పంట రుణాలకు కేవలం రూ.177 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కేటాయింపులకు ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందని, కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేటపట్టడం లేదని విమర్శించారు. కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వంతులవారీ విధానంలో పూర్తి స్థాయిలో నీరందిస్తామని అధికారులు చేసిన ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నర్సింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు ధనికొండ శ్రీనివాస్, జొజ్జవరపు శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు మామిడిశెట్టి రామాంజనేయులు, పెచ్చెట్టి నర్సింహమూర్తి, కవల వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉగాది కానుకగా ఫైబర్నెట్ కనెక్షన్లు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా ప్రజలకు ఉగాది కానుకగా రూ.149కే కేబుల్ కనెక్షన్ తో పాటు ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కోరారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటా కేబుల్ కనెక్షన్ అమలు తీరును ఆయన శుక్రవారం అధికారులు, కేబుల్ నెట్వర్క్ ప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం రూ.160 నుంచి రూ.275 వరకూ కేబుల్ కనెక్షన్ కు వసూలు చేస్తున్నారని, ఇకపై ఫైబర్ గ్రిడ్ ద్వారా నాణ్యమైన అన్ని ఛానల్స్నూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని, ఉచితంగా టెలిఫోన్ సౌకర్యం కూడా దీని ద్వారా కలుగుతుందన్నారు. ఏలూరు కార్పొరేషన్ తో పాటు 8 మున్సిపల్ పట్టణాల్లో స్టాకును అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఫైబర్నెట్ ప్రతినిధి హరికృష్ణ, ఎంఎస్వోలు, ఏసీటీ ప్రతినిధి రామకృష్ణ, భీమవరం ఎంఎస్వో పైడిరాజు, జిల్లా అధికారులు డీపీవో కె.సుధాకర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు, డీఎంహెచ్వో డాక్టర్ కె.కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
‘విజిట్’లో టెక్నో ఫెస్టివల్ ఉత్సవ్–2కె17
తెలికిచెర్ల (నల్లజర్ల) : కళాశాలలో ఎంతమంది చేరారన్నది ముఖ్యం కాదు వారిలో దేశానికి ఉపయోగపడేవారిని ఎంతమందిని తయారు చేయగలిగామన్నదే తమ ధ్యేయమని విజిట్ కళాశాల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. కళాశాలలో శుక్రవారం టెక్నో ఫెస్టివల్ ఉత్సవ్–2కె 17ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానం అందించకుండా కేవలం సర్టిఫికెట్లకే పరిమితం చేయడం దేశద్రోహంగా భావిస్తానని చెప్పారు. అలా విద్యాభ్యాసం చేసిన వారు దేశ ప్రగతికి అవరోధంగా, భారంగా మారుతున్నారన్నారు. అలా చేయడం తన విధానానికి విరుద్ధమని చెప్పారు. తొలుత జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్య కమిటీ సభ్యులు గ్రంధి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు దేశభక్తి, సేవానిరతి, గౌరవభావం పెంపొందించుకోవాలని వారు ఉద్భోదించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గ్రంధి సాయిబాబా వరప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఆనంద్కుమార్, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ రాంబాబు, ఎంబీఏ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ సత్యప్రకాష్, సివిల్ విభాగాధిపతి ప్రొఫెసర్ సోమశేఖర్రాజు, ఈఈఈ విభాగాధిపతి కె.రాజేంద్ర, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ హసన్ పాల్గొన్నారు. -
కనులపండువగారథోత్సవం
నత్తా రామేశ్వరం (పెనుమంట్ర) : నత్తా రామేశ్వరంలో గోస్తనీ తీరాన కొలువైన రామేశ్వరస్వామి ఆలయం నిర్మిం చిన నాటి నుంచి ఆచారంగా వస్తున్న స్వామివారి కల్యాణ ర«థోత్సవం శుక్రవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. రామేశ్వరస్వామి పార్వతీ సమేతుడై ప్రత్యేక అలంకరణలో రథంలో కొలువుదీరారు. రథాన్ని అరటిగెలలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. హరహరమహాదేవ శంభోశంకర అంటూ భక్తులు స్వామివారి రథాన్ని లాగారు. కాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ రథోత్సవానికి హాజరయ్యారు. వేలాది మంది భక్తుల సందడి నడుమ మేళతాళాలతో రథోత్సవం వైభవంగా సాగింది. వైభవంగా ఆచంటేశ్వరుని రథోత్సవం ఆచంట : మహాశివరాత్రి పర్వదినం సం దర్భంగా ప్రసిద్ధిగాంచిన ఆచంటేశ్వరాలయం భక్తులతో పోటెత్తింది. ఆచంట పరిసర గ్రామాలకు చెందిన భక్తులు కోడేరులోని వశిష్ట గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మధ్నాహ్నం మూడు గంటలకు పురవీధులగుండా స్వామివారి రథోత్సవం కనుల పండువగా సాగింది. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మ న్ గొడవర్తి కృష్ణ భగవాన్, ఈవో దండు వెంకట కృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ముగిసిన టెన్నిస్ టోర్నీ
భీమవరం : క్రీడల నిర్వహణపై వివిధ సంస్థలు చూపిస్తున్న ఆసక్తి ప్రశంసనీయమని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేష న్ సీఈవో, గౌరవ ప్రధాన కార్యదర్శి హెచ్.చటర్జీ పేర్కొన్నారు. భీమవరం కాస్మోపాలిట న్ క్లబ్, స్పోర్ట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్స్లో క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. సభలో ముఖ్యఅతిథిగా చటర్జీ మాట్లాడారు. దాతల సహకారంతో మరిన్ని క్రీడలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పోటీలకు అల్లూరి పద్మరాజు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రామరాజు, తట వర్తి కృష్ణబాబు, గౌరవాధ్యక్షుడు రుద్రరాజు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చటర్జీని క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు. విజేతలు వీరే : పురుషుల సింగిల్స్ ఫైనల్స్ : కునాల్ విజ్రాని (మహారాష్ట్ర)పై దక్షిణేశ్వర్ సురేష్ (తమిళనాడు) 6–1, 7–5 తేడాతో గెలుపొందారు. డబుల్స్ : కునాల్ విజ్రాని (మహరాష్ట్ర), యాష్ యాదవ్ (మధ్యప్రదేశ్) జోడిపై అనురాగ్ నెన్వాని (ఢిల్లీ), రోహ న్ భాటియా (మహారాష్ట్ర) జోడి 6–2, 6–3 స్కోరుతో గెలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్ : నిత్యరాజ్బాబు (తమిళనాడు)పై ఈటె మెహతా (గుజరాత్) 6–1, 6–1 తేడాతో గెలిచింది. డబుల్స్ : సాయిదీప్య (తెలంగాణ), యమలపల్లి సహజ (ఏపీ) జోడిపై ఈటె మెహతా (గుజరా త్), వి.సౌమ్య (గుజరాత్) జోడి 6–0, 6–2 తేడాతో గెలిచింది. -
వైఎస్సార్ సీపీలో 150 మంది చేరిక
లింగపాలెం : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్బాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకూ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో గుర్రాల వెంకటేశ్వరరావు(గడ్డియ్య), కత్తి వెంకటేశ్వరరావు, కె.సోమయ్య, కె.సత్యనారాయణ, గుర్రాల ఏసోబు, జి. వీరబాబు, కె.శ్రీను, కె.మారేశ్వరరావు, కత్తి నాగేశ్వరరావు, కె.కాశియ్య, నక్కా సత్యనారాయణ, కత్తి దుర్గారావు, కాసగాని శ్రీనివాసరావు, ఎన్కృష్ణారావు, వీరి అనుచరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముసునూరి వెంకటేశ్వరావు, సీనియర్ నాయకులు ఏపూరి సూరిబాబు, మందలపు సాయిబాబు, కోటగిరి పాపారావు, కాసగాని ఆంజనేయులు, వడ్లాని లలిత, పొనగంటి సత్యనారాయణ, కొల్లి వీరభద్రరావు, వడ్లాని హరినాథరాజు, వడ్లాని యేసోబు, తోకల సత్యనారాయణ పాల్గొన్నారు. -
గోకార్టింగ్ చాంపియ న్ షిప్ పోటీలు ప్రారంభం
భీమవరం : భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి గోకార్టింగ్ చాంపియ న్ షిప్ పోటీలు శుక్రవారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు కేవలం తరగతి గదుల్లో విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా వివిధ నూతన ఆవిష్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి ఈ పోటీలు వేదిగా నిలుస్తాయననారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో ఆరు రాష్ట్రాల నుంచి 31 జట్లు పాల్గొంటున్నాయన్నారు. అనంతరం ఎస్పీని దుశ్శాలువాతో సత్కరించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆరిఫ్, విష్ణు విద్యా సంస్థల డైరెక్టర్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చాగల్లులో షుగర్ ఫ్యాక్టరీ సీజ్
చాగల్లు (కొవ్వూరు) : చాగల్లులో జైపూర్ షుగర్ ఫ్యాక్టరీని శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రెండేళ్లగా ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. కొంతకాలంగా రైతులు తమకు రావలసిన బకాయిల కోసం పోరాటం చేస్తున్నారు. యాజమాన్యం బకాయిలు కొంతమేర చెల్లించినా ఇంకా రూ.19.04 కోట్లు రైతులకు బకాయి పడింది. దీంతో రైతులు రెవిన్యూ అధికారులను ఆశ్రయించడంతో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఫ్యాక్టరీ అస్తులు వేలం వేయటానికి పలు దఫాలు నోటీసులు జారీ చేశారు. ఐదుసార్లు వేలం నిర్వహించినా పాటదారులు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఫ్యాక్టరీని సీజ్ చేశారు. తిరిగి ఈ నెల 23వ తేదీన ఫ్యాక్టరీ అస్తులకు వేలం నిర్వహించనున్నారు. ఈ ఘటనతో ఫ్యాక్టరీలో పని చేసే 600 మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. -
బీ–న్యూ లో సంక్రాంతి ఆఫర్లు
భీమవరం : నవ్యాంధ్రలోని అన్ని వర్గాల ప్రజలకు సెల్ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు బీ–న్యూ సంస్థ ..సంక్రాంతి సందర్భంగా వినూత్న ఆçఫర్లను అందిస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ ఆర్థికæ లావాదేవీలు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే బీ–న్యూ సంస్థ వినియోగదారులకు అందుబాటులోకి ఉంచిందన్నారు. సంక్రాంతి సందర్భంగా విభిన్న మోడళ్ల సెల ఫోన్లపై ఆఫర్లు అందిస్తున్నామన్నారు. రూ.699 డ్యూయల్ సిమ్ ఫోన్ కొనుగోలుపై లంచ్ బాక్స్, రూ.999 ఫోన్పై ట్రావెల్æ బ్యాగ్, రూ.1,399 ఫోన్తో పాటు టేబుల్ఫ్యాన్, రూ.4,499 4జీ స్మార్ట్ఫోన్కు జియో సిమ్, రూ. 9,999 స్మార్ట్ఫోన్తో పాటు ఎల్æఈడీ టీవీ, రూ.16,999 జియోనీ ఫో¯న్పై ల్యాప్టాప్, రూ.19,999కే యాపిల్ 5 ఎస్, రూ.15,499కే లెనోవో కే-6 నోట్బుక్తో పాటు బ్లూటూత్ హెడ్ సెట్æ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై బ్లూ టూ™త్, పవర్ బ్యాంక్, హెడ్ సెట్æ, మెమరీ కార్డులను ఉచితంగా పొందవచ్చన్నారు. వివిధ మోడళ్ల ఫోన్లకు బజాజ్ ఫైనాన్స్ ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించే సదుపాయం ఉందన్నారు. అన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసే సదుపాయం ఉందన్నారు. -
ఘనంగా మావుళ్లమ్మ ఉత్సవాలు ప్రారంభం
భీమవరం(ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవ ఉత్సవాలు శుక్రవారం కలశస్థాపన పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి గ్రామోత్సవంను ప్రారంభించారు. పురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం, కొడమంచిలి కొప్పేశ్వరరావు, మద్దిరాల మల్లికార్జునరావు అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రవీంద్రనా«థ్రెడ్డి మావుళ్లమ్మ అమ్మవారిని శుక్రవారం కమలాపురం ఎమెల్యే ఎల్ రవీంద్రనాథ్రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో నేడు మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు బల్లిపాడుకు చెందిన ఆధ్మాత్మిక వేత్త ఆకుల ఆప్పారావు ఉపన్యాసం, 5 గంటలకు తాడేపల్లి గూడెంకు చెందిన యడమిల్లి బ్రదర్స్ బుర్రకథ, రాత్రి 8 గంటలకు తణుకుకు చెందిన గీతామందిరి వారి దేవీ కటాక్షం నాటకం ప్రదర్శితం కానున్నాయి. -
ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్–17 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నాకౌట్ దశకు చేరుకున్నాయి. బాలికల విభాగంలో లీగ్దశలో విజయం సాధించి కేరళ, పంజాజ్, తమిళనాడు, బీహర్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, హర్యానా జట్లు నాకౌట్కు చేరుకున్నాయి. బాలుర విభాగంలో కేరళ, ఉత్తరాఖండ్, ధిల్లీ, కర్నాటక, గుజరాత్, యూపీ, బీహర్, హర్యానా జట్లు నాకౌట్కు దశకు చేరుకున్నాయని నిర్వాహకులు ఆదిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. -
వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా ప్రవీణ్
రామాపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ కువైట్ కమిటీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా జి.ప్రవీణ్కుమార్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కువైట్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి తనకు నియామకపు పత్రం అందజేశారన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మేడపాటి వెంకట్, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ల సహకారంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. అంతేకాక కువైట్ కమిటీ కోకన్వీనర్లు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులకు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు. -
ఫ్లోఫుట్బాల్ మ్యాచ్ విజేత నరసాపురం
తణుకు టౌన్ : కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్లోఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా శుక్రవారం స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో తణుకు–నరసాపురం జట్ల మధ్య పోటీ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 2–1 గోల్ తేడాతో నరసాపురం విజయం సాధించినట్లు ఫ్లో సీఈవో రాజేష్ రావూరి తెలిపారు. తొలుత ఈ మ్యాచ్ను మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు కడియాల సూర్యనారాయణ ప్రారంభించారు. శ్యామ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. ఈ సందర్భంగా లావా మొబైల్ సంస్థ నిర్వహించిన లక్కీడిప్లో జి. ఏసురాజు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు. మ్యాచ్ కో-ఆర్డినేటర్ డి. రంగారావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్యాంబాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకులు వెంకటేశ్వరరావు, వైఎస్ సేవాదళ్ నాయకుడు అంబటి రాఘవ, లావా మొబైల్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు మ్యాచ్ను తిలకించారు. ఫొటోరైటప్: 06టీఎన్కెసియూఎల్ 06– హోరాహోరీగా తలపడుతున్న నరసాపురం, తణుకు జట్లు -
గోదావరివాసుల అప్యాయత ఎంతో ఇష్టం
కొవ్వూరు : గోదావరివాసులు అప్యాయత ఎంతో ఇష్టమని సినీనటి, టీవీ యాంకర్ ఝాన్సీ తెలిపారు. కొవ్వూరులో విక్టర్ సూపర్ బజార్ ప్రారంభోత్సవానికి శుక్రవారం వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు సుమారు 50 సినిమాలు, ఐదు వేలకు పైగా సీరియల్స్, టీవీ ప్రోగ్రాంలలో పాల్గొన్నట్టు చెప్పారు. మూడు వందల సినిమాల్లో నటించానని గౌతంరాజు తెలిపారు. తన కుమారుడు కృష్ణంరాజు హీరోగా 'లక్ష్మీదేవి సమర్పించే నేడే చూడండి' అనే సినిమా ఈ నెల 30న విడుదల కానున్నట్టు చెప్పారు. తనను ఆధారించినట్టే తన కొడుకు కృష్ణంరాజును ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. -
ఆర్టీసీ బస్సుల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు
పులివెందుల రూరల్ : బస్సుల్లో నగదు రహిత చెల్లింపులు చేసుకొనేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చెంగల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జిల్లాకు కొత్త బస్సులు రానున్నాయని తెలిపారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్నారు. పెద్ద నోట్లరద్దు కారణంగా ఆర్టీసీకి మరింత నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం అజ్మతుల్లా, ట్రాఫిక్ సూపరింటెండెంట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
షిర్డీకి పర్యాటక రైలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : మధురై నుంచి కాట్పాడి, చెన్నై, సెంట్రల్, రేణిగుంట, గుంతకల్ మీదుగా షిర్డీకి పర్యాటక రైలు నడుపుతున్నట్లు రేణిగుంట ఐఆర్సీటీసీ మేనేజర్ మధుసూధన్రావు, కడప స్టేషన్ మేనేజర్ నాజరుద్దీన్ తెలిపారు. శుక్రవారం వారు సాక్షితో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ రాత్రి మధురైలో ఈ రైలు బయలుదేరుతుందన్నారు. చెన్నై సెంట్రల్, రేణిగుంట, గుంతకల్ మీదుగా 30వ తేదీన షిర్డీ చేరుతుందన్నారు. 31 రాత్రి బాబాను దర్శనం చేసుకోవచ్చన్నారు. అనంతరం పండరీపురం, మంత్రాలయంలో దైవ దర్శనం చేసుకోవచ్చన్నారు. .ఈ రైలులో మొత్తం 15 బోగీలు ఉంటాయన్నారు. స్లీపర్ క్లాస్కు రూ 5855 చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9701374932, 9701360620 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతి ప్రదానం
ఏలూరు సిటీ : ఏపీ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(అపుస్మా) ఆధ్వర్యంలో ఏలూరు జోన్ స్పోర్ట్స్ మీట్–16కు సంబందించి బహుమతి ప్రదానోత్సవ వేడుక స్థానిక వైఎంహెచ్ఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ–2 ఎంహెచ్ షరీఫ్, జిల్లా విద్యాశాఖాధికారి డి.మదుసూధనరావు, డీఎస్డీవో ఎండీ సిరాజ్, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ హాజరయ్యారు. స్పోర్ట్స్మీట్లో ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. 25 పాఠశాలల నుంచి 2,305 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్లలో పోటీపడ్డారు. అలాగే అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అపుస్మా 15 మంది రైతులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరుకాగా అపుస్మా జోన్ అధ్యక్షుడు ఎంఎన్.శ్రీకాంత్, సెక్రటరీ కె.విజయలక్ష్మి, కోశాధికారి ఎస్.రాజ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ఆర్కేఎ ప్రసాద్, జోనల్ కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ ఇన్చార్జి జి.రవిశంకర్ పాల్గొన్నారు. -
డోలారే.. డోలారే..
ఏలూరు సిటీ : సీఆర్ఆర్ మహిళా కళాశాలలో సాంస్కృతిక వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు విద్యార్థినులకు డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జి.రాజేష్, జి.లీలావతి, టి.భవాని వ్యవహరించారు. విద్యార్థినులు డ్యాన్స్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. థిమ్ డ్యాన్స్లో డీవీఎస్ఎస్ లక్ష్మి ప్రథమ, సీహెచ్ రూపారాణి ద్వితీయ, సుప్రియ గ్రూప్ తృతీయ స్థానాల్లో నిలిచారు. క్లాసికల్ డ్యాన్స్లో మేఘన ప్రథమ, బి.కీర్తిక ద్వితీయ, సీహెచ్ మహేశ్వరి గ్రూప్ తృతీయస్థానాలు, ఫోక్ డ్యాన్స్లో పి.మీనాక్షి గ్రూప్ ప్రథమ, ఎన్.కనకరత్నం గ్రూప్ ద్వితీయ, జాతీయ సమైక్యత నృత్యంలో ప్రేమ కుమారి గ్రూప్ విజేతలుగా నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ శైలజ పర్యవేక్షించారు. -
ఐదుగురు విద్యార్థినులకు గాయాలు
వల్లూరు: కడప తాడిపత్రి ప్రధాన రహదారిపై మండలంలోని తప్పెట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మోడల్ స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. స్థానికులందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగాయపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులు రోజూ లాగే సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా టైర్ పంక్చర్ అయింది. దీంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుని వెళ్లి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న లేబాకకు చెందిన భవాని, చందన, బుజ్జి, సౌజన్య, శ్రీవిద్య గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భాస్కర్రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనం ద్వారా వారిని కడప రిమ్స్కు తరలించారు. బాధితులను ప్రిన్సిపాల్తోపాటు పలువురు ఉపాధ్యాయులు పరామర్శించారు. కాగా ఆటో బ్రిడ్జి దిగిన తరువాత పంక్చర్ కావడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. కేవలం 40 మీటర్ల ముందు వున్న బ్రిడ్జిపై ప్రమాదం జరిగి వుంటే ఎక్కువ నష్టం జరిగేది. -
హౌస్బిల్డింగ్ సొసైటీలో సీఐడీ విచారణ
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక వైఎంఆర్ కాలనీలోని సహకార గృహ నిర్మాణ సంఘ కార్యాలయంలో శుక్రవారం సీఐడీ అధికారులు విచారణ చేశారు. తిరుపతి సీఐడీ సీఐ కళావతితోపాటు సిబ్బంది విచారణ నిర్వహించారు. టూటౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో ఉన్న కందుల బాలనారాయణరెడ్డి కాలనీ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెళ్లాయి. 479 ప్లాట్లలో సుమారు 200కు పైగా థర్డ్ పార్టీకి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రేటు ప్రకారం ప్లాట్లకు డబ్బు చెల్లించి, వచ్చిన ఆదాయాన్ని పక్కదారి పట్టించారనేది ప్రధాన అభియోగం. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల డీఎల్సీఓ రమేష్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఎంత మంది బినామీలు ఉన్నారు, ఆదాయం ఎంత వచ్చిందనే విషయమై సీఐడీ సీఐ విచారణ చేయడానికి వచ్చారు. విచారణ వివరాలను ఆయన వెల్లడించలేదు. -
గణితశాస్త్రం, కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉన్నతస్థితి
ఏలూరు సిటీ : గణితశాస్త్రం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉంటే మెరుగైన జీతాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చని వరంగల్ నిట్ ప్రొఫెసర్ డీవీఎల్ఎల్ సోమయాజులు అన్నారు. స్థానిక సీఆర్ఆర్ అటానమస్ కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గణితశాస్త్రంలో అధునాతన పద్ధతులు అనే అంశంపై ప్రారంభమైన జాతీయ సెమినార్ రెండోరోజు శుక్రవారం ఆసక్తికంగా సాగింది. ముఖ్యవక్తగా హాజరైన సోమయాజులు మాట్లాడుతూ గణితశాస్త్రంతో సామాజిక వ్యవస్థ ముడిపడి ఉందన్నారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఫ్రొఫెసర్ బి.మిశ్రా మాట్లాడుతూ కాస్మలాజికల్ మోడల్ అనే అంశంపై వివరణ ఇస్తూ గణితంతో విశ్వంలో దాగి ఉన్న డార్క్ ఎనర్జీని లెక్కించి, కనుమరుగవుతున్న శక్తి వనరులకు బదులుగా ఈ శక్తిని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ మ్యాథ్స్ స్టాటస్టిక్స్ డీన్ ప్రొఫెసర్ బి.పద్మావతి మాట్లాడుతూ గణితం అభ్యసించే విద్యార్థులకు కంప్యూటర్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. దేశవిదేశాల్లో ఉన్నత సంస్థల్లో అత్యున్నత స్కాలర్షిప్లు, మిలియన్ డాలర్ ప్రైజ్లున్నాయని తెలిపారు. నోబుల్ బహుమతితో సమానమైన అవార్డులు గణిత విద్యార్థులకు అందుతున్నాయని ఆమె తెలిపారు. మ్యాథ మెటికల్ మోడలింగ్–ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే అంశంపై తిరుపతి వేంకటేశ్వర యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎన్.భాస్కరరెడ్డి అవగాహన కల్పించారు. ముగింపు సభకు సీఆర్ఆర్ విద్యాసంస్థల పాలకమండలి అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు, కార్యదర్శి ఎన్వీకే దుర్గారావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వీర్రాజు చౌదరి, పీజీ కరస్పాండెంట్ వి.రఘుకుమార్, డైరెక్టర్ సి.అరుణకుమారి, అధ్యాపకులు పీసీ స్వరూప్, వి.రామబ్రహ్మం, కె.చలపతిరావు, బి.శ్రీనివాసరావు, కె.హేమలత, ఎన్.అను, కె.శైలజ, వి.లక్ష్మీకుమారి, ఆయా కళాశాలల అధ్యాపకులు, ఇతియోపియా దేశం నుంచి, ఏయూ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకులు హాజరయ్యారు. -
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.260 కోట్లు
చింతలపూడి : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం రూ.260 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానంలో శుక్రవారం ఖేలో ఇండియా నియోజకవర్గస్థాయి పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులతో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, మొగల్తూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రెండోదశలో జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ ఏడాది ఉత్తమ పీఈటీగా ఎంపికైన కలరాయనగూడెం జెడ్పీ హైస్కూల్ పీఈటీ ఎండీ యూసుఫ్ను మంత్రి సభలో సత్కరించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఏ అజీజ్, సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, వైస్ ఎంపీపీ గుత్తా వెంకులు, తహసీల్దార్ టి.మైఖేల్రాజ్ పాల్గొన్నారు. -
వైభవంగా సామూహిక వ్రతాలు
కాళ్ల : గ్రామంలోని స్వయంభూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సుమారు 450 మంది పాల్గొని స్వామివారి వ్రతాలు ఆచరించారు. తాడినాడ గ్రామానికి చెందిన వేగేశ్న వెంకట సూర్య సత్యనారాయణ రాజు– సూర్య లక్ష్మి దంపతులు వ్రతాల్లో పాల్గొన్న వారికి అన్నవరం స్వామివారి ప్రసాదం, ప్రతిమ అందజేశారు. గూట్లపాడుకు చెందిన ఆరేటి సత్యనారాయణ, నాగ పుష్పావతి ప్రసాద వినియోగం ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ అడ్డాల వెంకట గణపతిరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏలూరు (మెట్రో) : జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ను తూర్పు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎన్జీవో నాయకులు, జిల్లా ఎన్జీవో ఎన్నికల అధికారి ఉల్లి కృష్ణ శుక్రవారం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఇలా 15 పోస్టులతో కూడిన జిల్లా కమిటీకి సంబంధించి 25వ తేదీ మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేస్తారు. అనంతరం జాబితాను విడుదల చేస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే 26వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చి 26న తుదిజాబితా ప్రకటిస్తారు. ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేష¯ŒS వస్తే 25నే నూతన జిల్లా ఎన్జీవో కమిటీని ప్రకటిస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే డిసెంబర్ 4న మధ్యాహ్నం వరకూ ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలోని 15 తాలూకాలకు చెందిన 277 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేసులో రెవెన్యూశాఖ : జిల్లా ఎన్జీవో అధ్యక్ష పదవి కోసం జిల్లా రెవెన్యూ శాఖ తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ శాఖ తమ నుంచి ఏలూరు ఎన్జీవో తాలూకా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్కుమార్ను అభ్యర్థిగా ప్రకటించింది. అదే విధంగా పే అండ్ అకౌంట్స్, ఇరిగేష¯ŒS శాఖల నుంచి హరనాథ్, చోడగిరి శ్రీనివాసరావు కూడా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. -
బ్యాంకులో వృద్ధుడి నుంచి రూ.49వేలు చోరీ
కొయ్యలగూడెం : పాతనోట్లు మార్చుకునేందుకు కన్నాపురం ఆంధ్రాబ్యాంకుకు వచ్చిన ఒక వృద్ధుడి నుంచి ఇద్దరు యువకులు రూ.49వేలు దొంగిలించి పరారైన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బుట్టాయగూడెం మండలం కోట రామచంద్రపురానికి చెందిన బర్రె విజయరాజు కొద్దినెలల కిందట పొలం అమ్మగా సుమారు రూ.3.50 లక్షలు వచ్చాయి. ఇందులో అప్పులు తీర్చగా పోను రూ.49వేలను దాచుకున్నాడు. ప్రస్తుతం పెద్దనోట్లను రద్దు చేయడంతో వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి భార్య భద్రమ్మతోపాటు వచ్చాడు. క్యూలో నిలుచుని ఉన్న విజయరాజును మంచినీరు పోయాల్సిందిగా ఇద్దరు యువకులు కోరారు. దీంతో ఆయన పక్కనే ఉన్న వాటర్టిన్ను గ్లాసులోకి వంచుతుండగా, ఇద్దరూ విజయరాజు పైజేబులో ఉన్న సొమ్మును లాక్కుని పరారయ్యారు. విజయరాజు వృద్ధుడు కావడంతో వారిని వెంబడించలేకపోయాడు. బ్రాంచి మేనేజర్ సూచన మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పాలకొల్లు అర్బన్/యలమంచిలి : చించినాడ బైపాస్ రోడ్డులోని కాజ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పాలకొల్లు రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. పూలపల్లికి చెందిన కోలా అజయ్ (14), యలమంచిలి మండలం ఊటాడ గ్రామానికి చెందిన భారతి సుబ్బారావు ఇద్దరూ స్కూటర్పై చించినాడ వైపు వెళ్తుండగా అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎల్వీఆర్ ట్రావెల్ బస్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదస్థలంలో పడిఉన్న అజయ్, సుబ్బారావును సీఐ చంద్రశేఖర్ తన జీపులో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అజయ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుబ్బారావు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అజయ్ కాలు బస్సు బాయ్నెట్లో విరిగిపోయి ఉండడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. అజయ్ లజపతిరాయపేట మాంటిస్సోరీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. సుబ్బారావు తన తండ్రి కృష్ణతో కలిసి రొయ్యల చెరువులపై పనిచేస్తున్నాడు. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జనావేధన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు.. చిల్లర నోట్లు, కొత్త నోట్లు తీసుకునేందుకు బ్యాంకుల ఎదుట జనం పెద్దఎత్తున క్యూ కడుతూనే ఉన్నారు. అడుగడుగునా అవస్థలతో వేదనకు గురవుతుంటే.. మరోవైపు వారిని మోసం చేసే ముఠాలు చెలరేగిపోతున్నాయి. కొయ్యలగూడెం మండలం కె.కన్నాపురంలో ఆంధ్రాబ్యాంక్ వద్ద ఓ వృద్ధుణ్ణి మోసం చేసి రూ.49 వేల పాత నోట్లను దొంగలు అపహరించుకుపోయారు. ఆ గ్రామానికి చెందిన విజయరాజు అనే వృద్ధుడు తన వద్ద ఉన్న నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చాడు. బల్లమీద కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు మీ వస్తువులు పడిపోయాయని చెప్పి అతని వద్ద ఉన్న నోట్లను దొంగిలించి పారిపోయారు. మరోవైపు ఒకరి ఆధార్ కార్డు నంబర్ను ఉపయోగించి వేరేవారు డబ్బులు మార్చుకుపోయిన ఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి. ఆధార్కార్డు జిరాక్స్ తీసుకుని బ్యాంకుకు వెళ్లి రూ.4వేల పాత నోట్లను మార్చుకునేం దుకు ప్రయత్నించగా ఇప్పటికే మీ ఆధార్ నంబర్తో సొమ్ములు మార్చుకున్నారన్న సమాధానం రావడంతో విస్తుపోయిన ఘటనలు ఏలూరులో చోటుచేసుకున్నాయి. జిరాక్స్ తీయిస్తున్న సమయంలో మరో కాపీ తీసుకున్నారా, లేకపోతే సిమ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన జిరాక్స్ కాపీలను దుర్వినియోగం చేస్తున్నారో తెలియని పరిస్థితి పలుచోట్ల ఉంది. తెరుచుకోని ఏటీఎంలు మరోవైపు శుక్రవారం కూడా ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ప్రాంగణాల్లో ఉన్న ఏటీఎంలు మాత్రం కొద్దిసేపు పనిచేయగా, బహిరంగ ప్రాంతాల్లోని ఏటీఎంలు పూర్తిగా మూసి ఉంచారు. అక్కడక్కడా కొన్ని ఏటీఎంలు తెరుచుకున్నా తక్కువ మొత్తంలో రూ.100 నోట్లు మాత్రమే పెట్టారు. రూ.2 వేల నోట్లు ఏటీఎంలలో పెట్టడానికి సాంకేతిక సమస్య ఉందని, దానిని సరిచేస్తేగాని వాటిని ఏటీఎం సెంటర్లలో అందుబాటులో ఉంచలేమని అధికారులు ప్రకటించారు. రూ.2000 నోట్లు, రూ.50 నోట్లు పెట్టాలంటే సాఫ్ట్వేర్ మార్చాల్సి ఉంటుందని, అందువల్ల జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. మరోవైపు ఏలూరు పెద్ద పోస్టాఫీసు వద్ద రూ.500, రూ.1000 నోట్లు చిల్లర ఉన్నా మార్చుకోవడం లేదంటూ ప్రజలు ధర్నాకు దిగారు. చిల్లర సమస్యతో పెట్రోల్ బంక్లు శనివారం నుంచి మూసివేయనున్నట్టు ప్రచారం జరగడంతో వాటివద్ద రద్దీ పెరిగింది. రూ.లక్ష విసిరేసి వెళ్లిన వ్యక్తి ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్ష విలువైన పాత వెయ్యి నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. అవి నిజమైన నోట్లా.. కాదా.. అన్న సందేహంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. ఇదిలావుంటే మొదటి రోజు కంటే రెండో రోజున బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద జనం రద్దీ పెరిగింది. బారులు తీరి నగదు బదిలీ కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఎంతో కొంత పెద్ద నోట్లను వదిలించుకోవడమే చాలన్నట్టుగా పేద, మధ్యతరగతి వర్గాలు ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులకు పెద్ద నోట్లను చెల్లించారు. -
‘గడపగడపకూ వైఎస్సార్’తో బెదిరిన టీడీపీ
కొయ్యలగూడెం : గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ప్రజలకు చేరువకావడంలో పార్టీ శ్రేణులు విజయం సాధించాయని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా టీడీపీ జనచైతన్య యాత్రలు నిర్వహిస్తూ జనం చేత చీత్కారాలకు గురైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి యర్రంపేటలో మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలు లేని ప్రాంతాల్లో టీడీపీ జన చైతన్యయాత్రలు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు రక్షణ కవచంలా నిలబడుతుందని, వారిపై దాడులు సహిస్తే ముందుగా నేనే టీడీపీ శ్రేణులను ఎదుర్కోవడానికి సైనికుడిని అవుతానని ఆళ్ల నాని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసే కాలం దగ్గరల్లోనే ఉందని చెప్పారు. ముందుగా పొంగుటూరులో సర్పంచ్ల ఛాంబర్ మండల అధ్యక్షురాలు కాసగాని వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాశం రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, సీనియర్ నాయకులు తాడికొండ మురళీకృష్ణ, సర్పంచ్ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవీగంజిమాల, స్థానిక నాయకులు కంఠమణి సుబ్బారాయుడు, గద్దే సురేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చింతలపూడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు చినవెంకన్న తెప్పోత్సవం
ద్వారకా తిరుమల : క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చినవెంకన్న తెప్పోత్సవం నేత్రపర్వంగా జరగనుంది. ఇందుకు క్షేత్రంలోని పుష్కరణి వద్ద సరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏటా ఈ ఉత్సవాన్ని శ్రీవారి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడు కూడా వేడుకను నేత్రపర్వంగా జరిపేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీవారి పుష్కరణిని, గట్లును అలంకరించారు. పుష్కరణి పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పుష్కరణి ముందు స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ను ఏర్పాటు చేస్తున్నారు. తెప్పను హంసగా ముస్తాబు చేస్తున్నారు. ఈ తెప్పోత్సవ వేడుక శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమౌతుందని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
బస్తాకు రూ.1,500 మద్దతు ధర ఇవ్వాలి
ఏలూరు (మెట్రో) : ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,500 మద్ధతు ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. ధాన్యం మార్కెట్లోకి వచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, అయినకాడికి దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం మద్దతు ధర, స్వామినాథ¯ŒS కమిటీ సిఫార్సుల అమలు అంశంపై స్థానిక ఐఏడీపీ హాలులో శుక్రవారం రాష్ట్ర కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న రంగారావు మాట్లాడుతూ మిల్లర్లు, దళారులు కలిసి తేమశాతం, తాలు శాతం పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. ఈ సదస్సులో రిటైర్డ్ జెడిఎ జి.ప్రసాదరావు, రైతు నాయకులు నల్లిమిల్లి వీరరాఘవరెడ్డి, అట్లూరి రాధాకృష్ణ, జుజ్జవరపు శ్రీనివాస్, పిచ్చెట్టి నరశింహమూర్తి, వాడపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 95 శాతం సెటాప్ బాక్స్ల ఏర్పాటు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో 95 శాతం వరకూ సెటాప్ బాక్స్లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వినియోగదారుల అసోసియేషన్ ప్రతినిధులు, ఎంఎస్ఒలతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే ఫోర్త్ ఫేజ్లో 95శాతం సెటప్ బాక్స్లను వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నారని డిసెంబరు 31వ తేదీనాటికి నూరు శాతం మంతి పూర్తి చేసుకుంటారని చెప్పారు. -
11 నుంచి ‘మన గుడి’
ఏలూరు (ఆర్ఆర్పేట) : హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 8వ విడత మన గుడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్. దుర్గాప్రసాద్, ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు ఎంవీఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో టీఎస్.రవికుమార్, కెవీ.నరసింహాచార్యులు, ఎస్ఎస్.చక్రధర్, జీవీ.నాగేశ్వరరావు, సీహెచ్. సత్యనారాయణరాజు పాల్గొన్నారు. -
2020 నాటికి కోటిపల్లి రైల్వేలైన్కు ఓ రూపు
నరసాపురం : కోటిపల్లినరసాపురం రైల్వేలైన్కు 2020 నాటికి ప్రాథమికంగా ఓ రూపు వస్తుందని దక్షణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. శుక్రవారం నరసాపురం రైల్వేస్టేషన్ను తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటిపల్లి రైల్వేలైన్కు సంబంధించి మూడు బ్రిడ్జిల నిర్మాణం ముందుగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. గౌతమి నదిపై రైల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వైనతేయి, వశిష్ట నదులపై రైలు వంతెనల నిర్మాణాలపై ఎలాంటి కదలిక లేదన్నారు. ఈ మూడు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తవ్వడానికే 30, 40 నెలలు పడుతుందని పేర్కొన్నారు. నరసాపురం రైల్ కం బ్రిడ్జి లేదు నరసాపురంలో రైల్ కం వంతెన నిర్మాణ ప్రతిపాదనలు లేవన్నారు. కోటిపల్లి రైల్వేలైన్కు సంబంధించి నరసాపురంలో రైల్ కమ్ బ్రిడ్జి లింక్ ఉండదన్నారు. చించినాడ బ్రిడ్జి వద్దే సమాంతరంగా రైల్ బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా రైల్కమ్బ్రిడ్జిల ప్రతిపాదనలు లేవని చెప్పారు. అలాగే ఆర్వోబీల నిర్మాణాల ప్రతిపాదనలు కూడా లేవన్నారు. ఆయన వెంటన రైల్వే డీజీఎం (విజయవాడ) అశోక్కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
పురుగుమందుల గిడ్డంగిపై విజిలెన్స్ దాడులు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో ఎటువంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న పురుగుమందుల గిడ్డంగిపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. విజిలెన్స్ ఏవో ఎం. శ్రీనివాసకుమార్, డీసీటీవో జి.జయకుమార్, ఎస్ఐ ఎస్.రామకృష్ణ, మండల వ్యవసాయాధికారి ఎస్.చెన్నకేశవు సంయుక్తంగా గిడ్డంగిలో తనిఖీలుచేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుమందులను గుర్తించారు. గిడ్డంగిలో ప్లాస్టిక్ కవర్లతోపాటు, కొన్ని లేబుళ్లు లభ్యం కావడం, ఆ లేబుళ్లపై ఫార్మోలేటెడ్బై ఎన్జీ గూడెం అని ఉండడంతో అధికారులు నాగులగూడెం కూడా తనిఖీకి వెళ్లారు. అక్కడ మందులు తయారు చేస్తున్నారనే అనే అంశంపై ఆరా తీశారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్రమంగా సరుకు నిల్వ ఉంచిన గిడ్డంగి లైసెన్సు కె.రాజేశ్వరి పేరుమీద ఉందని చెబుతున్నారని, ఇక్కడ పురుగుమందుల నిల్వకు, విక్రయాలకు అనుమతులు లేవని విజిలెన్స్ అధికారులు చెప్పారు. గిడ్డంగిలోని రూ.ఆరులక్షల71వేల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై 6ఏ కేసుతోపాటు, అనధికార నిల్వపై మరో కేసు నమోదుచేసినట్టు వివరించారు. -
7న గోదావరికి మహా నీరాజనం
కొవ్వూరు :తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 7న గోదావరికి మహా నీరాజనం కనుల పండువగా నిర్వహించనున్నట్టు ఆర్డీవో బి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గోష్పాదక్షేత్రం స్నానఘట్టానికి ప్రతి కార్తీక సోమవారం భక్తుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరికి మహా నీరాజనం సమర్పించేందుకు స్నానఘట్టం వద్ద నదిలో మూడు పంట్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. టీటీడీ నుంచి తెచ్చిన భూదేవి, శ్రీ దేవి సమేత కలియుగ వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గోదావరిలో పెరిగిన ఒండ్రు మట్టి, చెత్త చెదారం తొలగింపునకు కలెక్టర్ రూ.లక్ష మంజూరు చేసినట్టు చెప్పారు. పారిశుధ్యం మెరుగ్గా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్కి సూచించారు. భక్తులకు తాగునీరు, రక్షణ తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
డిజైన్ ఖరారుకాని భవనాలకు శంకుస్థాపన
-
నేడు కౌన్సిల్ సమావేశం
రాయచోటిటౌన్: రాయచోటి మున్సిపల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్రాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ రాయచోటి మున్సిపాలిటీని ప్రభుత్వం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించిందని, ఇందుకోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. పట్టణ పరిధిలోని అనేక అభివద్ధి పథకాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కౌన్సిలర్లు తప్పకుండా హాజరు కావాలని కోరారు. -
ఇంటి గోడల నుంచి వెండి నాణేల లభ్యం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో పాడుపడిన ఇంటిlగొడలను శుక్రవారం కూల్చివేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. ఇంటి యజమాని ఇంటిని పొక్లైనర్తో పడగొడుతున్న సమయంలో గోడల్లో నుంచి కుండలు బయల్పడ్డాయి. కిందపడిన ఈ కుండలు పగలడంతో వెండి నాణేలు బయటకు వచ్చాయి. ఇంటి యజమాని వెంటనే పనులు నిలుపుదల చేయించి పొక్లైనర్ను పంపించి వేశారు. ఇంటి పరిసరాల్లో తవ్వకాలు చేస్తే మరిన్ని నాణేలు బయటపడే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆశావహులు ఆ పరిసరాల్లో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని పడగొట్టిన ఇంటి ప్రాంతంలోనే జాగారం చేస్తున్నారు. ఈ వెండి నాణేలు 1907 సంవత్సరం కాలం నాటి రూపాయి నాణేలు, పులిబొమ్మ , బ్రిటిష్ రాజు, ఓంకారం ఉన్న నాణేలు లభ్యమైనట్టు స్థానికులు తెలిపారు. అయితే ఎన్ని నాణేలు ఉన్నాయో తెలియలేదు. దీనిపై అధికారులకు కూడా ఎటువంటి సమాచారం లేదు. కొందరు చిన్నారులు కొన్ని నాణేలను తీసుకెళ్లారని, కుండలో వెండి నాణేలతో పాటు బంగారు నాణేలు కూడా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. -
ముగిసిన మహా కుంభాభిషేకం
పాలకొల్లు సెంట్రల్ : స్థానిక ఉమా క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం మహా కుంభాభిషేకం వైభవోపేతంగా ముగిసింది. కలశపూజ చేసిన పవిత్ర జలాలతో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ ఆలయ శిఖరానికి అభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని అన్నారు. కుంభాభిషేకం వల్ల సమృద్ధిగా వర్షాలు పడి పాడిపంటలు తులతూగుతాయన్నారు. ఈవిధంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పూజా కార్యక్రమాలు జరి గితే రాష్ట్రం అభివృద్ధితో విరాజిల్లుతుందని అన్నారు. సుమారు పది వేల మంది భక్తులు కుంభాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, అవభృధస్నానము, శాంతి కల్యాణం, పంచ హారతులు, మహదాశీర్వచన, పండిత సత్కారం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం చండీ ఉపాసకులు మాడుగుల శివశ్రీ శర్మ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. -
జిల్లాలో 32 కరువు మండలాలు
- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో 32 మండలాలను కరువు కింద ప్రకటిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైరుతి రుతు పవనాల వల్ల జిల్లాలో ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. ఖరీఫ్లో వర్షాధారంపై సాగు చేసిన పంటలు దాదాపుగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 1.34 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 97 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వేరుశనగ, పత్తి, కంది, పెసర, మినుము తదితర పంటలు ఎండిపోయాయి.వేరుశనగ పంట ఊడలు దిగే సమయంలో వాన ముఖం చాటేసింది. ప్రభుత్వ రెయిన్గన్ల ప్రయోగం ఫలితాలివ్వలేకపోయింది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని 32 మండలాలను కరువు కింద ప్రకటించాలంటూ కలెక్టర్ కేవీ సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత బుధవారం రాష్ట్ర స్థాయి డ్రాట్ కమిటీ వివిధ జిల్లాల నుంచి ప్రతిపాదనలను పరిశీలించింది. కలెక్టర్ పంపిన ప్రతిపాదనల మేరకు అన్ని మండలాలను కరువు కింద గుర్తిస్తూ జీఓ నెం. 9 విడుదల చేసింది. జిల్లాలో కరువు సహాయక చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఇవీ.. – ఏదైనా మండలాన్ని కరువు కింద ప్రకటించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను అనుసరిస్తుంది. ఇందులో వర్షపాతలోటు ప్రధానమైంది. సంవత్సర సాధారణ వర్షపాతం 750 మిల్లీ మీటర్లు ఉన్న మండలాల్లో 15 శాతం వర్షపాత లోటు ఉండాలి. జిల్లా సాధారణ వర్షపాతం 700మిల్లీమీటర్లు కనుక ఈ నిబంధన వైఎస్సార్ జిల్లాకు వర్తిస్తుంది. ఈ ఖరీఫ్లో ఈ నిబంధన ప్రకారం పరిశీలిస్తే 32 మండలాల్లో వర్షపాత లోటు నమోదైంది. – ప్రధాన పంటల సాధారణ సాగు విస్తీర్ణం 50 శాతానికి మించి తగ్గిపోవాలి. – ఐదు సంవత్సరాల సగటు పంట దిగుబడులతో పోలిస్తే 33 శాతం దిగుబడి నష్టం ఉండాలి. – పంటలను ప్రభావితం చేసే డ్రై స్పెల్స్ నమోదు ఉండాలి. – నార్మలైజ్డ్ విజిటేటివ్ డిఫరెన్షియల్ ఇండెక్స్ – పై నిబంధనలలో వర్షపాత లోటు తప్పనిసరిగా ఉండాలి. మిగతా వాటిల్లో ఏదేని రెండు వర్తిస్తే ప్రభుత్వం వాటిని కరువు మండలాల కింద ప్రకటిస్తుంది. కరువు మండలాలు ఇవీ కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, తొండూరు, చక్రాయపేట, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బ్రహ్మంగారిమఠం, గోపవరం, బద్వేలు, అట్లూరు, కొండాపురం, మైలవరం, పెద్దముడియం, రాజుపాలెం, బి.కోడూరు, ముద్దనూరు, వేముల, వీరపునాయునిపల్లె, కమలాపురం, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వేంపల్లె, రామాపురం, వీరబల్లి. -
దొంగల ముఠా అరెస్ట్
ఏలూరు(సెంట్రల్) : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ భూషణ్ శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక వన్టౌన్లోని మోతేపల్లి వారి వీధి రామాలయం వద్ద నివాసం ఉండే గొల్లపల్లి నాగ మల్లేశ్వరరావు అలియాస్ మల్లి, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు గ్రామానికి చెందిన షేక్ అజీజ్లిద్దరూ కలిసి ఏలూరు సబ్డివిజన్ పరిధిలోని భీమడోలు, ఏలూరు రూరల్, టూటౌన్, చేబ్రోలు, దెందులూరు, ఉండ్రాజువరం పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఈ కేసుల దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం భీమడోలు, ఏలూరు రూరల్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. భీమడోలు రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న గొల్లపల్లి నాగమల్లేశ్వరరావుతోపాటు, అతని బాబాయ్లు గొల్లపల్లి నాగరాజు, దాసరి బోసురాజును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నాగమల్లేశ్వరరావు, అజీజ్లిద్దరూ కలిసి పలు దొంగతనాలకు పాల్పడినట్టు, వారికి నాగరాజు, బోసురాజు, అజీజ్ భార్య సమీరా, తల్లి అస్లాంబేగ్, తండ్రి మస్తాన్ సాహెబ్ సహకరించినట్టు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు కాజులూరు వెళ్లి అజీజ్ భార్య సమీరా, తల్లి స్లాంబేగ్ను అరెస్ట్ చేశారు. మస్తాన్ సాహెబ్ పరారాయ్యాడు. అరెస్టయిన ఐదుగురు నిందితుల వద్ద పోలీసులు రూ. 21 లక్షల 76 వేలు నగదు, 440 గ్రాముల బంగారం, కిలో వెండి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు, లారీ రికార్డులు స్వాధీనం చేసున్నారు. ఈ సొత్తు విలువ రూ.60 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. మొత్తం 17 చోరీలు గొల్లపల్లి నాగమల్లేశ్వరరావు, షేక్ అజీజ్ కలిసి ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 17 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసు విచారణలో తెలింది. ఈ చోరీల్లో సుమారు రూ.64 లక్షలు విలువైన సొత్తును దొంగిలించినట్టు తెలిసింది. వీరిద్దరూ కొన్ని చోరీల అనంతరం డబ్బు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పంచుకుంటారని, కొంతకాలం ఖాళీగా ఉండి తిరిగి దొంగతనాలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. చోరీ సొత్తుతో ఇళ్ల స్థలాలు, లారీ కొనుగోలు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. షేక్ అజీజ్ ఇళ్ల స్థలాలు, లారీ కొన్నట్టు తేలింది. అతను చోరీ సొమ్ముతో భార్య సమీరా, తండ్రి మస్తాన్ సాహేబ్ పేరిట రూ.15 లక్షలతో నర్సీపట్నంలో ఐదు సెంట్లు ఇళ్ల స్థలం కొన్నాడు. మరోచోట ఇళ్లస్థలం కొనేందుకు రూ.3 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాడు. రూ.6 లక్షలతో ఓ లారీనీ కొన్నాడు. అతని బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఉంది. దీనిని పోలీసులు సీజ్ చేశారు. చోరీ సొత్తును దాచిపెట్టడానికి అజీజ్కు తల్లి అస్లాంబేగ్, భార్య సమీరా, తండ్రి మస్తాన్ సహకరించేవారు. నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం కాజులూరు వెళ్లి అజీజ్ భార్య షేక్ సమీరా, తల్లి షేక్ అస్లీమబేగంను అరెస్ట్ చేశారు. అజీజ్ తండ్రి షేక్ మస్తాన్ సాహేబ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో అరెస్టయిన అజీజ్ నెల రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. హత్యకేసుల్లోనూ నిందితుడు అరెస్టయిన నాగమల్లేశ్వరరావు చోరీ సొత్తును అతని బాబాయ్లు ఏలూరు తూర్పువీధికి చెందిన గొల్లపల్లి నాగరాజు, జంగారెడ్డిగూడెంకు చెందిన దాసరి బోసురాజు వద్ద దాచేవాడు. నాగ మల్లేశ్వరరావుపై విశాఖపట్నం జిల్లాలో రెండు హత్య కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఫిర్యాదు సక్రమంగా ఇవ్వాలి ఎక్కడైనా చోరీ జరిగితే బాధితులు ఫిర్యాదులో పోయిన వస్తువులు, నగదు వివరాలు సక్రమంగా ఇవ్వాలని ఎస్పీ భాస్కర్భూషణ్ కోరారు. ఇటీవల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఫిర్యాదుదారు తన ఇంట్లో రూ.10వేలు చోరీకి గురైతే రూ.3లక్షలు పోయినట్టు ఫిర్యాదు ఇచ్చారని, ఇలా చేయడం వల్ల విచారణ సరిగా సాగదని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన భీమడోలు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై బి.వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్సై ఎం.వి.సుభాష్, హెడ్కానిస్టేబుళ్లు షేక్ అమీర్, బండారు నానిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ భాస్కరరావు, సీఐ చిన్ని కొండలరావు పాల్గొన్నారు. -
బాణసంచా అక్రమ తయారీపై కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : జిల్లాలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. ఆయన శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగను ప్రజలంతా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీనికోసం పోలీసుశాఖ రక్షణ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. అక్రమ బాణసంచా తయారీ కేంద్రాలపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫోన్కాల్స్ను స్వీకరించిన ఆయన ప్రజల సమస్యలను విన్నారు. బుట్టాయిగూడెం నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి గ్రామంలో పేకాట యథేచ్ఛగా సాగుతోందని, దానిని నిరోధించాలని కోరారు. ఏలూరులో ట్రాఫిక్ నియంత్రించాలని మరో వ్యక్తి విజ్ఞప్తి చేశారు. కైకరంలో ఒకవ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆ గ్రాముస్తడు ఫిర్యాదు చేశారు. దెందులూరులో ఆటోలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. -
జిల్లాలో డెంగీ మరణాలు లేవు
ఏలూరు అర్బన్ : జిల్లాలో డెంగీ మరణాలు లేవని జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్. కె.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం yీ సీహెచ్ఎస్ శంకరరావు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గడచిన పది నెలల కాలంలో 800 మంది జ్వరపీడితులకు డెంగీ పరీక్షలు నిర్వహించగా వారిలో కేవలం 13 మందికి డెంగీ ఉందని నిర్ధారణ జరిగిందన్నారు. వారు కూడా చికిత్సల అనంతరం సాధారణ స్థితికి వచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయన డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చికిత్సల అనంతరం కోలుకుంటున్న జ్వరపీడితులను పరామర్శించారు. అనంతరం తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులకు, పుట్టుకతోనే కామెర్ల బారిన పడిన చిన్నారులకు నవజాత శిశు విభాగంలో అందుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఐవో డాక్టర్ మోహనకృష్ణ తదితరులు ఉన్నారు. -
దసరా నుంచే.. తీన్మార్
కొత్త జిల్లాలు ముహూర్తం ఖరారు సిద్దిపేటలోకి మరో మండలం బెజ్జెంకిని కలపాలని ప్రతిపాదనలు తుది నోఫికేషన్కు సర్వం సిద్ధం సిద్దిపేటకు ఖరారైన కలెక్టర్ అధికారిక ఉత్తర్వులే తరువాయి మెదక్ జిల్లాలో కొత్తగా ఐదు మండలాలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:దసరా నుంచే కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొచ్చే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మెదక్ జిల్లాను మూడు జిల్లాలు చేయడంపై శుక్రవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తొలి ముసాయిదా తరువాత నిర్ణయం తీసుకున్న రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు అవసరమైన చట్ట సవరణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ను తేవాలని క్యాబినేట్ నిర్ణయించింది.‡ తాజా పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో అదనంగా మరో మండలం కలవబోతోంది. కరీంనగర్ జిల్లాలోని పాత బెజ్జంకి మండల కేంద్రంతో పాటు మరి కొన్ని గ్రామాలను కలుపుకొని బెజ్జంకి మండలం పేరుతో సిద్దిపేట జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు పంపారు. ఈ నిర్ణయంపై రెండు జిల్లాల మంత్రులతో పాటు, కలెక్టర్లు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బెజ్జెంకి మండలంలోని గ్రామాలను రెండుగా విభజన చేసి కరీంనగర్కు సమీపంగా ఉన్న గ్రామాలకు వడ్లూరు (బేగంపేట) లేదా గన్నేరువరం మండల కేంద్రం చేసి కరీంనగర్ జిల్లాలో చేరుస్తారు. ఇక మిగిలిన జెజ్జంకి, తోటపల్లి, పోతారం, గాగిల్లాపూర్, గుగ్గిల్ల, వేములపల్లి, లక్ష్మీపూర్, దేవక్కపల్లి, దాచారం, వీరాపూర్, గూడెం, కల్లెపల్లి, ముత్తన్నపేట, చిలాపూర్, రేగులపల్లి గ్రామాలు, ఇల్లంతకుంట మండలంలో గుండారం, రేపాక గ్రామాలు, కోహెడ మండలంలోని ఇంకొన్ని గ్రామలను కలిపి బెజ్జంకి మండల కేంద్రం చేసి సిద్దిపేటలో కలుపుతున్నారు. 19 జిల్లాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. తాజాగా ఈ సంఖ్య 23 మండలాలకు చేరుతుంది. నాగిరెడ్డిపేటపై వీడని సందిగ్ధత:.... తొలి నోటిఫికేషన్లో 14 మండలాలతో ఏర్పాటు చేయదలిచిన మెదక్ జిల్లాలో 20 మండలాలకు పెరిగింది. నర్సాపూర్ ప్రజల విజ్ఞప్తి మేరకు నర్సాపూర్కు రెవెన్యూ డివిజన్ హోదా కల్పిస్తూ మెదక్ జిల్లాలో చేర్చారు. నిజాంపేట, మనోహరాబాద్, నార్సింగి, హవేళిఘణపురం, పిడిచేడ్ గ్రామాలకు మండల కేంద్రం హోదా కల్పించారు. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూన్నారు. పోచారం, మాల్తుమ్మెద, వాడి, చీనూరు తదితర గ్రామాలకు చెందిన నలుగురు యువకులు మూకుమ్మడిగా పోచారం డ్యాంలో దూకి ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలు కోరుకుంటే నాగిరెడ్డిపేట మండలంలోని మెదక్ సమీప గ్రామాల ప్రజలు మెదక్ జిల్లాలో కలపవచ్చని ఇటీవల జరిగిన ప్రజాప్రతినిధలు భేటీలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో పై నాలుగు గ్రామాలు మెదక్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే పోచారం గ్రామం వస్తే ఈ గ్రామ పంచాయతీలోని జలప్రాజెక్టు (పోచారం)కూడా మెదక్ జిల్లాలోకి వస్తుంది కాబట్టి, కామారెడ్డి ప్రజా ప్రతినిధులు పోచారంను మెదక్లో కలపకుండా అడ్డం పడుతున్నట్లు సమాచారం. సిద్దిపేట కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి! సిద్దిపేట జిల్లా తొలి కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారిక ఉత్తర్వులు వెలువడటమే తరువాయి. ప్రస్తుతం మెదక్ జాయింట్ కలెక్టర్ పని చేస్తున్న ఆయనకు పూర్తిస్థాయి కలెక్టర్గా పదోన్నతి కల్పిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ర్రూం పథకం ఇళ్లకు వెంకట్రామిరెడ్డి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఇళ్ల నిర్మాణంలో వ్యయప్రయాసాలు ఉన్నప్పటికీ జేసీ పట్టుదలతో అనుకున్న సమయానికే ప్రాజెక్టు దాదాపు పూర్తి చేసి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్శించారు. -
వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఏపీ
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి.టక్కర్ తిరుచానూరు : దేశంలోనే అత్యంత వ్యాపార అనుకూలత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా శ్రమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి.టక్కర్ తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో శుక్రవారం భారతదేశ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన, పరిశ్రమల పురోగతిపై సమీక్ష జరిగింది. రాయలసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 15ఏళ్ల పాటు రెండెంకల వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించుకుందన్నారు. 25వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల మౌలిక వసతులు 30రోజుల్లోపు కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనలో జాప్యం వహించరాదని హెచ్చరించారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తుల్లో 2014లో 8.3శాతం నమోదయ్యిందని, 2015లో 10.99శాతం నమోదవ్వగా ఈ ఆర్థిక సంవత్సరంలో 15.99శాతంగా నమోదయ్యిందని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేకాధికారి కృష్ణయ్య, అమరరాజ బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, సీఐఐ చైర్మన్ శివకుమార్, సీఐఐ తిరుపతి ప్రతినిధి ఎం.విజయనాయుడు, డైరెక్టర్ జీఎస్.రతి, జాయింట్ కలెక్టర్ గిరీషా, తిరుపతి మున్సిపల్ కమిషనర్ వినయ్చంద్, సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల, పరిశ్రమల జోనల్ అధికారులు, 300మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
190 చక్రాల ట్రాలీ
జీలుగుమిల్లి : రహదారిపై 190 చక్రాల భారీ వాహనం(ట్రాలీ) నెమ్మదిగా కదులుతూ చూపరులను ఆకర్షించింది. ఇటువంటివి రెండు వాహనాలు ముంబాయి నుంచి జంగారెడ్డిగూడెంలో గల 132 కేవీ సబ్స్టేషన్కు రెండు(పీటీఆర్) పవర్ ట్రాన్స్ ఫారమ్లను తీసుకుని బయలుదేరాయి. శుక్రవారం ఇవి జంగారెడ్డిగూడెంకు 14 కిలోమీటర్ల దూరంలోని జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురానికి చేరుకున్నాయి. -
190 చక్రాల ట్రాలీ
జీలుగుమిల్లి : రహదారిపై 190 చక్రాల భారీ వాహనం(ట్రాలీ) నెమ్మదిగా కదులుతూ చూపరులను ఆకర్షించింది. ఇటువంటివి రెండు వాహనాలు ముంబాయి నుంచి జంగారెడ్డిగూడెంలో గల 132 కేవీ సబ్స్టేషన్కు రెండు(పీటీఆర్) పవర్ ట్రాన్స్ ఫారమ్లను తీసుకుని బయలుదేరాయి. శుక్రవారం ఇవి జంగారెడ్డిగూడెంకు 14 కిలోమీటర్ల దూరంలోని జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురానికి చేరుకున్నాయి. -
గోదావరి వరద తగ్గుముఖం
కొవ్వూరు : గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలో నీటి మట్టాలు క్రమేణా తగ్గుతున్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 5,46,150 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రం ఆరు గంటలకు 4,30,682 క్యూసెక్కులకు తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 5,800 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మిగిలిన 4,24,882 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువున భద్రచలంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు 35.40 అడుగులుగా ఉన్న నీటిమట్టం 30.50 అడుగులకు తగ్గింది. ఇప్పటి వరకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గేట్లు పూర్తిగా ఎత్తివేసిన అధికారులు వరద తీవ్రత తగ్గడంతో గేట్లు నియంత్రణలో పెట్టారు. ధవళేశ్వరం ఆర్మ్ వద్ద ఉన్న 70 గేట్లలలో 30 గేట్లను అరమీటరు ఎత్తు, 40 గేట్లను మీటరు ఎత్తులేపారు. ర్యాలీలో 43, మద్దూరులోని 23 గేట్లును 1.50 మీటర్లు ఎత్తు, విజ్జేశ్వరం ఆర్మ్లోని 39 గేట్లును మీటరు ఎత్తులేపి వరద నీటిని గోదావరి నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకి శుక్రవారం సాయంత్రం నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ఏలూరు కాలువకు 379, నరసాపురం కాలువకు 304,, జీఅండ్వీ కాలువకు 231, అత్తిలి కాలువకు 204 క్యూసెక్కుల చొప్పున నీటిని విడిచిపెడుతున్నారు. ఉండి కాలువకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు.