schools
-
సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: సైనిక్ స్కూళ్ల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను కూడా దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో పోలీస్, యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నెలకొల్పాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కూల్ బ్రోచర్, వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు. స్కూల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రకటించారు. స్కూల్ యూనిఫామ్ నమూనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి శ్రీధర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర, ఐజీ రమేశ్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 31న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ స్కూల్లో 50 శాతం సీట్లు యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 50 శాతం సాధారణ పౌరుల పిల్లలకు ఇస్తారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని అధికారుల బృందం గత రెండు నెలలుగా ఈ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. అవసరమైన అనుమతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేశారు. -
Himachal: ఎడతెగని హిమపాతం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)ను హిమపాతం ఇంకా వీడటం లేదు. లాహౌల్ స్పితి జిల్లాలో ఎడతెగని రీతిలో భారీగా మంచు కురుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి అడపాదడపా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా మంచు పడుతున్న నేపధ్యంలో లాహౌల్ స్పితి జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేయాలని రాష్ట్ర విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.Manali Update: Road is blocked near Dhundhi Bridge due to an avalanche Travelers are advised to avoid the route until further notice. Stay updated and travel safely.- Lahaul-Spiti Police#manali #snowfall @HP_SDRF @PoliceKullu @himachalpolice @CMOFFICEHP #HimachalPradesh pic.twitter.com/VwILGzYK7y— Vinod Katwal (@Katwal_Vinod) February 27, 2025గడచిన మూడు రోజులుగా లాహౌల్ స్పితి(Lahaul Spiti)లో హిమపాతం కురుస్తోంది. నేడు (గురువారం) సిమ్లాలో తేలికపాటి వర్షం కుర్తుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మనాలి సమీపంలోని ధుండిలో కొండచరియలు విరిగిపడిన కారణంగా, లేహ్ మనాలి హైవేను మూసివేశారు. దీంతో మనాలిలోని సోలాంగ్ వ్యాలీని దాటి ముందుకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. అటల్ టన్నెల్ దక్షిణ, ఉత్తర పోర్టల్లలో రెండు అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. ఇటువంటి పరిస్థితిలో స్థానికులు తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు సూచించారు. ధర్మశాలలో భారీ వర్షం కారణంగా పోలీసు నియామక ప్రక్రియను మార్చి 9కి వాయిదా వేశారు. వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రోహ్తాంగ్ పాస్ వద్ద దాదాపు రెండున్నర అడుగుల మేరకు మంచు కురిసింది. ఈ కారణంగా ఫిబ్రవరి 19 నుండి లాహౌల్ స్పితికి హెచ్ఆర్టీసీ బస్సు సర్వీసులను నిరవధికంగా నిలిపివేశారు. ఫిబ్రవరి 26- 28 మధ్య భారీ వర్షాలు/హిమపాతం సంభవించే అవకాశం ఉన్నందున హిమాచల్ ప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.ఇది కూడా చదవండి: Marathi Language Day: దేశంలో ‘థర్డ్ లాంగ్వేజ్’ -
అవస్థల ‘అపార్’!
సాక్షి, హైదరాబాద్: ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ (అపార్)(APAAR)’.. ప్రతి విద్యార్థికి శాశ్వత గుర్తింపు నంబర్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విధానం. ఒకటో తరగతి మొదలు పన్నెండో తరగతి వరకు ప్రతి విద్యార్థి పూర్తి వివరాలను అపార్ వెబ్పోర్టల్లో నమోదు చేసిన తర్వాత.. వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య జనరేట్ అవుతుంది.. అదే అపార్ ఐడీ. విద్యార్థుల చదువుకు సంబంధించిన అన్నిరకాల వివరాలు, సర్టీఫికెట్లు అందులో నిక్షిప్తమవుతాయి.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతోంది. రాష్ట్రంలోని 40 వేల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల పరిధిలో సుమారు 65 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది సెపె్టంబర్లో అపార్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు 60 శాతం కూడా నమోదు పూర్తికాలేదు.మూడింటిలోనూ సరిపోలితేనే.. విద్యార్థి తొలుత పాఠశాలలో చేరినప్పుడు రాసిన అడ్మిషన్ రిజిస్టర్, అధికారులు ఆన్లైన్లో నమోదు చేసిన యూడైస్ ప్లస్ వివరాలు, ఆధార్లోని వివరాలు.. ఇలా మూడింటిలోనూ విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు సరిపోలితేనే అపార్ వెబ్పోర్టల్లో నమోదు చేసే వీలుంటుంది. ఏ ఒక్కదానిలో, ఏ వివరాల్లోనైనా తేడా ఉంటే అపార్ ప్రక్రియ పూర్తవడం లేదు. బర్త్ సర్టీఫికెట్లో పూర్తిగా వివరాలు లేకపోవడం, ఆధార్లో ఇంటిపేరుకు బదులు ఒక్క అక్షరమే ఉండటం, పుట్టినతేదీ తప్పుగా ఉండటం, పేరులో అక్షర దోషాలు వంటి సమస్యలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.వీటిని సవరించుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాలు సూచిస్తున్నాయి. వీలైనంత త్వరగా సర్టిఫికెట్లు తెస్తే అపార్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తామని ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న మధ్యవర్తులు, అధికారులతో చేతులు కలిపి.. అందినకాడికి దండుకుని సర్టీఫికెట్లు ఇప్పిస్తున్నారు.ఫిర్యాదు చేసేదెలా...? జనన ధ్రువపత్రాల జారీ, పొరపాట్ల సవరణకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అంతా మీసేవ కేంద్రాల ద్వారానే జరుగుతోంది. అయితే దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లను మాన్యువల్గా తీసుకురావాలనే సాకు చూపుతూ స్థానిక సంస్థల అధికారులు దరఖాస్తుల పరిశీలనను నిలిపివేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ఇతర దళారులు దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులతో కుమ్మక్కై వెంటనే సర్టీఫికెట్లు సిద్ధం చేసి ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ తంతు దరఖాస్తుదారులకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎలాగోలా త్వరగా పనికావాలన్న ఉద్దేశంతో దళారులను ఆశ్రయిస్తున్నారు.నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి అపార్ ఉద్దేశం మంచిదే అయినా వివరాల నమోదు ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఆధార్, యూడైస్, స్కూల్ రికార్డుల్లోని వివరాలన్నీ సరిపోలినప్పుడే పోర్టల్లో వివరాలను ఎంట్రీ చేయగలిగే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన మెజార్టీ పిల్లల స్కూల్ వివరాలు, ఆధార్ వివరాల్లో చిన్నపాటి పొరపాట్లు ఉన్నాయి.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకూ ఈ సమస్య ఉంది. సరైన వివరాలను నమోదు చేస్తే తప్ప వెబ్సైట్లో అపార్ వివరాలు జనరేట్ కావు. ప్రస్తుతం ఆధార్ తప్పనిసరి చేసినప్పటికీ.. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణతో వివరాల నమోదుకు అవకాశం కల్పించాలి. అప్పుడే అపార్ నమోదు ప్రక్రియ నూరుశాతం పూర్తవుతుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పించాం. కానీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కావడంతో మార్పులు చేసే వీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెబుతున్నారు. – సిద్దగోని గిరిధర్గౌడ్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ సంఘంబర్త్ సర్టిఫికెట్లో మార్పు కోసం రూ.5 వేలు తీసుకున్నారు మా ఇద్దరు పిల్లలకు సంబంధించి అపార్ వివరాలు నమోదుకావడం లేదని స్కూల్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. ఆధార్లో ఇంటిపేరు పూర్తిగా ఉంటే, జనన ధ్రువీకరణ పత్రంలో షార్ట్ ఫామ్లో ఉంది. దీంతో బర్త్ సర్టిఫికెట్లో వివరాలు మార్పించాలన్నారు. దీనికోసం స్థానికంగా ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లాను. గెజిటెడ్ సంతకం, అఫిడవిట్తోపాటు మున్సిపల్ కార్యాలయంలో పని పూర్తి చేయించేందుకు రూ.5 వేలు వసూలు చేశారు. వారం తర్వాత సర్టీఫికెట్ వచ్చింది. స్కూల్లో ఇచ్చి అపార్ వివరాలను నమోదు చేయించాను. – టి.యాకయ్య, జగద్గిరిగుట్ట, మేడ్చల్ జిల్లాఅన్ని ధ్రువపత్రాలు సమర్పించినా తిరస్కరించారుమా అబ్బాయి బర్త్ సర్టిఫికెట్లో తల్లిదండ్రుల పేర్లు ఇంటిపేరుతో కాకుండా ఒక్క మొదటి అక్షరంతో ఉన్నాయి. వాటిని మార్చి పూర్తి ఇంటిపేరు సరి చేయడానికి మీసేవ కేంద్రంలో దర ఖాస్తు చేశాను. ఆ పత్రాలను ప్రింట్ తీసుకుని ఎల్బీ నగర్ లోని మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాను. ఆధారాలను సమర్పించినా మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటూ మెలిక పెట్టి రెండు వారాల తర్వాత దరఖాస్తును తిరస్కరించారు. – బందె గిరిజ, ఎల్బీ నగర్, రంగారెడ్డి జిల్లా -
బడి బయటే బాల్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు గురుకులాలు, ఇతర హాస్టల్ వసతి ఉన్న స్కూళ్లు కావాల్సినన్ని ఉన్నా.. బడి మధ్యలోనే మానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాథమిక స్థాయిలో కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి చాలామంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. ప్రాథమికోన్నత స్థాయిలో 0.34 శాతం, ఉన్నత పాఠశాలల్లో 11.92 శాతం డ్రాపౌట్స్ నమోదయ్యాయి.ప్రాథమిక స్థాయిలో ఇది మైనస్ 2.23 శాతంగా ఉంది. ప్రధానంగా పల్లెల్లోనే డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం రాష్ట్ర ప్రణాళికా విభాగం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్–2024’లో ఈ వివరాలను పొందుపర్చింది. హనుమకొండ, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయి.నివేదికలోని ప్రధానాంశాలు⇒ రాష్ట్రంలో 40,975 స్కూళ్లున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 20,539, ప్రాథమికోన్నత పాఠశాలలు 7,482, ఉన్నత పాఠశాలలు 11,561, హయ్యర్ సెకండరీ 1,393 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 65,41,085 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో పాఠశాలకు సగటున 160 మంది విద్యార్థులు ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 533 స్కూళ్లు ఉండగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,907 ఉన్నాయి.⇒ హైస్కూల్ పరిధిలో 39,92,429 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 8,98,588, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 9,16,869, హయ్యర్ సెకండరీలో 7,33,199 మంది పిల్లలున్నారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 9,02,674 మంది విద్యార్థులుండగా.. అతి తక్కువగా ములుగు జిల్లాలో 41,061 మంది మాత్రమే ఉన్నారు.⇒ 6 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు రాష్ట్రంలో 26,62,200 మంది ఉండగా, పాఠ శాలల్లో నమోదైనవారు 29,28,678 ఉన్నా రు. ప్రాథమిక పాఠశాలల్లో గ్రాస్ ఎన్రో ల్మెంట్ రేషియో(స్థూల నమోదు నిష్పత్తి) 110 శాతంగా ఉంది. ఇది అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 175 శాతం ఉండగా, అతి తక్కువగా జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 70 శాతం ఉంది.⇒ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జీఈఆర్ 107 శాతం ఉంది. రాష్ట్రంలో 11 నుంచి 13 సంవత్సరాల వయసున్న పిల్లలు 16,53,800 మంది ఉండగా, ఆరోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లలో నమోదైన పిల్లలు 17,73,298 (కుటుంబాల వలస ఇతరత్రా కారణాల వల్ల) ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో 59 శాతం ఉండగా, ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో 173 శాతంగా ఉంది.⇒ ఉన్నత పాఠశాలల్లో జీఈఆర్ 95 శాతంగా ఉంది. రాష్ట్రంలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 11,44,600 మంది ఉండగా, ఉన్నత పాఠశాలల్లో నమోదైన పిల్లలు 10,82,551 మంది మాత్రమే. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 55 శాతం, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 149 శాతం నమోదైంది.⇒ రాష్ట్రంలో సగటున 19 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో 18 మందికి, ప్రాథమికోన్నత స్థాయిలో 14 మందికి, ఉన్నత పాఠశాల స్థాయిలో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. హయ్యర్ సెకండరీ స్థాయిలో 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. టీచర్–స్టూడెంట్ నిష్పత్తి 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. ప్రాథమికోన్నత స్థాయిలో 21 జిల్లాల్లో, ఉన్నత స్థాయిలో 23 జిల్లాలు, హయ్యర్ సెకండరీ స్థాయిలో 13 జిల్లాల్లో ఇది రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. మెదక్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో టీచర్–స్టూడెంట్ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది.⇒ రాష్ట్రంలో లింగనిష్పత్తి 988గా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మహిళలు ఉన్నారు. అత్యంత తక్కువ లింగనిష్పత్తి ఉన్న జిల్లా రంగారెడ్డి. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వనపర్తి జిల్లాలున్నాయి. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్న జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి. -
America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం
అమెరికాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో అప్పుడప్పుడు చోటుచేసుకునే కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తుంటాయి. గత సంవత్సరం అంటే 2024లో అమెరికాలోని పలు పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాదిలో 80కి పైగా అమెరికన్ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు నమోదుకాగా, పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమంది గాయపడ్డారు.ఇటువంటి కాల్పుల ఘటనల కారణంగానే తమ పిల్లలను అమెరికాలో చదువుకునేందుకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. 2025లో భారతదేశం నుండి వేలాది మంది విద్యార్థులు అమెరికన్ కళాశాలలు(American colleges), విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాలోని కొన్ని రాష్ట్రల్లో ప్రశాంతమైన వాతావరణం(Calm atmosphere) ఉంది. అక్కడ విద్యార్థులు చదువుకునేందుకు పలు అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలోని 10 రాష్ట్రాలివే..అమెరికాలోని 10 సురక్షితమైన రాష్ట్రాలువ్యోమింగ్నార్త్ డకోటాసౌత్ డకోటాహవాయీవెర్మోంట్మెయిన్అలాస్కావెస్ట్ వర్జీనియారోడ్ ఐలాండ్న్యూ హాంప్షైర్అమెరికాలోని అత్యంత సురక్షితమైన ఈ రాష్ట్రాల జాబితాను ఇక్కడ జరిగిన కాల్పుల సంఘటనల ఆధారంగా తయారు చేశారు. 1966 నుండి 2024 వరకు పాఠశాలల్లో కాల్పుల సంఘటనలు అతి తక్కువగా జరిగిన రాష్ట్రాలను ఈ జాబితాలో చేర్చారు. 1966- 2024 మధ్య వ్యోమింగ్లో రెండు పాఠశాలల్లో మాత్రమే కాల్పులు జరిగాయి. నార్త్ డకోటా(North Dakota), సౌత్ డకోటాలలో మూడు సంఘటనలు, హవాయిలో నాలుగు, వెర్మోంట్లో ఐదు, మెయిన్, అలాస్కాలో ఏడు, వెస్ట్ వర్జీనియాలో ఎనిమిది, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్షైర్లో ఇప్పటివరకు ఎనిమిది సంఘటనలు నమోదయ్యాయి.అమెరికాలోని ఈ రాష్ట్రాలు అత్యంత సురక్షితమైనవిగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో తక్కువ నేరాల రేట్లు, తక్కువ జనాభా, పటిష్టమైన భద్రతా విధానాలు ఉన్నాయి. వెర్మోంట్, న్యూ హాంప్షైర్ వంటి రాష్ట్రాలు కమ్యూనిటీ పోలీసింగ్తో పాటు ప్రజల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. ఇది ప్రజలకు మరింత భద్రతా భావాన్ని అందిస్తుంది. ఈ రాష్ట్రాల్లో పెద్ద నగరాలు తక్కువగా ఉండటం వల్ల నేరాల సంఖ్య కూడా తక్కువే. పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రల్లో నేరాలను అరికట్టడంతో ముందుంది.ఇది కూడా చదవండి: బోర్డింగ్ స్కూల్పై దాడి.. రష్యా- ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు -
బడికి పంపాలన్నా భయపడుతున్నారు
శాన్ఫ్రాన్సిస్కో: అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అక్రమవలసదారుల్లో భయందోళనలు ఎక్కువయ్యాయి. తమ పిల్లలను బడికి పంపడానికి కూడా అక్రమ వలసదారుల కుటుంబాలు భయపడుతున్నాయి. పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలు అని అక్కడి విద్యావేత్తలు వలస తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అయితే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ అధికారులు పాఠశాలలు, చర్చిలు, ఆసుపత్రులనూ క్షుణ్ణంగా తనిఖీచేసి అక్రమవలసదారులుంటే అక్కడే అరెస్ట్ చేసే అధికారం ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో వీరిలో ఆందోళనలు మరింత పెరిగాయి. సున్నితమైన ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టరాదన్న మార్గదర్శకాలను అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు తుడిచిపెట్టేశాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నేరగాళ్లు ఇకపై అమెరికాలోని పాఠశాలలు, చర్చిల్లో తలదాచుకోలేరని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా విధానం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు పాఠశాలల్లోకి ప్రవేశించొచ్చు. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 7,33,000 మంది పాఠశాల వయస్సు పిల్లలు అమెరికాలో అక్రమంగా ఉన్నారు. ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వం నిబంధనతో వీరిలో చాలా మందికి అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ వీళ్ల తల్లిదండ్రులకు పౌరసత్వం లేదు. తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటి లక్షలాది మందిని బహిష్కరిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనేక వలస కుటుంబాలు బహిరంగంగా తిరిగేందుకు భయపడుతున్నాయి. పిల్లల్ని స్కూళ్లకు పంపించకపోవడంతో విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపుతుందంటున్నారు విద్యావేత్తలు. తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్న పాఠశాలలు కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు అక్రమవలసదారుల పిల్లలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కాలిఫోర్నియాలో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలు చేయడంలో పాఠశాలలు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు సహాయం చేయవని చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవంబర్లో తీర్మానాన్ని ఆమోదించింది. క్రిమినల్ వారెంట్ లేకుండా అధికారులను పాఠశాలల్లోకి అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేసింది. విద్యార్థి ఇమ్మిగ్రేషన్ స్థితిపై సమాచారం సేకరించకూడదనే విధానాలను గత నెలలో న్యూయార్క్ నగర ప్రధానోపాధ్యాయులకు గుర్తు చేసింది. అయితే కొన్ని చోట్లా కుటుంబాలకు ఇలాంటి భరోసా దక్కట్లేదు. ట్రంప్ చర్యతో విద్యార్థులు, కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని జార్జియా రెఫ్యూజీస్ అకాడమీ చార్టర్ స్కూల్ అధ్యాపకులు చెప్పారు. చాలా మంది విద్యార్థులు పాఠశాలకు దూరమవుతారని భావించి, వారు ముఖ్యమైన పరీక్షలను కోల్పోకుండా ఉండటానికి పరీక్ష షెడ్యూల్ను ముందుకు జరిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి పరిమితం చేస్తున్నారని అమెరికా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ రైట్స్ అధికారి మైఖేల్ ల్యూకెన్స్ తెలిపారు. వలసదారులు తమంతట తాముగా అమెరికాను వీడేలా ప్రభుత్వం భయపెడుతోందని ఆయన ఆరోపించారు. కంటి మీద కునుకు లేదు‘‘ఇప్పుడు మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 14 ఏళ్ల క్రితం గ్వాటెమాల నుంచి వచ్చి బోస్టన్లో ఉంటున్నాం. మా పిల్లలు బోస్టన్ స్కూళ్లలో చదువుతున్నారు. అక్రమవలసదారులని ముద్రవేసి ఇప్పుడు మమ్మల్ని పనిచేసుకోనివ్వకపోతే ఏం చేయాలి. న్యాయం కోసం కోర్టుకెళ్లలేను. లైసెన్స్ ఉన్నాసరే కారులో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి. తలచుకుంటే నిద్రకూడా పట్టట్లేదు. చట్టబద్ధత రుజువు కోసం స్కూళ్లో మా పిల్లలను అధికారులను నిలదీస్తే ఏం చేయాలో పాలుపోవట్లేదు’’అని ఐరిస్ గొంజాలెజ్ అని మహిళ వాపోయారు. ఇలా చేస్తారని ఊహించలేదు : కార్మెన్ ‘‘వాళ్లు ఇలా చేస్తారని నేను ఊహించలేదు’’అని మెక్సికో నుంచి వలస వచ్చిన కార్మెన్ అనే వృద్దురాలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘శాన్ఫ్రాన్సిస్కో బే పాఠశాలకు నా ఇద్దరు మనవరాళ్లను ఇప్పుడెలా తీసుకెళ్లాలి?. అండగా ఉంటామని పాఠశాల హామీ ఇచ్చింది. అయినా భయంగానే ఉంది. తరిమేస్తే సొంతదేశం అస్సలు వెళ్లలేం. డ్రగ్స్ ముఠాలు రాజ్యమేల మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రం నుంచి వచ్చాం. రెండేళ్ల క్రితం అక్కడ మా అల్లుడిని కిడ్నాప్చేశారు. బెదిరింపులు పెరగడంతో అమెరికాకు వలసవచ్చాం. శాన్ఫ్రాన్సిస్కోలో ఉండటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండలేం. ఎక్కడికీ వెళ్లలేం. దేవుడా మా ప్రాణాలి్న, మా పిల్లల్ని కాపాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు. ఇలా పేద అక్రమవలసదారుల వ్యథలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వినపడుతున్నాయి. -
‘అన్న’లు నిర్మించిన పాఠశాల
సాక్షి, సిద్దిపేట: ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి అన్న వార్తలు విన్నప్పుడల్లా ఆ ఊరి ప్రజలు ఉలిక్కిపడతారు. 30 ఏళ్ల కిందట బాలకార్మికులుగా మగ్గిపోతున్న తమ బిడ్డల కోసం బడి కట్టించిన ఆ అన్నలను తలుచుకుని కలవరపడుతుంటారు. తెలంగాణలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో నక్సల్స్ సిద్దిపే ట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో పేద పిల్లల కోసం పాఠశాలను నిర్మించారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల అదే.గ్రామస్తుల విజ్ఞప్తితో.. 1991 వరకు ఈ గ్రామంలో పాఠశాల పూరి గుడిసెలో కొనసాగింది. ఆ సమయంలో దుంపలపల్లికి వచ్చిన పీపుల్స్వార్ నాగన్న దళానికి పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. దీంతో మూడు గదులను నిర్మించాలని నక్సల్స్ నేతలు నాగన్న, నగేష్, రామన్న, జనార్దన్లు నిర్ణయించారు. 1991లో పనులు ప్రారంభించి, 1995 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ బడి నిర్మాణానికి సుమారు రూ.5 లక్షల వరకు వెచ్చించినట్లు తెలిసింది. బడి నిర్మాణానికి గ్రామస్తులంతా శ్రమదానం చేశారు. కూల్చివేతను అడ్డుకున్న స్థానికులునక్సలైట్లు నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరటంతో వాటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మన ఊరు–మన బడి పథకంలో భాగంగా జీ ప్లస్ 1లో నాలుగు గదుల నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం రూ.51 లక్షలు మంజూరు చేశారు. దీంతో పాత గదులను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ గదులు నక్సల్స్కు గుర్తుగా ఉండాలని వాదించినట్లు తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు.. పాత బడి ఎదురుగా కొత్త పాఠశాల నిర్మాణం ఇటీవల ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ స్కూళ్లో ఇప్పటివరకు 943 మంది చదువుకున్నారు. ప్రస్తుతం 64 మంది (బాలురు 36, బాలికలు 28) విద్యార్థులు ఉన్నారు.కూల్చవద్దు అంటున్న స్థానికులుపాత భవనం కూల్చివేసి వాటి స్థానంలో నాలుగు తరగతి గదులు నిర్మించాలని మన ఊరు–మన బడి పథకంలో నిర్ణయించారు. పనులు ప్రారంభించే సమయంలో పాత గదులు కూల్చవద్దని స్థానికులు అడ్డుకున్నారు. ఎందుకని అడిగితే అప్పట్లో నక్సలైట్లు ఆ గదులను నిర్మించారని చెప్పారు. – నాగేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయుడు -
పిల్లలూ.. స్కూల్లో బాంబులు పెట్టారంట పారిపోండి
ఢిల్లీ : ముంబైలో (mumbai) బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ముంబైకి చెందిన పలు స్కూళ్లలో బాంబులు (bomb threat) పెట్టామంటూ అగంతకులు బెదిరింపులు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్వ్కాడ్స్ స్కూల్స్లో తనిఖీలు నిర్వహించాయి. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని బాంబు స్వ్కాడ్ నిర్ధారించాయి.గురువారం ముంబైలోని జోగేశ్వరి-ఓషివారా ప్రాంతానికి చెందిన ది ర్యాన్ గ్లోబల్ స్కూల్లో 2001లో భారత పార్లమెంట్పై ఉగ్రదాడికి పాల్పడ్డ అప్జల్ గురు అనుచరులు బాంబు పెట్టినట్లు అగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్లో పేర్కొన్నారు.మరోవైపు, బుధవారంతమిళనాడులో ఏరోడ్ జిల్లాలో సుమారు ఏడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న రెండు స్కూల్స్కు బాంబు బెదిరింపులొచ్చాయి. ఏరోడ్ జిల్లాకు చెందిన భారతి విద్యాభవన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్స్లో బాంబులు పెట్టామంటూ దుండగులు ఈ-మెయిల్స్ పంపారు.దీంతో అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థుల్ని అలెర్ట్ చేసింది. వెంటనే స్కూల్ వదిలి పారిపోవాలంటూ సూచించారు. అనంతరం, స్కూల్ తనిఖీలు నిర్వహించింది. పోలీసులకు సమాచారం అందించింది.యాజమాన్యం ఫిర్యాదుతో స్కూల్స్కు పోలీసులు,బాంబు స్వ్కాడ్, స్నైపర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. స్కూల్స్లో అణువణువూ తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో బాంబులు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
బట్టీ వద్దే బడి..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామ స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీ వద్ద ఒడిశా బడి ఏ ర్పాటు చేశారు. ఇక్కడి ఇటుక బట్టీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 50 కుటుంబాలు పనులు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో సు మారు 35 మంది ఏడేళ్లలోపు పిల్లలు ఉండటంతో బట్టీ యజ మాని జహంగీర్.. వారి కోసం ప్రత్యేకంగా ఒడిశా పాఠశాలను ఏర్పాటు చేశారు.35 మంది పిల్లలకు ప్రాథమికస్థాయి విద్యను బోధించేందుకు ఒడిశాకు చెందిన సునీల్ అనే యువకుడిని నియమించారు. పాఠశాల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు సునీల్ ఒడిశా భాషలో అక్షరాలతో పాటు పాఠాలు నేర్పుతు న్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, బట్టీలో పనిచేస్తున్న వారి పిల్లలకు వారి భాషలోనే విద్యను నేర్పించాలనే ఉద్దేశంతో ఈ బడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. నిందితులు ఎవరంటే?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీలోని పలు స్కూళ్లకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ చేసింది విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.సాధారణంగా స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందు కోసం విద్యార్థులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కానీ వారిలో కొంత మంది విద్యార్థులు పరీక్షల ముందు రోజు బుక్ తీసి మమ అనిపిస్తుంటారు. సరిగ్గా చదవక.. స్కూల్కో,లేదంటే కాలేజీకి వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తుందనే భయంతో ఆరోగ్యం సరిగా లేదని, ఊరెళుతున్నామని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటుంటారు.ఇదిగో ఢిల్లీలోని రోహిణి జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థులు కూడా అంతే. పరీక్ష రాయాల్సి వస్తుందని స్కూల్లో బాంబు తామే పెట్టామని బెదిరించినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు.తాజాగా రోహిణి జిల్లాలో రెండు స్కూల్స్కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు ఈ-మెయిల్స్ విచారణ చేపట్టారు. తమ విచారణలో ‘ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వేర్వేరు పాఠశాలలకు ఇ-మెయిల్స్ పంపినట్లు తేలింది’అని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులిద్దరూ స్కూల్లో పరీక్ష రాయాల్సి వస్తుందని బెయిరింపు ఇ - మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. విద్యార్థులు కావడంతో, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. #BreakingNews | #DelhiBombThreat : Major update has come in that students were behind the bomb threat that has been sent to 2 schools.@_pallavighosh | @shankar_news18 decodes#delhibombthreat #delhi #schools pic.twitter.com/FGAquLsFzV— News18 (@CNNnews18) December 22, 2024 11 రోజులుగా వందకు పైగా బాంబు బెదిరింపులుఢిల్లీ పోలీసులు గత 11 రోజులుగా 100కి పైగా పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు పంపడంపై దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగించి ఇ-మెయిల్స్ పంపడంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం మే నుండి, నగరంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాంబు బెదిరింపు ఇ-మెయిల్లు వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
బాంబు బెదిరింపుల శాఖ ఒక్కటి ఏర్పాటు చేయాలి సార్!
-
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
-
చిన్న పరిశ్రమలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే అవకాశమున్న చోట సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, నూతన ప్రణాళికలను వివరించారు.ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య కొత్తగా పది పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, అరులో ఐదింటిని ఎంఎస్ఎంఈల కోసం అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుల్లో ఒక దానిని మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించడంతోపాటు కొత్త పార్కుల్లో ఐదు శాతం ప్లాట్లు మహిళలకు కేటాయిస్తామని చెప్పారు. కొన్ని ప్లాట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని, వారికోసం ప్రత్యేక విధానం తీసుకొస్తామని వెల్లడించారు.‘మాదకద్రవ్యాలతో పొంచి ఉన్న ప్రమాదంపై విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడం కోసం రూపొందించిన ‘డ్రగ్ అబ్యూజ్ యాప్’ను వేయి గ్రామీణ స్కూళ్లలో వినియోగిస్తాం. చిన్న, సన్న కారు రైతులకు 48 గంటల్లోపు రూ.లక్ష వరకు రుణం లభించేలా రూపొందించిన యాప్ను సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 8న ప్రారంభిస్తారు’అని వెల్లడించారు. కంపెనీలకు సులభంగా అనుమతులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సత్వరం అనుమతులు లభించేలా సరళీకరణ విధానాలను అమలుచేస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ‘ఏడాది కాలంలో టీజీఐపాస్ ద్వారా రూ.6,347.59 కోట్ల విలువైన 1,539 యూనిట్లకు అనుమతులిచ్చి 35,724 మందికి ఉపాధి కలి్పంచాం. మరో రూ.9,240 కోట్లతో 37,588 ఉపాధి కల్పన కోసం 731 యూనిట్లు అనుమతులు కోరాయి. 8,894 మందికి ఉపాధి కలి్పంచేలా 14,433 కోట్లతో ఏర్పాటయ్యే 16 మెగా ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చాం. ఫార్మా రంగంలోనూ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులతో 141 ప్రాజెక్టుల ద్వారా 51 వేల మందికి ప్రత్యక్షంగా, 1.50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులు అనుమతుల దశలో ఉన్నాయి’అని శ్రీధర్బాబు వివరించారు. నిమ్జ్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. ‘9 కాలేజీలతో టీహబ్ ఒప్పందం చేసుకుంది. నిమ్జ్కు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులిస్తుంది. అక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 2 లక్షల మందికి ఉపాధి కోసం కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. ఏఐ రంగంలో హైదరాబాద్ను అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేందుకు 200 ఎకరాల్లో ఎక్సలెన్సీ సెంటర్కు వచ్చే ఏడాది ఆరంభంలో శంకుస్థాపన చేస్తాం. వీహబ్ ద్వారా కొత్తగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతాం. 33 జిల్లా కేంద్రాల్లో మినీ ప్రొటో టైపింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మరో 11 స్కూళ్లు ఏర్పాటు చేస్తాం’అని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. -
కాలానికి అనుగుణంగా విద్యాబోధన ఉండాలి: సరితా జాదవ్
బంజారాహిల్స్: మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక విద్యావిధానాలతో పాఠశాలలను ఎలా సిద్దం చేయాలనే అంశంపై నిర్వాహకులు దృష్టి సారించాలని యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ సూచించారు. ’హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో ’సమన్వయ 2024’ పేరుతో జాతీయ సదస్సును బంజారాహిల్స్లో నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలోని 281 సీబీఎస్ఈ స్కూళ్లకు చెందిన ప్రిన్స్పల్స్. అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సరికొత్త విద్యావిధానాలు, మారుతున్న పరిస్థితులు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ మాట్లాడుతూ..గ్లోబల్ ఎడ్యుకేషన్ విధానానికి అనుగుణంగా విద్యాబోధనను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం స్కూళ్లలో ఏర్పాటు చేసుకోవాల్సిన మౌళిక సదుపాయాలు, పరిశోధనలపై దృష్టి పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో విద్యావ్యవస్థలో రానున్న మార్పులకు సన్నద్ధం చేయడంలో ఇలాంటి సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ అజంతా సేన్, ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ కాథన్ దుష్యంత్ శుక్లా, హెచ్ఎస్ఎస్ సీ చైర్మన్ అమీర్ ఖాన్, వైస్ చైర్పర్సన్ డా. ఎబెనీజర్, సెక్రెటరీ రోజా పాల్,డా. సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంతటి దుర్భర పరిస్థితి.. 118 మంది ఒకటే బాత్రూం
మహబూబాబాద్ అర్బన్: ఈ పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులు.. అందులో 132 మంది బాలురు.. బాలికలు 118 మంది.. కానీ ఉన్నది ఒక్కటే మూత్రశాల. బాలురకు చెరువు కట్టే దిక్కు కాగా, బాలికలు ఒకరి తరువాత ఒకరు క్యూలైన్ కట్టాల్సిందే. ఇదేదో మారుమూల గ్రామంలో కాదు.. జిల్లా కేంద్రం పరిధిలోని ఓ ఉన్నత పాఠశాలలో దుస్థితి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి పరిధి ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలు, బాలురకు కలిపి ఒకే మూత్రశాల ఉంది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నిరుపయోగంలో ఉన్నాయి.బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే. మగపిల్లలు సమీపంలోని చెరువుకట్టకు వెళ్తుండగా, బాలికలు క్యూలైన్లో నిలబడి మూత్రశాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో నూతన మరుగుదొడ్లు నిర్మించాలని, లేకపోతే తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు విద్యాశాఖ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. -
ఢిల్లీలో హైబ్రీడ్ మోడ్లో పాఠశాల తరగతులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ మునిసిపల్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ‘హైబ్రిడ్ మోడ్’లో అంటే ఆన్లైన్, ఆఫ్లైన్లలో నడపాలని ఆదేశించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలి నాణ్యతలో కాస్త మెరుగుదల ఏర్పడిన దరిమిలా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సడలింపులను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పాఠశాలల నిర్వహణలో ఈ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలను అక్టోబర్ 18 నుండి ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా గాలి నాణ్యత చాలా తక్కువ వర్గానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తరగతులను పునఃప్రారంభించాలని సీఏక్యూఎం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో హైబ్రిడ్ మోడ్లో విద్యాబోధన కొసాగనుంది. దీని ప్రకారం పాఠశాల తరగతులను అటు ఆన్లైన్లో, ఇటు అఫ్లైన్లోనూ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో తరగతులు నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం ని ర్ణయం తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్ధులు ఇంట్లో ఉండటం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది. ‘పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు లేవు, అందువల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు. అంతేగాక ఆన్లైన్ క్లాస్లలో పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఇలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగితే వారు వెనకబడిపోతారు. పాఠశాలలు, అంగన్వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారు. ’ అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చదవండి: షిండేనే మహారాష్ట్ర సీఎం!ఈ మేరకు ఢిల్లీలో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు సూచించింది. అదే విధంగా 1 నుంచి 10,11, 12 తరగతులకు శారీరక తరగతులపై నిషేధం కొనసాగించడంతోపాటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై రేపటిలోగా (మంగళవార) నిర్ణయం చెప్పాలని సీఏక్యూఎమ్ను(CAQM) ఆదేశించింది.ఇక ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షలను సరిగా అమలు చేయకపోవడంపై సిటీ పోలీస్ కమిషనర్పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయ్యింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.యాక్షన్ ప్లాన్-4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణరంగంలో కార్మికులు, దినసరి కూలీలు పనులు కోల్పోయారని తెలిపింది. 12 సెక్షన్ ప్రకారం శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సీఏక్యూఎమ్కు అన్ని అధికారాలు ఉన్నాయి. కావున వారిందరికీ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి సూచించింది. -
Uttar Pradesh: విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు పొడిగింపు
నోయిడా: ఉత్తరప్రదేశ్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో ఆఫ్లైన్ తరగతుల నిర్వహణను పొడిగించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలనా అధికారులు నవంబర్ 25 వరకు అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆఫ్లైన్ తరగతులపై నిషేధాన్ని నవంబర్ 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం ఇటీవల ఆఫ్లైన్ తరగతులను నిలిపివేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 'చాలా తీవ్రమైన' కేటగిరీకి చేరుకోవడంతో ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు ఆఫ్లైన్ తరగతులను నిలిపివేశారు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డియోస్) ధరమ్వీర్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్లో శనివారం గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్, అశోక్ విహార్, ఆనంద్ విహార్, బవానా, డీటీయూ, ద్వారక, చాందినీ చౌక్, జహంగీర్పురి, నరేలా, నెహ్రూ నగర్, మందిర్ మార్గ్, పట్పర్గంజ్, రోహిణి, వజీర్పూర్, పంజాబీ బాగ్ తదితర ప్రాంతాల్లో వాయునాణ్యత 400 కంటే ఎక్కువ నమోదైంది. ఇది కూడా చదవండి: 8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ -
ఆశ్చర్యానికి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
అనుకున్నదే జరిగింది పేద పిల్లలపై కక్ష తీర్చుకున్న బాబు
-
సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా వచ్చినట్లు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడపై పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత.. ఒకేసారి దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోమవారం రాత్రి పాఠశాల అడ్మినిస్ట్రేషన్కు ఈ-మెయిల్స్ను దుండగులు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నారు. ఢిల్లీ తోపాటు హైదరాబాద్లోని అన్ని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపుల సందేశాలు రావటంతో అన్ని స్కూళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్స్గా భద్రత అధికారులు భావిస్తున్నారు.ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో నడిచే 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్లైన్ ధృవీకరించింది. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది. గత వారం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్న పలు భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. టార్గెట్ చేసిన ఎయిర్లైన్స్లో ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా మరియు అకాసా ఎయిర్ ఉన్నాయి.చదవండి: ‘లారెన్స్ బిష్ణోయ్ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’ -
‘పోలీసు స్కూల్’కు శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మంత్రి శ్రీధర్బాబుతో కలసి ఈ ‘పోలీస్ స్కూల్’కు శంకుస్థాపన చేశారు. పోలీసు వ్యవస్థలో కొత్త అధ్యాయానికి దీనితో తెరతీసినట్టు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ‘‘యూనిఫాం సర్వీసులవారి కుటుంబ సభ్యుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు శంకుస్థాపన చేశాం.ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలీసులను వారి పార్టీ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే.. మా ప్రభుత్వం మాత్రం పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తోంది..’’ అని ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని.. కులమతాలకు అతీతంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో పోలీసులకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాగా.. పోలీసు కుటుంబ సభ్యులకు స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని.. ఇవి కేంద్రీయ విద్యాలయాలకు దీటుగా విద్యను అందిస్తాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. కేంద్రీయ విద్యాలయాల్లో మాదిరిగా.. పోలీస్ స్కూళ్లలోనూ ఇతర విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.యూనిఫాం సర్వీసుల సిబ్బంది అందరికీ..పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితోపాటు ఇతర యూనిఫాం సర్వీసులైన అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖ సిబ్బంది పిల్లలకు విద్య అందించేందుకు ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేస్తూ.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!
అరబ్ దేశాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలిసిందే. అక్కడ స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. ఆఖరికి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అలాంటి సౌదీలో ఇటీల కొంతకొంత మార్పులు సంతరించుకుంటున్నాయి. మొన్నటకీ మొన్నఅందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడమే గాక అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడూ ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాద్యాయులందరికి సంగీత విద్యలో శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సౌదీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్ నూర్ అల్-దబాగ్ రియాద్లో జరిగిన లెర్న్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. ఎందుకంటే..ప్రాథమిక తరగతుల నుంచి పాఠ్యాంశాల్లో సంగీత విద్యను చేర్చాలనే యోచనలో ఉండటంతో ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాధ్యాయులందరికీ సంగీతంలో శిక్షణ ఇస్తున్నట్లు నూర్ పేర్కొంది. దాదాపు 9 వేల మంది మహిళా ఉపాధ్యాయులకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు సదరు శాఖ ప్లానింగ్ డైరెక్టర్ నూర్ తెలిపారు. అలాగే కళలు, సంస్కృతిని కూడా విద్యా పాఠ్యాంశాల్లో విలీనం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేగాదు విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించి తద్వారా సౌదీని సుసంపన్న దేశంగా మలచాలన్న దిశవైపుకు అడుగులు వేస్తోంది. ఇది నిజంగా సౌదీ ప్రగతి శిలకు సూచనగా చెప్పొచ్చు. కాగా, 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా డ్రైవర్లపై నిషేధం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం వరకు పలు మార్పులు తీసుకురావడం విశేషం.(చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు) -
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
రేపటి నుంచి దసరా సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి పాఠశాలలు ఈ నెల 14న పునఃప్రాంరంభమవుతాయని పేర్కొన్నారు.వాస్తవానికి ఈ నెల 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు మార్పులు చేశారు. అయితే, బుధవారం గాంధీ జయంతి కావడంతో మరో రోజు సెలవు కలిసి వచ్చింది. అన్ని జూనియర్ కాలేజీలకు సైతం ఈ నెల 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
AP: 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: అక్టోబర్ 3వ తేదీ నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యామంత్రి లోకేశ్ చెప్పారు. ఆయన శుక్రవారం పాఠశాల విద్యపై సమీక్షించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందు నుంచే సెలవులు ఇస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 13 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.ఇదీ చదవండి: నిరుద్యోగులకు సర్కార్ షాక్ -
రాజ రాజ చోర
అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్స్ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్ ఖేడి, హుల్ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.ఇలా బయటపడింది.. ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో ఘనంగా జరిగింది. ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు. పోలీసులు ఏం చేయలేరా? నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. పైగా దొంగల స్కూల్ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
స్కూళ్ల మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయాల్సిందే
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, వార్డు ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రతి వారం వారి పరిధిలోని స్కూళ్లలో మరుగుదొడ్లను పరిశీలించి, ఆ ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ప్రతి సోమవారం, గురువారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను సందర్శించి అక్కడి మరుగుదొడ్లు, యూరినల్స్ గదుల్లో శుభ్రతకు సంబంధించిన ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతను సచివాలయాల ఉద్యోగులకు అప్పగిస్తూ ప్రభుత్వం గత 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధులకు చాలాచోట్ల ఆ ఉద్యోగులు హాజరు కావడం లేదన్న సమాచారంతో గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం కూడా ఈ మేరకు అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోని సెక్రటరీలకు వ్యక్తిగతంగా మెసేజ్ రూపంలో ఈ సమాచారం మరోసారి పంపారు. -
గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య
కన్నాయిగూడెం: దట్టమైన అడవుల్లో జీవిస్తూ విద్య కు దూరంగా ఉంటున్న గిరిజన పిల్లలకు నాణ్య మైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధి బంగారుపల్లి గ్రామంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు.అనంతరం సీతక్క మాట్లాడుతూ, అటవీ గ్రామాల్లో పాఠశాలలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ అభ్యంతరాలతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కన్నాయిగూడెం మండలంలో కంటైనర్ భవనం నిర్మించినట్లు తెలిపారు. గత పదేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నాశనం చేసిందని ఆమె ఆరోపించారు. -
పేద పిల్లలకు ఆ అర్హత లేదా ? CBSE రద్దుపై వైఎస్ జగన్ ఆవేదన
-
చదువులూ వరద పాలు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలు మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థుల చదువునూ వరదపాలు చేశాయి. మానుకోటలో 188 పాఠశాలలు, ఖమ్మం జిల్లాలో 72 పాఠశాలలు దెబ్బతిన్నాయి. శ్లాబ్లు కూలిపోవడం, పగుళ్లు రావడం, లీకేజీలు, కాంపౌండ్ వాల్ దెబ్బతినడం, కిచెన్ షెడ్ కూలిపోవడం, ఫర్నిచర్ దెబ్బతినడం, పుస్తకాలు, కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు తడిసిపాడైపోవడం వంటివి సమస్యగా మారాయి. అటు ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోనూ విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు తడిసి పాడైపోయాయి. దీనితో వేలాది మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో చదువులు ఎలా సాగుతాయి, మళ్లీ పుస్తకాలు కొనడం ఎలాగని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. రెండు అంతస్తుల ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ తరగతి గదుల్లో బురద మేటలు వేశాయి. తొమ్మిదో, పదో తరగతి పుస్తకాలు తడిసి పాడైపోయాయి. పాఠశాలను చూసేందుకు వచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, వరుణ్తేజ్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఇక్కడి పరిస్థితి చూసి ఆవేదన చెందారు.బడికి వెళ్లాలంటే.. సర్కస్ ఫీట్లే..మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు– ఉగ్గంపల్లి మార్గంలో బ్రిడ్జి పక్కన రోడ్డు తెగిపోయింది. దీంతో విద్యార్థులు బడికి వెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు బ్రిడ్జి పైనుంచి నిచ్చెన సాయంతో పిల్లలను కిందికి దింపి, రోడ్డుపైకి తీసుకెళ్లి పంపిస్తున్నారు. సాయంత్రం మళ్లీ అదే తరహాలో తిరిగి తీసుకెళుతున్నారు.భయం భయంగా వెళ్లాల్సి వస్తోందిమంగళవారం నుంచి రెండు రోజులు బడికి వెళ్లలేదు. మూడోరోజు మా నాన్న బ్రిడ్జి వద్దకు వచ్చి నిచ్చెన మీది నుంచి కిందికి దింపి రోడ్డు వరకు తీసుకొచ్చి బడికి పంపించాడు. సాయంత్రం మళ్లీ వచ్చి తీసుకెళ్లాడు. బ్రిడ్జి పైనుంచి నిచ్చెనతో దిగాలన్నా.. ఎక్కాలన్నా భయం వేస్తోంది. – ఏనుగంటి శ్రీజ, ఏడో తరగతి, ఉగ్గంపల్లి -
ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్
పారిస్: సెల్ఫోన్.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్ఫోన్ మారిన సెల్ఫోన్ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్ మిడిల్ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ‘డిజిటల్ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెబుతున్నారు. ఫ్రాన్స్లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేయాలన్న నిబంధన లేదు. -
1864 స్కూళ్లను మూసేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకు దూరం చేస్తోందని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరనే సాకుతో ఈ ఏడాది 1,864 పాఠశాలలను మూసివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా మూసివేయాలని చూడటం సిగ్గుచేటు అని విమర్శించారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2024– 25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 2.4 లక్షలు తగ్గడం ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని, విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సమీక్ష చేయకుండా ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని నిందించారు. సీఎం రేవంత్రెడ్డికి విద్యా వ్యవస్థపై ఏమాత్రం పట్టింపు లేకపోవడం దారుణమని కేటీఆర్ విమర్శించారు . 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలిరాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం, స్కూళ్లల్లో మౌలిక వసతుల లేమి, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం, పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో అపరిశుభ్రత, భద్రత లేకపోవడం.. వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై సూచనల కోసం విద్యావేత్తలు, మంత్రులతో కమిటీ వేయాలని సూచించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టకపోతే బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
TG: స్కూళ్లకు సెలవులు..! సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31) సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. జిల్లాల్లో వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు సచివాలయానికి అప్డేట్ చేయాలని ఆదేశించారు. -
జగన్ చేసింది నిజం – లోకేశ్ చూసిందే సాక్ష్యం
-
లోకేష్ వస్తే పిల్లలు టైంకు తినొద్దా!
-
కోల్కతా ఉదంతం: ప్రభుత్వ అనుబంధ స్కూల్స్కు నోటీసులు
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను దేశం నలుమూలల నుంచి ప్రజలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండించి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఘటన జరిగిన పశ్చిమ బెంగాల్లో మరింత అధికంగా చిన్నాపెద్ద తేడా లేకుండా నిరసనల్లో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా బెంగాల్ ప్రభుత్వం పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పలు స్కూల్స్ టీచర్లు, విద్యార్థులతో నిరసనలు చేపట్టాయని పేర్కొంది. పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు జరగాల్సిన సమయంలో ఇలా నిరసనల్లో వారిని పాల్గొనేలా చేయటంపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.హౌరా, బంకురా, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్లోని పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్కు నోటీసులు ఇచ్చింది. అందులో హౌరాలోని బలుహతి ఉన్నత పాఠశాల, బలుహతి బాలికల ఉన్నత పాఠశాల, బంట్ర రాజలక్ష్మి బాలికల పాఠశాలు ఉన్నాయి. ‘‘ 23.08.2024న స్కూల్స్లో క్లాసులు జరగాల్సిన సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో.. నిరసన ర్యాలీ నిర్వహించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలా చేయటం సరికాదు.. బాలల హక్కుల ఉల్లంఘన’’ అని నోటీసుల్లో తెలిపింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన సీబీఐ.. ఇవాళ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. -
Rajasthan: బంద్తో విద్యాసంస్థల మూసివేత.. ఇంటర్నెట్ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్లోని విద్యాసంస్థలపై కనిపించింది.బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్పూర్లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్గఢ్లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. -
బద్లాపూర్ భగభగ!
థానె/ముంబై: మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. స్థానిక కిండర్గార్టెన్ స్కూల్లో రెండేళ్లు, నాలుగేళ్ల చిన్నారులపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించలేదంటూ మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు వందలాదిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, ఆ మార్గంలో 8 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.బద్లాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలపాటు జాప్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేధింపుల ఘటన చోటుచేసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్తోపాటు ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ నెల 17న అటెండర్ను అరెస్ట్ చేశారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ సోమవారం రాత్రి పాఠశాల యాజమాన్యం çస్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్ను సస్పెండ్ చేసింది.వేధింపుల ఘటనపై పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించలేదంటూ స్థానిక పోలీస్స్టేషన్ ఇన్చార్జిని ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఇన్స్పెక్టర్తోపాటు అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. దర్యాప్తునకు ఐజీ స్థాయి అధికారి సారథ్యంలో సిట్ను ఏర్పాటు చేశామన్నారు. కేసుపై సత్వర విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ ఆరోపణలు అవాస్తవం కేసు నమోదు చేసేందుకు పోలీసులు 12 గంటలపాటు ఆలస్యం చేశారంటూ వచి్చన ఆరోపణలను డీసీపీ సుధాకర్ పఠారే చెప్పారు. కేసు నమోదు ప్రక్రియ రాత్రి 11.30 గంటలకు మొదలుకాగా, నిందితుడిని మూడున్నర గంటల్లోపే 3.30 గంటలకు అరెస్ట్ చేశామన్నారు. అభంశుభం తెలియని బాధిత చిన్నారుల నుంచి సమాచారం రాబట్టడం క్లిష్టమైన, సున్నితమైన వ్యవహారమని, ఈ ప్రక్రియ వల్లే కేసు నమోదు ఆలస్యమైందని వివరించారు. ఒక మహిళా అధికారి సహా మొత్తం ముగ్గురు అధికారులు దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారన్నారు. మంత్రి చెప్పినా ససేమిరా.. వేధింపుల ఘటనకు నిరసనగా కొన్ని సంస్థలు మంగళవారం బద్లాపూర్ బంద్నకు పిలుపునిచ్చాయి. ఉదయం భారీ సంఖ్యలో కిండర్గార్టెన్ విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చి పాఠశాల గేట్లు విరగ్గొట్టారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్పైకి రాళ్లు రువ్వారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని పట్టాలపై బైఠాయించారు. రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, దోషులకు ఉరివేయాలని పట్టుబట్టారు.చివరికి సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టారు. రాత్రి 6 గంటల సమయానికి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పట్టాలపైనే తిష్ట వేయడంతో సబర్బన్ సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బద్లాపూర్లో రైల్ రోకో కారణంగా అంబర్నాథ్–కజ్రట్ మార్గంలో 30 వరకు సబర్బన్ రైళ్లను రైల్వే శాఖ పాక్షికంగా రద్దు చేసింది. మరో 12దూరప్రాంత రైళ్లను దారి మళ్లించింది. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 55 బస్సులను ఏర్పాటు చేసింది. -
పథకాలకు డబ్బులు లేవు సరే... మరి అన్న క్యాంటీన్లకు ఎక్కడివి..?
-
‘జన్మభూమి 2’లో స్కూళ్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: త్వరలో ప్రారంభించే ‘జన్మభూమి 2’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు చెప్పారు. విద్యా రంగ నిపుణులు, మేధావులతో చర్చించి విద్యా శాఖలో, సిలబస్లో మార్పులు చేయాలని ఆదేశించారు. విద్యా శాఖపై మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లలో తెలుగుకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థికీ కేంద్ర ప్రభుత్వ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ ఇవ్వాలన్నారు.పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్లు నిర్వహించాలని, వీటిలో తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరవుతారని అన్నారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేయాలని చెప్పారు. జీవో నం.117పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూళ్లలో ఆయాల పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. డైట్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా శాఖలో నూతన విధానాలు, సంస్కరణలను వివరించారు. నైపుణ్య గణనపై అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల్లో 3.54 కోట్ల మంది పనిచేసే వయసున్న వారి నైపుణ్యాన్ని గణన చేయాల్సి ఉందని చెప్పారు. ఇందుకోసం 40 వేల మంది ఎన్యూమరేటర్లు అవసరమని, 8 నెలలు పడుతుందని వివరించారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కూడా సంప్రదించి నైపుణ్య గణన చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా ఇండ్రస్టియల్ పార్కులు రాష్ట్రంలో ఓడరేవులు, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైనా సీఎం సమీక్షించారు. ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును వెంటనే పునరుద్ధరించాలన్నారు. పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఓడరేవులు అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్ర, రా్రõÙ్టతర ప్రాంత హింటర్ ల్యాండ్ అనుసంధానంతో కూడిన ఓడరేవుల నిర్మాణం ద్వారా ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. కరోనాకంటే గత ప్రభుత్వమే టూరిజాన్ని దెబ్బతీసింది ఏపీలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు చెప్పారు. టూరిజం అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికతో రావాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలన్నారు. కరోనాకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పర్యాటకం ఎక్కువగా దెబ్బతిందని అన్నారు. టీడీపీ గత ప్రభుత్వం ఐదేళ్లలో పర్యాటక రంగంపై రూ.880 కోట్లు ఖర్చు చేయగా.. గత ప్రభుత్వం రూ.213 కోట్లే ఖర్చు చేసిందన్నారు. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 20.6 శాతం నుంచి 2019–24 మధ్య 3.3 శాతానికి పడిపోయిందన్నారు. రుషికొండపై గత ప్రభుత్వం సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో నిరి్మంచిన ప్యాలెస్ను ఏం చేయాలన్న విషయంపై వివిధ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
మేం చెప్పిన వారే చైర్మన్
సాక్షి అమరావతి/ సాక్షి, నెట్వర్క్: పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ–ఎస్ఎంసీ) ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా జరిగేలా అధికార టీడీపీ నేతలు యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగించారు. తాము చెప్పిన వారినే చైర్మన్ చేయాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించినప్పటికీ, ఆ మేరకు అధికారికంగా ప్రకటించకుండా అడ్డుపడ్డారు. పోలీసుల కనుసన్నల్లోనే ఎన్నికలు జరిగినప్పటికీ టీడీపీ నేతల రౌడీయిజాన్ని వారు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. 24 జిల్లాల పరిధిలోని 40,781 పాఠశాలలకు గాను 40,150 (98.45%) పాఠశాలల్లో గురువారం టీడీపీ మూకల దౌర్జన్యం మధ్య ఎన్నికలు పూర్తయ్యాయి. 631 పాఠశాలల్లో వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. ఎన్నికలు నిర్వహించని పాఠశాలలకు రీ షెడ్యూల్ ప్రకటించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.అడుగడుగునాదౌర్జన్యం» వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభ్యులందరూ చిట్టిబోయిన కవితను చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చేందిన టీడీపీ నేత వడ్డమాను సుధర్శన్రావు, మరి కొంత మంది పాఠశాలకు వచ్చారు. మోపూరి పార్వతి అనే మహిళను చైర్మన్గా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మంగారి మఠం మండలంలో పలు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సంబంధం లేకుండా టీడీపీ నేతలే చైర్మన్లను నియమించారు. » శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు ప్రాథమిక పాఠశాలలో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు లావణ్య పూర్తి మెజార్టీతో గెలిచారు. అయినా ఆమె గెలుపును అధికారికంగా ప్రకటించకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రెండవసారి ఎన్నిక జరపాలని పట్టుబట్టారు. దీంతో 30 మంది సభ్యుల్లో 22 మంది లావణ్యకు మద్దతు తెలిపారు. అయినా టీడీపీ నాయకులు హెచ్ఎంతో గొడవ పెట్టుకున్నారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన రూరల్ సీఐ కూడా టీడీపీ నాయకులకే మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. » ధర్మవరం రూరల్ మండలం రేగాటిపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో టీడీపీ వర్గీయులు మాత్రమే పాఠశాలలోకి ప్రవేశించి, ఇతరులెవ్వరూ లోపలకు రాకుండా అడ్డుకున్నారు. పలువురు పాఠశాల బయట గొడవ చేయగా, ఎన్నికను వాయిదా వేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సొంతూరు తోపుదుర్తి గ్రామంలో డీఎస్పీ శివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సార్సీపీ మద్దతుదారులైన తల్లిదండ్రులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి పంపకుండా అడ్డుకున్నారు. టీడీపీ మద్దతుదారులను సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత వీరిని లోపలికి అనుమతించారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పెద్ద దళితవాడ మండల పరిషత్ పాఠశాలలో వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందినా, టీడీపీ నేతల హెచ్చరికలతో టీడీపీ మద్దతుదారు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి కేశవరం ప్రాథమిక పాఠశాలలో వైఎస్సార్సీపీ మద్దతుదారు గుడాల వసంతకుమార్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే ఎస్ఐ ఆనందకుమార్ జోక్యం వల్ల టీడీపీ మద్దతుదారు పి.అచ్చియ్యమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. » తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. కమిటీలో లేని వారిని ఎలా అభ్యర్థిగా నియమిస్తారని వైఎస్సార్సీపీ నేతలు నిలదీయడంతో టీడీపీ నేతలు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. » సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ముందుగానే తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లను ఇచ్చి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారు. దీంతో పోటీలో నిలబడాలనే ఆశతో వచ్చిన పలువురు తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలోని గంగమాంబపురం జెడ్పీ హైస్కూల్లో టీడీపీ మద్దతుదారును ఏకపక్షంగా ఎంపిక చేశారు. » గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్సీపీ బలపరిచిన బూసి ఏసుమరియమ్మ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని, వారి మద్దతుదారులు ఎన్నికైనట్లు ప్రకటించారు. » విశాఖ జిల్లా చంద్రంపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రధానోపాధ్యాయుడి చాంబర్లో తిష్టవేసి మొత్తం వ్యవహారం వారికి అనుకూలంగా నడిపించారు.» శ్రీకాకుళం జిల్లా జలుమూరు బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్సార్సీపీకి చెందిన కింజరాపు పద్మ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీన్ని సహించలేని స్థానిక టీడీపీ నేత మునుకోటి దామోదరరావు.. పోలీసులు తమకు సహకరించలేదని పోలీసు స్టేషన్పై దాడికి యత్నించారు. -
జమ్ములో ఉగ్ర ఘటనలు.. విద్యాసంస్థల మూసివేత
జమ్ములో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా ఆర్మీ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ నుండి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు. 27వ తేదీ వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆన్లైన్ మాధ్యమం ద్వారా విద్యార్థులకు బోధన జరగనుంది.జూన్ 9న జమ్ము డివిజన్లోని రియాసీలో శివఖోడి నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత మరిన్ని ఉగ్ర దాడులు చోటుచేసుకున్నాయి. గత బుధవారం జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు. అదే సమయంలో ఒక సైనికుడు గాయపడ్డాడు.అంతకుముందు జూలై 24న జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని బట్ సెక్టార్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు వీరమరణం పొందారు. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్లో ఉగ్ర ఘటనలను గుర్తించామన్నారు. సాధారణ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం తేదని, మన భద్రతా దళాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులందరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
వానాకాలం చదువులు
ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 55 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఐదు తరగతులకు మూడే గదులు ఉన్నాయి. మూడింటిలో రెండు గదుల పైకప్పు పగుళ్లు తేలి వర్షానికి కురుస్తున్నాయి. మరో రెండు తరగతుల విద్యార్థులను వరండాలోనూ, డైనింగ్ హాల్లోనూ కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తూ నెట్టుకొస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండడంతో పన్నెండేళ్ల క్రితం నిర్మించిన తరగతి గదుల స్లాబ్ పైకప్పు పగుళ్లు తేలి కురుస్తోంది. గోడలకు పగుళ్లు ఏర్పడి.. తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. గదిలోకి చేరుతోన్న నీటితో పుస్తకాలు..పై స్లాబ్ నుంచి కురుస్తున్న నీటితో తామూ తడవకుండా గొడుగులు పట్టుకొని పాఠాలు వింటున్నామని 8వ తరగతి విద్యార్థులు చెబుతున్నారు. ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేసినా, గదులు కురుస్తూనే ఉన్నాయని, వర్షాలకు రూ.6 లక్షల విలువైన డిజిటల్ టీవీ తడిసి పాడైపోయిందని ఉపాధ్యాయులు తెలిపారు. దీనిపై ఎంఈఓ మహేశ్వర్రెడ్డిని సంప్రదించగా..ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. ..:: నెన్నెల -
చదువుల మోత!
విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో బోధన ఊపందుకుంటోంది.ఈనేపథ్యాన విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్లు, హాస్టళ్లకు వెళ్తున్న వారి కోసం పరుపులు, పెట్టెలు ఇతర సామగ్రి కొనుగోళ్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని బుక్స్టాళ్లు, ఇతర దుకాణాలు వారం ఇలా రద్దీగా కనిపించాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
‘ప్రైమరీ’లో ప్రగతి జాడేదీ?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రాథమిక వి ద్యలో విద్యార్థుల ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. తెలగాణ సహా అన్ని రాష్ట్రాల్లో ఈ లోపం కనిపిస్తోందని.. దీన్ని అధిగమించేందుకు కసరత్తు అవసరమని తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 2026 నాటికి దశల వారీగా ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రాలు.. ఆ దిశగా అడుగులు వేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ రెండేళ్లకోసారి నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్)ను నిర్వహించి.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యా ర్థుల ప్రమాణాలను పరిశీలిస్తుంది. అలా తాజాగా చేపట్టిన సర్వేలో తేలిన అంశాలను వెల్లడించింది. కనీస స్థాయి కూడా ఉండక.. ప్రతి విద్యార్థికి ఐదో తరగతికి చేరేసరికి చదవడం, రాయడంతోపాటు సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన అవసరం. ఇది తేల్చేందుకు కేంద్ర విద్యాశాఖ సర్వేలో 28 అంశాలపై స్వల్పస్థాయి ప్రశ్నలు ఇచ్చింది. విద్యార్థుల్లో 56– 68 శాతం మంది 50శాతం ప్రశ్నలకే సమాధానం ఇచ్చారు. గణితంలో అయితే 70 శాతం మంది విద్యార్థులు 30శాతం ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. 8వ తరగతి విద్యార్థులు కూడా గణితంలో 37శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నట్టు సర్వేలో గుర్తించారు. ప్రాంతీయ భాషల్లో రాయడం, చదవడంలోనూ విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఈ కేటగిరీలో కనీసం సగం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగినవారు 53 శాతం మంది మాత్రమే. చాలా రాష్ట్రాల్లో 13.85 శాతం మంది 8వ తరగతి వచ్చే సరికే బడి మానేస్తున్నారని.. దీన్ని కనీసం 6 శాతానికి తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం టార్గెట్ పెట్టింది. నెరవేరని లక్ష్యం! రెండేళ్ల క్రితం సర్వే చేసిన సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. కనీసం 50శాతం, ఆపైన ప్రశ్నలకు సరైన సమాధానం రాసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించింది. ఆ సమయంలో తర్వాతి ఐదేళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని రాష్ట్రాలు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటివరకు పెద్దగా మార్పు మొదలైనట్టు కనిపించలేదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు కొత్త లక్ష్యాలను నిర్దేశించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. పిల్లల్లో ప్రమాణాలు పెరగకపోవడానికి పాఠశాలల్లో టీచర్ల కొరతే కారణమని అధికారులు అంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా కరోనా తర్వాత నాణ్యమైన టీచర్లు దొరికే పరిస్థితి లేక సమస్యగా మారిందని విశ్లేషిస్తున్నారు. -
విశాఖ విమల విద్యాలయం మూసివేత
ఉక్కునగరం/గాజువాక: స్టీల్ప్లాంట్ టౌన్షిప్లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉచిత తెలుగు మీడియం పాఠశాల.. ‘విశాఖ విమల విద్యాలయం’ హఠాత్తుగా మూతపడింది. పాఠశాలలు తెరుచుకునే ముందు రోజు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చింది. దీంతో సుమారు రెండు వేల మంది విద్యార్థులతో పాటు 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డున పడ్డారు. స్టీల్ప్లాంట్ టౌన్షిప్లో తెలుగు విద్యార్థులు, నిర్వాసిత ప్రజల పిల్లల సౌకర్యార్థం స్టీల్ప్లాంట్ యాజమాన్యం అభ్యర్థన మేరకు విశాఖకు చెందిన ఆర్సీఎం డయాసిస్ మిషన్ సంస్థ ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి బిల్డింగ్తో పాటు విద్యుత్, మంచినీటి సరఫరా, ఫీజులు, సిబ్బంది జీతాలను ఉక్కు యాజమాన్యమే చెల్లిస్తోంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు, నిత్యం కూలి పనులు చేసుకునే వారి పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఎంవోయూను రెన్యువల్ చేస్తారు. యాజమాన్యం ఏడాదికి సుమారు రూ.6 నుంచి 7 కోట్లు జీతాల రూపేణా చెల్లిస్తోంది. ఈ ఏడాది మే 31తో ఎంవోయూ గడువు ముగియనున్న నేపథ్యంలో గతేడాది అక్టోబర్ నుంచి మిషన్ ప్రతినిధులు ఎంవోయూ రెన్యువల్ కోసం అభ్యర్థన పంపారు. యాజమాన్యం ఎంవోయూ కొనసాగిస్తుందన్న ధీమాతో పాఠశాల యాజమాన్యం ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తి చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలు చేసింది. ఈ నెల 11న ఉక్కు యాజమాన్యం నుంచి పిడుగు లాంటి వార్త అందింది. పాఠశాల నిర్వహణకు బిల్డింగ్ ఇస్తామని సొంత ఫీజులతో పాఠశాల నిర్వహణకు సంబంధించి కొత్త ఎంవోయూ చేసుకుందామని తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యం హడావుడిగా ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు 13 నుంచి పాఠశాలకు రావొద్దని సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, పల్లా పెంటారావు తదితరులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.సొంతంగా నిర్వహించలేం గత 40 ఏళ్లుగా స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో పాఠశాల నడుస్తోంది. రెన్యువల్ కోసం అభ్యర్థించగా కొత్త ఎంవోయూకు సిద్ధమవమంటున్నారు. ఫీజులు వసూలు చేసుకుని జీతాలు చెల్లించుకోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలతో సమానంగా చెల్లించే మాకు సొంత ఫీజులతో పాఠశాల నిర్వహించే పరిస్థితి లేదు. – ఫాదర్ రత్నకుమార్, కరస్పాండెంట్ ఆర్సీఎం మిషన్ సీఎండీ బంగ్లా ముట్టడిస్తాం స్టీల్ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల పిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలను మూసివేయడం అన్యాయం. పాఠశాలను వెంటనే తెరిపించకపోతే సీఎండీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. రెండు వేల మంది పిల్లల అంశంపై అడ్మిన్, సీఎండీ బంగ్లాను ముట్టడిస్తాం. – బి.గంగారావు, 78వ వార్డు కార్పొరేటర్ పాఠశాల తెరిపిస్తాం హఠాత్తుగా పాఠశాలను మూసివేస్తే ఉపా«ధ్యాయులు, విద్యార్థులు రోడ్డున పడాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల సహకారంతో ఉక్కు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. పాఠశాలను తెరిపించే వరకూ వదిలే ప్రసక్తే లేదు. – పల్లా పెంటారావు, కార్మిక నాయకుడు మా పిల్లల పరిస్థితేంటి? కూలీ, నాలీ చేసుకుని బతుకులు సాగిస్తున్నాం. నా భర్త చనిపోతే నేను కూలి పనిచేసుకుంటూ నా కొడుకుని ఈ పాఠశాలలో చదివిస్తున్నాను. ఇప్పుడు పాఠశాల మూసేస్తామంటే ఎక్కడ చదవాలి? ఎవరు చేర్చుకుంటారు మాలాంటి పేదోళ్లను. – కృష్ణమ్మ, విద్యార్థి తల్లి మా చదువులు ఎలా? నేను పదో తరగతికి వచ్చాను. మేము చాలా పేదోళ్లం. మా తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్తోమత లేదు. ఇప్పుడు మా పరిస్థితేంటి? మా చదువులు మధ్యలో ఆగిపోవాల్సిందేనా? – 10వ తరగతి విద్యార్థిని ఆందోళన వద్దు ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభం విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని గాజువాక ఎంఈవోలు ఎం.సునీత, బి.విశ్వనాథం గురువారం ఓ ప్రకటనలో కోరారు. పాఠశాల మూసివేత వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లామని, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా జిల్లా విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. -
ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభం
-
కన్నీళ్లు పెట్టిస్తున్న చిన్నారి మాటలు..
-
బడిగంట మోగింది
సాక్షి, సిటీబ్యూరో: కొత్త విద్యా సంవత్సరం ఆరంభమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నాయి. బడి గంటలు గణగణ మోగాయి. ఇంటివద్ద ఆటపాటలతో సరదాగా గడిపిన పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. బుధవారం ఉదయం నుంచే రోడ్లపై సందడి కనిపించింది. విద్యాసంస్థలు గల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు ఆగుతూ, సాగుతూ ముందుకు సాగాయి. తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ వరకు దిగబెట్టారు.సర్కారు బడుల బలోపేతానికి కృషిపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ఆలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, గన్ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్, డీఈఓ రోహిణి, ఆర్డీఓ మహిపాల్, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ విశ్వనాథం గుప్తా పాల్గొన్నారు. -
తెలంగాణలో మోగిన బడిగంట
-
తెలంగాణలో మోగిన బడి గంట.. ఆర్టీఏ అలర్ట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గవర్నమెంట్, ప్రైవేట్ బడులన్నీ తెరుచుకున్నాయి. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఉదయం నుంచి అన్ని స్కూల్స్, కాలేజీల బస్సుల ఫిట్నెస్లను పరిశీలిస్తున్నారు. ఫిట్గా లేని బస్సులు, వ్యాన్లను సీజ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇవాళ్టి నుంచి బడులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. నిన్ననే స్పెషల్ డ్రైవ్ పేరిట చెకప్ లిస్ట్ పంపించారు అధికారులు. అయినా కొన్ని విద్యా సంస్థలు బస్సులు, వ్యాన్లను ఆర్టీఏ కార్యాలయాలకు ఫిట్నెస్ టెస్టులకు పంపలేదు. దీంతో అధికారులే రంగంలోకి దిగి దాడులు నిర్వహిస్తున్నారు. ఇక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. -
ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ
అమరావతి, సాక్షి: వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు కాకుండా.. ఎల్లుండి(జూన్13న) పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏటా జూన్ 12 వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో ఒక్కరోజు సెలవును పొడిగించింది విద్యాశాఖ. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్బుక్స్ ఉన్నాయి. మొదటి సెమిస్టర్కు 3.12 కోట్ల పుస్తకాలు ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు.పదో తరగతి సాంఘికశా్రస్తాన్ని సీబీఎస్ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇక చదువుల సీజన్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హడావుడి ముగియ డంపై విద్యా రంగంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు రీ ఓపెనింగ్ అవుతున్నాయి. స్కూళ్లల్లో మౌలిక సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఇక ఇంట ర్ బోర్డ్ ప్రవేశాల మొదలు, ఉన్నత విద్యా మండలి కార్యక్రమాలు, యూనివర్శిటీల ప్రక్షాళన వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్టబోతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతీ అంశంపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. 7 నుంచి బదిలీలు, పదోన్నతులు ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు దీన్ని చేపట్టాలని భావించినా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. గత ఏడాది కొంతమంది టీచర్లను బదిలీ చేశారు. కానీ ఇప్పటి వరకూ రిలీవ్ చేయలేదు. దాదాపు 50 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మరోవైపు 10 వేల మంది టీచర్ల వరకూ పదోన్నతులు పొందాల్సి ఉంది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ నుంచి హెచ్ఎం వరకూ ప్రమోషన్లు ఇవ్వడానికి సీనియారిటీ జాబితా కూడా రూపొందించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఊపందుకుంటున్న అడ్మిషన్లు ఇంటర్ అడ్మిషన్లకు అనుగుణంగా ఇంటర్ కాలేజీలకు బోర్డ్ అనుబంధ గుర్తింపు ఇప్పటికే చాలావరకు పూర్తి చేసింది. ఇంకా 600 ప్రైవేటు కాలేజీలకు ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరు కల్లా అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ప్రవేశాలు ఊపందుకున్నాయి. గత ఏడాది 80 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఈ సంవత్సరం మరికొంత మంది చేరే వీలుంది. టెన్త్ ఉత్తీర్ణులకు అవసరమైన డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ నుంచి మొదలు పెట్టే వీలుంది. డిగ్రీ ప్రవేశాలను వేగంగా చేపడుతున్నారు. తొలి దశ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరుగుతుంది. డిగ్రీలో ఏటా 2.20 లక్షల మంది చేరుతున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కూ చురుకుగా ఏర్పాట్లు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి ఆన్లైన్ దర ఖాస్తు లు ప్రక్రియ మొదలుపెడతారు. రాష్ట్రంలో 1.06 లక్ష ల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 80 వేల వర కూ కనీ్వనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ జూ లై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అవసరమై న అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.వీసీల నియామకాలపై దృష్టిరాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల్లో కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వచి్చన దరఖాస్తుల పరిశీలనకు ప్రభు త్వం సెర్చ్ కమిటీలను కూడా నియమించింది. మే నెలాఖరుతో వీసీల పదవీ కాలం ముగిసింది. వీరి స్థానంలో ఐఏఎస్లను ఇన్ఛార్జిలుగా నియమించారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటంతో వీసీల నియామకం ఇంత కాలం చేపట్టలేదు. సెర్చ్ కమిటీ భేటీ అయిన, ఒక్కో వర్శిటీ కి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఇందులో ఒకరిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియ మరో పది రోజుల్లో జరగొచ్చని అధికారులు చెబుతున్నారు. -
స్కూలు ఫీజులు తగ్గుతాయా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రైవేటు స్కూళ్లలో ఫీజు దోపిడీకి చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తోంది. ఈమేరకు కసరత్తు వేగవంతం చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.2024–25 విద్యా సంవత్సరం జూన్ 12నుంచి పునః ప్రారంభం కానుంది. ఆలోపు ఫీజు నియంత్రణకు సంబంధించి స్పష్టత, ఉత్తర్వు లు వస్తే ఆ మేరకు తల్లిదండ్రులు పిల్లల స్కూల్ ఫీజుల చెల్లింపులపై అంచనాలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే జూన్ 6వ తేదీ వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత కసరత్తు వేగవంతం చేసినప్పటికీ ఫీజు నియంత్రణ చట్టం ఖరారయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు అనుమానంగానే ఉంది. చట్టం రూపకల్పన, ఆ తర్వాత చట్టసభల్లో ఆమెదం తర్వాతే ఫీజు నియంత్రణకు లైన్ క్లియర్ కానుందని, దీంతో 2025–26 నుంచి ఈ చట్టం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఒకటో తరగతికి ఆరేళ్ల మాటేమిటి?మరోవైపు ఒకటో తరగతిలో ప్రవేశానికి 6 సంవత్సరాల వయసు నిండి ఉండాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ నిబంధనల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ ఈ అంశంపైనా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మన రాష్ట్రంతో పాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు, కేరళ, హర్యానా సహా చాలా రాష్ట్ర ప్రభు త్వాలు ఈ వయస్సు ప్రమాణా లపై ఎలాంటి నిర్ణ యం తీసుకోని నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరం నాటికే ఈ అంశంపై స్పష్టత రానుందని అధి కారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఒకటో తరగతి ప్రవేశానికి ఆరేళ్ల వయోపరి మితి నిబంధనతో జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ప్రచారం ఉంది. కాగా, 2024–25 విద్యా సంవత్సరంలో ఐదేళ్ల వయోపరిమతి నిబంధనతోనే ప్రవేశాలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
ఢిల్లీలో 100 స్కూళ్లకు బాంబు బెదింపులు.. స్పందించిన ఎల్జీ
ఢిల్లీ: ఢిల్లీ రాజధాని పరిధిలో బుధవారం 100 స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపుల ఘటనపై ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా స్పందించారు. బాంబు బెదిరింపుకు సంబంధించి వచ్చిన ఈ మెయిల్స్ను పోలీసులు ట్రేస్ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నామని ఎల్జీ తెలిపారు.కేంద్ర హోం శాఖ స్పందన..ఢిల్లీ స్కూళ్ల బాంబు మెయిల్ బెదిరింపు ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. పాఠశాలలకు వచ్చినవి నకిలీ బెదిరింపు మెయిల్స్ అని స్పష్టం చేసింది. పలు పాఠశాలలను ఢిల్లీ పోలీసులు తనిఖీ చేశారని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను స్కూళ్ల యాజమాన్యాలు మూసివేసినట్ల తెలిపారు.అంతకంటే ముందు.. బాంబు బెదిరింపులై ఢిల్లీ మంత్రి అతిశీ స్పందించారు. ‘ఇవాళ ఉదయం కొన్ని స్కూళ్లులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు విద్యార్థులను స్కూళ్ల నుంచి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే పాఠశాలల్లో ఎటువంటి బాంబు లేవని పోలీసులు గుర్తించారు. మేము స్కూళ్లు, పోలీసులతో టచ్లో ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు, పాఠశాలల అధికారులు ఆందోళన పడొద్దు. స్కూళ్ల అధికారులు కూడా తల్లిదండ్రులకు టచ్లో ఉన్నారు’ అని మంత్రి అతిశీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.Some schools have received bomb threats today morning. Students have been evacuated and those premises are being searched by Delhi Police. So far nothing has been found in any of the schools.We are in constant touch with the Police and the schools. Would request parents and…— Atishi (@AtishiAAP) May 1, 2024దేశ రాజధాని పరిధిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా అలజడి రేగింది. పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే పిల్లలను బయటకు పంపించి తనీఖలు చేపట్టింది. మరో వైపు ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్ల వద్దకు చేరుకున్నారు.ఇప్పటివరకు 100 పాఠశాలల్లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణిక్య పురిలోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు స్కూల్స్కు వద్దకు చేరుకొని వాటి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు తనిఖీలు చేసిన పాఠశాలల్లో ఎలాంటి బాంబు లేవని, వచ్చింది నకిలీ బాంబు మెయిల్గా పోలీసులు గుర్తించారు. బయట దేశం నుంచి వీపీఎన్ మోడ్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు బెందిరింపుల నేపథ్యంలో స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్పై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లకు మంగళవారమే చివరి పనిదినంగా ఉంది. ఈ సందర్భంగా మంగళవారం ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్మెంట్–2 పరీక్షల ఫలితాలను స్కూళ్లలో ప్రకటించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
Summer Holidays: ఏపీ బడులకు 24 నుంచి వేసవి సెలవులు
-
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించామని తెలిపారు. ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చని.. విద్యాభ్యాçÜం అంతా ఆంగ్లంలోనే ఉంటుందన్నారు. WWW.cse.ap.gov.in/apms.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మా మంచి జగన్ మామయ్య (ఫొటోలు)
-
Fact Check: బాబు బాగోతమే ‘బెస్ట్’ట..!
సాక్షి, అమరావతి: ఒకటీ రెండూ కాదు.. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి వచ్చాయి. కుల మత బేధాలు లేకుండా 47 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా, జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్.. ఒక్కటేంటి చదువుకోవాలనే ఆశ, ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్యనందిస్తోంది ఈ సర్కారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.1.25 కోట్ల ఫీజును చెల్లిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో ‘ఏపీ చదువులు బెస్ట్’ అనిపించుకుంది. కానీ రామోజీకి మాత్రం ఇవి కనిపించకపోగా.. ‘‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’’ అన్న కుసంస్కారికి సంఘ సంస్కర్త అని డబ్బా కొడుతోంది. బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను అటకెక్కించేశారంటూ గగ్గోలు పెడుతోంది. దళిత, గరిజన బిడ్డలు చదువులకు దూరం చేశారంటూ మొసలి కన్నీరు కారుస్తోంది. అట్టడువర్గాల యువతకు అందించే విదేశీ విద్యా పథకం పైనా ఈనాడు విషం కక్కింది. గత ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చేస్తే దానిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టి అక్రమాలను వెలికి తీసింది. విదేశీ విద్యా పథకంలో మార్పులు చేసి నిజమైన అర్హులకు అందిస్తోంది. ఎంపిక చేసుకున్న యూనివర్సిటీలకు ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు 41 మంది ఎస్సీ విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొంది విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. అడవి బిడ్డలు చదువుకునే గిరిజన విద్యాలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా, వారి భోజన, ఇతర సదుపాయాల కోసం రూ.920.31 కోట్లను ఖర్చు చేసింది. అందుకు నిదర్శనమే ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు 2019 నుంచి 23 మధ్య దాదాపు 400 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ ర్యాంకులు సాధించారు. ఇవేమీ కనిపించని ఈనాడు పత్రిక కుళ్లు రాతలు రాస్తోంది. ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పథకాలు ఇంతకంటే చాలా గొప్పవని చెబుతోంది. బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ ఎన్ని రామోజీ? ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించేందుకు దివంగత వైఎస్సార్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికే ‘బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్’గా చంద్రబాబు పేరుమార్చి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తన కూటమిలోని సభ్యులు నడుపుతున్న 383 ప్రైవేటు స్కూళ్లలో కేవలం 33 వేల మందిని చేర్పించి, నిరుపేద విద్యార్థులకు బెస్ట్ ఇంగ్లిష్ మీడియం చదువులంటూ భారీగా నిధులను దోచుకున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని రాష్ట్రంలోని దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం బోధనలోకి మార్చారు. దాంతో 47 లక్షల మంది పిల్లలకు బెస్ట్ విద్య అందుతోంది. ఇక గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రి మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 1958 పాఠశాలలను ఆధునికీకరించారు. వీటిలో ఇప్పుడు 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది. వారి భోజన, సదుపాల కోసం ఒక్క 2023 సంవత్సరంలోనే ప్రభుత్వం రూ.920.31 కోట్లు ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చవిదిన విద్యార్థులు గత నాలుగేళ్లలో 400 మందికిపైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. 50 మందికి పైగా నీట్ ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువుతున్నారు. గిరిజన వర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల స్థాపన గత ప్రభుత్వంలో ప్రచారానికే పరిమితమైన అడవి బిడ్డల బెస్ట్ విద్యను ఈ ప్రభుత్వం వారి చెంతకు చేర్చింది. ఒకటో తరగతి నుంచి స్కూళ్లలో ఇంగ్లిష్ విద్యను అందించడమే కాకుండా ఉన్నత విద్యను సైతం వారి దరికి చేర్చింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రూ.153.85 కోట్లతో నిర్మిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలో సగం సీట్లు (150) గిరిజన విద్యార్థులకే రిజర్వు చేసింది. సాలూరులో రూ.561.88 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని నిర్మిస్తోంది. పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఇవేమీ రామోజీ పచ్చ కళ్లకు కనిపించకపోవడమే విడ్డూరం. ఎస్సీ విద్యా సంస్థల్లో ఉత్తమ విద్య గత టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసి అంతిమంగా పేదలపైన, దళితులపైన భారం మోపారు. చదువులు, వైద్యాన్ని కొనే స్తోమత లేక రెండింటికీ దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్కు బకాయి పెట్టి విద్యార్థులను వేదనకు గురి చేసింది. ఇవేమీ ఈనాడు దినపత్రికలో ఏరోజూ కనిపించలేదు. అలాంటి పరిస్థితులను తొలగిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎస్సీ, ఎస్టీల కోసం చేపడితే అది తప్పు అన్నట్టు రాస్తోంది. గతంలో కనీస ప్రమాణాలు లేని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీంను అమలు చేసి నిధులను దోచుకున్నారు. ఇప్పుడు విద్యార్థులందరికీ నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ తరగతి గదులు, ఐఎఫ్పీ స్క్రీన్లు, ఇంటర్నెట్, విద్యార్థులకు ట్యాబ్లు, బైలింగువల్ టెక్టŠస్ బుక్స్తో, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. టోఫెల్ శిక్షణనిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. మెయిన్స్కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది. గత ఏడాది ప్రకటించిన జేఈఈ అడ్వాన్డ్, మెయిన్స్ల్లో విద్యార్థులు 99.05 శాతం పర్సంటైల్ సాధించడంతో పాటు 200 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందారు. రూ.వేల కోట్ల నిధుల అభివృద్ధి కనిపించలేదా రామోజీ ఎస్సీ వర్గానికి చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15 వేల చొప్పున రూ.5,335.7 కోట్లు ఇప్పటివరకూ అందించింది. 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.75 కోట్లు అందించింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5.06 లక్షల మందికి పైగా ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.834 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో వేసింది. 83 వేల మంది ఎస్టీల తల్లులకు రూ.135.66 కోట్లను వారి ఖాతాల్లో జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5.4 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.2,081 కోట్లు అందించింది. 1.11 లక్షల మంది ఎస్టీ తల్లులకు రూ.346 కోట్లు అందాయి. ఈ పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఇవేమీ బెస్ట్ అవెయిలబుల్కు సాటిరావంటోంది ఎల్లో మీడియా. ♦ గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలను, అవినీతిని, అక్రమాలను గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకు వచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సులలో క్యూఎస్ ర్యాంకింగ్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకుల గల విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా ట్యుషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని మార్చి అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 41 మంది విద్యార్థులు ఎంపికై విదేశాల్లో చదువుకుంటున్నారు. గత ప్రభుత్వం విదేశీ విద్యకు ఈ స్థాయిలో భరోసా ఇవ్వగలిగిందా? ♦ అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్పైనా ఈనాడు పచ్చి అబద్ధాలు అచ్చేసింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్ మరింత ప్రయోజనకరంగా నిర్వహిస్తోంది. విశాఖలో సివిల్స్ కోచింగ్. విజయవాడలో గ్రూప్స్కి శిక్షణనిస్తోంది. తిరుపతిలో బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణనిస్తోంది. ఈ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉద్యోగ శిక్షణ కోసం ఇప్పటివరకు రు.15 కోట్లు పైగా ఖర్చు చేసింది. అయినా సరే.. బాబు బాగోతమే బాగుందంటోది పచ్చపత్రిక. -
బడి తెరిచిన మొదటి రోజే పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ బైలింగ్యువల్ పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.55 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తోంది. గతేడాది దాదాపు 27 లక్షల పుస్తకాలు మిగలడంతో మిగిలిన 4.28 కోట్ల పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఈసారి పాఠ్యపుస్తకాల ముద్రణ బిడ్ను ఉత్తరప్రదేశ్కు చెందిన పితాంబరా ప్రెస్ పొందింది. 25 శాతం ముద్రణను స్థానిక ఎంఎస్ఎంఈలకు అప్పగిస్తారు. గత ఏడాది పుస్తకాల ముద్రణకు అత్యంత నాణ్యమైన 70 జీఎస్ఎం పేపర్ను వినియోగించారు. ఈ ఏడాది కూడా ఇదే నాణ్యత ఉండేలా ముద్రణ సంస్థకు నిబంధనలు విధించారు. పదో తరగతి ఫిజిక్స్ పుస్తకాలకు ప్రత్యేకంగా అత్యంత నాణ్యమైన 80 జీఎస్ఎం ఆర్ట్ పేపర్ను వినియోగిస్తున్నారు. స్కూళ్లు తెరిచేనాటికే ప్రతి విద్యార్థికీ జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్లలో ఇతర వస్తువులతో పాటు అన్ని పుస్తకాలు అందిస్తారు. ఇందుకోసం మే 31 నాటికి మొదటి సెమిస్టర్ పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరతాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థులకు కూడా పుస్తకాలను అందించేందుకు 5 శాతం పాఠ్య పుస్తకాలను బఫర్ స్టాక్గా ఉంచుతారు. అన్ని మాధ్యమాలకూ ద్విభాషా పుస్తకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియంతో పాటు ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, కన్నడ మాధ్యమం స్కూళ్లు కూడా ఉన్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ ద్విభాషా పుస్తకాలు ఇస్తారు. ఇతర మీడియం విద్యార్థులకు కూడా ఇంగ్లిష్తోపాటు వారు ఎంచుకున్న భాష ఉన్న ద్విభాషా పుస్తకాలు అందిస్తారు. దీంతోపాటు సవర, కొండ, కోయ, సుగాలి వంటి గిరిజన విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 9 తరగతులు ఇంగ్లిస్ మీడియంలోకి మారాయి. 2024–25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి వస్తుంది. దీంతో 1 నుంచి 10 వరకు నూరు శాతం ఇంగ్లిష్ మీడియం బోధనలోకి వస్తుంది. విద్యార్థులకు స్థానిక సంస్కృతులు, జాతీయ అంశాలపై అవగాహన ఉండేలా తరగతులను మూడు కేటగిరీలుగా విభజించి సిలబస్ రూపొందించారు. 1 నుంచి 5 తరగతులకు 100 శాతం ఎస్సీఈఆర్టీ సిలబస్ ఉంటుంది. 6, 7 తరగతులకు ఇంగ్లిష్, సైన్సు, లెక్కల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్, తెలుగు, హిందీ, సోషల్ స్టేట్ సిలబస్ ఉంటాయి. 8, 9, 10 తరగతులకు ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ) మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉంటాయి. స్థానిక ముద్రణ సంస్థలకు 25%అవకాశం పాఠ్య పుస్తకాల ముద్రణ బిడ్ను ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించు కుంది. ఈ సంస్థ 1 నుంచి 5, 7 తరగతుల పుస్తకాలు ముద్రిస్తుంది. పేజీకి రూ.0.33 ధర నిర్ణయించారు. స్థానిక ఎంఎస్ఎంఈలకు కూడా అవకాశం కల్పించడానికి 6, 8, 9, 10 తరగతుల పుస్తకాల ముద్రణ అప్పగిస్తారు. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహా్వనించారు. -
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమా న్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండ టంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యా హ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
విప్లవ భేరి
ఐదేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలను గెలవటం ఓ విప్లవం.. ఆ తర్వాత.. స్కూళ్లు, విద్యార్థుల నుంచి.. చెప్పే చదువుల వరకూ విద్యా రంగం సమూలంగా మారింది. ఇంటికే వైద్యులు, గ్రామాల్లోనే పరీక్షలు సహా... పేదల ప్రతి చికిత్సకూ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోంది. ఆర్బీకేల నుంచి పంటల కొనుగోళ్లు, బీమా వరకూ ప్రతి చర్యా రైతుకు భరోసా ఇస్తోంది. ఈ రాష్ట్ర మహిళలకు సొంతింటి పట్టాలున్నాయి. సొంత కాళ్లపై నిలబడగలిగే సత్తా ఉంది. ఇవే కాదు.. ఇంటింటికీ పథకాలు చేరవేసే వలంటీర్లు, గ్రామాల్లో పాలన భవనాలు, వ్యవసాయ– వైద్యారోగ్య కేంద్రాలు.. ఇవన్నీ ఐదేళ్లలోనే. కోవిడ్ కబళించిన రెండేళ్లను మినహాయిస్తే మూడేళ్లలోనే ఇంతటి సంక్షేమాభివృద్ధితో కూడిన విప్లవాన్ని... బహుశా ఈ రాష్ట్రమే కాదు.. ఏ రాష్ట్రమూ ఇదివరకెన్నడూ చూడలేదు. సమాజంలోని అట్టడుగు వర్గాలనూ అభివృద్ధిలో భాగం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన ఫలితమే ఈ విప్లవం. అందుకే దేశంలో ఏ నాయకుడూ చెప్పని విధంగా ఆయన ధైర్యంగా జనానికి ఓ మాట చెబుతున్నారు. ‘గత ఎన్నికల ముందు చేస్తానని చెప్పినవన్నీ చేశా. మీ కుటుంబానికి మంచి జరిగిందని మీరు నమ్మితేనే మళ్లీ నాకు ఓటెయ్యండి’ అని. ఇలాంటి నాయకత్వమే అసలైన విప్లవం. విప్లవంతోనే చరిత్ర మారుతుంది. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో గత 58 నెలలుగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోనే దిక్సూచిగా పరిపాలిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి.. మద్యపాన నియంత్రణ, సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు వంటి వాటిని ఎందుకు అమలు చేయలేదో సహేతకమైన కారణాలు చెప్పడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్నారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పరిపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి భారీ ఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో 58 నెలల్లో నియమించిన వారే 2.13 లక్షలు కావడం గమనార్హం. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. –సాక్షి, అమరావతి -
TN: తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్, కాంచీపురంలలో సోమవారం( మార్చ్ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్ రాగా సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పీఎస్బీబీ మిలీనియం స్కూల్కు బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులు వచ్చిన రెండు స్కూళ్లలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. స్కూళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. కాగా, మార్చ్ 1వ తేదీ బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. అశ్లీల వీడియో వైరల్.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు -
ఇన్స్ట్రక్టర్లను ఆదుకోవాలి!
విద్యావ్యవస్థలో మార్పులు తేవడానికి తెచ్చిన విద్యాహక్కు చట్టం, నూతన విద్యా విధానాల లక్ష్యాలను పాలకులు పట్టించు కోకపోవడం వల్ల అటు విద్యార్థులూ, ఇటు ఇన్ స్ట్రక్టర్లూ తీవ్రంగా నష్ట పోతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కళా (ఆర్ట్), వృత్తి (క్రాఫ్ట్) విద్యలను విద్యార్థులకు దూరం చేశారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యాహక్కు చట్టం 2009లో వచ్చింది. ఈ చట్టం పేర్కొన్న ‘సమగ్ర శిక్ష’అందించేందుకు 2012 నుండి రెండు సార్లు ప్రభుత్వం ఆర్ట్, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్లను నియమించింది. కానీ వీరంతా శ్రమదోపిడీకి గురౌతూ దశాబ్దకాలంగా అవమానాలను భరిస్తున్నారు. గత ప్రభుత్వం ఎటూ పట్టించుకోలేదు. నూతన ప్రభుత్వమన్నా ఆర్ట్, క్రాఫ్ట్ విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత నాలుగు దశా బ్దాలుగా ఉపాధ్యాయ నియామకాల్లో ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులను నిర్లక్ష్యం చేశారు. రేవంత్నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నదని నిన్న విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రుజువు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 1700 పోస్టులు ఈ కేటగిరీలో ఖాళీగా ఉన్నాయి. అయినా ఒక్క పోస్టును కూడా భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రస్తా వించలేదు. ప్రతీ పాఠశాలలో ఒకప్పుడు రంగస్థల వేదికలు ఉండేవి. విద్యార్థులు వార్షికోత్స వాలూ, జాతీయ పర్వదినాలు వంటి సంద ర్భాల్లో వీటి మీదే సాంస్కృతిక ప్రదర్శ నలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ వేదికలూ లేవు. అప్పట్లో ప్రతీ పాఠశాలలో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్లను బోధించేందుకు ఉపా ధ్యాయులను నియమించేవారు. కానీ ఈ పోస్టులను ఇప్పుడు దాదాపుగా మర్చి పోయారు. విద్యార్థి దశలోనే ఆర్ట్, వృత్తి విద్యలు అత్యంత అవసరమని 2009 విద్యా హక్కు చట్టం చెబుతోంది. భారతీయ సంప్ర దాయ కళలతో పాటు నైపుణ్యాలను మెరుగు పరిచి ‘మేకిన్ ఇండియా’కు ఊపిరిపోయాలని నూతన విద్యా విధానం కోరుతోంది. అయి నప్పటికీ దీని అమలులో గత రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. 2012లో అప్పటి ‘రాజీవ్ విద్యా మిషన్’ కింద పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల (పీటీఐ) పేరుతో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను విధుల్లోకి తీసు కున్నారు. కానీ వారిని ఫుల్టైమ్ ఉద్యోగులు గానే వాడుకుంటున్నారు. కేంద్రం ఇచ్చే వేతనాలను సరిగా ఇవ్వక పోగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం వాటాను కూడా ఏనాడూ ఇవ్వలేదు. వేసవి సెలవులలో టెర్మినేట్ చేసి తిరిగి తీసుకోవడా నికి నెలల తరబడి జాప్యం చేసి జీతాలు ఎగ్గొట్టింది ప్రభుత్వం. కరోనా సమయంలో 21 నెలల జీతాలు కేంద్రం ఇచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే నొక్కేసింది. వీరికి ఇచ్చే కేవలం రూ. 11,700 గౌరవ వేతనం ఇవ్వడా నికి ప్రభుత్వం అష్టకష్టాలూ పెట్టింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కళా,వృత్తి విద్యలకు ఇప్పటికైనా ప్రాణం పోయాలి. నిబంధనల ప్రకారం పదేళ్లుగా పనిచేస్తున్నఇన్స్ట్రక్టర్లను రెగ్యులర్ చేయాలి. పార్ట్ టైంఇన్స్ట్రక్టర్లుగా పని చేస్తున్న వారిని ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లుగా రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. - వ్యాసకర్త ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మొబైల్: 94904 01653 - కనుకుంట్ల కృష్ణహరి -
టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఎగ్జామ్స్ విభాగం ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో 3,473 సెంటర్లను సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు ఉంటాయి. కాగా, 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు ఎన్రోల్ చేసుకున్నారు. వీరిలో గత ఏడాది పదో తరగతి ఫెయిలై తిరిగి ప్రవేశం పొందినవారు 1,02,528 మంది ఉన్నారు. ఓరియంటల్ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. కాగా, మొత్తం పదో తరగతి విద్యార్థుల్లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటలకు వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు అంటే ఉదయం 10గంటల వరకు అనుమతిస్తారు. మొత్తం 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్ను అధికారులు సిద్ధంచేశారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి అక్కడ స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారులు సిట్టింగ్ స్క్వాడ్ను నియమిస్తారు. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ‘క్యూఆర్ కోడ్’తో పేపర్ లీకులకు చెక్ పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్ట్రీస్కు అవకాశం లేకుండా ఈ ఏడాది ప్రశ్నపత్రాలను ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించారు. ప్రతి పేపర్పైనా, ప్రతి ప్రశ్నకు క్యూఆర్ కోడ్ను ముద్రించారు. దీంతో మాల్ ప్రా్రక్టీస్ చేసినా, పేపర్ లీక్ చేసినా ఆ పేపర్ ఏ జిల్లా, ఏ మండలం, ఏ సెంటర్లో ఏ విద్యార్థికి కేటాయించినది అనేది వెంటనే తెలిసిపోతుంది. మరోవైపు ఇన్విజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్–టీచింగ్ సిబ్బంది, ఏఎన్ఎంలతోపాటు పరీక్షల సరళిని పర్యవేక్షించే చీఫ్ ఇన్విజిలేటర్లు కూడా పరీక్షా కేంద్రాలకు సెల్ఫోన్ తీసుకువెళ్లకుండా నిషేధించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం ఎవరూ తీసుకువెళ్లకూడదని విద్యాశాఖ పరీక్షల విభాగం స్పష్టంచేసింది. వెబ్ లింక్ ద్వారా పేపర్ సాఫ్ట్ కాపీ మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వ్యాల్యూషన్ పూర్తిచేసి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. గతంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యూషన్కు దరఖాస్తు చేసుకుంటే ఫలితాలు తెలుసుకునేందుకు సంబంధిత పేపర్ ఇచ్చేవారు. ఈ ఏడాది అలాంటి వారికి వెబ్ లింక్ పంపించనున్నారు. సదరు లింక్ను ఓపెన్ చేస్తే పేపర్ సాఫ్ట్ కాపీని పొందేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పదో తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. విద్యార్థులు పదో తరగతి హాల్టికెట్ను చూపించి తమ ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా వెళ్లి, రావొచ్చు. ఈ సదుపాయం ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా కల్పించారు. -
‘భావి భారతం గురించి నీకేం తెలుసు?’.. విద్యార్థులకు రైల్వేశాఖ పోటీ..
భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోంది? భారతీయ రైల్వేలు ఎంతలా మారనున్నాయి?.. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను వారి అధ్యాపకులు అడుగుతుంటారు. తాజాగా భారతీయ రైల్వే దేశంలోని పాఠశాలల విద్యార్థులకు ఒక పోటీ నిర్వహించబోతోంది. ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు భావి భారతంపై తమకున్న కలల గురించి చెప్పాలని రైల్వేశాఖ కోరింది. ఇందుకోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 4000 పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారు. భావి భారతం ఎలా ఉండబోతోంది? రైల్వేల భవిష్యత్ ఎలా ఉండనుందనే దానిపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, కవితా రచన తదితర పోటీలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పోటీలో ప్రతిభ కనబరిచిన 50 వేల మంది విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 26న దేశంలోని అన్ని డివిజన్లలోని 2000 రైల్వే స్టేషన్లలో పోటీ నిర్వహించనున్నామని, పోటీలు జరిగే సమయంలో ప్రధాని స్వయంగా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారని రైల్వే అధికారులు తెలిపారు. -
అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తాం
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత కూడా తమదేనన్నారు. ఆ తండాలకు పంచాయతీ భవనాలను నిర్మిస్తామన్నారు. గురువారమిక్కడి బంజారాభవన్లో గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాల్లో రేవంత్ మాట్లాడారు. విద్యుత్, మంచినీరు... ఇలా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అన్ని నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. బంజారా సోదరులతో ఈ సమావేశం నిర్వహిస్తుంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసినంత ఆనందంగా ఉందని చెప్పారు. 1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారని, ఆ తర్వాత దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాందీదేనన్నారు. మీ ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సేవాలాల్ జయంతిని ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ఇచ్చిందని చెప్పారు. జయంతి ఉత్సవాల నిర్వహణకు రూ.కోటి కాదు.. మరో కోటి జత చేసి రూ.2 కోట్లు విడుదల చేస్తున్నామని, తక్షణమే దీనికి సంబంధించిన జీఓను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి కె.జానారెడ్డి, బలరాంనాయక్, రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.విజయారెడ్డి, బంజారా సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆంగ్ల మాధ్యమం అనుసరణీయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రాథ మిక పాఠశాల స్థాయి నుండి బోధనా మాధ్య మంగా ఆంగ్లాన్ని ప్రవేశ పెట్టాలని తీసుకున్న నిర్ణయం సరైన దిశలో ఒక సాహసోపేతమైన ముందడుగు. ఆంధ్రప్ర దేశ్ ఇప్పటికే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. ఇంగ్లీషు మీడియం విద్య తన ముఖ్య మైన ఎజెండాల్లో ఒకటిగా చేసుకొంది. ఈ ఏడాది ఢిల్లీలోని రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ తరఫున పాల్గొన్న శకటం ఇంగ్లీషు మీడియం చదువు ప్రాముఖ్యాన్ని ఎలుగెత్తి చాటింది. దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాల, కళాశాల స్థాయుల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడా నికి కసరత్తు జరుగుతోంది. ఇంగ్లీషు మాధ్యమం విషయంలో కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా ఇప్పుడు వారూ నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. మొత్తం మీద విద్యావేత్తలు, విద్యా నిర్వాహ కులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి ఆంగ్ల మాధ్యమ విద్యకు ఎంతో మద్దతు లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించి నప్పుడు మొదట్లో కొన్ని కార్పొరేట్ పాఠశాలలు, ఇతర స్వార్థ ప్రయోజనాలకుచెందిన కార్టెల్లు వ్యతిరేకించినప్పటికీ, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా కార్యకర్తలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం బలమైన రాజకీయసంకల్పంతో ముందుకు సాగింది. అనేక దళిత సంఘాలు, ఎన్జీఓ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు నిర్వహించి బోధనా మాధ్యమంలో ప్రతిపాదిత మార్పుకు సంఘీభావం తెలిపాయి. ఆంగ్ల విద్య సామాజిక మార్పుకు నాంది పలుకు తుందనీ, సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు విముక్తి కల్పించే సాధనంగా ఉపయోగ పడుతుందనీ వారు భావించారు. ఇంగ్లీషు చదువు వల్ల మాతృభాషకు నష్టం వాటిల్లుతుందని కొందరు అంటున్నారు. కానీ, భయపడాల్సిన పనిలేదు. ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీషును ఒక సబ్జెక్ట్గా బోధిస్తే, పిల్ల లకు ఆ భాషలో కూడా మెరుగైన వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందే అవకాశం ఉంది. సాఫ్ట్ వేర్, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు నడిచే యుగం ఇది. ఇంగ్లీషు పరిజ్ఞానం ఈ రంగాల్లో చాలా అవసరం. ఇవ్వాళ మన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్న పిల్లలకు మెరుగైన అవకాశాలు లభించడం ఖాయం. ఫలితంగా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు పెరుగుతుంది. ఇది అంతిమంగా రాష్ట్ర, దేశ అభివృద్ధికి దారితీస్తుంది. ఇంగ్లీషు ప్రాధాన్యతను పెరుగుతున్న సామాజిక–ఆర్థిక అవసరాల కోణంలో చూడాలి. సృజనాత్మక రచన, సాహిత్య ఎదుగుదల మాతృభాష ద్వారానే సాధ్యమవుతుందనేది నిజం. కానీ ఇంగ్లీషు... దేశం లోపలా, బయటా అన్ని చోట్లా ఉనికిలోకి వచ్చింది. లింక్ లాంగ్వేజ్గా ఉంది. ఈ భాష లేకుండా ఈ రోజు ‘ప్రపంచ పౌరుడి’ని ఊహించలేము. ప్రాథమిక పాఠ శాలల నుండే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే సమాజంలో సమూలమైన మార్పు రావడం ఖాయం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ పాఠ శాలల్లో అధిక ఫీజులు కట్టి పిల్లలను చదివిస్తూ సతమతమవుతున్న మధ్యతరగతి తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెలుగు మాధ్యమాన్ని ఇంగ్లీషులోకి మార్చడం అనేక సవాళ్లతో కూడుకున్న పని. మొదటి అతి ముఖ్యమైనది ఉపాధ్యాయు లకు కొత్తగా శిక్షణ ఇవ్వడం. ముఖ్యంగా మారు మూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇంగ్లీషు కమ్యూనికేషన్ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ప్రతి ఒక్కరికీ తెలుసు.అందువల్ల, ఉపాధ్యాయులు ‘ఇంగ్లిష్అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ’ లేదా అటువంటి ఇతర సంస్థల ద్వారా, ‘ఉపాధ్యాయుల ఇండక్షన్ ప్రోగ్రామ్ల’ ద్వారా శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లీషులో సబ్జె క్టుల బోధనకు ఉపయోగించే రీడింగ్/ టీచింగ్ మెటీరియల్స్ తయారీలో ఉపా ధ్యాయుల పాత్ర, విధి ఉంటుంది. మాతృభాష ఆంగ్లం కాని పిల్లలకు బోధించడంలో అత్యంత సమగ్రమైన పద్ధతి, విధానాలు అత్యంత నైపుణ్యం కలిగి ప్రణాళికాబద్ధంగా అమలు చేయబడేవి. దీనికి తోడు ప్రస్తుతంఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కూడా పెంచాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పాటూ ఎన్ఆర్ఐల ఇష్టపూర్వక సహ కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడ తాయని ఆశిద్దాం. - వ్యాసకర్త హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంత హిస్టరీ ప్రొఫెసర్ - కె.ఎస్.ఎస్. శేషన్ -
ఏపీలో డిజిటల్ బోధన సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యావిధానం అద్భుతంగా ఉందని మెక్సికో దేశానికి చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) అమలులో భాగంగా ఐబీ ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్డో మంగళవారం కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. విజయవాడలోని ఎంకే బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లోని గదులను, ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బోధనా అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు విన్నారు. అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు జెడ్పీ హైసూ్కళ్లను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్ ప్రదర్శన, సైన్స్ ల్యాబ్ను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియన్ యోగా’ ప్రత్యేక ప్రదర్శనకు ఆల్డో ముగ్దులయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్ విధానంపై ప్రిన్సిపల్ను ఆరా తీశారు. విద్యార్థి నుల వివరాలు, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యసన పద్ధతులను పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్థినులు ప్రదర్శించారు. స్కూళ్ల సందర్శన అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దిందని, వసతుల కల్పనలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించిందని ఆల్డో అభినందించారు. ఈ పర్యటనలో ఐబీ ప్రతినిధి వెంటఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ వై.గిరిబాబు యాదవ్, డీసీఈబీ సెక్రటరీ ఉమర్ అలీ ఉన్నారు. -
సర్కార్ బడుల్లో పెరిగిన విద్యార్థుల చేరికలు
-
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
పరీక్షలను భారంగా భావించొద్దు : ప్రధాని మోదీ
-
ఏపీ విద్యా సంస్కరణలు.. దేశానికి దిక్సూచిగా..
సాక్షి, అమరావతి : సాధారణంగా ఏ ప్రభుత్వమైనా విద్యా రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ఇందుకు చెప్పుకోదగ్గ మొత్తం కూడా ఖర్చుపెట్టదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో గత నాలుగున్నరేళ్లుగా విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమేగాక, ఖరీదైన ఇంటర్నేషనల్ బాకలారియెట్ వంటి సిలబస్ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలని సంకల్పించింది. ఈ కాలంలో రాష్ట్రంలో విద్యా రంగం సమూలంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరువయ్యాయి. కొద్దిమందికి మాత్రమే పరిమితమైన సీబీఎస్ఈ సిలబస్ సైతం ఇప్పుడు పేద పిల్లలకు అందుతోంది. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చింది. త్వరలో అత్యంత ఖరీదైన ఐబీ సిలబస్ సైతం ఉచితంగా అందించనున్నారు. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఇలా పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దంపట్టేలా గణతంత్ర దినోత్సవ వేడుల్లో ప్రదర్శించే శకటాన్ని విద్యాశాఖ రూపొందించింది. ఈ నేపథ్యంలో.. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత.. అమలుచేస్తున్న సంస్కరణలపై ప్రత్యేక కథనం.. విద్యా సంక్షేమానికి భారీగా నిధులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచింది. ఇందులో భాగంగా.. ► పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపినందుకు గాను గత నాలుగేళ్లలో ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా 42,61,965 మంది ఖాతాల్లో రూ.26,349.50 కోట్లు ప్రభుత్వం జమచేసింది. ►మనబడి నాడు–నేడు పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.17,805 కోట్ల వ్యయంతో, మూడు దశల్లో 12 మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో దాదాపు 32 వేల పాఠశాలల రూపురేఖలు మారాయి. ►పాఠశాల తెరిచిన మొదటిరోజే ప్రతి విద్యార్థికి ‘జగనన్న విద్యాకానుక’గా ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, కుట్టు కూలీతో మూడు జతల యూనిఫాం క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగుతో పాటు హైస్కూల్ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ అందించి ప్రైవేటు స్కూలు విద్యార్థుల కంటే మిన్నగా బడికి వెళ్లేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. ►బాలికా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేసి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసి అందులో ఒకటి బాలికలకు కేటాయించింది. ఇటు ‘గోరుముద్ద’.. అటు డిజిటల్ చదువులు.. ► దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు చిక్కీ, రాగిజావతో సహా 16 రకాల పదార్థాలతో ‘జగనన్న గోరుముద్ద’ను అందిస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,910 కోట్లు అదనంగా ఖర్చుచేస్తోంది. గోరుముద్ద పథకం కింద ఇప్పటిదాకా రూ.6,262 కోట్లు ఖర్చుచేశారు. ►అలాగే, ఏటా 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రూ.15 వేల విలువైన బైజూస్ కంటెంట్తో రూ.17,500కు పైగా మార్కెట్ విలువగల ట్యాబ్ను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. గత రెండేళ్లలో మొత్తం 9,52,925 ట్యాబులు ఉచితంగా అందించిన ఘనత దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. ► 62 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను, స్మార్ట్ టీవీలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లోను, తరగతి గదుల్లో అమర్చిన ఐఎఫ్బీలు, స్మార్ట్ టీవీల్లో బైజూస్ కంటెంట్ ద్వారా బోధన చేపట్టారు. ఫలితాన్నిచ్చిన విద్యా సంస్కరణలు.. ఈ సంస్కరణల ఫలితంగా గత విద్యా సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించారు. ఇలా ప్రతిభ కనబరిచిన 22,710 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’గా గుర్తించి వారిని సత్కరించి ప్రభుత్వం ప్రోత్సహించింది. విద్యా సంస్కరణల శకటం ఆంధ్రప్రదేశ్లో అమలుచేస్తున్న విద్యా సంస్కరణలను చాటిచెబుతూ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన శకటం శుక్రవారం విజయవాడలో జరిగే గణతంత్ర వేడుకల్లో సందడి చేయనుంది. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోను, విద్య, విద్యార్థుల్లో తీసుకొచ్చిన మార్పులతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శకటాన్ని రూపొందించింది. అలాగే, ఢిల్లీలో జరిగే వేడుకల్లో సైతం ఏపీ విద్యా సంస్కరణల ఆధారంగా రూపొందించిన శకటం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. ‘డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ విధానంతో ఈ వాహనం దేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని పరిచయం చేయనుంది. -
విద్యావ్యవస్థలో పేద ధనిక తారతమ్యం ఉండకూడదు: సీఎం జగన్
-
22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే..
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహం నెలకొంది. ఈ నేపధ్యంలోనే ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రాల్లో ఈ నెల 22న పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే.. ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి గోవా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో కూడా జనవరి 22న పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. హర్యానా హర్యానాలో కూడా రామ్లల్లా పవిత్రోత్సవంనాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ, ముంబైలకు పోటీనివ్వనున్న అయోధ్య స్టార్ హోటళ్లు! -
ఏపీలో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. దీంతో జనవరి 22న(సోమవారం) తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. చదవండి: అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు.. దేశానికే తలమానికం: సీఎం జగన్ -
స్కూల్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్న పూర్వవిద్యార్థులు
-
తృప్తిగా.. కడుపు నిండుగా..మధ్యాహ్న భోజనం
నాడు నీళ్ల సాంబారు, ముద్ద అన్నం పప్పుకు, రసానికి తేడానే ఉండదు పేరుకే ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ సరుకులకు డబ్బు చెల్లింపులో తీవ్ర జాప్యం సరుకులు ఎవరెవరో ఇళ్లకు ఎత్తుకుపోయే పరిస్థితి వంట వాళ్లనూ పట్టించుకోని వైనం ఎవరికీ పట్టని భోజనం నాణ్యత వంటశాల లేక స్కూలంతా పొగ సగటున 50 శాతం మంది విద్యార్థులకే భోజనం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజనం కోసం ఎండలో క్యూలైన్లో వేచిఉన్న విద్యార్థులు నేడు రోజుకో మెనూ చొప్పున మొత్తంగా 16 రకాల ఐటమ్స్ గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం సగటున 90% మంది విద్యార్థులకు భోజనం భోజనం పూర్తయ్యాక ఆహారంపై ఆరా.. బాగుంటే ‘గుడ్’ లేకుంటే ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ నాణ్యత కోసం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి తినే ఏర్పాటు ఎంత మంది భోజనం చేస్తున్నారో ఆన్లైన్లో పక్కాగా రికార్డు 43 లక్షల మంది ప్రతి రోజూ సంతృప్తికరంగా భోజనం సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ 2019–20లో రూ.979.48 కోట్లు, 2020–21లో రూ.1,187.49 కోట్లు, 2021–22లో రూ.1,840.05 కోట్లు, 2022–23లో రూ.1,548.58 కోట్లు, 2023–24లో రూ.1,689 కోట్లు బడ్జెట్ ప్రత్యేకంగా వంట గది, ఎప్పటికప్పుడు బిల్లులు విద్యార్థులకు తరగతి గది పక్కన వరండాల్లో భోజనం పెడుతున్న దృశ్యం -
అంకుల్.. స్కూల్లో వాష్రూమ్స్ లేవు
వేములవాడ రూరల్: ‘అంకుల్.. మాకు వాష్రూమ్స్, మూత్రశాలలు లేవు, ఇబ్బందులు పడుతున్నాం’అని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కు మొరపెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటాంపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన వికసిత్భారత్ సంకల్పయాత్రకు సంజయ్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో బాలరాజుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఎంపీకి ఏకరువు పెట్టారు. దీనికి ఆయన స్పందిస్తూ సౌకర్యాలకు ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు 24 గంటల్లో తెలపాలని అధికారులకు సూచించారు. -
జనవరి 22న ఉత్తర ప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవు
లక్నో: జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ఈనెల 22నన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం దృష్టా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్లల్లా 'ప్రాణ-ప్రతిష్ఠ' కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ఆదిత్యనాథ్ పరిశీలించారు. అదే విధంగా జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని సీఎం తెలిపారు. ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. కాగా అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. చదవండి: మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్ -
AP:సెలవులొచ్చాయి! స్కూళ్లలో మొదలైన సంక్రాంతి ‘సందడి’ మొదలు! (ఫొటోలు)
-
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్లు సరికొత్తగా డెస్్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
ఇలా సెలవులిచ్చారు.. అలా క్యాన్సిల్ చేశారు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ జారీ చేసిన సర్క్యులర్ను ఉపసంహరించుకుంది. సెలవులు పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన గంటలోపే విద్యాశాఖ డైరెక్టరేట్ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సెలవు పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ కొత్తగా మళ్లీ సర్క్యులర్ జారీ చేయనుంది. దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు, పొగమంచు కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించారు. జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పొరపాటుగా సెలవుల ఉత్తర్వు జారీ అయ్యిందని విద్యా శాఖ పేర్కొంది. సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలిగాలుల వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటోంది. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు శీతాకాలపు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. -
ప్రభుత్వ బడికి సరికొత్త శోభ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ రెండో దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రెండో దశలో భాగంగా 22,217 పాఠశాలల్లో పనులు చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే 2,755 స్కూళ్లలో నూరు శాతం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది. అన్ని పాఠశాలల్లో కొత్త భవనాలతో పాటు తాగునీటి నుంచి ఆట వస్తువుల వరకు నిర్దేశిత 12 వసతులను కల్పిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం సదుపాయాలు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నాడు–నేడు మొదటి దశ కింద ఇప్పటికే దాదాపు రూ.3,700 కోట్లతో 15,715 ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. మొదటి దశలో లేని 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు 2,755 స్కూళ్లలో పనులు నూరు శాతం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. అలాగే మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్ల నిర్మాణం, మరో 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లను పూర్తి చేసింది. 394 పాఠశాలల్లో పెయింటింగ్, తాగునీటి సదుపాయాలు తప్ప ఇతర అన్ని పనులూ పూర్తయ్యాయి. రెండో దశలో చేపట్టిన పనులకు ఇప్పటికే రూ.3,535.44 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. సమున్నతంగా నిలిపేందుకు.. వైఎస్ జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను సమున్నతంగా నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లతో సహా అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్లలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలతో సహా మొత్తం 44,512 స్కూళ్లను నాడు–నేడు పథకం కిందకు తీసుకువచ్చారు. పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో, దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నిరంతర నీటి సరఫరాతో పాటు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి డబుల్ డెస్క్ ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్లు, డిజిటల్ క్లాస్రూమ్లు, అదనపు తరగతి గదులు, వంటషెడ్లు, ప్రహరీ వంటి మొత్తం 12 సదుపాయాలను కల్పిస్తున్నారు. -
ఆ రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు
ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో తీవ్రమైన చలి వాతావరణం నెలకొనడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఫలితంగా విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. పెరుగుతున్న చలి దృష్ట్యా ఈనెల 14 వరకూ ఘజియాబాద్లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జలౌన్లో జనవరి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాగ్రాజ్లోనూ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను ఈ నెల 6 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారణాసిలో నిరంతరం పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా పాఠశాల సమయాలను మార్చారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాజలింగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు. -
పేద చదువులపైనా పచ్చ ప్రేలాపనలు
-
TN: తమిళనాడును వదలని భారీ వర్షాలు
చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు విడిచిపెట్టడం లేదు. మొన్నటి దాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్కాశి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు,ప్రైవేటు సంస్థల ఆఫీసులకు సెలవు ప్రకటించింది. దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ‘కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్కాశీ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్)కు చెందిన 250 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం నియమించాం’ అని తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ తెలిపారు. ఇదీచదవండి..ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ -
లక్షల్లో నర్సరీ ఫీజు.. పేరెంట్ ఓరియెంటేషన్ చార్జీలు అదనం..!
కోకాపేటలోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ సంవత్సరం 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. వచ్చే ఏడాది అయిదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలని తల్లిదండ్రులకు మెసెజ్ వెళ్లింది. అంటే పైతరగతికి అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది. ఉప్పల్ చౌరస్తా సమీపంలోని ఓ ప్రముఖ పాఠశాలలో చాలా వాటితో పోలిస్తే అక్కడ కొంత రుసుములు తక్కువనే పేరుంది. అయినా ఈసారి ఒకటో తరగతిలో ప్రవేశానికి 14 శాతం పెంచడం గమనార్హం. అక్కడ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించగా.. వచ్చే ఏడాదికి దాన్ని రూ.57 వేలకు పెంచారు. పాఠశాల ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. డిజీ తరగతులు, ఏసీ క్లాస్రూం, టెక్నాలజీ నేర్పుతున్నామని చెబుతూ యాజమాన్యాలు లక్షల్లో బాదుతున్నారు. అవి ఎందుకు కడుతున్నారో తల్లిదండ్రులకు సరైన వివరాలు అందుబాటులో ఉండవు. పాఠశాల యాజమాన్యం ఫలానా మొత్తం చెల్లించాలని చెప్పగానే.. వీలైతే కొంత బేరమాడి, లేదంటే వారు చెప్పినంత ముట్టజెప్పడం అలవాటైంది. కానీ పాఠశాలకు చెల్లిస్తున్న ఫీజులో అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ట్రావెల్ చార్జీలు, కాషన్ మనీ, వార్షిక చార్జీలు.. ఇలా రకరకాలుగా విభజించి తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. తాజాగా ఓ స్కూల్ యాజమాన్యం 2024-25 విద్యాసంవత్సరానికిగాను నర్సరీ, జూనియర్ కేజీకి ఏకంగా రూ.1,51,656 వసూలు చేస్తుంది. అందుకు అదనంగా ‘పేరెంట్ ఓరియంటేషన్’ పేరుతో రూ.8,400 చెల్లించాలని కోరింది. అయితే అందుకు సంబంధించిన ఫీజు వివరాలతో ఉన్న కాపీ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. अब समझ आ रहा है, पिता जी ने मुझे सरकारी स्कूल में क्यों पढ़ाया था 😭 pic.twitter.com/fkyPlDT6WP — Raja Babu (@GaurangBhardwa1) December 7, 2023 ఫీజుల వినియోగం ఇలా... విద్యాసంస్థల్లో గరిష్ఠంగా ఎంత ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో పాటు... వసూలు చేసిన ఫీజులను ఎలా వినియోగించాలో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: ఆ సిటీలో 8,500 ఎకరాల్లో సోలార్ప్లేట్లతో పార్కింగ్ స్థలం నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతాన్ని టీచర్లు, నాన్ టీచింగ్ స్టాప్ వేతనాలకు, మరో 15 శాతాన్ని గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్కు ఖర్చు చేయాలి. అలాగే మరో 20 శాతం ఫీజును పాఠశాల లేదా కళాశాల అభివృద్ధికి వినియోగించాలి. అలాగే ఆయా విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వివరాలతో పాటు వారి విద్యార్హతలు, వారికి ఇస్తున్న జీతాల సమాచారాన్ని విద్యాశాఖకు తెలియజేయాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను విద్యాసంస్థల వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలి. -
పాఠశాలల్లో లీడ్ ఏఐ ఆధారిత అసెస్మెంట్
ముంబై: ఎడ్టెక్ సంస్థ లీడ్ తాజాగా పాఠశాలల్లో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత మూల్యాంకన విధానాన్ని అందుబాటులోకి తెచి్చంది. నిర్దిష్ట తరగతుల విద్యార్థుల స్థాయులను బట్టి మెరుగైన ప్రశ్నలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడతుందని సంస్థ సీఈవో సుమీత్ మెహతా తెలిపారు. టీచర్లు అవసరమైతే వీటిని సమీక్షించి, తగు మార్పులు, చేర్పులు కూడా చేసేందుకు వెసులుబాటు ఉంటుందని వివరించారు. బోధనాంశాలను నేర్చుకోవడంలో విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించేందుకు, తగు పరిష్కార మార్గాలను అమలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని మెహతా పేర్కొన్నారు. అలాగే ఎగ్జామ్ పేపర్ల లీకేజీ సమస్యకు కూడా అడ్డుకట్ట పడుతుందన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి అసెస్మెంట్ విధానాన్ని ఎంచుకునే వీలు కలి్పంచే ఈ విధానం .. తమ నెట్వర్క్లోని 9,000 పైచిలుకు పాఠశాలల్లో, 50,000 మంది పైచిలుకు ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని మెహతా చెప్పారు. -
బెంగళూరులో స్కూల్స్కు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కలకలం సృష్టించింది. సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు మొయిల్స్ రావడంతో విద్యార్థులు, స్కూల్స్ యాజమాన్యం వణికిపోయింది. దీంతో, ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. వివరాల ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని ఒక ఈ మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. తర్వాత బాంబ్స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది నకిలీ బెదిరింపు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటకలోని సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. తొలుత ఏడు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యాసంస్థలకు అదే తరహా ఈ మెయిళ్లు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన స్కూల్స్ యాజమాన్యం.. విద్యార్థుల పేరెంట్స్కు సమాచారం అందించారు. ‘ఈ రోజు మన పాఠశాల అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. గుర్తుతెలియని వర్గాల నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, వెంటనే వారిని బయటకు పంపించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. మరోవైపు.. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన పాఠశాల్లలో ఒక్క స్కూల్.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి అతి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, వైట్ఫీల్డ్, కొరెమంగళ, బసవేశ్వరనగర్, యెళహంక, సదాశివనగర్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఇదిలా ఉండగా.. గత ఏడాది కూడా బెంగళూరులోని ఏడు పాఠశాలలకు ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, తర్వాత అది నకిలీ బెదిరింపు అని తేలింది. ఇదీ చదవండి: తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్డీ హెచ్చరిక -
జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు!
బీహార్ ప్రభుత్వ విద్యాశాఖ తాజాగా సెలవుల క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ఈద్-బక్రీద్కు మూడు రోజులు, ముహర్రం కోసం రెండు రోజుల చొప్పున సెలవులు కేటాయించారు. ఉపాధ్యాయులకు వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. విద్యార్థులకు యథావిధిగా వేసవి సెలవులు ఉంటాయి. కొత్త సెలవుల పట్టిక ప్రకారం 60 రోజుల సెలవుల్లో 38 రోజులు ఉపాధ్యాయులు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయులకు 22 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. మే ఒకటిన కార్మిక దినోత్సవం సెలవు కూడా రద్దు చేశారు. ప్రత్యేక రోజులలోనూ పాఠశాలలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులలో భోజన వేళకు ముందు ఆ ప్రత్యేకదినానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు తెలియజేయాల్సివుంటుంది. హిందూ పండుగలలో సెలవులు రద్దు చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్కు ఎడతెగని ఆటంకాలు! "तुष्टिकरण के सरदार-बिहार के कुर्सी कुमार" एकबार फिर चाचा-भतीजे की सरकार का हिंदू विरोधी चेहरा सामने आया। एक तरफ स्कूलों में मुस्लिम पर्व की छुट्टी बढ़ाई जा रही हैं,वहीं हिंदु त्योहारों में छुट्टियां खत्म की जा रही हैं। लानत है वोटबैंक के लिए सनातन से घृणा करने वाली सरकार को। pic.twitter.com/3yX6WAeGnx — Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) November 27, 2023 -
ఆ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవులు!
చెన్నై: కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కేరళలో ఈ రెండు రోజులు(బుధ, గురువారాలు) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్డీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు.. తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కేరళ, తమిళనాడులో గత నాలుగు రోజులుగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెం.మీ, 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా జనం అవస్థలు పడుతున్నాయి. కాలనీల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
Israel-Hamas war: స్కూళ్లపై బాంబుల వర్షం
ఖాన్ యూనిస్ (గాజా): గాజాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతుల లేమి, అటు ఇజ్రాయెల్ బాంబింగ్తో అక్కడి పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆస్పత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నడుపుతున్న అల్ ఫలా స్కూల్పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు. గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న అల్ ఫకూరా స్కూల్పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్ లాహియాలోని తల్ అల్ జాతర్ స్కూలు భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. మూ డు ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మర ణం పాలైనట్టు చెబుతున్నారు. ఉత్తర గాజాలో ఓ భవనంపై జరిగిన దాడులకు ఒకే కుటుంబానికి చెందిన 32 మంది బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 19 మంది చిన్నారులున్నారని పేర్కొంది. దక్షిణ గాజాలో పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ శివార్లలో నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 26 మంది పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో పశి్చమవైపున జరిగిన మరో దాడిలో కనీసం 15 దాకా మరణించారు. మరోవైపు బాంబు, క్షిపణి దాడుల్లో పా లస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం కూడా పాక్షికంగా నేలమట్టమైనట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 12 వేలు దాటినట్టు హమాస్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటిదాకా 104 మంది ఐరాస సంస్థల సిబ్బంది కూడా యుద్ధానికి బలవడం తెలిసిందే. ఇంధన సరఫరా తాజాగా గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఖాళీ చేయిస్తోంది. దాంతో రోగులు, సిబ్బంది, శరణార్థులు వందలాదిగా ఆస్పత్రిని వీడుతున్నారు. ఏ మాత్రమూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 120 మందికి పైగా రోగులు, వారిని కనిపెట్టుకునేందుకు ఆరుగురు వైద్యులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో మిగిలినట్టు సమాచారం. తిండికి, నీటికి కూడా దిక్కు లేక గాజావాసుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఘర్షణలు పరిపాటిగా మారాయి. వారిలో డీహైడ్రేషన్, ఆహార లేమి సంబంధిత సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచి్చంది. గాజాకు నిత్యావసరాలతో పాటు ఇతర అవ్యవసర సరఫరాలన్నీ నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. చలి తీవ్రత పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. కాకపోతే గాజాలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన ఇంటర్నెట్, ఫోన్ సేవలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దాంతో అక్కడి పాలస్తీనియన్లకు అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ఐరాస సంస్థలు సమాయత్తమవుతున్నాయి. గాజాకు తాజాగా భారీ పరిమాణంలో ఇంధన నిల్వలు కూడా అందినట్టు అవి వెల్లడించాయి. నోవా ఫెస్ట్ మృతులు 364 మంది ప్రస్తుత యుద్ధానికి కారణమైన అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపు దాడిలో ఇజ్రాయెల్లో 1,200 మంది దాకా దుర్మరణం పాలవడం తెలిసిందే. ఆ సందర్భంగా దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్ను హమాస్ మూకలు దిగ్బంధించి విచక్షణారహితంగా కాల్పులకు దిగాయి. ఆ మారణకాండకు 270 మంది బలైనట్టు ఇజ్రాయెల్ అప్పట్లో ప్రకటించింది. కానీ అందులో ఏకంగా 364 మంది మరణించారని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఫెస్ట్లో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 40 మందికి పైగా మిలిటెంట్లకు బందీలుగా చిక్కినట్టు పేర్కొంది. పులి మీద పుట్రలా... ఉత్తర గాజాను ఇప్పటికే దాదాపుగా ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ ఇప్పుడిక దక్షిణాదిపై దృష్టి పెట్టింది. దక్షిణ గాజాను కూడా తక్షణం ఖాళీ చేసి పశి్చమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ దాడులను ఉధృతం చేస్తోంది. దాంతో దక్షిణ గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఇజ్రాయెల్ ఆదేశాల నేపథ్యంలో 10 లక్షలకు పైగా ఉత్తర గాజావాసులు సర్వం కోల్పోయి చచ్చీ చెడీ దక్షిణానికి వెళ్లడం తెలిసిందే. దాంతో ఆ ప్రాంతమంతా ఒకవిధంగా అతి పెద్ద శరణార్థి శిబిరంగా మారి నానా సమస్యలకు నిలయమై విలవిల్లాడుతోంది. ఇప్పుడు మళ్లీ పశి్చమానికి వలస వెళ్లాలన్న ఆదేశాలు వారి పాలిట పులిమీద పుట్రలా మారుతున్నాయి. -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సరికొత్త హామీ.. ‘సీఎం రైజ్’ స్కూళ్లు
Madhya Pradesh Elections: మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగనుండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సరికొత్త హామీ ఇచ్చారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్’ స్కూల్ను ఏర్పాటు చేస్తామన్నారు. సాగర్ జిల్లాలో ప్రచార ర్యాలీలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ స్కూల్కు వచ్చి వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత బస్సుతోపాటు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ‘రాష్ట్రంలోని ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్’ స్కూల్ను ఏర్పాటు చేస్తాం. ఇక్కడ లైబ్రరీ, ల్యాబ్లు, స్మార్ట్ క్టాస్రూమ్లతో పాటు విద్యార్థులను స్కూల్కి తీసుకొచ్చి, ఇంటికి చేర్చేందుకు బస్సులు ఉంటాయి. ఇవన్నీ ఉచితమే’ అని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రకటన చేశారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. కాగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1990 నుంచి ఆయన ఇక్కడ ఐదు పర్యాయాలు పోటీ చేసి గెలుపొందారు. -
ఆధార్ లింక్.. బడికి బంక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆధార్ అప్డేట్ కష్టాలు చుట్టుముడుతున్నాయి. పదేళ్లకోసారి కార్డుదారుడి వేలిముద్రలను మరోసారి సేకరించడంతోపాటు ఫోన్ నంబర్, పేరు, చిరునామా సవరణల కోసం ఈ–కేవైసీ (ఎల్రక్టానిక్ నో యువర్ కస్టమర్) వివరాల నమోదును ఆధార్ సంస్థ తప్పనిసరి చేయడం, ఈ–కేవైసీ కాని కుటుంబాల్లోని వారి పేర్లను రేషన్కార్డుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆధార్ నమోదు కేంద్రాలకు తాకిడి విపరీతంగా పెరిగింది. ఒక్కో కేంద్రం వద్ద నిత్యం పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తుండడంతో చాలా మంది తెల్లవారుజాము నుంచే కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయితే వారిలో అత్యధికులు పాఠశాల విద్యార్థులే ఉంటున్నారు. వరుసగా రెండు, మూడు రోజులపాటు స్కూళ్లు ఎగ్గొట్టి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగితేగానీ ఈ–కేవైసీ నమోదు సాధ్యంకావట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులతోనే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఆధార్ నమెదు కేంద్రాల్లో పిల్లల తాకిడి విపరీతం కావడంతో అటు పిల్లలు, ఇటు పెద్దలు ఆధార్ ఈ–కేవైసీ కోసం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. చేతులెత్తేసిన విద్యాశాఖ... బడి పిల్లలకు ఉచితంగా ఆధార్ ఎన్రోల్మెంట్, సవరణ ప్రక్రియ కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకంగా ఆపరేటర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి పాఠశాలలోనే ఆధార్ నమోదు కౌంటర్లు తెరిచి విద్యార్థులందరికీ ఉచితంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 876 కిట్లను ఆపరేటర్లకు అప్పగించి నమోదు ప్రక్రియను మొదలుపెట్టింది. కానీ ఈ కార్యక్రమానికి శాఖపరంగా పర్యవేక్షణలోపం, దానికితోడు అధికారుల ఉదాసీనవైఖరి తోడవడంతో పాఠశాల స్థాయిలో నమోదు ప్రక్రియ అటకెక్కింది. అందుకు బదులుగా ఆయా కిట్లను ఆపరేటర్లు తమకు నచ్చినచోట కౌంటర్ ఏర్పాటు చేసుకొని నమోదు ప్రక్రియను సాగిస్తూ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కేవలం పాఠశాల పిల్లల వివరాలను నమోదు చేయాల్సి ఉండగా పెద్దల వివరాలను కూడా నమోదు చేçస్తున్నారు. అయితే చాలాచోట్ల ఈ కిట్ల ద్వారా ఎంట్రీ చేస్తున్న వివరాలు తప్పులతడకగా ఉంటుండటంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. కేంద్రాలను పెంచరు... కొత్త కిట్లు ఇవ్వరు... ఆధార్ నమోదు నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం రాష్ట్రంలో 650 శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు గరిష్టంగా 100 మంది వివరాల నమోదు మాత్రమే సాధ్యమవుతోంది. ఆపరేటర్ల తిరస్కరణ, నమోదు కేంద్రాల నిర్వహణ భారంతో ప్రస్తుతం 350 శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఫలితంగా తాకిడీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రాల సంఖ్య పెంచాలని లేదా కొత్తగా రెండో కిట్టు ఇవ్వాలని ఆధార్ సంస్థకు నిర్వాహకులు వినతులు సమర్పిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావట్లేదు. నిత్యం గలాటాలు... పరిమితికి మించి జనాలు రావడం... సాంకేతిక కారణాలతో నమోదు ప్రక్రియ జాప్యం జరుగుతుండటం లాంటి కారణాలతో ప్రతి రోజూ కార్డుదారులు మమ్మల్ని నిలదీస్తున్నారు. –శ్రీనివాస్, ఆధార్ కేంద్రం నిర్వాహకుడు బోడుప్పల్ వినతులు బుట్టదాఖలు.. మా కేంద్రానికి రెండో కిట్టు కేటాయించాలని గత కొంతకాలంగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. –కె.పవిత్ర, ఆధార్ కేంద్రం నిర్వాహకురాలు ఇబ్రహీంపట్నం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రంలో శనివారం కనిపించిన దృశ్యం ఇది. కేవలం ఆధార్లో వివరాల నమోదు కోసం బడికి సెలవుపెట్టి మరీ వచ్చినట్లు వారంతా పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆధార్ నంబర్ లింకుతో గతంలో ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ ఎన్రోల్మెంట్ జరగ్గా ఇప్పుడు ఆయా విద్యార్థులు వారి వేలిముద్రలతో ఆధార్లో అప్డేట్ చేసుకుంటున్నారు. వీరంతా ఆధార్ వివరాల అప్డేషన్ కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆధార్ నమోదు కేంద్రానికి ఉదయం 7 గంటలకే క్యూలో నిలబడ్డారు. ఒక్కో సెంటర్లో రోజుకు పరిమిత సంఖ్యలోనే వివరాల అప్డేషన్ ప్రక్రియ జరుగుతుండడంతో తెల్లవారుజాము నుంచే టోకెన్లు తీసుకునేందుకు ప్రయతి్నస్తూ ఇలా లైన్లలో నిరీక్షిస్తున్నారు. -
మంచి నేర్పండి ఇలా
-
నేటినుంచి మళ్లీ బడులు
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి విజయదశమి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొనడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే సిలబస్ అనుకున్న మేర పూర్తవ్వలేదు. చాలా స్కూళ్లల్లో 40 శాతం సిలబస్ కూడా పూర్తవ్వలేదు. దీంతో ఎన్నికల లోపు సిలబస్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది టీచర్లు పోలింగ్ విధులకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి శిక్షణ కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఇప్పుడు జిల్లాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. అంటే మరో 15 రోజుల్లో ఉపాధ్యాయులు పూర్తిగా ఎన్నికల శిక్షణలోనే పెద్ద సంఖ్యలో పాల్గొనే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్ పూర్తి చేసేందుకు కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ముఖ్యంగా టెన్త్ పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పబ్లిక్ పరీక్షలు కావడంతో సిలబస్ కోసం అదనపు క్లాసులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత డిసెంబర్లో ఈ ప్రక్రియ చేపట్టే వీలుందని చెబుతున్నారు. దసరా వరకూ 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని, మిగిలిన సిలబస్ను డిసెంబర్లో ప్రత్యేక క్లాసుల ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. దశల వారీగా అల్పాహారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి దసరా తర్వాత దీన్ని అమలు చేయాలని భావించినా, ఎన్నికల షెడ్యూల్డ్ వస్తుందని తెలియడంతో ముందే ప్రారంభించారు. పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్ళల్లో దసరా తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అనుకున్నారు. కానీ ఇందుకు అవసరమైన ప్రణాళిక పూర్తవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ స్కూలులో వంట సామాగ్రి, బడ్జెట్ అంశాలపై స్పష్టత లేదంటున్నారు. దీంతో తొలి రోజు మండలానికి ఒక స్కూల్లో సీఎం అల్పాహారం పథకం అమలు చేయాలనిఅధికారులు నిర్ణయించారు. ప్రతీ వారం ప్రతీమండలంలో ఒక్కో స్కూల్ చొప్పున, దశలవారీగా విస్తరించబోతున్నట్టు అధికారులు తెలిపారు. -
టెన్త్ ఫెయిలైన 88,342 మంది తిరిగి బడికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉన్నత విద్య చదవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. అందుకే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు. పలు సంస్కరణలు తెచ్చారు. అందులో భాగమే టెన్త్ ఫెయిలైన విద్యార్థులను తిరిగి స్కూళ్లలో ఎన్రోల్ చేయించి తరగతులకు పంపడం. వారు పదో తరగతి ఫెయిలైన తర్వాత చదువు మానేయకుండా ఈ చర్యలు చేపట్టారు. మధ్యలో చదువు మానేస్తే పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్తమవుతుంది. దీంతో వారిని తిరిగి తరగతులకు పంపుతున్నారు. తిరిగి పదో తరగతిలో చేరిన వారికి విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ప్రభుత్వం అందిస్తోంది. గత విద్యా సంవత్సరంలో 1.23,680 మంది విద్యార్థులు టెన్త్ ఫెయిలయ్యారు. వారు తిరిగి స్కూల్స్లో చేరారా లేదా అనే వివరాలన్నింటినీ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల ద్వారా ప్రత్యేక ట్రాకింగ్ సాఫ్ట్వేర్తో ప్రభుత్వం సేకరించింది. వారిలో 88,342 మందిని ఇప్పటివరకు తిరిగి పదో తరగతిలో ఎన్రోల్ చేయించింది. ఇప్పుడు ఈ విద్యార్థులంతా తిరిగి తరగతులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ అంశంపై సమీక్షించారు. అదనంగా చేరికలు గత విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 1,26,212 మంది అదనంగా చేరారు. గత విద్యా సంవత్సరంలో టెన్త్లో 6,64,511 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 7,90,723 మంది ఎన్రోల్ అయ్యారు. అందరినీ బడిబాట పట్టించడంతో పాటు ఆ పిల్లలందరూ డిగ్రీ వరకు చదివేలా సూక్ష్మస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేయడమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు. పాస్ అయిన విద్యార్ధులు అంతటితో చదువు ఆపేయకుండా తదుపరి కోర్సుల్లో చేరుతున్నారా లేదా అనే వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో సేకరిస్తోంది. చదువు ఆపేసిన వారిని పై తరగతుల్లో చేరేలా ప్రోత్సహిస్తోంది. ప్రతి పేద విద్యార్ధి ఆరి్థక స్థోమత లేక మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా రాస్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, నాడు–నేడు కార్యక్రమాలన్నీ విద్యార్ధులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే పథకాలే. -
ఏపీలో రేపటి నుంచి దసరా సెలవులు
సాక్షి, విజయవాడ: ఏపీలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తోంది. ఎప్పుడు.. ఎక్కడి నుంచంటే.. 13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700 బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి.విశాఖపట్నం నుండి 480 బస్సులు,రాజమండ్రి నుండి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. చదవండి: విద్యా సంస్కరణలపై వక్రభాష్యాలు -
నేటి నుంచి తెలంగాణలో బడులకు దసరా సెలవులు
హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు నేటి (శుక్రవారం)నుంచి బతుకమ్మ, దసరా సెలవులు. అక్టోబర్ 13 నుంచి బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు బడులకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొంది. Follow the Sakshi TV channel on WhatsApp: -
TS: ఈనెల 13 నుంచి స్కూళ్లకు బతుకమ్మ, దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు బతుకమ్మ, దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో అక్టోబర్ 6 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చదవండి: బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఖాయం: బండి సంజయ్ -
ఏపీలో 14 నుంచి దసరా సెలవులు
సాక్షి, అమరావతి: ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం సమయంలో. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. -
వైట్ హౌస్లో ఏపీ విద్యా ప్రభ
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ను సందర్శించారు. ఇప్పటి వరకు వైట్హౌస్ను బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు.. తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు. విద్యార్థులను వైట్ హౌస్ భద్రత సిబ్బంది శ్వేత సౌధం మొత్తం తిప్పారు. భవనంలో ప్రతి ఒక్క విభాగం పని విధానాన్ని అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా భవనంలో కలియదిరిగారు. అక్కడి విభాగాలు, సిబ్బంది పనితీరు, సెక్యూరిటీ సిస్టం, అధ్యక్షుడు నివసించే భవనం, కార్యాలయం పని విధానాలను తెలుసుకున్నారు.ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లబ్ధిపొందిన వారే చెప్పడం సమంజసమని భావించిన ప్రభుత్వం.. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇలా దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మన రాష్ట్రం నుంచే ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో యునైటెడ్ నేషన్స్లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ సమన్వయంతో, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పర్యవేక్షణలో విద్యార్థుల బృందం ఈనెల 14న అమెరికాకు వెళ్లింది. ఈ బృందంలో మాల శివలింగమ్మ, (తండ్రి సోమనాథ్ రైతు కూలీ, తల్లి గంగమ్మ), మోతుకూరి చంద్రలేఖ (ఏఎస్ఆర్ జిల్లా,తండ్రి రామారావు ఆటో డ్రైవర్), గుండుమోగుల గణేష్ అంజన సాయి (పశ్చిమ గోదావరి జిల్లా, తండ్రి గోపీ, కౌలు రైతు), దడాల జ్యోత్స్న (కాకినాడ జిల్లా, తండ్రి సింహాచలం సెక్యూరిటీ గార్డు), చాకలి రాజేశ్వరి (నంద్యాల జిల్లా, తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్), పసుపులేటి గాయత్రి (ఏలూరు జిల్లా, తండ్రి రమేష్, తల్లి కూలీలు), అల్లం రిషితారెడ్డి (విజయనగరం జిల్లా, తండ్రి రామకృష్ణారెడ్డి మెకానిక్), వంజివాకు యోగేశ్వర్ (తిరుపతి జిల్లా, తండ్రి నాగరాజు కేబుల్ ఆపరేటర్), షేక్ అమ్మాజన్(శ్రీ సత్యసాయి జిల్లా, తల్లి షేక్ ఫాతిమా వ్యవసాయ కూలీ), సామల మనస్విని (పార్వతీపురం మన్యం జిల్లా, తల్లి కృష్ణవేణి) ఉన్నారు. ఈ నెల 15 నుంచి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలిలో జరిగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ) సదస్సుతో పాటు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్లో రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’, విద్యా సంస్కరణలపై వీరు ప్రసంగించారు. న్యూయార్క్లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్లో నిర్వహించిన ఎస్డీఎస్ సర్విస్ సదస్సు, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో సైతం పాలుపంచుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్లో ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాలను సందర్శించి భారత్కు తిరుగుపయనమయ్యారు. సీఎంకు విద్యార్థుల కృతజ్ఞతలు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి సదస్సు కోసం రాష్ట్రం తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైనందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తాము నేర్చుకున్న అంశాలను రాష్ట్రంలోని విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. పేద కుటుంబాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తమను ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్కుమార్కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. -
కొండకోనల్లో ‘కొత్త’ బడులు
సాక్షి, అమరావతి: ‘నాడు – నేడు’ కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. రవాణా సౌకర్యం లేని కొండకోనల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లోని ఈ పాఠశాలలను ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ ఈ పాఠశాలలు పాకల్లో, రేకుల షెడ్లలో నడుస్తున్నాయి. చాలా తక్కువ స్కూళ్లకు భవనాలు ఉన్నప్పటికీ, అవి శిథిలమైపోయాయి. ఇలాంటి పాఠశాలలకు ప్రభుత్వం ‘నాడు – నేడు’ కార్యక్రమం రెండో దశ కింద కొత్త రూపునిస్తోంది. వీటిలో పాడుబడ్డ భవనాలను బాగు చేసి, కొత్త భవనాలు కూడా నిర్మిస్తోంది. తొలుత 20 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న 763 స్కూళ్లను గుర్తించారు. వీటిలో రూ.219.69 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 75 పాఠశాలలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 66, తిరుపతి 51, చిత్తూరు 42, సత్యసాయి జిల్లాలో 38 ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 9 నుంచి 30 వరకు పాఠశాలలు ఉన్నాయి. కొత్త భవనాలు నిర్మించాల్సినవి 360 వరకు ఉండగా, మిగిలినవి మెరుగులు దిద్దాల్సినవి ఉన్నాయి. ఇప్పటికే 180 స్కూళ్ల పనులు పూర్తి చేయగా, మిగిలిన పాఠశాలల పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని పాఠశాల విద్యా శాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ ఆదేశించారు. నాడు–నేడు మూడో దశలో ఏజెన్సీలోని 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను ఆధునీకరించాలని నిర్ణయించారు. 817 పాఠశాలల్లో సదుపాయాలు.. ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో నాడు–నేడు పనులు చేపట్టిన 817 పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన రూ.46.83 కోట్లతో ఈ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి పాఠశాలలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 457 ఉన్నాయి. -
వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లను నడపాలా? వద్దా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగమే నిర్ణయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్రాంతంలో వర్షం ప్రభావం ఒక్కోలా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా, కొన్నిచోట్ల వర్ష ప్రభావం అంతగా ఉండటం లేదు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడం సరికాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ శాఖ నివేదికను పరిగణనలోనికి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ను విద్యాశాఖ తిరస్కరించింది. హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో వర్షం ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో వర్షం ఏమాత్రం లేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిలా్లల్లో వర్షం కారణంగా స్కూళ్లు నడపలేని పరిస్థితి ఉన్నప్పుడు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ పరిస్థితులు ఉంటున్నాయని గుర్తించారు. వర్షం తీవ్రంగా ఉండి, వరదలు, వాగులు పొంగడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు విద్యార్థులు స్కూళ్లకు రాలేరని విద్యాశాఖ భావిస్తోంది. అలాంటప్పుడు జిల్లావ్యాప్తంగా సెలవు ప్రకటించే అధికారం ఆ జిల్లా యంత్రాంగానికే ఉంటుందని, ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వర్షాలతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చిన పక్షంలో ఇతర సా«దారణ సెలవులు తగ్గించి, సిలబస్ పూర్తికి చర్యలు తీసుకోవాలని, అవసరమైనప్పుడు ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. -
హైదరాబాద్లో స్కూళ్లకు ఇవాళ సెలవు
-
భారీ వర్షం.. హైదరాబాద్లో నేడు స్కూళ్లకు సెలవు
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాల కారణంగా హైదరాబాద్లో స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పొరుగున్న ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్కు రెడ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. మరో మూడు గంటల పాటు భారీ వర్షం కొనసాగవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో డీఆర్ఎఫ్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులను అధికారులు సూచించారు. చదవండి: హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీ.. -
తెలంగాణలో కుండపోత వర్షాలు.. అక్కడ స్కూళ్లకు సెలవులు
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ నేడు సెలవు ప్రకటించారు. భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యధికంగా మోపాల్ మండలంలో 15.7 సెంటీమీటర్లు, ఇందల్వాయిలో 14.8, డిచ్పల్లి మండలం గన్నారంలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. 10 మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిరికొండ మండలం తుంపల్లిలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చీమన్ పల్లి, గన్నారం, దర్పల్లి, కమ్మర్ పల్లి, మెండోరా , మోర్తాడ్ లో 5 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదైంది. ఇక జిల్లాలో కురుస్తున్న కుండపోత వానలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది కామారెడ్డి జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట సదాశివనగర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి పలు మండలాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చెరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చదవండి: మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్లో పోస్టర్లు తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో వాగు పొంగిపొర్లుతోంది. వాగు ప్రవహించడంతో టేక్రియాల్, బ్రాహ్మణపల్లి, సంగోజి వాడి, కాలోజివాడి, చందాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేగాక తాడ్వాయి మండలం సంతయిపేట గ్రామ శివారులోని భీమేశ్వర వాగు, పాల్వంచ మండలం వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయిదు రోజులు వర్షాలు అల్పపీడన ప్రభావంతో వచ్చే అయిదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని హైదాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, నారాయణపేట, నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.అదిలాబాద్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్,కొమరం భీం, మహబూబబాద్,మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రంగా రెడ్డి, సిద్దిపేట, సూర్యా పేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
France: బుర్ఖా నిషేధంపై రగడ
ప్యారిస్: ఫ్రాన్స్ స్కూళ్లలో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ)లను నిషేధించనున్నారు. పాఠశాలల్లో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు స్కూళ్ల ఉన్నతాధికారులకు విధి విధానాలను తెలియజేస్తామని చెప్పారు. 'లౌకికవాదం మొదట పాఠశాలలోనే తెలుసుకోవాల్సిన విధానం. బుర్ఖా(అబయ)లు మతపరమైన గుర్తును కలిగి ఉన్నాయి. దీనివల్ల ఫ్రాన్స్ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతుంది. తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతో మతం ఎంటో చెప్పేలా ఉండకూడదు.' అని గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే ఎలాంటి దుస్తులను ధరించకూడదని పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు. పాఠశాలల్లో బుర్ఖా(అబయ) ధరించే సాంప్రదాయం క్రమంగా పేరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలకు ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. పాఠశాలల్లో ఇస్లామిక్ బుర్ఖా(అబయ)లను నిషేధించాలనే వాదనలు ఫ్రాన్స్లో కొద్దిరోజులుగా తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. వామపక్షవాదులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముస్లిం సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మతపరమైన గుర్తులంటే కేవలం వేషధారణ మాత్రమే కాదని అంటున్నాయి. ఇతర వస్తువులు కూడా మతపరమైన గుర్తులను సూచిస్తాయని చెబుతున్నాయి. కానీ ప్రతిపక్ష రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ అధినేత ఎరిక్ సియోట్టో ప్రభుత్వ విధానాలకు స్వాగతం పలికారు. ఇదీ చదవండి: ప్రిగోజిన్ మృతి చెందాడా..? రష్యా జన్యు పరీక్షల్లో ఏం తేలింది..? -
100 జీఈఆర్ను నిజాయితీగా సాధించాలి
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్లు 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించారని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. నంద్యాల జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన పలు పాఠశాలల పనితీరును పరిశీలించారు. బనగానపల్లిలోని వలంటీర్లు తమ పరిధిలోని గృహాల్లో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు చేయించారు. దీంతో ఈ వలంటీర్లకు యాప్ ద్వారా బ్యాడ్జి వచ్చిది. వీరు తమ పరిధిలో ఒకటికి రెండుసార్లు డేటాను పరిశీలించి.. ‘నా సర్వే సరైంది.. ఇది నా చాలెంజ్.. మిషన్ జీఈఆర్ 100 శాతం ఆంధ్రా’ అనే క్యాప్షన్తో బ్యాడ్జి స్క్రీన్షాట్ను వారి వాట్సాప్ స్టేటస్లో ఉంచారు. వీరి సవాలును స్వీకరించిన మిగతా 60 వేల మంది వలంటీర్లు కూడా తమ పరిధిలోని డేటాను మరోసారి తనిఖీ చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. నూరు శాతం జీఈఆర్ను నిజాయితీ, నిబద్ధతతో సాధించాలన్నారు. -
విద్యార్థి తాగునీటి బాటిల్లో మూత్రం
కొరుక్కుపేట(చెన్నై): పుదుకోట్టై సమీపంలోని కీలయూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఓ విద్యార్థిని ఇటీవల బాటిల్లోని నీరు తాగి వెంటనే వాంతులు చేసుకుంది. దీనికి కారణం ఏమిటని విచారించగా, ఆ విద్యార్థి తాగునీటి బాటిల్లో మూత్రం కలిపినట్లు తేలింది. అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. దీంతో జిల్లా ప్రధాన విద్యాశాఖాధికారి మంజుల, అధికారి పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పాఠశాలకు పిలిపించి ప్రశ్నించారు. దీంతో విద్యార్థిని తాగే వాటర్ బాటిల్లో మూత్రం కలిపినట్లు ఇద్దరు విద్యార్థులు అంగీకరించారు. వెంటనే ఉపాధ్యాయులు ఇద్దరికీ పాఠశాల నుంచి బహిష్కరించారు. కాగా పుదుచ్చేరిలో సమీపంలోని వెంగ్కైవ్యాల్లో కొన్ని నెలల క్రితం ఓ పార్టీ వినియోగించే తాగునీటి ట్యాంక్లో మలం కలిపిన విషయం సంచలనం కలిగించింది. ఈ విషయం మరువక ముందే తాగినీటి బాటిల్లో మూత్రం కలిపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చదవండి వచ్చే ఉగాదికి ఘోర విపత్తు.. జోస్యం చెప్పిన కోడిమఠం స్వామి -
మీకు తెలుసా? తాటాకు బొమ్మలకు చాలా డిమాండ్, ఉపాధి మార్గం
తాటాకులు ఇప్పటికీ మన పల్లెల్లో విస్తారం. కానీ తాటాకు విసనకర్రలు పోయాయి. తాటాకు చాపలు, తాటాకు బొమ్మలూ పోయాయి. ‘మన కళ ఇది. మన పిల్లలకు బార్బీ కంటే తాటాకు బొమ్మలే నచ్చుతాయి’ అంటుంది కోయంబత్తూరు మోహనవాణి. తాటాకు కళను పిల్లలకు నేర్చించి వారికై వారు తయారు చేసుకున్న బొమ్మలతో ఆడుకునేందుకు ప్రోత్సహిస్తోంది. స్త్రీలు సరిగా నేర్చుకుంటే ఉపాధి మార్గం అని కూడా చెబుతోంది. మన దేశంలో పశ్చిమ బెంగాల్లో తాటాకుతో చేసే బొమ్మలకు, బుట్టలకు చాలా డిమాండ్ ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. విశాఖ జిల్లా నక్కపల్లి, నర్సీపట్నంల నుంచి శ్రేష్టమైన తాటాకు గ్రేడింగ్ అయ్యి, రంగులు అద్దుకుని కోల్కతాకి ఎగుమతి అవుతుంది. అక్కడ వాటితో బొమ్మలు, బుట్టలు తయారు చేసి అమ్ముతున్నారు. పెద్ద ఆదాయం. విశాఖలో జరుగుతున్నట్టుగా మిగిలిన జిల్లాల్లో జరగడం లేదు. తాటాకులు మన తొలి కాగితాలు. తాటాకుతో ఒకప్పుడు ఇళ్లు కప్పేవారు, పందిళ్లు వేసేవారు, చాపలు, బుట్టలు, బొమ్మలు తయారు చేసేవారు. ఇప్పుడు ఆ కళంతా ఎవరూ సాధన చేయడం లేదు. దానిని అందరికీ నేర్పించాలని కూడా అనుకోవడం లేదు. కాని తమిళనాడులో 34 ఏళ్ల మోహనవాణి అనే మహిళ పట్టుబట్టి తాటాకు బొమ్మల కళను అందరికీ నేర్పుతోంది. దక్షిణాదిలో విస్తారంగా ఉండే తాటి చెట్టు నుంచి ఆకు సేకరించి బొమ్మలు చేసి ఉపాధి పొందవచ్చంటున్నది. ఎనిమిదేళ్ల వయసులో.. మోహనరాణిది కోయంబత్తూరు. ఆమెకు ఎనిమిదేళ్లు ఉండగా మేనమామ ఆమెకు తాళపత్ర గ్రంథం చూపించాడు. రోజూ చూసే తాటాకుల మీద పుస్తకమే రాయవచ్చా అని మోహనరాణికి ఆశ్చర్యం వేసింది. తాటాకులతో చిన్న చిన్న బొమ్మలు చేసే ప్రయత్నం చేసిందిగాని పూర్తిగా రాలేదు. అప్పటినుంచి తాటాకు బొమ్మలు చేయాలనే కోరిక ఉండిపోయింది. ఐదేళ్ల క్రితం మదురైలో తాటాకు బొమ్మలు నేర్పించే వర్క్షాప్ జరుగుతున్నదని తెలిసి హాజరయ్యింది. మూడు రోజుల ఆ వర్క్షాప్లో తాటాకు బొమ్మలు చేయడం నేర్పించారు. పచ్చి ఆకుతో నేరుగా, ఎండిన ఆకైతే నీటితో తడిపి మెత్తగా చేసుకుని అప్పుడు బొమ్మలు చేయాలని తెలిసింది. ఎలా కత్తిరిస్తే ఏ షేప్ వస్తుందో అర్థమయ్యాక తన ఊహ కలిపి బొమ్మలు తయారు చేసింది. వాటికి పూసలు జత చేయడంతో స్పష్టమైన బొమ్మలు తయారయ్యాయి. మోహనవాణి తాటాకులతో చీమలు, చిలుకలు, నెమళ్లు, చేపలు... ఇలా చాలా బొమ్మలు చేస్తుంది. వాటితో గట్టి బుట్టలు కూడా అల్లుతుంది. పిల్లల లోకం అయితే ఈ బొమ్మలు తర్వాతి తరాలకు అందాలని నిశ్చయించుకుంది మోహనవాణి. కోయంబత్తూరులోని స్కూళ్లకు వెళ్లి తాటాకు బొమ్మలు నేర్పించింది. పిల్లలు ఎంతో హుషారుతో బొమ్మలు నేర్చుకున్నారు. కొత్త బొమ్మలు చేశారు. ‘ఆశ్చర్యం ఏమిటంటే మీరు తయారు చేసిన బొమ్మలతో కథ కల్పించి చెప్పండి అనంటే వాళ్లు చాలా విచిత్రమైన కథలు చెప్పారు. పిల్లలకు ఇదెంతో మానసిక వికాసం అనిపించి తరచూ అనేక స్కూళ్లకు వెళ్లి వర్క్షాపులు నిర్వహించి ఈ కళను నేర్పుతున్నాను’ అంది మోహనవాణి. ప్లాస్టిక్కు దూరం తాటాకు బొమ్మలు పర్యావరణ హితమైనవి. పిల్లల్ని, పర్యావరణాన్ని ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంచుతాయి. అంతేకాదు తాటాకు బొమ్మలు దేశీయమైనవి. మనదైన కళ కావడం వల్ల పిల్లలు కృత్రిమ పాశ్చాత్య బొమ్మలతో కాకుండా అమాయకమైన ఈ బొమ్మలతో ఎక్కువ ఆనందం పొందుతారు. ‘పర్యావరణ స్పృహ పెరిగింది కాబట్టి తాటాకు బుట్టలను, బాక్సులను, విసనకర్రలను చాలామంది కొంటున్నారు. మహిళలు ఈ కళను నేర్చుకుంటే అతి తక్కువ పెట్టుబడితో మంచి ఉపాధి పొందవచ్చు’ అంటోంది మోహనవాణి. ఆమె ఇప్పుడు ముంబైలోని కొన్ని స్కూళ్లకు వెళ్లి ఈ విద్య నేర్పుతోంది. మిగిలిన రాష్ట్రాలలో కూడా చాలా స్కూళ్లు ఆమెను ఆహ్వానిస్తున్నాయి. టీచర్లు ఈ క్రాఫ్ట్ నేర్చుకుంటే పిల్లలకు నేర్పించవచ్చని టీచర్లకు తాటాకు కళ నేర్పుతోంది మోహనవాణి. ‘తాటాకు బొమ్మలు చేయడం పెద్ద స్ట్రెస్బస్టర్. మీ ఒత్తిడి దూరం చేసుకోవడానికైనా తాటాకు అందుకుని బొమ్మలు చేయండి’ అంటోంది మోహనవాణి. -
స్కూళ్లలో సంఘాలకు నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోకి కూడా విద్యార్థి సంఘాలు అడుగుపెట్టడం కష్టమే. ఏ విద్యార్థి సంఘాన్ని అనుమతించవద్దంటూ డీఈఓలకు పాఠశాల విద్య డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. ఏదైనా పాఠశాలలోకి ఏ విద్యార్థి సంఘం నాయకుడైనా వచ్చినట్టు రుజువైతే దానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ సర్క్యులర్లో పేర్కొంది. ఒకవేళ విద్యారి్థసంఘం నేతలు స్కూలుకు వస్తే హెచ్ఎంపై కఠినచర్యలూ తప్పవని హెచ్చరించింది. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాఠశాలవిద్య డైరెక్టర్ దేవసేన ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థి సంఘాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ జరిగినట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విద్యాసంస్థలు కేంద్రంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూడాలని ప్రభుత్వం ఇచి్చన ఆదేశాల మేరకే పాఠశాలవిద్య డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆమె తెలిపినట్టు డీఈఓలు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు, సంఘాలు, వ్యక్తులు, విద్యా సంఘాలు ఎవరైనా సరే ముందుగా డీఈఓ అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది అప్రజాస్వామికమని, విద్యార్థి సమస్యలపై నినదించే హక్కు తీసివేయడం తగదంటున్నాయి. హెచ్ఎంలలో ఆందోళన విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం ఎలా సాధ్యమని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నిర్బంధం విధిస్తే వారినుంచి ప్రతిఘటన వస్తుందని, ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుంటే ప్రశాంతమైన పాఠశాల ప్రాంగణంలో అశాంతి నెలకొంటుందంటున్నారు. -
తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి...
లక్నో: విద్యార్థులకు చదువుతో వారికి మంచి చెడులను కూడా బోధించే వాడే ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఓ గౌరవం ఉంది. అయితే ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం ఛీ ఇవేం పనులు అనుకునేలా తప్పతాగి పాఠశాలకు వెళ్లడమే కాకుండా తరగతి గదిలోనే ఆదమరిచి నగ్నంగా నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో బహ్రైచ్ జిల్లాలోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశేశ్వరగంజ్ బ్లాక్లోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో దుర్గా ప్రసాద్ జైశ్వాల్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం ఫూటుగా మద్యం సేవించి పాఠశాలకు వెళ్లాడు. విద్యార్థుల మందే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నిద్రపోయాడు. ఇదంతా కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ముందు దుర్గా జైస్వాల్ అనుచిత ప్రవర్తన గురించి తెలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ ప్రధానోపాధ్యాయుడు తరచూ ఇలాంటి చర్యలను పాల్పడేవాడని ఆరోపించారు. ఇటువంటి చేష్టలతో ఇబ్బంది పడిన విద్యార్థినులు కొందరు పాఠశాలకు వెళ్లడం మానేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై చర్య తీసుకున్న ప్రాథమిక శిక్షా అధికారి (బిఎస్ఎ) బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో విచారణకు ఆదేశించడంతో పాటు దుర్గా జైస్వాల్ను సస్పెండ్ చేశారు. అతడిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని.. అవసరమైతే, ప్రధానోపాధ్యాయుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. చదవండి జేసీబీతో ఏటీఎంపై దాడి.. దోపిడీకి దొంగల యత్నం -
తెలంగాణలో రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు
-
భారీ వర్షాలు... పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
-
‘స్కూళ్లలో స్మార్ట్ఫోన్లు నిషేధించండి!’
ప్యారిస్: ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాలల్లో, పాఠశాల దశలో విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగించడంపై నిషేధించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని.. వీటికి శాస్త్రీయంగానూ రుజువులు ఉన్నాయని విషయాన్ని సైతం తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది. ‘‘డిజిటల్ విప్లవం శక్తివంతమైందే కావొచ్చు. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్ఫోన్.. డిజిటల్ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్కి పరిమితం అయ్యారని తెలిసిందే. కానీ, అదే సమయంలో ఇంటర్నెట్కు దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని యునెస్కో గుర్తు చేస్తోంది. అలాగే.. ఇప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది. విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30%కి పరిమితం చేసిందిని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్లైన్ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
భారీ వర్షాలు: తెలంగాణలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధ, గురువారాలు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని విద్యాసంస్థలకు బుధ, గురువారం సెలవులంటూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థల పరిస్థితిపై ప్రభుత్వం ఆరా తీసింది. దీంతో ఉన్నతాధికారులు జిల్లాల నుంచి సమాచారం సేకరించారు. చదవండి: హైదరాబాద్ వర్షాలు.. ఆ ఏరియా వాళ్లు ఈ టైంకు ఆఫీస్లో లాగౌట్ చేయాల్సిందే అనేకచోట్ల విద్యార్థుల హాజరు తగ్గిందని, బడులకు వచ్చే అవకాశం లేదని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. దాదాపు 6 వేల బడుల్లో 30 శాతం హాజరు కూడా కన్పించలేదని తెలిసింది. వర్షాలు పడుతుండటంతో బడుల్లో మధ్యాహ్న భోజనం వండటానికీ అష్టకష్టాలు పడుతున్నారు. భోజనం వండే అవకాశం ఉండటం లేదని, తరగతి గదులకు సమీపంలోని వరండాల్లో వండటం వల్ల పొగతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పలువురు హెచ్ఎంలు చెప్పారు. అన్నిచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిందని, రాకపోకలు నిలిచిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించి సెలవులు ఇవ్వాలని మంత్రి సబితను ఆదేశించారు. -
వాతావరణ శాఖ హెచ్చరికలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
సాక్షి, బెంగళూరు: వారం నుంచి వదలని వానలతో కర్ణాటకలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రేపు (జులై 26న) రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈక్రమంలోనే అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వయనాడ్, కోజీకోడ్, కన్నూర్, మళప్పురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మూసి ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. (షాకింగ్ వీడియో.. గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన 200కు పైగా కార్లు) తెరిపినివ్వని వర్షం కారణంగా కాసర్గాడ్ జిల్లాలోని వెళ్లరికుందు, హోస్దుర్గ్ తాలుకాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వానలు, వరదల కారణంగా కేరళలలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇడుక్కి, వయనాడ్, కాసర్గాడ్ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు ఉన్న చోట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కాగా, జులై 27 వరకు దక్షిణ భారతానికి భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు) -
స్కూల్కి వెళ్లనని పిల్లలు మారాం చేస్తున్నారా? ఇలా చేసి చూడండి
ఉదయాన్నే పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించడం పేరెంట్స్కు పెద్దపని. ఇంతకంటే వాళ్లను నిద్రలేపడం అతిపెద్ద టాస్క్. ఎంత లేపినా నిద్ర లేవరు. కింద స్కూల్ ఆటోనో, బస్సో వచ్చి హారన్ కొడుతుంటుంది. కానీ వీళ్లు లేవరు. వీళ్లను తొందరగా నిద్ర లేపాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.... సమస్యను అర్థం చేసుకోవాలి.. ముందుగా నిద్ర లేవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో గమనించాలి. రాత్రి సరిగా పడుకున్నారా లేదా... అసలు నిద్రపట్టలేదా... ఇంకేదైనా సమస్య ఉంటే అనునయంగా అడిగి తెలుసుకోవాలి. సరిపోయిందా లేదా? స్కూలుకు వెళ్లే పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. గేమ్స్, ఫోన్లు చూస్తూ సరిగా పడుకోరు. రోజూ ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి వాళ్లు కచ్చితంగా పడుకునేలా చేయాలి. ప్రేమతో లేపాలి ఉదయం ఎంత ఉత్సాహంగా లేస్తే రోజంతా అలానే గడుస్తుంది. అందుకే పిల్లలు త్వరగా లేవకపోయినా ప్రేమగా నిద్రలేపాలి. పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాషలోనే నిద్రలేపాలి. ఇందుకోసం వాళ్లకు నచ్చే మంచి విషయాలు, స్కూలుకు వెళ్లడం ఎంతముఖ్యమో ప్రేమతో చెప్పాలి. ఇష్టమైన ఫుడ్ పిల్లలు ఇష్టంగా తినే ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్లో ఇవ్వాలి. అది తినడం కోసం అయినా త్వరగా నిద్ర లేస్తారు. ఈ నాలుగు చిట్కాలు ప్రయత్నిస్తే మీ సమస్య తీరినట్టే. -
దంచి కొడుతున్న వానలు, విద్యా సంస్థలకు సెలవు పొడగింపు
రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు శనివారానికి సెలవును పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో.. శనివారం సెలవును పొడిగించారు. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. -
భారీ వర్షాలు.. సెలవులు పొడిగింపు
-
పాఠశాలల్లో ఫ్యూచర్ టెక్నాలజీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
నేను తప్పు చేయలేదని చెప్పండి!
నిజామాబాద్: తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని చెప్పాలని ఓ హెచ్ఎం తన బడిలోని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. తనపై చర్యలు తీసుకోకుకుండా అడ్డుకోవాలని వారిని డీఈవో కార్యాలయం చుట్టు తిప్పుతున్నారు. ఇందల్వాయి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంపై వచ్చిన ఫిర్యాదులపై ఇటీవల విద్యాశాఖ అధికారు లు విచారణ చేపట్టారు. విచారణలో సదరు హెచ్ఎం నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుల కు వేతనాలు మంజూరు చేసినట్లు తేలింది. అతడి పై చర్యలు తీసుకోవడానికి జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఆయన కొన్ని రోజులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. తన పాఠశాలకు చెందిన పది మంది టీచర్లను వెంటబెట్టుకొని తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తనకు సహకరించాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాడు. బడి వదిలేసి అందరు టీచర్లను తన వెంట తిప్పుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళ టీచర్లకు సైతం ఫోన్లు చేస్తూ తాను చెప్పిన చోటుకు రావాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. సదరు హెచ్ఎం గతంలో మరో ప్రాంతంలో పని చేసినప్పుడు కూడా మహిళా ఉపాధ్యాయులను పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు చేపట్టే సమావేశాలకు గైర్హాజరు అవడం, వారి ఆదేశాలను పాటించకపోవడం అనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎం వేధింపులపై ఉపాధ్యాయులు ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. -
భారీ వర్షాలు: జీహెచ్ఎంసీ పరిధిలో రేపు, ఎల్లుండి స్కూల్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురవనుందని, కొన్ని ప్రాంతాల్లో 120 మిల్లీ మీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ పడే అవకాశం ఉందని, నగరవాసులు మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మేయర్ తెలిపారు. చదవండి: హైదరాబాద్లో ఏకధాటిగా వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు ఇవే.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలు పూర్తిగా జలమయ్యాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ సమీపంలోని కాలనీలు పూర్తిగా మోకాళ్ల లోతు నీటితో కాలనీలు మునిగాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండడం, ఆఫీస్ నుండి ఇండ్లలోకి వెళ్లేవారు తమ వాహనాలను సైతం ఆ మోకాల్లోతు నీళ్లలో నడిపించుకుంటూ వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నాడు–నేడు రెండో దశ స్కూళ్లలోనూ డిజిటల్ విద్య
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను అత్యున్నత స్థాయి బోధన ద్వారా గ్లోబల్ సిటిజన్లుగా తీర్చి దిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు 30,230 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ)ను ఏర్పాటు చేస్తున్నారు. 1 నుంచి 5 వ తరగతి స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా నాడు–నేడు రెండో దశ స్కూళ్లలో కూడా ఐఎఫ్పీ, స్మార్ట్ టీవీల ఏర్పాటుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ స్కూళ్లలో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవోలు), అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ల (ఏపీవో)కు శుక్రవారం ఆదేశాలిచ్చారు. రెండో దశలో పనులు పూర్తి చేసుకున్న అన్ని స్కూళ్లకు ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలను బోధనా తరగతి గదుల్లో మాత్రమే అమర్చాలన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల పనులను వెంటనే చేపట్టి ఆగస్టు నెలాఖరుకి పూర్తి చేయాలని డీఈవోలు, ఏపీవోలను ఆదేశించారు. ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలకు అవసరమైన కేబులింగ్, ఇతర ఏర్పాట్లకు అంచనాలు రూపొందించాలని, రెండో దశలో అందుబాటులో ఉన్న నిధులతో వాటిని అమర్చాలన్నారు. ఏఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలకు సమీపంలో రెండు సాకెట్లు, స్విచ్లతో కూడిన రెండు సాకెట్ బాక్స్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రాడ్ బ్యాండ్ సిగ్నల్ పాయింట్ అన్ని తరగతి గదుల మధ్యలో ఉంచాలని తెలిపారు. -
పిల్లలు స్కూల్కి వెళ్లమని మారాం చేస్తున్నారా? ఇలా చేయండి
స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. పొద్దున లేచి స్కూలుకు వెళ్లాలంటే భయం, బాధతో బడికెళ్లమని మారాం చేస్తుంటారు చిన్నారులు. మరికొంతమంది అయితే మొండికేసి ఏడుపు అస్సలు ఆపరు. ఇలాంటి పిల్లలను నవ్వుకుంటూ స్కూలుకు పంపాలంటే ఈ నాలుగు పాటిస్తే సరి... మానసికంగా సిద్ధం చేయాలి: ముందుగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి తరగతి టీచర్, తోటి విద్యార్థులు, ఇతర స్కూలు సిబ్బందితో మాట్లాడి, వారితో స్నేహంగా మెలగాలి. అప్పుడు అది దగ్గర నుంచి చూసిన పిల్లలు స్కూలు వాతావరణాన్ని కొత్తగా భావించరు. దీంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా నవ్వు తెప్పించే కథలు చెబుతూ ఉండాలి. గట్టిగా అరవకూడదు : పిల్లలు స్కూలుకు వెళ్లను అని మారాం చేసినప్పుడు గట్టిగా తిట్టడం, ఆరవడం, కోప్పడటం చేయకూడదు. ఇలా చేస్తే వాళ్లు మరింత భయపడతారు. ఎందుకు స్కూలుకు వెళ్లనంటున్నారో బుజ్జగిస్తూ కారణాలు తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి వాళ్లను స్కూలుకు వెళ్లడానికి అనుకూలంగా ఆలోచించేలా వివరిస్తూ, వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. అనుకూలంగా మాట్లాడాలి : స్కూలు ప్రారంభంలో పిల్లలను స్కూలో దింపడం, స్కూలు అయిపోయాక తీసుకురావడం చేయాలి. వాళ్లకిష్టమైన టిఫిన్ పెట్టాలి. స్కూలు నుంచి వచ్చాక ‘‘స్కూల్లో ఎలా గడిచింది? ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు? ’’ అని అడగాలి. స్కూల్లో తమ పిల్లలు ఎలా ఉంటున్నారో పిల్లలకు తెలియకుండా టీచర్ను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. టీచర్ చెప్పిన సలహాలు సూచనలు పాటించాలి. ప్రోత్సహించాలి: స్కూలుకు వెళ్లేందుకు ఆసక్తి కలిగేలా పిల్లలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుండాలి. స్కూల్లో స్నేహితులను ఏర్పర్చుకోమని చెబుతుండాలి. ఇవన్నీ చేయడానికి తల్లిదండ్రులు కాస్త సహనం పాటిస్తే.. పిల్లలు సంతోషంగా స్కూలుకు వెళ్లి చదువుకుంటారు. -
Himanshu Rao : శెభాష్ హిమాన్షు.. వాళ్లతో పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
ఏపీలో క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలకు ఆటంకం లేకుండా విద్యార్థులకు బోధన అందించేందుకు ప్రభుత్వం ‘క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్’ (సీఆర్ఎంటీ) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైనా సెలువులో ఉంటే వారి స్థానంలో రిసోర్స్ పూల్లో ఉన్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ బోధన చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నచోట సెలవు పెట్టినా, డెప్యుటేషన్లపై మరో చోటకు వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల బోధనకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఆర్ఎంటీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. హైసూ్కల్ కాంప్లెక్స్లో బడి బయట పిల్లల డేటాను సేకరించి వారిని బడిలో చేర్పించేందుకు, ఇతర విధులకు 2001–09 మధ్య రెండు మూడు ఉన్నత పాఠశాలలకు ఒక్కరు చొప్పున క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను (సీఆర్పి) నియమించింది. ప్రస్తుతం ఆయా విధుల్లో చాలావరకు ఎంఈవోలు, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్లు చేస్తున్నారు. దీంతో పాఠశాలల్లో బోధనకు అన్ని అర్హతలు ఉన్న సీఆర్పిలను బోధన ప్రయోజనాల కోసం ఉపయోగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించి మండలాన్ని ఒక క్లస్టర్గా రిజర్వ్ మొబైల్ టీచర్లుగా వారిని నియమించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,489 మంది క్లస్టర్ రిసోర్స్పర్సన్లు ఇకపై క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లుగా మారనున్నారు. ఎంఈవో పర్యవేక్షణలో ఒక్కో సీఆర్ఎంటీ మూడు లేదా నాలుగు పాఠశాలలకు సేవలు అందించేలా విధులను నిర్ణయించారు. రాష్ట్రంలోని 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు వీరిద్వారా నిరాటంకంగా బోధన అందించవచ్చు. -
దర్శకధీరుడికి అరుదైన గౌరవం.. ఇక నుంచి వారి కోసం!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం లభించింది. ఆయనను ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ ఛైర్మన్గా నియమితులయ్యారు. గ్రామీణ స్థాయి పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా.. ఆస్కార్ ఘనత పొందిన రాజమౌళికి ఈ అవకాశం రావడం పట్ల సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!) ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ISBC) గ్రామీణ ప్రాంతాల్లో వసతుల్లేక చాలామంది ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు పొందలేకపోతున్నారు. అలాంటి వారికోసమే దిలీప్ వెంగ్ సర్కార్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ యువతలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సాహం అందిస్తున్నారు. ఛైర్మన్ పదవితో రాజమౌళికి మరింత బాధ్యతను పెంచింది. మహేశ్ బాబుతో సినిమా కాగా.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం రాజమౌళి.. ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ29 పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డ్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకధీరుడు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?) Maverick Director @SSRajamouli is honored with another remarkable post as he is appointed as the Hon. Chairman of the Indian Schools Board for Cricket. 🏏#SSRajamouli #ISBC #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/STiunIzeEp — Telugu FilmNagar (@telugufilmnagar) July 1, 2023 -
గ్రూప్ 4 పరీక్ష: వాళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఈ క్రమంలో జూలై 8 రెండో శనివారం రోజును వర్కింగ్ డే ప్రకటించింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి జులై 1న పరీక్ష జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష మొత్తం 9 లక్షల 50 వేలమంది రాయనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. చదవండి: గ్రూప్-4 పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే.. -
మన ఊరు.. తడ‘బడి’!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రాథమిక విద్య అనేది హక్కు మాత్రమే కాదు. పేదల జీవితాల్లో చీకటిని శాశ్వతంగా తొలగించే ఏకైక సాధనం. సమాజ ఆర్థికాభివృద్ధికి శక్తివంతమైన చోదకం కూడా. అందువల్ల ప్రాథమిక దశలో మంచి అభ్యాసన కోసం చక్కటి పాఠశాల వాతావరణం, అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేలా ‘మన ఊరు – మనబడి’కి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 26,195 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.7,289 కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించింది. కానీ ఈ పథకం తొలి ఏడాదిలోనే తడబడుతోంది. నిధుల కొరతతో వెనకబడి పోతోంది. మూడు దశల్లో మొత్తం అన్ని పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ కింద 9,058 పాఠశాలలను ఎంపిక చేయగా, జూన్ 12తో గడువు ముగిసినా 7 వేలకు పైగా పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చాలా పాఠశాలల్లో పనులు సుదీర్ఘంగా సాగుతుండగా, అనేకచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల చెట్ల కింద, శిథిల భవనాల్లో పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని హంగులతో ఆకర్షణీయంగా.. మంచినీళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్ల ఏర్పాటుతో పాటు కొత్త క్లాస్రూంల నిర్మాణం, డిజిటల్ బోర్డు లు, పాఠశాల అంతా ఆకర్షణీయ మైన రంగులు లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం ప్రభుత్వ నిధుల్ని కేటాయించడమే కాకుండా పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల నుండి కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. కోటి రూపాయలకు పైబడి ఇస్తే పాఠశాలకు, రూ.10 లక్షలు ఇస్తే ఒక గదికి వారు సూచించే పేరును పెట్టాలని నిర్ణయించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. కానీ దాతల నుండి ఆశించిన స్పందన లేకపోవటం, ప్రభుత్వం నుండి నిధులు ఆగిపోవటంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టి) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు– మనబడి’ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. దీంతో సరిపడా గదులు లేక విద్యార్థులను ఉపాధ్యాయులు ఆవరణలోని చెట్ల కింద కూర్చోపెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఇదీ లెక్క.. ♦ 2025 నాటికి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసి, 2030 నాటికి రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలన్నది లక్ష్యం. కానీ ఇప్పు డు రాష్ట్ర సగటు అక్షరాస్యత 73.3 శాతమే. ఇక మహిళల్లో అక్షరాస్యత 64.8 శాతమే. ♦ రాష్ట్రంలో మొత్తం 62.29 లక్షల మంది విద్యార్థులుండగా అందులో అత్యధికం ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. 50.23 శాతం ప్రైవేటులో, 49.77 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 49.5% వెనకబడిన తరగతులు (బీసీ), 22.4% జనరల్ కేటగిరి, 17.5 శాతం ఎస్సీలు, 10.6 శాతం గిరిజనులు ఉన్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలలు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు అత్యధికంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. తక్కువ నిధులిస్తోంది మన రాష్ట్రమే రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 (ఎ) మేరకు విద్య అనేది ప్రాథమిక హక్కు. 6 నుండి 12 ఏళ్ల వరకు తప్పనిసరి విద్య అందించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ తెలంగాణలో విద్య అప్రాదాన్య సబ్జెక్ట్ అయింది. దీంతో పేదలు, వారి పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతోంది. దేశంలో విద్యకు అతి తక్కువగా నిధులు కేటాయిస్తున్న సర్కార్ మనదే. విద్య విషయంలో ప్రజల్లోనూ ప్రశ్నించే తత్వం పెరగాలి. – జస్టిస్ చంద్రకుమార్ ఆశించిన స్థాయిలో లేదు.. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ప్రత్యేక పద్ధతుల్లో, తగిన మౌలిక సదుపాయాలతో విద్యా బోధన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ముఖ్యంగా పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శాంతాసిన్హా. ఎంవీ ఫౌండేషన్ -
ఒంటిమామిడి..నిల‘బడి’oది!
అది నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఊరు మొత్తం రైతు కుటుంబాలు. పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలని వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. విద్యార్థులెవరూ లేకపోవడంతో ఊర్లోని సర్కారు బడి మూతబడింది. ఒకసారి రాలేగావ్ సిద్ధి నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పిన మాటలు వారిలో ప్రేరణ రగిలించాయి. ప్రైవేట్ స్కూళ్లకు కట్టే డబ్బులతో మన ఊరి పాఠశాలను తెరిపించుకోవాలనుకుని నిశ్చయించుకుని స్కూల్ను తెరిపించుకున్నారు. ఇప్పుడు ఆ పాఠశాల.. నో అడ్మిషన్ బోర్డు పెట్టేవరకు చేరుకుంది. ఇదీ.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి పాఠశాల విజయగాథ. – సాక్షి, వరంగల్ డెస్క్ మూతబడినా... ఒంటిమామిడి గ్రామస్తులందరూ తమ పిల్లలను వరంగల్లోని ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. 2005లో విద్యార్థుల సంఖ్య జీరోకు చేరుకోవడంతో పాఠశాల మూతపడింది. 2014–15లో ఆ గ్రామం నీటి సంరక్షణలో రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామస్తులు మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామానికి వెళ్లి నీటి సంరక్షణలో అన్నా హజారే చేపడుతున్న చర్యలను గమనించారు. వాటిని గ్రామస్తులకు వివరించేందుకు కంపచెట్లతో నిండిపోయిన ఆ పాఠశాల ఆవరణను శుభ్రం చేసి సమావేశమయ్యారు. రాలేగావ్సిద్ది నుంచి వచ్చిన ఓ వక్త మాట్లాడుతూ నీటి సంరక్షణలో మీ గ్రామం బేషుగ్గా ఉంది.. మరి మీ పాఠశాల ఎందుకు మూతపడింది అన్న మాటలు గ్రామస్తులను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎంతమంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారో సర్వే చేశారు. 270 మంది పిల్లలు ఏటా చదువు కోసం రూ.35 లక్షలు కడుతున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఆ డబ్బులో కొంత మన పాఠశాల నిర్వహణకు పెట్టుకుని తెరిపించుకుందామని గ్రామసభలో తీర్మానం చేశారు. దీన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అనుమతి ఇచ్చారు. దీంతో పాఠశాల 270 మంది విద్యార్థులతో పునఃప్రారంభమైంది. తర్వాత టెన్త్ వరకు అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 496 మంది విద్యార్థులు ఉన్నారు. అయినా 9 మంది ఎస్జీటీలే ఉండటంతో మరో 11 మంది ప్రైవేట్ టీచర్లను పెట్టుకుని పాఠశాలను నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందంగా ఫీజు చెల్లింపు పాఠశాల నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఏడాదికి కొంత ఫీజు రూపంలో విరాళం ఇస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులు సంవత్సరానికి రూ.5 వేలు, హైసూ్కల్ విద్యార్థులు రూ.6 వేలు ఇస్తుంటారు. ప్రైవేట్గా పెట్టుకున్న టీచర్లకు నెలకు రూ.2.20 లక్షలు వేతనం చెల్లిస్తుండటం గమనార్హం. పాఠశాల నిర్వహణలో చైర్మన్ పొన్నాల రాజు ఆధ్వర్యంలోని 24 మంది సభ్యులున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఇక్కడ ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులు ఇన్చార్జీలుగా ఉంటారు. ఆ తరగతికి సంబంధించి అన్ని అంశాలను వారే చూసుకుంటారు. పాఠశాల ప్రత్యేకతలివీ.. ♦ ప్రతి తరగతి గది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ♦ మధ్యాహ్న భోజనం వండేందుకు ముగ్గురు వంట మనుషులను పెట్టి ఒక్కొక్కరికి రూ.4,500 వేతనం ఇస్తున్నారు. ♦ ముగ్గురు స్కావెంజర్లను నియమించుకున్నారు. ♦ మంచినీటి కోసం ప్రత్యేకంగా వాటర్ ప్లాంట్ఏర్పాటుచేశారు. ♦ అన్ని హంగులతో డీజీ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ల్యాబ్, లైబ్రరీ ♦ ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహణ ♦ మండలంలో టెన్త్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన ఏకైక పాఠశాలగా గుర్తింపు పొందింది. పలువురు విదేశీయులు పాఠశాలను సందర్శించారు. ఏకతాటిపై నిలబడ్డాం గ్రామస్తులందరం ఒక్కతాటిపై నిలబడి పాఠశాలను నిలబెట్టుకున్నాం. పిల్లలు బాగా చదువుతున్నారు. ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంతో ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టీచర్లు లేరు. రేషనలైజేషన్, బైఫర్కేషన్ కాలేదని స్కూల్ అసిస్టెంట్లను ఇవ్వడం లేదు. ఐదు అదనపు తరగతి గదులు కావాలి. స్థలం కూడా సరిగా లేకపోవడంతో ఇరుకుగా ఉంది. – పొన్నాల రాజు, ఎస్ఎంసీ చైర్మన్ పిల్లలను ఇన్వాల్వ్ చేసి బోధిస్తాం విద్యార్థులు ఉదయం 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు బడినుంచి వెళ్తారు. స్టడీ అవర్స్లో టీచర్లు దగ్గరుండి చదివించడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి అంశంలో పిల్లలను ఇన్వాల్వ్ చేసి బోధన సాగుతుంది. ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు పెట్టాం. – ఆరోగ్యమ్మ గోపు, హెచ్ఎం అర్థమయ్యేలా చెబుతారు బట్టీ విధానం ఉండదు. ప్రతి పాఠం సుల భంగా అర్థమయ్యేలా చెబుతారు. కంప్యూటర్ తరగతులు కూడా ఉన్నాయి. స్టడీ అవర్స్ వల్ల మేము బాగా చదవగలుగుతున్నాం. మధ్యాహ్న భోజనం కూడా బాగుంటుంది. – పరకాల సాత్విక, టెన్త్ విద్యార్థిని -
ఎండకు భయపడి.. బడికి దూరం..!
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో రోజు రోజుకు భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు సైతం ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడం లేదు. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటే భయపడే పరిస్థితులున్నాయి. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండు పూటల బడులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1046 పాఠశాలలుండగా 1,15,324 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంపీపీ, జెడ్పీపీ 683 పాఠశాలల్లో 37,207 మంది, 30 ప్రభుత్వ పాఠశాలల్లో 2648 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 15 నుంచి 20వరకు నమోదైనట్లు తెలుస్తోంది. ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం రెండంకెలు కూడా దాటని పరిస్థితి. ప్రతీరోజు వసతిగృహలతో కూడిన విద్యాలయాల ప్రిన్సిపాల్, ఎస్వోలు పిల్లలకు ఫోన్ చేసి రమ్మని చెబుతున్నా ఎండలు తగ్గాక వస్తామంటూ దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి రావడంతో కొందరు విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకరోజు వచ్చిన విద్యార్థి మరో రోజు రావటం లేదని తెలుస్తోంది. ఈ నెల 20న విద్యా దినోత్సవం రోజున పుస్తకాలు అందించనుండడంతో పుస్తకాలు లేకుండానే పాఠాలు సాగుతున్నాయి. వసతి గృహాల్లో.. వసతితో కూడిన విద్యాలయాల్లో మరోలా ఉంది. తొమ్మిది టీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ స్కూళ్లలో 2605 మంది విద్యార్థులు చదువుతున్నారు. టీఎస్ఆర్ఈఐ సొసైటీ స్కూల్లో 581మంది, 16 టీడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఆశ్రమ పాఠశాలల్లో 2668 మంది, అర్బన్ రెసిడెన్షియల్లో 88 మంది, 18 కేజీబీవీల్లో 4405 మంది అభ్యసిస్తున్నారు. ఐదు మోడల్స్కూళ్లలో 3,399, ఎనిమిది ఎంజేపీటీబీసీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్ స్కూళ్లలో 3342 మంది చదువుతున్నారు. నాలుగురోజుల గడుస్తున్నా పట్టుమని పదిమంది కూడా రాని పరిస్థితి. వాతావరణం చల్లబడే వరకై నా పాఠశాలలు వేళలు మార్చడం.. ఒంటిపూట బడులపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఒంటిపూట పెడితే బాగుంటుంది.. ఎండలు బాగా ఉన్నా యి.. ఇంట్లోనే కూలర్ తిరుగుతుంటే తట్టుకో లేకపోతున్నాం. బడిలో పిల్లలు ఉండలేని పరిస్థితి. ఫ్యాన్ ఉన్నా వడగాల్పులతో ఇబ్బందిగా ఉంది. అందుకే మా బాబును మధ్యాహ్నం వచ్చి ఇంటికి తీసుకెళ్తున్నా. ఒక్కపూట బడిపెడితే మంచిగుండు.. చల్లబడే వరకు రెండు పూటలకు పంపాలంటే భయంగా ఉంది. -
మోగిన బడి గంట
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ఈనెల 17 వరకు ఉ.7.30 నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అన్ని పాఠశాలల్లోను అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు.. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 43 లక్ష మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం సిద్ధంచేసిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సోమవారం అన్ని పాఠశాలల్లోను ప్రారంభించారు. అలాగే, గతంలో పాఠశాలలు తెరిచిన తొలిరోజు 30 శాతం దాటని హాజరు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజే 57 శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో 61 శాతం మందికి విద్యా కానుక కిట్లను అందించారు. రెండోరోజు మంగళవారం నుంచి కిట్ల పంపిణీని వేగవంతం చేసి వారం రోజుల్లో మొత్తం పంపిణీని పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక అన్ని పాఠశాలల్లోను ఉ.8.30–9.00గంటల మధ్య విద్యార్థులకు రాగిజావ.. 11.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. -
AP Schools ReOpen Photos: ఆంధ్రప్రదేశ్లో మోగిన బడి గంట (ఫొటోలు)
-
ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచే పాఠశాలలు ప్రారంభం
-
బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు: సీఎం జగన్
Updates ►మోసాల చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రం ►బాబు పెత్తందారీ భావజాలానికి.. పేదలకు మధ్య యుద్ధం. ►సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. ►ఎల్లో మీడియా విష ప్రచారానికి, మనం చేస్తున్న మంచికి యుద్ధం. ►టీడీపీ హయాంలో దోచుకో, పంచుకో, తినుకో విధానం. ►డీపీటీ కావాలా? నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలా? ►ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అండగా ఉండకపోవచ్చు.. ►జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు. ►మీ జగనన్న ప్రజలనే నమ్ముకున్నారు. ►ఇది కురుక్షేత్ర యుద్దం ►ఈ యుద్ధంలో నా ధైర్యం, బలం మీరే. ►మీకు మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా నిలవండి. ►దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ►చంద్రబాబు పులిహోర మ్యానిఫెస్టో తెచ్చారు. ►మరోసారి మోసానికి తెరతీశారు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారు. ►14 ఏళ్లు సీఎంగా బాబు ఏం చేశారు? గాడిదలు కాశారా? ►బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు ► విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేశాం: సీఎం జగన్ ► ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. ► టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టాం. ► అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ► ఇంగ్లీష్ మాట్లాడటంలో మన విద్యార్థులకు ప్రతిభ పెరుగుతుంది. ► రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లీష్ టీచర్లకు అమెరికాలో శిక్షణ. ► విద్యాకానుక కిట్లలో మెరుగైన మార్పులు చేశాం. ► యూనిఫామ్ డిజైన్లో మార్పులు చేశాం. ► గతేడాది కంటే ఈ ఏడాది యూనిఫామ్ క్లాత్ శాతం పెరిగింది. ► రూ.1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్ల పంపిణీ. ► 43 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక ► ప్రతి విద్యార్థి రూ. 2,400 విలువైన కిట్ పంపిణీ. ► ఇప్పటి వరకు విద్యాకానుక పథకానికి రూ. 3,366 కోట్లు ఖర్చుచేశాం. ►ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స సత్యనారాయణ ►విద్యారంగంలో కీలక సంస్కరణలు చేశాం. ►ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలబడాలనేదే లక్ష్యం. ►ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో విద్యా బోధన. ►సీఎం జగన్ అంటే ప్రభంజనం: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ►పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ►నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరులో ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించిన సీఎం జగన్ డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్రూమ్లో విద్యార్థులతో కూర్చొని ముచ్చటించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్పై ఆల్ ది బెస్ట్ అని రాశారు. జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు సీఎం వైఎస్జగన్ చేరుకున్నారు. కాసేపట్లో నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక అందించనున్నారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండగా.. తొలిరోజే విద్యాకానుక అందిస్తోంది ప్రభుత్వం. వరుసగా నాలుగో ఏడాది సీఎం జగన్ ‘జగనన్న విద్యాకానుక’ కిట్ను అందజేయనున్నారు. ►ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►జగనన్న విద్యాకానుక కిట్కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు. ►43.10 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సీఎం జగన్ విద్యా కానుక అందించనున్నారు. ►రూ. 1,042.53 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►నాలుగేళ్లలో విద్య కోసం రూ.60 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ► తొలి దశలో నాడునేడు పూర్తయిన 15,715 స్కూళ్లలో డిజిటల్ విద్య, హైస్కూళ్లలో 30 వేల తరగతి గదులకు బైజూస్ కంటెంట్తో డిజిటల్ విద్య అందిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. పాఠ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చదవండి: పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు! -
సీఎం వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణలు
-
ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
-
ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు.. జూన్ 17 వరకు ఒంటి పూటే..
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో రాగి జావ, 11.30 నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: విద్యాశాఖలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం -
12 నుంచి స్కూళ్లు.. తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని, అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విజయవాడలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం వైఎస్ జగన్ సోమవారం విద్యా కానుకను లాంఛనంగా పంపిణీ చేస్తారని తెలిపారు. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యా కానుక కిట్ల నాణ్యతను నాలుగు దశల్లో పరిశీలించామని, ఈ ఏడాది యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నామన్నారు. 20న సీఎం చేతుల మీదుగా విద్యార్థులకు సత్కారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించే వేడుక రాష్ట్రస్థాయిలో 20న సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, హెచ్ఎంలనూ సత్కరిస్తామని చెప్పారు. 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో విద్యార్థులను సత్కరిస్తామన్నారు. వీరితో పాటు టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులను 12 నుంచి 19 వరకు సత్కరించనున్నట్లు తెలిపారు. మొత్తం 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందిస్తామన్నారు. పాఠశాల స్థాయిలోనే ‘టోఫెల్’ శిక్షణ రాష్ట్ర విద్యార్థులు గ్లోబల్ ఇంగ్లిష్లో పట్టు సాధించేలా రాష్ట్రస్థాయిలోనే విద్యార్థులుకు టోఫెల్ శిక్షణ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ఇద్దరు ఉపాధ్యాయులను ప్రఖ్యాత అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి పంపి శిక్షణ ఇప్పిస్తామన్నారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు టోఫెల్–ప్రైమరీ, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు టోఫెల్– జూనియర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే గోరుముద్ద పథకం అమలు చేస్తామని మధ్యాహ్న భోజన పథకం సంచాలకులు డాక్టర్ నిధి మీనా తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’ ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం టెన్త్, ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడం తప్ప పాఠశాల, కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశం ఇంతవరకు లేదు. అయితే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇలాంటి విద్యార్థులకు మరో అవకాశంగా రెగ్యులర్గా అదే తరగతిలో మరోసారి చదువుకునే అవకాశాన్ని కలి్పస్తున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. వీరికి ఒక్క ఏడాదే ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వర్తిస్తాయని వివరించారు.