పాఠశాలల్లో దొంగల హల్చల్
Published Sun, Aug 21 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
గోపాలపురం : పాఠశాలలు, పంచాయతీరాజ్ ఏఈ కార్యాలయాల్లో శుక్రవారం తెల్లవారుజాములన దొంగలు హల్చల్చేశారు. తాళాలు పగలకొట్టి చోరీకి యత్నించారు. స్థానిక జిల్లాపరిషత్, మండలపరిషత్ కార్యాలయంలోని జెడ్పీ ఎంపీపీ పాఠశాలలు, పంచాయతీరాజ్
ఏఈ కార్యాలయంలో దొంగలు పడి తాళాలు పగలకొట్టారు. పాఠశాలల్లో బీరువాలు పగలకొట్టారు. అయితే నగదేమీ దోచుకెళ్లలేదు. శనివారం జెడ్పీ హైస్కూలు హెచ్ఎం వేసంగి సత్యనారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైటర్ జి.కృష్ణప్రసాద్ తెలిపారు.
Advertisement
Advertisement