thiefs
-
ఇద్దరు దొంగల ఫైటింగ్ కథ..
దొంగతనం చేయాలంటే పకడ్బందీగా స్కెచ్ వేయాలి. ఈ ఇద్దరు దొంగలకు మాత్రం ఎలాంటి స్కెచ్, పెన్సిల్ అవసరం లేకుండానే బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఒక ఇంటి ముందు వారికి కొరియర్ ప్యాకేజీ కనిపించింది. దాన్ని చూడగానే ‘యురేక’ అంటూ పరుగెత్తుకు వెళ్లారు.ఆ తరువాతే అసలు సీన్ స్టార్ట్ అయింది. ‘ఇది నాది’ అంటూ ఆ ఇద్దరు దొంగలు వాదులాడుకోవడమే కాదు ఒకరి ముఖంపై ఒకరు పంచ్లు ఇచ్చుకున్నారు. ఫైటింగ్ సీన్లు ఎన్నో ప్రదర్శించారు. డోర్ బెల్ కెమెరా ఫుటేజీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఇంటి యజమాని షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.‘దొంగలు ప్యాకేజీని యాదృచ్ఛికంగా చూశారా? లేదా సాంకేతిక మాయాజాలంతో ఫలానా చోటుకి కొరియర్లో ప్యాకేజీ రానుందని తెలుసుకున్నారా? రెండోది నిజమైతే చాలా ప్రమాదమే’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు నెటిజనులు.ఇవి చదవండి: ఏ దారెటు పోతుందో..? ఎవరినీ అడగక.. -
Hyderabad: దోమలగూడలో దారుణం
సాక్షి, హైదరాబాద్: దోమలగూడలోని గగన్మహల్ రాధామదన్నివాస్లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంటి యజమానులు లేని సమయంలో కారు డ్రైవర్గా పనిచేసే వ్యక్తి ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. మృతురాలు స్నేహలత దేవి (61)కు భర్త మహేష్ కుమార్.. కుమారుడు పవన్ కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహేష్ కుమార్ పవన్ కుమార్ గోషామాల్లో ప్లైవుడ్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వ్యాపార నిమిత్తం తండ్రి కొడుకు ప్లైవుడ్ షాప్కు వెళ్లారు. ఆ సమయంలో కారు డ్రైవర్ మహేష్.. స్నేహలత దేవి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలతో పరారైనట్లు దోమలగూడ పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్కు చెందిన మహేష్ రెండు నెలల క్రితమే వీరి వద్ద కారు డ్రైవర్గా విధుల్లో చేరాడని తెలిపారు. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలీసులకు సమాచారం రావడంతో స్నేహలత దేవిని హుటాహుటిన హైదర్గూడాలోని అపోలో ఆసుపత్రి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాల ధ్రువీకరించాయి. ముఖానికి ప్లాస్టర్ వేయటంతో ఊపిరడకపోవటం వల్లే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని దోమలగూడ పోలీసులు తెలిపారు. గాంధీనగర్ ఏసీపీ కే రవి కుమార్, దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. చదవండి: TSRTC: కండక్టర్పై మహిళ దాడి.. సజ్జనార్ సీరియస్ కామెంట్స్ -
నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనుకోని ఉదంతాలు, సంఘటనలు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తాయి. లగేజీ మిస్ అవ్వడం, తారుమారు కావడం, ఒక్కోసారి బంగారం లాంటి ఇతర విలువైన సామాగ్రి మాయమై పోవడం లాంటి సంఘటలను విమాన ప్రయాణికులకు షాక ఇస్తూంటాయి. తాజాగా ఒక ప్రయాణికుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నూటికి నూరుపాళ్లు నిర్ధారించుకుని పదిలంగా లగేజీలో పెట్టుకున్న ఖరీదైన విస్కీ బాటిల్ మూడింట ఒకవంతు ఖాళీ అవడం చూసి అవ్వాక్కయ్యాడో వ్యక్తి. దీనిపై సంబంధిత ఎయిర్లైన్కి ఫిర్యాదు చేయడంతోపాటు, తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ నుంచి క్రిస్టోఫర్ ఆంబ్లర్ అనే ప్రయాణికుడు అందించిన వివరాల ప్రకారం చెక్-ఇన్ లగేజీలో ప్యాక్ చేసిన ఖరీదైన గ్లెన్మోరాంగీ 'ఎ టేల్ ఆఫ్ కేక్' విస్కీ బాటిల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాటిల్ సీల్ తెరిచి ఉండటంతో షాక్ అయ్యాడు. అంతేకాదు మూడింట ఒక వంతు ఖాళీ అయిపోయింది. ఎలాంటి లీకేజీ కూడా లేదు. దీంతో హే..యునైటెడ్ ఎయిర్లైన్స్..మీ బ్యాగేజ్ హ్యాండ్లర్లు దొంగలు అంటూ ఫోటోతో సహా ఆంబ్లర్ ట్వీట్ చేశాడు. దీని ధర కెనడాలో (అమెజాన్) రూ. 45,556 అట. దీనిపై నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. కొందరు తమ అనుభావాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్లైన్స్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. తమ బ్యాగేజీ రిజల్యూషన్ సెంటర్లో రిపోర్ట్ను ఫైల్ చేయమని కోరింది. Hey @united - bottle of expensive scotch in checked bag. Arrived opened and a third gone. No leakage. It was sealed new when packed and seal broken by opening. Your baggage handlers are thieves. pic.twitter.com/UHzTLzF4Eu — Though it be not written down, I am an ass. (@TheDogberry) March 28, 2023 -
Hyderabad: వరుసబెట్టి దోచేశారు.. అర్ధరాత్రి 13 ఇళ్లలో దొంగతనాలు
సాక్షి, కూకట్పల్లి: తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఏకంగా 13 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఓ దొంగల ముఠా విడిపోయి కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దయార్గూడ, కేరళబస్తీ, దేవీనగర్ ప్రాంతాల్లో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. ఇళ్లలోని వస్తువులను చిందరవందర చేసి అందినకాడికి దోచుకెళ్లారు. ఓ ఇంట్లో గల్లాపెట్టెలో ఉన్న రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లగా మరో ఇంటిలో వెండి పట్టా గొలుసులు, ఒక ఇంట్లో ల్యాప్టాప్ ఇలా దొరికిన వస్తువును ఎత్తుకెళ్లారు. చోరీలు జరిగిన ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవటంతో ఎవరింట్లో ఎంత సొత్తు అపహరణకు గురైందో వివరాలు తెలియలేదు. యజమానులు ఊళ్ల నుంచి తిరిగి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం 9 ఇళ్లల్లో తాళాలు పగలగొట్టినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీల ఆధారంగా అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ట్లు నిర్ధారణకు వచ్చారు. ముందుగానే రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ పరిశీలన దయార్గూడ, కేరళబస్తీ, దేవీనగర్లలో దొంగతనా లు జరిగిన ఇళ్లను సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పరిశీలించారు. పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నర్సింగ్రావు, నాయకులు బొట్టు విష్ణు, సంతోష్, రాము, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Hyderabad: బాలీవుడ్లో నటన.. కూతురికి మోడలింగ్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ.. -
దోపిడీ దొంగల బీభత్సం
మణికొండ: నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ముగ్గురిని కత్తులతో పొడవగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతుడి బైక్ను చోరీ చేసి దానిపై పరారయ్యారు. పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై ఆ ఇద్దరిలో ఓ నిందితుడు కత్తితో దాడి చేసి పరారవ్వగా.. ఆ పోలీసులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. బుధవారం రాత్రి హైదర్షాకోట్కి చెందిన ట్రాన్స్జెండర్ నిహారిక(నరేష్) తన మిత్రులతో కలిసి నార్సింగి రక్తమైసమ్మ గుడి సమీపంలో కోకాపేటకు చెందిన తులసికుమార్ అనే వ్యక్తితో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు తులసికుమార్ను కత్తితో పొడిచి అతడి నుంచి రూ.15వేలు లాక్కున్నారు. కత్తి దాడిలో అతని చేతి వేళ్లు తెగిపోయాయి. అక్కడే ఉన్న ట్రాన్స్జెండర్లను డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో నిహారిక తన భర్త కిషోర్రెడ్డి(35)కి ఫోన్ చేసింది. దాంతో అతను తన మిత్రుడు శివరాజ్తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే తులసికుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. ఈ లోగా నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. శివరాజ్ ఆ తర్వాత దారి కాచి హత్య... ఆ తర్వాత ఇద్దరు దుండగులు గంధంగూడ దారిలో కిషోర్రెడ్డి, అతని మిత్రుడు శివరాజ్లను అడ్డగించి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా శివరాజ్ స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. మృతుడు కిషోర్ ద్విచక్రవాహనం తీసుకుని వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల్లో ఒకతను సిక్కు వేషధారణలో ఉండగా మరొకతను మాస్క్ ధరించి ఉన్నాడని నిహారిక తెలిపారు. నిందితులను గుర్తించిన నార్సింగి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఓటి పోలీసులపై దాడి జగద్గిరిగుట్ట: నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసు నిందితుడు కరణ్సింగ్.. కూకట్పల్లి సిక్ బస్తీలోని భగవాన్సింగ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు విజయ్, రాజు గురువారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడి చేశారు. అప్పటికే పోలీసుల రాకను గమనించిన కరణ్ సింగ్ కత్తితో వారిపై దాడి చేసి పారిపోయాడు.. దాడిలో రాజు తలకు గాయం కావడంతో కూకట్పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఛాతీపై తీవ్ర గాయాలైన విజయ్ను మాదాపూర్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో బాలానగర్ డీసీపీ సందీప్ గోనె, మాదాపూర్ ఎస్ఓటీ క్రై మ్ అడిషనల్ డీసీపీ నారాయణ, బాలానగర్ ఏసీపీ గంగారామ్, జగద్గిరిగుట్ట సీఐ సైదులు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గురువారం రాత్రికి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్ ఏంటంటే!
సాక్షి, బంజారాహిల్స్: ముసుగు ధరించి నంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి, అతడి చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్ యజమాని అంకిత్ అగర్వాల్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో నివాసం ఉంటున్నాడు. ఇతడి వద్ద పని చేసే సేల్స్మెన్ ఆనంద్ మంగళవారం రాత్రి 9 గంటలకు ఆభరణాల దుకాణాన్ని మూసివేశాడు. రెండు షట్టర్లు, లాకర్ల తాళం చెవులు బ్యాగ్లో వేసుకొని యజమానికి ఇవ్వడానికి స్కూటీపై అతని నివాసానికి వచ్చాడు. హెల్మెట్ తీసి తన వాహనంపై పెడుతుండగా అప్పటికే పంజగుట్ట నుంచి అనుసరిస్తూ బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆనంద్ కళ్లల్లో కారం కొట్టి బ్యాగు లాక్కొని ఉడాయించారు. రాత్రి 10 గంటల సమయంలో బాధితుడు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, అదే రోజు రాత్రి ఆగంతకులు ఆ బ్యాగును పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్ ముందు పడేసి పరారైనట్లుగా గుర్తించారు. ఈ బ్యాగులో డబ్బు లేదా నగలు ఉంటాయని వారు భావించి ఉంటారని, అందులో తాళం చెవులు మాత్రమే ఉండటంతో బ్యాగు ను షాపు వద్ద పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా తాళాలతో షాపు షట్టర్లు తెరుద్దామని వెళ్లి ఉంటారని,అయితే, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండటంతో బ్యాగ్ను షాపు ముందు పడేసి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అగంతకుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగలించేందుకు వచ్చి కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యారు! వీడియో వైరల్
చెన్నై: ఇద్దరు దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకు మద్యం షాపుకి వెళ్లి పోలీసులుకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువెల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకని లిక్కర్ షాపుకి డ్రిల్లింగ్ మిషన్తో రంధ్రం చేశారు. ఐతే ఆ దొంగలు షాపులోకి వెళ్లిన తర్వాత ఆ మద్యం బాటిళ్లను చూసి టెంప్ట్ అయ్యి ప్లాన్ మార్చుకున్నారు. కాసేపు ఆ షాపులోనే ఉండి తాగి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా ప్లాన్ కూడా అమలు చేశారు. ఆ దొంగలు వక్రబుద్దే వారిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాలే చేసింది. పోలీసులు వారు ఏ విధంగా లిక్కర్ షాపుకి రంధ్రం చేసి వెళ్లారు అలానే వారిని బయటకు రప్పించి మరీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పోలీసులు సదరు షాపు యజమానితో ఓపెన్ చేయించి మరీ పోలీసులను అదుపులోకి తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా వారు ఎలా షాపుకి ఎంట్రీ ఇచ్చారో అలానే అదుపులో తీసుకోవడం గ్రేట్ అంటూ పోలీసుల పని తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
లిక్కర్ బాటిల్స్ దొంగిలిద్దామని వెళ్లారు.. కానీ!
-
అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం
-
సినిమాను తలపించే ట్రైన్ ఛేజింగ్! రైల్వే పోలీసుల సాయంతో..
సాక్షి, చెన్నై: ఇప్పటి వరకు దొంగల వేటలో బైక్, కారు ఛేజింగ్లు చేసిన తమిళ పోలీసులు.. తాజాగా ట్రైన్ ఛేజింగ్తో ఉత్తరాది ముఠా ఆటకట్టించారు. వివరాలు.. తిరుప్పూర్కు యూనియన్ మిల్రోడ్డు కేపీఎన్ కాలనీకి చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో కుదువ దుకాణం నడుపుతున్నాడు. ఈనెల మూడో(గురువారం) తేదీ అర్ధరాత్రి ఆ దుకాణంలో దోపిడీ జరిగింది. నాలుగో తేది ఉదయాన్నే(శుక్రవారం) ఈ ఘటన వెలుగు చూసింది. ఈ దోపిడిలో 3 కేజీల బంగారం, 9 కేజీల వెండి, రూ. 25 లక్షల నగదును దుండగులు అపహరించుకెళ్లారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా దొంగల కోసం వేట మొదలెట్టారు. నలుగురు యువకులు ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. తిరుప్పూర్ నుంచి ఈ యువకులు చెన్నైకు చేరుకున్నట్లు గుర్తించారు. చివరికి చెన్నై నుంచి ముంబై వైపుగా వెళ్లే రైలు ఎక్కినట్టు తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా.. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా మరో రైలులో తమిళ పోలీసులు ఛేజింగ్కు బయలుదేరారు. రైల్వే పోలీసుల సాయంతో ఆదివారం ఉదయాన్నే ఆ నలుగురు యువకులను చాకచక్యంగా నాగ్పూర్ రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దోపిడీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. వారి వద్ద నుంచి 3 కేజీల బంగారం, 9 కేజీల వెండి, రూ. 14 లక్షల నగదు లభించాయి. 24 గంటల్లో 11 లక్షలు మాయం చేసి ఉండడంతో, వీరికి సహకరించిన వారెవ్వరైనా తిరుప్పూర్లో ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. బిహార్కు చెందిన ఈ నలుగురిని సోమవారం నాగ్పూర్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం తిరుప్పూర్కు తరలించనున్నారు. -
పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు
-
యజమాని షాక్.. నగల దుకాణం గోడకు కన్నం..
సాక్షి, అబ్దుల్లాపూర్మెట్ (హైదరాబాద్): దొంగలు ఓ నగల దుకాణంలోకి చొరబడి 3 కిలోల వెండి నగలు అపహరించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో శ్రీగణేష్ జ్యువెల్లర్స్ పేరిట సుమన్ చౌదరి అనే నగల షాపు నిర్వహిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే ఆయన సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చి షాపు తెరిచాడు. దుకాణం వెనుక వైపు ఉన్న గోడకు కన్నం కనిపించడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. సుమారు 3 కిలోల వెండి ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ పరిశీలించారు. దొంగలను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: కేటీఆర్ దిష్టిదొమ్మలు తగలబెట్టండి -
రూ.1.26 కోట్లతో పరారైన దొంగలు దొరికారు
నెల్లూరు (క్రైమ్): బ్యాంకులో జమ చేయాల్సిన నగదుతో పరారైన నిందితులు దొరికారు. వారి వద్ద నుంచి రూ.1,11,20,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు సారాయంగడి సెంటర్కు చెందిన షేక్ రబ్బాని మూడేళ్లుగా బాలాజీనగర్లోని రైటర్స్ సేఫ్ గార్డ్స్ సంస్థలో కస్టోడియన్గా పనిచేస్తున్నాడు. సంస్థ నిర్దేశిత షాపింగ్మాళ్లు, హాస్పిటళ్లు తదితర సంస్థల వద్ద రోజువారీ కలెక్షన్ సేకరించి ఆ వ్యాపార సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంటాడు. ఈ క్రమంలో ఆగస్టు 31న రబ్బాని, అతని సహచర ఇద్దరు కస్టోడియన్లు రోజువారీ కలెక్షన్ రూ.1,26,08,450 నగదును సేకరించారు. దాన్ని బ్యాంకులో జమచేయాలని వారు రబ్బానికి ఇచ్చారు. రబ్బాని తన స్నేహితులైన సారాయంగడి సెంటర్కు చెందిన పాతనేరస్తుడు షేక్ రఫీ అలియాస్ గాంధీ, నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంకు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ దూద్కలతో కలిసి నగదుతో ఉడాయించాడు. కొంత నగదును తెలిసిన వారివద్ద పెట్టి మిగిలిన నగదును తమవెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై సంస్థ రూట్ లీడర్ తిరుపతిరావు ఈనెల 1న చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర, సీసీఎస్ డీఎస్పీలు జె.శ్రీనివాసులరెడ్డి, శివాజీరాజా తమ సిబ్బందితో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు సాంకేతికతను వినియోగించుకుని నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిందితులు పోలీసులకు చిక్కకుండా ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతూ జల్సాలు చేయసాగారు. తీసుకెళ్లిన నగదు ఖర్చు అయిపోవడంతో మిగిలిన నగదును తీసుకెళ్లేందుకు సోమవారం నెల్లూరుకు వచ్చారు. నవబాల దుర్గాదేవి గుడి సమీపంలోని చెరువుకట్ట వద్ద ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి రూ.1,11,20,000 నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. -
దొంగను దోచుకోబోయిన మరో దొంగ!
న్యూయార్క్ : దొంగ దగ్గరే తన చేతికి పని చెప్పి దొరికిపోయాడో దొంగ. తను దొరికిపోవటమే కాకుండా ఆ మరో దొంగను కూడా పోలీసులకు పట్టించాడు. వివరాల్లోకి వెళితే.. మార్చి 10వ తేదీన షమారి జే రియెడ్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి టయోటా ఆర్ఏవీ4లో వెళుతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత రోడ్డు పక్కగా టైకెల్ విల్సన్ అనే 19 ఏళ్ల యువకుడు పంక్షరైన తన కారు టైరు మార్చటానికి కష్టపడిపోతూ కనిపించాడు. దీంతో వారు టైకిల్కు సహాయం చేయటానికి కిందకు దిగారు. వారు కారు టైరు మారుస్తూ ఉండగా టికైల్.. రియెడ్ కారులోకి చేరుకున్నాడు. ఆ కారును దొంగిలించటానికి ప్రయత్నించాడు. కారును రివర్స్ చేయగా అది కాస్తా పుట్పాత్ను ఢీకొట్టి ఎటూ కదలకుండా నిలబడిపోయింది. ఆ వెంటనే స్పందించిన రియెడ్ తన కారులోకి చేరి హ్యాండ్ గన్తో టికైల్ను నిలువరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కారు యజమానిగా చెప్పుకుంటున్న రియెడ్ ఓ దొంగని, సదరు టయోటా కారును ప్రిన్స్ జార్జ్ కౌంటీనుంచి అతడు దొంగిలించాడని గుర్తించారు. టికైల్, రియెడ్లను అరెస్ట్ చేసి, వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలేశారు. చదవండి : వృథా అయిన డోసులు 23 లక్షలు, ఇలా అయితే బెటర్! -
పెళ్లింట భారీ చోరీ
కుషాయిగూడ: ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. సైనిక్పురి డిఫెన్స్ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది. నర్సింహారెడ్డి చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్ను పాతబస్తీలోని ఫలక్నుమా ప్యాలెస్లో ఆదివారం నిర్వహించారు. విందులో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్కు చెందిన వాచ్మన్ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్ తాళాలు పగులగొట్టాడు. వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం తదితర 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో సాయంత్రం ఏడున్నర గంటలకు రికార్డు అయ్యాయి. విందు నుంచి వచ్చేసరికి చిందరవందర పెళ్లి, రిసెప్షన్ ప్రశాంతంగా జరిగాయన్న ఆనందంలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అక్కడి పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు. రిసెప్షన్ పూర్తికాగానే కొంతమంది బంధువులు, కుటుంబసభ్యులు రాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. గేటు మూసి ఉండటంతో కాలింగ్ బెల్ కొడుతూ వాచ్మన్ను పిలిచారు. ఉలుకూపలుకు లేకపోవడంతో లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నర్సింహారెడ్డి వచ్చి ఆభరణాలు, ఇతర పరికరాలు చోరీకి గురయ్యాయని గుర్తించి మరునాడు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్తోపాటు డాగ్స్క్వాడ్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ పేర్కొన్నారు. -
దొంగ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా జైలు నుంచి బయటపడ్డ ముగ్గురు దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడి మళ్లీ జైలుపాలయ్యారు. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ కేంద్రంగా నేరాలకు పాల్పడుతూ జైలు పాలైన రాహుల్, సాగర్, ప్రమోద్ అనే ముగ్గరు వ్యక్తులు కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలలలో బెయిల్ మీద విడుదలయ్యారు. కానీ, బయటికొచ్చినా వారు నేరాలు చేయటం మానుకోలేదు. నగరంలోని ఓ రెసిడెన్షియల్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ( ఆశ్రమంలోకి చొరబడి పూజారులపై దాడి ) దీంతో అంజనీ ప్రసాద్ శాస్త్రి అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డుపై వెళుతుండగా ఓ ముగ్గురు వ్యక్తులు బైకుపై వచ్చి తన మొబైల్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్సుతో ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగల్ని పట్టుకోవటానికి ఆపరేషన్ మొదలుపెట్టారు. సీసీ కెమెరా ఫొటేజీల ద్వారా ఆధారాలు సంపాదించారు. అనంతరం పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ( భార్య చేతిలో.. తాగుబోతు భర్త హతం ) -
ఓజీ కుప్పం గ్యాంగ్ చిక్కింది
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు నుంచి నగదు డ్రా చేసిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మళ్లించి ఆ డబ్బుల్ని దొంగిలించే ఓజీ కుప్పం గ్యాంగ్ నగర పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ సహా దక్షిణాదిలోని అనేక నగరాలు, పట్టణాల్లో తమ పనికానిచ్చింది. నలుగురున్న ఈ గ్యాంగులో ఇద్దరిని పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.9.4 లక్షల నగదు, నాలుగు బైక్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ పి. రాధాకిషన్రావుతో కలసి గురువారం మీడియాకు వెల్లడించారు. రైళ్లలో వాహనాలతో సహా వచ్చి.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఓరన్ థంగల్ గొల్ల కుప్పంను ఓజీ కుప్పంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 మంది నేరగాళ్ళు 12 గ్యాంగ్లుగా పని చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్లు మినహా సభ్యులు ఒక్కోసారి ఒక్కో గ్యాంగ్లో కలిసి ‘పని’కి వెళ్తుంటారు. తెలుగు, తమిళం బాగా, హిందీ ఓ మోస్తరుగా తెలిసిన వీళ్ళు దక్షిణాదినే లక్ష్యంగా చేసుకుంటారు. ఓ నగరం/పట్టణాన్ని టార్గెట్గా చేసుకుని వారంతా ఆ ప్రాంతానికి బైక్లు తీసుకుని బయల్దేరతారు. లక్ష్యంగా చేసుకున్న ప్రాంతానికి వాహనాలను రైల్వే పార్శిల్ ద్వారా తాము వెళ్లే రైల్లోనే తీసుకువస్తారు. అక్కడకు చేరుకుని లాడ్జిల్లో లేదా శివార్లలో ఇళ్ళు అద్దెకు తీసుకుని బస చేస్తారు. అనంతరం ఓ బ్యాంకుపై దృష్టి సారించి ముగ్గురు వ్యక్తులు బ్యాంకు బయట, మరో వ్యక్తి బ్యాంకులోపల ఉంటారు. అక్కడ నగదు డ్రా చేస్తున్న వ్యక్తులను ప్రధానం వయసు మళ్లిన వారిని లక్ష్యంగా చేసుకుని అతడి కదలికలను ఎప్పటికప్పుడ బయటివారికి దొంగిలించి న సెల్ఫోన్ ద్వారా చేరవేస్తుంటాడు. డబ్బు డ్రా చేసిన వ్యక్తి బయటకొచ్చినప్పటినుంచి ఈ గ్యాంగ్ సమయం కోసం వేచి చూస్తూ అతడిని వెంబడిస్తుంది. ఖాతాదారుడు కనుక కారులో వస్తే తమ వద్ద ఉన్న పంక్చర్ చేసే ఉపకరణంతో టైర్కు రంధ్రం చేసి, లేదా కారులో డ్రా చేసిన డబ్బు తీసుకువెళ్ళేప్పుడు యజమానితో పాటు డ్రైవర్ కూడా ఉంటే రూ.50, రూ.100 నోట్లు పక్కన పడేయటం ద్వారా అవి మీవే అంటూ తీసుకునేలా చేసి తమ పని పూర్తి చేస్తారు. ఒకవేళ బైక్లోని డిక్కీలో నగదు పెడితే పార్క్ చేసేంత వరకు తెలియకుండా వెంటబడతారు. అనంతరం డిక్కీని పగలగొట్టి డబ్బును దొంగిలిస్తారు. ఈ మూడు కాకపోతే వీరి వద్ద దురద పుట్టించే ఓ స్ప్రే సిద్ధంగా ఉంటుంది. ఓ ముఠా సభ్యుడు తమ టార్గెట్ గమనించకుండా అతడి పై దీన్ని స్ప్రే చేసి వెళ్ళిపోతాడు. బాధితుడు ఆ దురదతో ఇబ్బంది పడుతుంటే వెనుక వచ్చే గ్యాంగ్ సభ్యులు సహకరిస్తున్నట్లు నటించి డబ్బు కాజేస్తారు. 300 కెమెరాల ఫీడ్ విశ్లేషించి.. నగరాన్ని టార్గెట్ చేసిన ఈ ముఠా గత నెల, ఈ నెల్లో కలిపి నల్లకుంట, అంబర్పేట్, ఫలక్నుమ, మీర్పేట్ ఠాణాల పరిధుల్లో నాలుగు నేరాలు చేసి రూ.16 లక్షలు ఎత్తుకుపోయారు. ఈ కేసుల్ని ఛేదించడానికి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్లతో పాటు గతంలో టాస్క్ఫోర్స్లో పనిచేసిన ఫలక్నుమ డీఐ కేఎస్ రవి సైతం బృందంగా ఏర్పడ్డారు. వీరు నేరం జరిగిన నాలు ప్రాంతాల్లోని సుమారు 300 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ను సేకరించి విశ్లేషించారు. రెండు వాహనాలపై తిరుగుతున్న నలుగురు వ్యక్తులు ఈ నేరాలు చేశారని, నేరం తర్వాత తమ ముఖాలు కప్పుకుని తప్పించుకుంటున్నారని గుర్తించారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు తమ వేగుల సాయంతో ఆ నలుగురూ ఓజీ కుప్పం ప్రాంతానికి చెందిన ఆకుల కిరణ్, జి.తులసింధర్, ప్రభుదాస్, శామ్యూల్రాజ్గా నిర్థారించారు. అనంతరం వీరికోసం ఓజీ కుప్పం వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు అక్కడే ఉండి నిందితులు కిరణ్, తులసింధర్లను పట్టుకుని నగరానికి తీసుకొచ్చారు. వీరి నుంచి రూ.9.4లక్షల నగదు, నాలుగు బైక్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నగరంలో నాలుగు నేరాలతో పాటు ఏపీలోని పెనమలూరు, పామర్రు, చిలకలపూడి, కర్ణాటకలోని బీదర్, తుముకూర్ల్లోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో 23 కేసుల్లో నిందితుడిగా ఉన్న కిరణ్పై మూడు ఎన్బీడబ్ల్యూలు పెండింగ్లో ఉన్నాయి. తులసింధర్పై గతంలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నేరగాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. -
ఇద్దరు దొంగలు అరెస్ట్: 159 గ్రాముల బంగారం స్వాధీనం
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : ఉభయగోదావరి జిల్లాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పెనుగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేర్వేరు రెండు కేసుల్లో అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి రూ.5.23 లక్షలు విలువచేసే 159 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నరసాపురం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్ల డించారు. కాకినాడకు చెందిన పాలిక దుర్గాప్రసాద్ రావులపాలెంలో లారీ క్లీనర్గా పనిచేస్తూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. 2011 నుంచి ఇతనిపై 10కిపైగా కేసులు ఉన్నా యి. రెండుసార్లు పలు కేసుల్లో ఏదాదిన్నర జైలు శిక్ష కూడా అనుభవించాడు. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం, ఏలేశ్వరం, తిమ్మాపురం, కోరంగి, అమలాపురం, కొత్తపేట, పి ఠాపురం ప్రాంతాల్లో చోరీలు చేశాడు. తాజాగా పెనుగొండలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడిని పెనుగొండలో పో లీసులు అరెస్ట్ చేసి 123 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెనుగొండకు చెందిన మరోవ్యక్తి కోసూరి కరుణ అనే యువకుడు భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, ఇరగవరం, అమలాపురం, రావుపాలెం, నరసాపురం, పి.గన్నవరం ప్రాం తాల్లో జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనారాయణతో కలిసి చో రీలు చేశాడు. ఇప్పటికే జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనా రాయణను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే కరుణ మాత్రం పోలీసులకు దొరకకుండా ముంబై పారిపోయాడు. ఈనేపథ్యంలో కోసూరి కరుణ పెనుగొండకు వచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ సీఐ సునీల్కుమార్, ఎస్సై పి.నాగరాజు, పెనుమంట్ర, ఇరగవరం ఎస్సైలు బి.శ్రీనివాస్, డి.ఆదినారాయణ నిందితులు ఇద్దరినీ ప ట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించారని డీఎస్పీ చెప్పారు. నరసాపురం సీఐ బి.కృష్ణకుమార్, టౌన్ ఎస్సై ఆర్.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
కార్యాలయం ఉద్యోగులే దొంగలు!
సాక్షి, ఒంగోలు : కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులే ఆ సంస్థలో వస్తువులను కాజేశారు. ఈ సంఘటన స్థానిక ఏనుగుచెట్టు సమీపంలోని డీటీడీసీ కార్యాలయంలో వెలుగు చూసింది. ఒన్టౌన్ సీఐ ఎం.భీమానాయక్ కేసు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరు పరిచారు. సీఐ కథనం ప్రకారం.. డీటీడీసీ కార్యాలయం నిర్వాహకుడు జొన్నగలగడ్డ శ్రీనివాసరావు ఇటీవల పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. డెలివరీ చేయాల్సిన పార్శిల్ వస్తువులు చోరీ అయ్యాయనేది ఆ ఫిర్యాదు సారాంశం. చోరీ సొత్తు విలువ రూ.4 లక్షలు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ముందుగా డీటీడీసీ కార్యాలయంలోని సీసీ పుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. అందులో లభించిన సమాచారం ఆధారంగా రాత్రి వేళ కార్యాలయంలో విధుల్లో పనిచేసిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిఘా ఉంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అయినాబత్తిన చిరంజీవి, అతడిచ్చిన సమాచారంతో అదే కార్యాలయంలో పనిచేసే కాకా మణికంటేశ్వరరావులను ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వివిధ కంపెనీలకు చెందిన 11 మొబైల్ ఫోన్లు, వైర్లెస్ స్పీకర్–1, సన్ గ్లాసెస్–1, బైక్ హారన్–1, రిస్ట్వాచి–1 స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.20 లక్షలుగా నిర్థారించారు. ఈ కేసులో మరో నిందితుడు హరిప్రసాద్ అలియాస్ హరి కోసం గాలిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ఎస్ఐ నఫీజ్ బాషా, సిబ్బంది కృషి చేశారంటూ వారిని సీఐ భీమానాయక్ అభినందించారు. -
దొంగలు దొరికారు
సాక్షి, విజయవాడ, గుంటూరు : నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చూపించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను బందరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు కొద్దిపాటి నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సీసీఎస్ బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన డేరంగుల రాజేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. వ్యసనాలకు బానిసైన రాజేష్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశాడు. భార్య లక్ష్మితో పాటు బంధువులైన మల్లెల సురేష్, తురక సురేష్, తురకా మమత, బత్తుల రేణు, తమ్మిశెట్టి బాలవీరాస్వామిలకు ఈజీ మనీ ఆశ చూపించి అతనితో కలుపుకున్నాడు. నేరాలు చేసేందుకు చేయి కలిపిన బంధువులతో కలిసి జనాన్ని మోసగించడం ప్రారంభించాడు. నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చిత్రీకరించి అమాయకులను అడ్డంగా దోచేయడం ప్రారంబించాడు. అలా జూన్ మాసంలో పెడన మండలం సింగరాయపాలెంలో బం«ధువులతో కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందరూ కూలి పనులు చేసుకుంటున్నట్లు గ్రామస్తులను నమ్మించారు. జూన్ 21న సింగరాయపాలెంకు చెందిన దుర్గాభవానీ అనే మహిళను కలిసి తనకు బంగారం బిస్కెట్ దొరికిందని నమ్మించాడు. అది అమ్మడం తనకు కష్టమని చెప్పి అతి తక్కువ ధరకు దొరికిన బిస్కెట్ అమ్మేస్తానంటూ అమాయకంగా నటించాడు. రాజేష్ మాటలు నమ్మిన దుర్గాభవానీ తన ఒంటిపై ఉన్న బంగారు నానుతాడు, చెవిదిద్దులతో పాటు రూ. 20వేల నగదును అప్పజెప్పి బిస్కెట్ను తీసుకుంది. అనుకున్న విధంగా పని ముగియడంతో రాజేష్, అతని బంధువులు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. అసలు విషయం తెలుసుకున్న దుర్గాభవానీ జరిగిన ఘటనపై పెడన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా రాజేష్, అతని బంధువులు చిలకలపూడి రైల్వేస్టేషన్లో అదే తరహాలో ప్రయాణికులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అందిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడిచేశారు. నిందితుడు రాజేష్తో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు. వీరిని విచారణ చేసి 24 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. ఈ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ముఠాను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన సీసీఎస్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు హబీబ్బాషా, వెంకటేశ్వరరావులను అబ్దుల్ అజీజ్ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఎస్ఐ హనుమంతరావు, పెడన ఎస్ఐ మురళి, జి. సత్యనారాయణ, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జల్సాల కోసం చోరీ
సాక్షి, ఆళ్లగడ్డ: వారంతా యువకులు.. కష్టపడకుండా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలనుకున్నారు. పథకం ప్రకారం చోరీ చేసి తప్పించుకున్నామని భావించారు. అయితే 24 గంటలు గడవకుండానే పోలీసులు వారిని పట్టుకుని కటకటాలకు పంపించారు. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని ఏవీ గోడౌన్ సమీపంలో శనివారం ఐదుగురు నిందితులను సీఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ 5500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పోతురాజు ఆదివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లకు చెందిన సూర విష్ణువర్ధన్రెడ్డి, దొర్ని పాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లికి చెందిన మహేశ్వర్రెడ్డి, శివశంకర్రెడ్డి గత నెల 29వ తేదీ సాహు సినిమా చూడటానికి ఆళ్లగడ్డకు వచ్చారు. నైట్ షో తర్వాత గ్రామానికి వెళ్లేందుకు ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులో ఎక్కారు. అయితే వీరి వద్ద పెద్దమొత్తంలో డబ్బులున్నట్లు భావించిన ఆటో డ్రైవర్ జెట్టి లక్ష్మణ్ తన మిత్రులు నీలిశెట్టి భూపతి శివ, దొమ్మరి దామోదర్, భూపతి సురేష్బాబుకు ఫోన్ చేసి రప్పించాడు. ఆటో చింతకుంట శివారు హెచ్పీ పెట్రోల్ బంకు సమీపానికి వెళ్లే సరికి వారంతా బైకులపై వచ్చి చుట్టుముట్టారు. ఆటోలో ఉన్న సూర విష్ణువర్ధన్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, శివశంకర్రెడ్డిని కిందకు దింపి దగ్గరున్న సొమ్ములు ఇవ్వాలని బెదిరించారు. డబ్బులు లేవని చెప్పడంతో విపరీతంగా కొట్టి మూడు సెల్ఫోన్లు, రూ.5,500 నగదు లాక్కొని వెళ్లి పోయారు. బాధితులు శుక్రవారం పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం సీఐ రమణ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. 24 గంటలు గడవకుండానే నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్కు ఆదేశించినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. -
టేక్మాల్ మార్కెట్లో దొంగల హల్చల్
సాక్షి, టేక్మాల్(మెదక్): టేక్మాల్ మార్కెట్లో దొంగల బెడద అధికమైంది. కాస్త ఆదమరిస్తే చాలా వస్తువులు మాయమవుతున్నాయి. ప్రతీ శనివారం నిర్వహించే వారంతపు సంతకు ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. దీంతో ప్రతీవారం సంత కిక్కిరిసిపోతుంది. ఇదే అదును చేసుకుంటున్న తొంగలు రెచ్చిపోతున్నారు. అందికాడికి ఎదిదొరికితే అది ఎత్తుకుపోతున్నారు. పోలీసులకు సవాలుగా మారినా దొంగలు దొరకడంలేదు. అధికంగా సెల్ఫోన్ల చోరీ.. మార్కెట్లో కూరగాయాలకు వెళ్లే సామాన్య ప్రజల నగదను అపహరించుకుపోతున్నారు. కాస్త ఆదమరిచి వస్తువులు పెట్టినా మట్టుకున్నా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ వచ్చే వారి సెల్ఫోన్లో అపహరణ అధికమైంది. ఇటీవట టేక్మాల్కు చెందినా గర్శ శ్రీనివాస్, జంగంనాగరాజు, విశ్వనాథం, వీరన్న, శంకర్, రాజు, మాదవచారిలతో పాటూ పల్వంచ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాంకిష్టయ్య, బోయిని నారాయణ, సాయిరెడ్డి, నర్సిరెడ్డి ఫోన్లు అపహరణకు గురయ్యాయి. అవుసలి రమేశ్ నగదు పోయాయని వాపోతున్నారు. ఇలా వారానికి రెండు నుంచి సెల్ఫోన్లు అపహరణకు గురవుతున్నాయి. మార్కెట్కు కాస్త అజాగ్రత్త వహించినా వస్తువులు అపహరణకు గురువుతున్నాయని వాపోతున్నారు. కొందరు మార్కెట్కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. స్టేషన్లో ఫిర్యాదులు.. వారంతపు సంతలో నగదు పోయిందని, సెల్ ఫోన్లు పోయాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు పెరుగుతున్నా.. దొంగలు మాత్రం వారి ఆగడాలను ఆపడంలేదు. పోలీసులు సైతం వారంతపు సంతలో నజర్పెట్టి అనుమానితులను ప్రశ్నించినా ఫలితం లేకపోతుంది. దొంగల ఆచూకి పోలీసులకు అంతుచిక్కకపోవడం లేదు. నిఘాను పెంచుతూ అనుమానితులను ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోయింది. మార్కెట్లోని దొంగలతో పోలీసులకు సవాల్గా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేశా.. గత వారం మార్కెట్లోకి కూరగాయాలు తీసుకోవడానికి వెళ్లాను. పదిహేను వేల రూపాయలగల విలువైన పోన్ అపహరణ గురయింది. ఎంత వెతికినా దొరకలేదు. దొంగల బెడద అధికమయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. మార్కెట్లోని దొంగలను పట్టుకోవాలి. – గర్శ శ్రీనివాస్, టేక్మాల్ పట్టుకుంటాం.. పిర్యాదులు వచ్చిన మాట నిజమే. మార్కెట్ రోజు గస్తీలో సిబ్బందిని పెడతాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచుతాం. మార్కెట్కు వెళ్లెవారు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలి. అనుమానితులు కంటపడితే సమచారం ఇవ్వండి. దొంగలపై శాఖాపరమైన చర్యలు తప్పవు. – షాబొద్దీన్, ఎస్ఐ, టేక్మాల్ -
మిరపకాయల దొంగలు ఇద్దరు అరెస్టు
కృష్ణాజిల్లా, చందర్లపాడు (నందిగామ) : కల్లాల్లో ఎండబెట్టిన మిరపకాయలను దొంగిలిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నందిగామ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన కొత్త ఆనంద్కుమార్, జగ్గయ్యపేటకు చెందిన యర్రంశెట్టి సైదేశ్వరరావు గడిచిన రెండు మాసాలుగా పలు గ్రామాల్లోని పొలాల్లో ఆరబెట్టిన మిర్చిని దొంగిలిస్తున్నారు. చందర్లపాడు మండలంలో పోపూరు, చింతలపాడు, పాతబెల్లంకొండ వారిపాలెం, కంచికచర్ల మండలం పెండ్యాల, వత్సవాయి మండలం గట్టుభీమవరం, తెలంగాణ రాష్ట్రం మధిర మండలంలోని దేశినేనిపాలెం గ్రామాలలో 96 టిక్కీల మిరపకాయల దొంగతనం జరిగింది. పగటిపూట ద్విచక్ర వాహనంపై పొలాల్లోని కల్లాల వద్ద రెక్కీ నిర్వహించి, స్థానికులతో కొద్ది సేపు కలివిడిగా మాట్లాడతారు. రాత్రి సమయంలో కల్లాల వద్ద రైతులు కాపలా ఉంటున్నారా లేదా అనేది నిర్ధారణ చేసుకుంటారు. కాపలా ఉండరని తెలిస్తే రాత్రివేళ వచ్చి మిరపకాయలను టిక్కీలకు ఎత్తుకుని ఆటో ద్వారా తరలిస్తారు. నిందితుల్లో ఒకడైన సైదేశ్వరరావుకు సొంత ఆటో ఉంది. మిరపకాయలను ఆ ఆటో ద్వారా నందిగామలో ఆనంద్కుమార్ ఉంటున్న ఇంట్లో నిల్వ చేస్తారు. ఆయా గ్రామాల్లో మొత్తం 96 టిక్కీల కాయలను ఇప్పటి వరకు దొంగిలించారని, వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. వీరిరువురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు చెప్పారు. -
బాబోయ్ దొంగలు
సాక్షి,నాగర్కర్నూల్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కురుమూర్తి ఆలయం, అచ్చంపేట ఉమామహేశ్వరం, కొత్తకోట మండ లంలోని పలు ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీల చోరీలు, ఇళ్లల్లో చోరీలతో మరింత భ యానికి గురవుతున్నారు. వేసవి ఉక్కపోతకు ఇళ్లలో పడుకోలేక.. ఆరుబయట నిద్రపోదామంటే ఒకింత ఆందోళనతో ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ వేసవికాలం కావడంతో చాలామటుకు గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఆరుబయట, ఇంటి మిద్దెలపై నిద్రిస్తుంటారు. కానీ, దొంగలకు ఇదే మంచి అవకాశంగా మారుతుంది. తాళం వేసిన ఇళ్లనే వారు టార్గెట్ చేసి దొరికిన కాడికి దోచుకెళుతున్నారు. ఇళ్ల యజమానులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, పార్లమెంట్ ఎన్నికల బందోబస్తులో పోలీసులు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ వంతుగా దొంగతనాల నివారణ కోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ∙వేసవి సెలవుల్లో దూరప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ను పోలీస్ అధికారులకు తెలియజేస్తే అలాంటి ప్రాంతాలలో పోలీసులు నిఘా పెడతారు. ∙విహారయాత్రలకు వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు ఉంచొద్దు. బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ∙పని నిమిత్తం ఎవరైనా ఇంటికి తాళం వేసి వె ళ్లాల్సి వస్తే పక్కింటి వారికి చెప్పి వెళ్లాలి. ఇళ్లు తా ళం వేసి ఉంటే దొంగతనం జరిగే ఆస్కారం ఉంది. ∙ఇంటి ఆవరణ, కాలనీ పరిసరాలు, షాపింగ్ కాంప్లెక్స్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ∙మేడపై నిద్రించే వారు మెడలో బంగారు, వెండి ఆభరణాలు వేసుకోవద్దు. ∙ఇళ్లలో ఉక్కబోత నుంచి ఉపశమనం కోసం కిటికీలు, తలుపులు తెరిచి నిద్రపోవద్దు. అలా ఉండడం వల్ల కిటికీ పక్కన ఉంచే షర్ట్స్, ప్యాంట్లలో నుంచి పర్సులు, నగదు, సెల్ఫోన్లు చోరీ అయ్యే అవకాశం ఉంది. ∙అపరిచితులను నమ్మొదు. బంగారానికి మెరుగు పెడతామని వచ్చే వారికి విలువైన వస్తువులు ఇచ్చి మోసపోవద్దు. ∙మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటికి, శుభకార్యాలకు వెళ్లాల్సి వస్తే మెడచుట్టూ కొంగు కప్పుకోవాలి. లేదంటే బైక్లపై వచ్చి చోరీ చేసే ఆస్కారం ఉంది. ∙తమ ఇంటి సభ్యుల సౌకర్యార్థం ఇంటి తాళాన్ని పరిసరాల్లో, కిటికీల పక్కన పెట్టవద్దు. దొంగలు వాటిని గుర్తించి దొంగతనం చేసే అవకాశం ఉంది. ∙వేసవి కావడంతో తాళం వేసిన ఇంటి ముందు వాహనాలు నిలపొద్దు. చోరీకి గురయ్యే అవకాశం ఉంది. జనసంచారం కల్గిన పార్కింగ్లలో వాహనాలు ఉంచాలి. ∙ఊళ్లకు వెళ్లే వారు ఇళ్లలో ఓ గదిలో లైట్ వేసి ఉం చితే మంచిది. రాత్రి వేళలో లైట్ వెలుగుతూ ఉం టే ఇంట్లో ఎవరో ఉన్నారని దొంగలు ఊహిస్తారు. ∙ఇంటి డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. అలాగే, ఇంటి గేట్లకు సైరన్లను బిగించుకోవాలి. అపరిచితులు గేటు డోర్లను ముట్టుకుంటే శబ్దం వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ∙ఇంటి పరసరాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఏదైనా సమాచారాన్ని అందించాలి అనుకుంటే 100 నంబర్కు డయల్ చేయాలి. -
నడ్డిరోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్ళిన ఇద్దరు యువకులు
-
దేవుళ్లకే శఠగోపం!
సాక్షి, కొత్తకోట రూరల్: జల్సాలకు ఆలవాటు పడిన కొందరు ఆలయాలను కూడా వదలడం లేదు. ఇటీవల కురుమూర్తిస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన మరవకముందే కొత్తకోటలోని మూడు ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పట్టణ శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లి గ్రామ శివారులోని పొలాల్లో పడేశారు. ఈ క్రమంలో కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3 వేల నగదు, సాయిబాబ ఆలయంలో రూ.500, వెంకటగిరి ఆలయంలో అరకిలో వెండి (శఠగోపం)తోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారని ఎస్ఐ తెలిపారు. ఉదయమే ఆయా ఆలయాల్లో తాళాలు పగులగొట్టి ఉండగా వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందిం చారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబ్నగర్, వనపర్తి జిల్లాకేంద్రాలను నుంచి క్లూస్ టీంలు వచ్చి పొలాల్లో పడేసిన హుండీలను పరిశీలించారు. దొంగతనానికి గురైన హుండీలపై ఉన్న వేలిముద్రలను క్లూస్టీం సభ్యులు సేకరించారు. మూడు ఆలయాలను వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్రావు పరిశీలించి ఎస్ఐతో వివరాలు తెలుసుకున్నారు. -
ముమ్మర గస్తీ
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండుగ నేపథ్యం లో నగరవాసులు పల్లెబాట పడుతుండడంతో నగరంతో పాటు శివారు ప్రాంతాలు బోసిపోతున్నాయి. లక్షలాది మంది పండుగ కోసం సొంతూళ్లకు పయనం కావడంతో కాలనీలకు కాలనీలే నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆయా ప్రాంతాల్లో అదును చూసు కొని దొంగ లు పంజా విసిరే అవకాశముంది. గతేడాది సంక్రాంతి పండుగ సమయాల్లో శివారు ప్రాంతా ల్లో దొంగలు చెలరేగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ‘గస్తీ’బాట పట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి కాలనీలో సెక్టార్ ఎస్ఐ, బ్లూకోట్స్, రక్షక్ వాహన సిబ్బందిని రం గంలోకి దింపారు. కొత్త ఏడాదిలో వరుసగా చైన్స్నాచింగ్లు, చోరీలు జరగడంతో ఇప్పటికే అప్ర మత్తమైన మూడు కమిషనరేట్ల పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళితే సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా ఇంటి యజమానులు, అద్దెదారుల ఇచ్చిన సమాచారంతో పాటు ప్రతీ కాలనీలో పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేస్తూ దొంగత నాలు జరగకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. కత్తిమీద సామే... సెలవులకు ముందే పెద్దఎత్తున దుండగులు చోరీలకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. పూర్తిస్థాయిలో ప్రజలు పండగకు స్వగ్రామాలకెళ్లి ఇళ్లకు తాళాలు పడితే ఇంకా ఎంత విజృంభిస్తారోననే భయం వెంటాడుతోంది. ఓవైపు గస్తీ .. నిఘా పెంచామని పోలీసులు చెబుతున్నా.. దొంగలు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అరెస్టులతో నియంత్రణ చర్యలు చేపడుతున్నా దొంగతనాల జోరు కొనసాగుతూనే ఉంది. వారం రోజుల వ్యవధిలోనే ఘట్కేసర్, బంజారాహిల్స్, పద్మారావునగర్, వనస్థలిపురం, హయత్నగర్, కేపీహెచ్బీ ఠాణాలో పరిధిలో దొంగలు విజృంభించారు. సంక్రాంతికి ముందే సవాల్ విసురుతుండటంతో రానున్న రోజుల్లో ఇంకెన్ని ఇళ్లకు కన్నాలు పడతాయోననే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మూడు కమిషనరేట్ల పోలీసులు చేపడుతున్న నియంత్రణ చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. ఇటీవల జరిగిన చోరీలు ఇవీ... ♦ నెల 4న కేపీహెచ్బీ ఠాణా పరిధిలోని భగత్సింగ్నగర్ ఫేజ్–1కు చెందిన రెండు ఇళ్లలో, ఎన్ఆర్ఎస్ఏ కాలనీలోని మరో ఇంటిలో అర్ధరాత్రి దొంగలు చొరబడి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ♦ వనస్థలిపురం, హయత్నగర్ ఠాణాల పరిధిలో ఈ నెల 8న పట్టపగలే మూడు చోరీలు జరిగాయి. వనస్థలిపురం ఫేజ్–2 వాసి సుధాకర్రావు ఇంట్లో 2.5 తులాల బంగారం, రూ.10 వేల నగదు అపహరించారు. ప్రశాంత్నగర్కు చెందిన జంగయ్య ఇంట్లో 27 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ చేశారు. మన్సూరాబాద్ నాయక్నగర్ కాలనీకి చెందిన ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు శ్రీకాంత్ ఇంట్లో 7.5 తులాల బంగారం, 25 తులాల వెండి చోరీకి గురయ్యాయి. ♦ ఈ నెల 10న ఘట్కేసర్ మండలం దత్తాత్రేయనగర్లో ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి వివాహితను చీరతో బంధించి 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. -
వార్నీ.. మంటలు మీ పనా?
కర్ణాటక, కృష్ణరాజపురం : రెండేళ్లుగా తరచూ బెళ్లందూరు చెరువులో భారీగా మంటలు అంటుకుంటున్న ఘటనలకు సంబంధించి శుక్రవారం అసలైన కారణం వెలుగు చూసింది. బెళ్లందూరు చెరువులో మంటలు అంటుకోవడానికి వెనుక చెరువులో పేరుకుంటున్న చెత్త, విషవాయువులు మాత్రమే కారణంగా ఇన్ని రోజులు భావిస్తూ వచ్చిన అధికారులు.. మంటలు అంటుకున్న ఘటనలకు తమిళనాడుకు చెందిన నలుగురు కేబుల్వైర్ల దొంగలు ప్రధాన కారణమని తెలుసుకొని అవాక్కయ్యారు. బెళ్లందూరు చెరువులో తరచూ మంటలు అంటుకుంటుండడంతో చెరువు చుట్టూ రక్షణ కోసం నియమించిన మార్షల్స్ ఎప్పటిలాగానే శుక్రవారం చెరువులో విధులు పాల్గొన్నారు. బెళ్లందూరు చెరువులో మంటలు, పొగ (ఫైల్) ఈ క్రమంలో చెరువులో చెట్ల మాటున నలుగురు వ్యక్తులు వైర్లకు నిప్పు పెడుతుండడాన్ని గమనించి వెంటనే అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో అసలు విషయంవెలుగు చూసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసిన వైర్లను బెళ్లందూరు చెరువులో తగులబెట్టి లోపలున్న రాగి వైరును విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు తెలిపారు. చాలా ఏళ్లుగా తాము ఇక్కడే వైర్లను తగులబెడుతున్నామని గతంలో బెళ్లందూరు చెరువులో మంటలు అంటుకున్న ఘటనలు తాము వైర్లకు నిప్పు పెట్టడం వల్లే జరిగాయంటూ అంగీకరించారు. తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
దొంగల చేతివాటం
చౌటుప్పల్ (మునుగోడు) : దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. శుభకార్యాల్లోకి ప్రవేశించి పని చేసుకుపోయారు. పెద్ద ఎత్తున నగదు చోరీ చేశారు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని లక్కారం, చౌటుప్పల్లో చోటు చేసుకుంది.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ముగ్గురు, డిండికి చెందిన మరో యువకుడు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో çసంచరిస్తూ అనువైన ప్రాంతాలను గుర్తించి చోరీలకు పాల్పడుతుంటారు. అందులో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. ముందుగా లక్కారం గ్రామంలోని ఎంఆర్ఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు. భోజనాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆదమర్చి ఉన్న అక్కడి వ్యక్తుల జేబులకు చిల్లు వేశారు. పని ముగించుకుని సాఫీగా అక్కడి నుంచి వెనుతిరిగారు. అనంతరం మండల కేంద్రంలో జరుగుతున్న వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ భోజనాల వద్దకు వెళ్లి జనంలో చొరబడ్డారు. చేతివాటం ప్రదర్శిస్తుండగా యువకులు పట్టుకోబోయారు. దీంతో అక్కడి నుంచి నలుగురు దొంగలు పారిపోబోయారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగల వెంటపడి పట్టుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించారు. రెండు ఘటనల్లో 12మంది బాధితుల వద్ద లక్షా 20 వేల రూపాయల వరకు దొంగలు అపహరించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీలో ‘దొంగలు పడ్డారు’!
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో సామగ్రికి భద్రత కరువైంది. దాదాపు ఏడేళ్ల నుంచి కడప డిపో పరిధిలో సామాన్లకు సం బంధించిన ఆడిట్ కూడా జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆర్టీసీ బస్సులోల ఏవైనా వస్తువులు ప్రయాణికులు మరిచిపోతే వెంటనే ప్రకటన ఇవ్వడంకానీ, పోలీసులకు ఫిర్యా దు చేయడంగానీ జరగాలి. అలాంటివేమీ చేయకుండానే ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పలు ఆరోపణలకు తావి స్తోంది. ఆర్టీసీలో కొందరు ఇంటి దొంగలైతే, మరికొందరు బ యటివారు ఉన్నారు. అయినా వారిపై నిఘా కరువవుతోంది. ∙సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కడప డిపో గ్యారేజీలో టైర్లు కొన్ని మాయమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు కొత్త టైర్లు డిపో గ్యారేజీ ప్రహరీ సమీపంలో ఉన్న ఓ పాఠశాల ఆవరణంలో పడిపోయాయి. వాటిని సంబంధిత పాఠశాల వారే ఆర్టీసీ వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. ⇒ ఆర్టీసీ బస్టాండ్లోని జనరేటర్ చోరీకి గురైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని విలువ దాదాపు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు ఉంటుంది. ⇒ ఎర్నింగ్ సెక్షన్లో కంప్యూటర్, మానిటర్లను ఎత్తుకుపోయినా దిక్కులేదని అనుకుంటున్నారు. ⇒ కండక్టర్లకు సంబంధించిన టికెట్ ట్రేలు దాదాపు 20 దాకా మాయమైనప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ⇒ టిమ్ (టికెట్ ఇష్యూయింగ్ మిషన్) లకు సంబంధించిన సామాన్లు కూడా గల్లంతయినట్లు సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు లేవనే చర్చ జరుగుతోంది. ⇒ ప్రతి డిపోకు ఇద్దరు క్యాషియర్లు బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ చేయించాల్సి ఉంది. అయితే గత ఏడేళ్లుగా ఎలాంటి ఆడిట్ జరగలేదని సమాచారం. ⇒ అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 800 వివిధ రకాల సామాన్లు, పరికరాలకు సంబంధించి ఎలాంటి గణాంకాలు లేకపోయినా, సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మా దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటాం కడప డిపోతో పాటు అన్ని డిపోలలో ఏవైనా అక్రమాలు జరిగితే వెంటనే ఎవరైనా సరే రాత పూర్వకంగా తమ దృష్టికి తీసుకుని వస్తే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కడప రీజనల్ మేనేజర్ చెంగల్రెడ్డి, డిప్యూటీ సీటీఎం కిషోర్లు వివరణ ఇచ్చారు. ప్రతి ఏడాది ఒకసారి ఆడిటింగ్ డిపోల వారీగా జరగాల్సి ఉందన్నారు. కడప డిపోకు ఆడిటింగ్ ఎపుడు జరిగింది విచారించి తెలియజేస్తామన్నారు. బంగారు ఆభరణాల వ్యవహారానికి సంబంధించి బద్వేలు సంఘటనలో బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామన్నారు. కడప డిపోలో బంగారు ఆభరణాలకు సంబంధించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విలువైన వస్తువుల మాటేమిటి ? కడప, బద్వేల్ డిపోల పరిధిల్లో ఇటీవల జరిగిన సంఘటనల్లో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహారం ప్రయాణికుల్లో ఆర్టీసీపై విశ్వసనీయత కోల్పోయే విధంగా ఉంది. ∙బద్వేల్ బస్టాండ్లో నాలుగు నెలల క్రితం ఓ ప్రయాణికుడు బ్యాగును మరిచిపోయి వెళ్లాడు. ఆ బ్యాగులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆలస్యంగా బయటకు పొక్కింది. ఐదుగురు ఉద్యోగులు కలిసి పంపకాలు చేసుకోవడంలో భేదాభిప్రాయాలు వచ్చి బయట ప్రచారం జరగడంతో ఉలిక్కిపడ్డారు. ఆ నోటా, ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కంగుతిన్న సదరు ఉద్యోగులు ఎంతోకొంత డబ్బులను జమచేస్తామని చెప్పుకుంటున్నట్లు సమాచారం. ⇒ కడప డిపో పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 27న అనంతపురం నుంచి గంజికుంటకాలనీకి చెందిన షేక్ జిలానీ భార్య రుక్సానాబేగం తన పిల్లలతో కలిసి కడపకు వచ్చింది. ముద్దనూరు వద్ద టిఫెన్ తీసుకుని బస్సులోనే తిన్నారు. కడపకు చేరుకునే సరికి తమ లగేజీలోని సూట్కేస్ కన్పించలేదు. దీంతో చిన్నచౌక్, ఒన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వీరినే నిందించడంతో మిన్నకుండిపోయారు. తర్వాత అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నా సూట్కేస్లోని వస్తువులను వేలం వేశారని, సుమారు 72 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారని తెలిసింది. ⇒ఈ సంఘటనపై ఈనెల 18న సాక్షి దినపత్రికలో ‘కడప డిపోలోనే బంగారు ఆభరణాలు’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో బాధితులు తగిన ఆధారాలతో అధికారులను సంప్రదించారు. అధికారులు బాధితురాలిని విచారించి, త్వరలో కమిటీ సమావేశం నిర్వహిస్తామని ఆ తర్వాత విచారిస్తామని వెల్లడించినట్లు బాధితురాలు ‘సాక్షి’కి వివరించింది. ∙ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
వారెవ్వా.. ఈ దొంగలు సూపరో సూపర్
లండన్: పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లే దొంగలందు మంచి దొంగలు వేరయా అని చెప్పక తప్పదేమో ఈ సంఘటన చూస్తుంటే. దొంగిలించుకెళ్లిన బైక్ను తిరిగి తీసుకురావడమే కాకుండా దానిలో తిరిగి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి, కొత్త తాళం చేయించి పెట్టి క్షమాపణలు కోరుతూ ఓ లేఖ కూడా రాసి పెట్టిపోయే బాధితులు ఆశ్చర్యపోయేలా ఇద్దరు దొంగలు. తాము ఏ యువకుడిదో ఆ బైక్ అనుకొని పొరబడ్డామని అందుకు క్షమించాలని ఆ లేఖలో వివరించారు. వివరాల్లోకి వెళితే..రెండు వారాల కిందట మెల్ ఫిషర్ అనే బ్రిటన్ మహిళ తన ఫేస్బుక్ పేజీలో ఒక విజ్ఞాపన కథనాన్ని వెలువరించింది. తన ప్రియుడి కుమారుడి బైక్ను ఎవరో దొంగిలించుకెళ్లారని, దయచేసి ఆ బైక్ కనిపిస్తే వివరాలు అందించాలని అందులో కోరారు. అయితే, ఆమె అలా పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే అనూహ్యంగా ఒక రోజు ఆ పిల్లాడి బైక్ ఇంటిముందే కనిపించింది. పైగా దానికి కొత్త తాళం చేయించి ఉండటంతోపాటు ఫుల్గా పెట్రోల్, ఓ క్షమాపణ పత్రం కనిపించింది. దీంతో మెల్ ఫిషర్, ఆమె ప్రియుడి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. 'మీ కుమారుడి బైక్ దొంగిలించినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాం. వాస్తవానికి మేం చేసిన తప్పు క్షమార్హం కాకపోయినప్పటికీ వివరణ ఇచ్చుకుంటున్నాం. మేం ఎవరో టీనేజర్ది ఆ బైక్ అని ఎత్తుకెళ్లాం. అయితే, మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాక వెంటనే మీ బైక్ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే మీ పిల్లాడి బైక్కు ఇక ఎవరూ దొంగిలించలేనంత బలమైన తాళాన్ని కొనుగోలు చేశాం. తాళాలు బైక్లో పెట్టాము. మీరు సూచించిన చోటే బైక్ ఇవ్వలేకపోతున్నాం. కానీ, ఈ బైక్ చూశాకనైనా గుండెపలిగిన మీ పిల్లవాడు సంతోషపడతాడని భావిస్తున్నాం. ఈ బైక్ను నడిపే యోగ్యత అతడికే ఉంది' అంటూ ఆ లేఖలో వివరించారు. -
ఆటో దొంగల అరెస్ట్
కర్నూలు : బళ్లారి రోడ్లోని మహేంద్ర ట్రాక్టర్స్ షోరూమ్లో ఆటోలను చోరీ చేసి తప్పించుకొని తిరుగుతున్న దొంగలను నాల్గవ పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కర్నూలు పట్టణానికి చెందిన షేక్నూర్ అహ్మద్, పింజరి బాబు, పింజరి లతీఫ్ఖాన్, ఎండీ మహమ్మద్బాషా తదితరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.7 లక్షలు విలువ చేసే నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగరాజురావు తెలిపారు. దొంగలను కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు. -
నాలుగే నిమిషాల్లో ఇల్లుగుల్ల
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కారులో వచ్చిన దొంగలు తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి క్షణాల్లో పని ముగించుకుని వెళ్లిపోయారు. విలువైన వస్తువులన్నిటినీ ఇంట్లోనే ఉన్న సూట్కేసులో సర్దుకుని అక్కడి నుంచి దర్జాగా ఉడాయించారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కాగా చూసి ఆశ్చర్యపోవటం పోలీసుల వంతయింది. వివరాల్లోకి వెళితే దొడ్డబళ్లాపురం పాత బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న బెస్తరపేటలో నివసిస్తున్న నరేష్ బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరిగే పూజకు వెళ్లాడు. విషయం పసిగట్టిన గుర్తు తెలియని దొంగలు దర్జాగా కారులో అక్కడికి చేరుకున్నారు. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.30 వేల నగదుతో ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉన్న ఒక సూట్కేస్లో సర్దుకుని వెళ్లిపోయారు. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నరేష్ కుటుంబం చోరీ జరిగిన సంగతి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు ఇద్దరు ఒక ఇండికా కారులో వచ్చి నాలుగే నిమిషాల్లో చోరీ సొత్తున్న సూట్కేస్తో వెళ్లడం ఇంటి ముందు ప్రైవేటు కార్యాలయం సీసీ టీవీలో రికార్డయింది. తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నగదు లాక్కుందామనుకున్నారు.. కానీ..
* దొరికిపోయి తన్నులు తిన్నారు..! * పోలీసుల అదుపులో ఇద్దరు చోరులు బాపట్ల: బాపట్ల స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద గురువారం మహిళ వద్ద నగదును చోరీ చేయడానికి ప్రయత్నించి ఇద్దరు దొరికిపోయారు. బ్యాంకు వద్ద బాగా రద్దీగా ఉండడాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఒక మహిళ చేతిలో ఉన్న నగదును లాక్కునేందుకు యత్నించారు. ఆ మహిళ కేకలు వేయడంతో క్యూలో ఉన్న వారు వెంటనే నిందితుని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతనితో పాటు ఉన్న మరో వ్యక్తిని కూడా పట్టుకుని అక్కడే ఉన్న పోలీసులకు ఇద్దరినీ అప్పగించారు. పోలీసులు విచారించగా ప్యాడిసన్పేటకు చెందిన వ్యక్తులుగా చెప్పారు. అయితే వారు ఆ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడంతో విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. -
విగ్రహాల దొంగలు అరెస్టు
-రూ.లక్ష విలువ గల పంచలోహ విగ్రహాలు స్వాధీనం ఆత్మకూరు(అనుమసముద్రంపేట): ఆలయాల్లో విగ్రహాలు చోరీ చేస్తున్న ఏడుగురు దొంగలను ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు లక్ష రూపాయల విలువైన దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని ఆత్మకూరు సీఐ ఖాజావలి తెలిపారు. మంగళవారం ఆత్మకూరులో స్థానిక సీఐ కార్యాలయం ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దొంగలను విలేకరుల ముందుకు తీసుకువచ్చారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో గత పది రోజులుగా దొంగతనాలు జరుగుతుండడంతో గస్తీ ముమ్మరం చేశామని, అందిన సమాచారం మేరకు నెల్లూరుపాళెంకు చెందిన పులిచెర్ల నాగేంద్ర, ఆత్మకూరుకు చెందిన పెయ్యల ప్రసాద్, సయ్యద్ అబ్దుల్ అలీ, మహ్మద్ అలీ జిన్నా, షేక్ షాబుద్దీన్, షేక్ ఉమర్, షేక్ జపురుల్లా, ఎస్టీ కాలనీకి చెందిన సయ్యద్ సర్ధార్, వరికుంటపాడు మండలం చెన్నంçపల్లికి చెందిన సుందరయ్యలపై నిఘా ఉంచామన్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్లో భాగంగా దేపూరు సమీపంలోని వెంకయ్యస్వామి ఆశ్రమం వద్దకు వెళ్లగా ఆలయం సమీపంలో చెట్ల వద్ద నక్కి చోరీ చేసేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులను గుర్తించామన్నారు. వారిలో జపురుల్లా, సర్దార్లు పరారయ్యారని మిగిలిన వారిని పట్టుకున్నామని తెలిపారు. వీరిని విచారించగా జూన్ నెల 25న నరసాపురం గ్రామంలోని శ్రీపాకనాటి పతివ్రతమ్మ ఆలయంలో పులిచర్ల నాగేంద్ర, పెంచల ప్రసాద్ తలుపులు పగులగొట్టి అమ్మవారి విగ్రహాలను దొంగలించి తీసుకెళ్లారని తెలిపారు. ఆ విగ్రహాల వివరాలు తెలపడంతో విగ్రహాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.లక్షకు పైగా ఉండవచ్చన్నారు. నిందితులను పట్టుకున్న ఆత్మకూరు ఎస్సై పూర్ణచంద్రరావు, సిబ్బందిని అభినందించారు. -
వెంగళాయపాలెంలో దొంగల హల్చల్!
* ప్రజల అప్రమత్తతతో పరారు * ఒకేరోజు గ్రామంలో నాలుగు చోట్ల చోరీ యత్నం * దుండగుల ఆటోను అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు రూరల్: పోలీసుల రాత్రి గస్తీలు అంతంత మాత్రంగా ఉండడంతో చోరులు తెగబడుతున్నారు. అందిన కాడికి దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదమరిచి ఉంటే అంతే సంగతులు అన్నట్టుంది గ్రామాల్లో ప్రజల పరిస్థితి. మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి గ్రామంలోని విశ్వం దుకాణం సమీపంలో తాళాలు వేసిన ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరూ లేని ఇంట్లో లైట్లు వెలగడంతో స్థానికులు ఎవరని కేకలు వేయడంతో దుండగులు ఆటోలో పరారయ్యారు. అనంతరం 10 గంటల ప్రాంతంలో గ్రామంలోని కోళ్ల ఫారాల సెంటర్లో మూసేసిన దుకాణం షట్టర్లు వంచేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం 11 గంటలప్రాంతంలో గ్రామ శివారులో ఒక పూరింట్లో చోరీకి ప్రయత్నించగా, వృద్ధురాలు అప్రమత్తమవడంతో పారిపోయారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సాయిబాబా ఆలయం సమీపంలో వెంకటరావు దుకాణంలో చోరీకి ప్రయత్నిస్తూ దుకాణం షట్టర్లు పలుగులతో వంచేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికుడు గమనించి కేకలు వేశాడు. దీంతో దుండగులు వారి వద్దనున్న రెండు పదునైన పలుగులు, మూడు షట్టర్లు, తాళాలు పగులగొట్టేందుకు వినియోగించే వస్తువులను వారితోపాటుగా తెచ్చుకున్న ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని దుండగులు వినియోగించిన పలుగులు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఒకే రోజు నాలుగు చోట్ల చోరీయత్నం జరగడంతో గురువారం మొత్తం గ్రామంలో ఇదే విషయం చర్చనీయాంశమైంది. పోలీసుల గస్తీలు సక్రమంగా లేకపోవడంతోనే దుండగులు తెగబడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు గ్రామాల్లో గస్తీలు పెంచాలని కోరుతున్నారు. -
బైక్ దొంగల అరెస్టు
నరసరావుపేట రూరల్: ద్విచక్రవాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని ప్రకాష్ నగర్కు చెందిన బత్తుల కిరణ్సాయి, బరంపేటకు చెందిన షేక్ మహాబూబ్సుభాని వన్టౌన్ పోలీస్స్టేషన్ , రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడ్డారు. దీంతో పాటు నల్లపాడులో మార్నింగ్ వాకింగ్కు వెళ్తున్న మహిళ మెడలోని 3 సవర్ల బంగారాన్ని అపహరించారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, బంగారు గొలుసును స్వా«ధీనం చేసుకున్నారు. శుక్రవారం వీరిని అరెస్ట్చేసి కోర్టులో హాజరుపర్చినట్టు రూరల్ ఎస్సై జెసిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఇదిగో దొంగలు
–వీరభద్రస్వామి దేవాలయంలో చోరీకి పాల్పడింది వీరే – సీసీ కెమెరాల్లో దొంగల చిత్రాలు నమోదు దీబగుంట్ల(గోస్పాడు): దీబగుంట్ల గ్రామం వీరభద్రస్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగల చిత్రాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వారం రోజుల క్రితం దేవాలయంలోని వీరభద్రస్వామికి సంబంధించిన వెండి వస్తువులు, హుండీలో ఉన్న సొమ్ము కాజేశారు. దీంతో గ్రామ పెద్దల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దేవాలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగల ఫొటోలు కనిపించాయి. వారి ఫొటోలను బుధవారం శిరివెళ్ల సీఐ ప్రభాకర్రెడ్డి, ఎస్ఐ జగదీశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో చూపించారు. ఈ దొంగలను పట్టించిన వారికి తగిన పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని ఎవరైనా గుర్తిస్తే సెల్: 94407 95541,94407 95513కి నంబర్లకు సమాచారం అందించాలని వారు కోరారు. -
పాఠశాలల్లో దొంగల హల్చల్
గోపాలపురం : పాఠశాలలు, పంచాయతీరాజ్ ఏఈ కార్యాలయాల్లో శుక్రవారం తెల్లవారుజాములన దొంగలు హల్చల్చేశారు. తాళాలు పగలకొట్టి చోరీకి యత్నించారు. స్థానిక జిల్లాపరిషత్, మండలపరిషత్ కార్యాలయంలోని జెడ్పీ ఎంపీపీ పాఠశాలలు, పంచాయతీరాజ్ ఏఈ కార్యాలయంలో దొంగలు పడి తాళాలు పగలకొట్టారు. పాఠశాలల్లో బీరువాలు పగలకొట్టారు. అయితే నగదేమీ దోచుకెళ్లలేదు. శనివారం జెడ్పీ హైస్కూలు హెచ్ఎం వేసంగి సత్యనారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైటర్ జి.కృష్ణప్రసాద్ తెలిపారు. -
నడికూడలో బైక్ చోరీ
పరకాల : మండలంలోని నడికూడలో దొంగలు మంగళవారం రాత్రి హల్చల్ చేశారు. గ్రామంలోని ఓ బైక్ను అపహరించారు. మరో బైక్ను అపహరించేందుకు విఫల యత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. నడికూడకు చెందిన టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఊర రవీందర్రావు, చింతలపల్లి భీమ్రావులు తమ ఇళ్ల ఎదుట బైక్లను నిలిపారు. కాగా, రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అపహరించారు. అయితే గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో భీమ్రావు బైక్ కనిపించింది. రవీందర్రావు బైక్ మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పట్టపగలు చోరీ
నిజాంసాగర్ : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. పగలు, రాత్రి అన్నతేడాలు లేకుండా దొంగతనాలు చేస్తూ దొంగలు రెచ్చి పోతున్నారు. నిజాంసాగర్ మండలం వడ్డేపల్లిలోని ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. వడ్డేపల్లికి చెందిన శైనొద్దీన్ బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో కలిసి బాన్సువాడకు వెళ్లారు. గ్రామస్తులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు గ్రామ శివారులోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు పట్టపగలు శైనొద్దీన్ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. గదుల్లో ఉన్న బీరువాలు, సుట్కేసులను పగులగొట్టారు. అందులో దాచిఉంచిన రూ. 90 వేల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకు వెళ్లారు. అయితే చోరీకి పాల్పడగా లభించిన నగదు, బంగారాన్ని గ్రామ శివారులోని పంటపొలాల్లో పంచుకున్నారు. అదే సమయంలో హరితహారం పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న గ్రామస్తులకు పంటపొలాల గట్ల కింద దాగి ఉన్న మహిళలు, పురుషులు కంటపడ్డారు. అప్పటికే శైనొద్దీన్ ఇంట్లో దొంగతనం జరిగిన విషయం గ్రామస్తులకు తెలిసింది. గ్రామశివారులోని పంటపొలాల్లో దాగి ఉన్న దొంగలను గ్రామస్తులు చుట్టిముట్టి పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన నలుగురు మహిళలతో పాటు ఒక దొంగను పట్టుకున్నారు. అప్పటికే నగదు, బంగారాన్ని పంచుకున్న మహిళలు సదరు నగదు, బంగారాన్ని దాచుకున్నారు. గ్రామశివారులో పట్టుబడిన దొంగలను కొట్టుకుంటూ గ్రామ పంచాయతీకి కార్యాలయానికి తీసుకువచ్చారు. అప్పటికే ఒక దొంగ కొంత నగదుతో పరారవడంతో నలుగురు మహిళలు, మరో దొంగను గ్రామస్తులకు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో దొంగలను విచారిస్తున్నారు. దొంగలను పట్టుకున్న గ్రామస్తులను సర్పంచ్ గోడాల రేఖారాము అభినందించారు. -
విఠలారంలో దొంగల బీభత్సం
ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం విఠలారం గ్రామంలో శుక్రవారం వేకువజామున దొంగలు చెలరేగి పోయారు. గణపవరం రాంప్రసాద్ అనే ప్రభుత్వ టీచర్ ఇంట్లో చొరబడి విలువైన వస్తువులు, పట్టుచీరలు దోచుకెళ్లారు. కుటుంబసభ్యులందరూ బెంగుళూరుకు వెళ్లగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేనందున ఎంతమేర చోరీ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. అలాగే పక్కనే ఉన్న ఐదు పాన్ షాప్లలో కూడా దొంగలు తమ చోరకళను ప్రదర్శించారు. పాన్షాప్ల తాళాలు పగులగొట్టి అందులోని ఐటమ్స్, నగదు ఎత్తుకెళ్లారు. ఈమేరకు బాధితులు ఏటూరునాగారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కి‘లేడీ’ల ‘వస్త్ర’లాఘవం!
దుస్తులు చోరీ చేసిన నలుగురు మహిళలు పరారవుతూ దొరికారు రాజాం: ఓ దుకాణంలో చొరబడిన ఆరుగురు మహిళలు తమ హస్తలాఘవంతో వస్త్రాలు కాజేశారు. అంతే చాకచక్యంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. చివరి క్షణంలో దుకాణ సిబ్బంది వచ్చి పట్టుకున్నారు. వివరాలివీ... స్థానిక పాలకొండ రోడ్డులోని వస్త్ర దుకాణంలో మంగళవారం నలుగురు మహిళలు మూడు బృందాలుగా విడిపోయి వెళ్లారు. కొనుగోలు దారుల్లా వ్యవహరిస్తూ చీరలు, రడీమెడ్ దుస్తులు పరిశీలించారు. అందులో ఓ వృద్ధురాలు ఒక్కొక్కటిగా బయటకు చేర్చి మూట కట్టి పరారైంది. ఆమె ఆ మూట పట్టుకొని ఏరియా ఆస్పత్రి వరకూ నడుచుకుంటూ చేరుకుంది. ఇంతలో మిగిలిన సభ్యులు ఆటోలో వచ్చి ఆమె పక్కనే ఆపారు. మూటను ఆటోలో పెట్టి ఆమెనూ ఎక్కమని సైగ చేశారు. దుకాణంలో సుమారు రూ.20 వేల విలువైన వస్త్రాల చోరీ జరిగినట్లు గుర్తించిన దుకాణం సిబ్బంది వెంటనే వారిని అనుసరించారు. ఆటోలో పరారైపోతున్న సమయంలో నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ నిమిత్తం నిందితులను స్టేషన్కు తరలించామని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకరరావు తెలిపారు. -
పండుగకు ఊరు వెళ్తే....
హైదరాబాద్ : జంటనగరాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే కాకుండా, యజమానులు ఉన్న ఇళ్లను వదలకుండా దోచేస్తున్నారు. కూకట్పల్లి సుమిత్రానగర్లోని వీబీఆర్ రెసిడెన్సీలో శనివారం వేకువజామున చోరీ జరిగింది. ఫ్లాట్ నెం.203 లో ఉంటున్న వృద్ధ దంపతులు పండుగకు చెన్నైకి వెళ్లారు. ఉదయం అనూహ్యంగా ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చిన ఇంటి చుట్టుపక్కల వారు కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చెన్నైలో ఉన్న యజమానులకు పోలీసులు సమాచారం అందించారు. చోరీ సొత్తుపై ఇంటి యజమానులు వస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. -
చిత్తూరులో దొంగల బీభత్సం
చిత్తూరు: దోపిడీ దొంగలు చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించారు. గంగవరం మండలం నల్లసానిపల్లిలో 20 మంది దొంగలు చొరబడి నానా రభస చేశారు. కాగా, ఇద్దరు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులు రావడంతో దొంగలు ఇళ్లలోకి చొరబడ్డారు. మరోపక్క, విద్యుత్ కోత కారణంగా చీకటి సమయంలో దొంగల అలజడి నెలకొనడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. -
నదిలో దూకి మరీ అరెస్టు
పంజాబ్: అచ్చం ఓ సినిమా దృశ్యంలాంటి ఘటన. అబ్బురపరిచిన పోలీస్ చేజింగ్.. తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన దొంగలు.. పోలీసుల సాహసంతో చివరికి లొంగుబాటు. ఇది పంజాబ్లో సోమవారం జరిగిన ఓ సినీ ఫక్కీలాంటి ఘటన. పంజాబ్లో కొందరు దొంగలు ముందుగా ఓ బైక్ను దొంగలించారు. ఆ వెంటనే అదే బైక్పై వేగంగా దూసుకెళ్తూ ఓ మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ విషయం పోలీసులకు తెలిసి వెంబడించారు. దీంతో కాసేపు దొంగా పోలీసు ఆట నెలకొంది. చివరికి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని ఓ నదిలో బైక్ను పడేసిన దొంగలు.. అనంతరం వారు కూడా దూకేశారు. కానీ, పోలీసులు, స్థానికులు కూడా ఆ నదిలోకి దూకి వారిని పట్టుకుని ఆట కట్టించారు. చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పతన్ కోట్ పోలీసులు చేసిన ఈ సాహసం అందరినీ అబ్బుర పరిచింది. -
దోపిడీ దొంగల బీభత్సం
-
దొంగలొస్తున్నారు...జాగ్రత్త
అల్లాదుర్గం రూరల్: మెదక్ జిల్లా అల్లాదుర్గం అంతా అప్రకటిత హై అలర్ట్...ఎక్కడి వారక్కడే అప్రమత్తమయ్యారు.. డబ్బులను జాగ్రత్తగా పెట్టుకున్నారు.. మహిళలు తమ నగలను భూమిలో పాతిపెట్టారు... ఎందుకిదంతా..? అల్లాదుర్గం పట్టణంలో దొంగలు సంచరిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారి ఆటకట్టించాలనుకున్న పోలీసులు గ్రామాల్లో చాటింపు వేయించారు. గ్రామాల్లో దొంగలు తిరుగుతున్నారని.. ఎవరైనా అపరిచితులు కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. డబ్బు, నగలను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు. కొందరు మహిళలు తమ నగలను భూమిలో పాతిపెట్టారు. అయితే, ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే తాము దండోరా వేయిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. -
ఘరానా దొంగల ఆటకట్టు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఘరానా దొంగలను పోలీసులు ఆటకట్టించారు. పలు పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముఠాలో ఉన్న నలుగురిపై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఇరవై తులాల బంగారం, మూడు కార్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివారలు ఇంకా తెలియరావాల్సి ఉంది. -
బిగ్బజార్ నిందితుల పట్టివేత
-
నిధులేవీ?
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు.. రానూ వచ్చాడు’ అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా పర్యటన సాగింది. మరో ఐదేళ్లు తమకు తిరుగు లేదన్న తీరు, అధికార దర్పం అడుగడుగునా తొణికిసలాడుతూ... విపక్షాలపై అసందర్భ ప్రేలాపనలే కాదు.. లక్షన్నరకు మించి అప్పులున్న రైతులనూ దొంగలుగా వ్యాఖ్యానిస్తూ సాగిన బాబు పర్యటన సామాన్యుల్లో తీవ్ర నిరాశనే మిగిల్చింది. జిల్లాను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీలను ఆశించిన జిల్లా ప్రజలకు చంద్రబాబు పర్యటనలో సమాధానాలు లభించలేదు. ప్రజలకే కాదు.. జిల్లాలోని తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా అసంతృప్తే మిగిలింది. తనకు కార్యకర్తలే ముఖ్యమని, వారి తర్వాతే ప్రజలైనా.. నాయకులైనా అని చంద్రబాబు వేదికల మీద మాట్లాడారు కానీ.. రెండు రోజుల తన పర్యటనలో ప్రత్యేకంగా కార్యకర్తలకు సమయం కేటాయించలేదు. పుట్టపర్తిలో గురువారం దిగింది మొదలు.. ముదిగుబ్బలో హెలికాప్టర్ ఎక్కేవరకూ ఆద్యంతం చంద్రబాబు పర్యటన ‘అధికార దర్పాన్ని’ ఒలికిస్తూ సాగింది. ప్రధాన డిమాండ్ల ప్రస్తావనేదీ? రాష్ట్ర పునర్విభజనలో భాగంగా కేంద్రం 14 జాతీయ సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. వీటిలో ఎయిమ్స్, ఐఐటీలను జిల్లాలో నెలకొల్పాలన్న డిమాండ్ గురించి చంద్రబాబు ఒక్కమాటా మాట్లాడలేదు. ఎయిమ్స్కు బదులు అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. వాస్తవంగా నగరంలోని 500 పడకల ఆస్పత్రిని 1000 ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు గతంలోనే అనుమతులు ఉన్నాయి. అప్పటి ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి ఇందు కోసం కృషి చేశారు. ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబు అదనంగా చేసేదేమీ లేదు. ఇక అనంత వెంకట్రామిరెడ్డి హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశ పనులు నిర్దిష్ట కాల పరిమితితో పూర్తి చేయాలన్న రైతుల డిమాండ్పై కూడా చంద్రబాబు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామన్నారే కానీ ఎప్పటి లోపు పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చవిచూసిన జిల్లా ప్రజలకు హంద్రీనీవా పూర్తవుతుందా అన్న అనుమానం పట్టి పీడిస్తూనే ఉంది. గత ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన రూ.640 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడిస్తారో చెప్పలేదు. గత ప్రభుత్వంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం రూ.7,400 కోట్లతో ‘ప్రాజెక్ట్ అనంత’కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతులు కూడా లభించాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యం ఏమిటన్నది చంద్రబాబు మాట మాత్రంగా కూడా చెప్పలేదు. రుణాల రీ షెడ్యూలో... రుణ మాఫీనో.. ఏదైనా కానీయండి.. ఈ సీజన్లో రైతులకు కొత్త రుణాలు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా ఆయన ప్రకటించలేదు. ఇలా ప్రధాన సమస్యలన్నింటినీ దాటవేస్తూ ఊకదంపు ఉపన్యాసాలతో రెండు రోజుల పర్యటన కానిచ్చేశారు. స్టేజ్షోగానే మిగిలిన ‘ముఖా..ముఖి’ గురువారం మహిళా సంఘాల మహిళలతో చంద్రబాబు సంభాషించే కార్యక్రమం కానీ, శుక్రవారం ముదిగుబ్బలో రైతులు, చేనేత కార్మికులతో ముచ్చటించే కార్యక్రమం గానీ కేవలం స్టేజ్ షోగానే మిగిలిపోయింది. శుక్రవారం రైతులతో ముఖాముఖి ‘స్పిరిటే’ లేకుండా పోయింది. చంద్రబాబుతో సహా వేదికపై నేతలందరూ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారు కానీ.. నేరుగా రైతులతో సంభాషించే ప్రయత్నం కూడా చేయలేదు. జిల్లా అధికారులు ఎంపిక చేసిన ముగ్గురు, నలుగురు రైతులను స్టేజి మీదకు పిలిపించి మాట్లాడించారు. వారు కూడా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. అధికారులు ఎంత నేర్పినా రైతులు కదా... వారి సమస్యలను చంద్రబాబుకు విన్నవించారు. ఒక మహిళా రైతు ‘జిల్లాలో డ్రిప్ పరికరాలు ఇస్తున్నారు. వాటి కాలపరిమితి ఐదేళ్లుగా పేర్కొంటున్నారు. అయితే నీటిలోని లవణాల కారణంగా రెండు మూడేళ్లకే డ్రిప్ పైపుల్లో రంధ్రాలు మూసుకుపోయి పనికి రాకుండా పోతున్నాయి. అధికారులేమో ఒక సారి ఇచ్చిన వారికి మళ్లీ సబ్సిడీ ఇవ్వడం లేదు. స్ప్రింక్లర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి మూడేళ్ల క్రితం డ్రిప్ పరికరాలు తీసుకున్న రైతులకు మళ్లీ సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇచ్చేలా చర్యలు తీసుకోండని’ విన్నవించారు. రైతులతో ముఖాముఖిలో అడిగిన ఈ చిన్న విన్నపానికి కూడా చంద్రబాబు తన ప్రసంగంలో నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. ఆయన ప్రసంగం ఆద్యంతం ‘మహిళలను లక్షాధికారులను చేస్తా.. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తా.. ఇజ్రాయెల్ టెక్నాలజీ.. కోల్డ్ స్టోరేజిలు.. ప్రాసెసింగ్ సెంటర్లు తీసుకొస్తా’ అంటూ పెద్ద పెద్ద మాటలతోనే సాగింది. వయ్యారి భామ.. వైరస్ వ్యవసాయం గురించిన ప్రాథమిక అంశాలపై తనకు ఎంత అవగాహన ఉందో చంద్రబాబు తన ప్రసంగంలో బయటపెట్టుకున్నారు. ఆయన తన ప్రసంగంలో ‘ఈ జిల్లాలో మూడు నాలుగేళ్ల క్రితం వయ్యారి భామ వైరస్ తెగులు వల్ల వేరుశనగ పంటకు తీవ్రమైన నష్టం జరిగింది. అలాంటి వైరస్ను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోమని ఇప్పుడే కలెక్టర్ను ఆదేశించా’అని అన్నారు. చంద్రబాబు వయ్యారి భామను వైరస్గా పేర్కొంటుంటే సమావేశానికి వచ్చిన రైతులు ముఖాలు చూసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి వయ్యారి భామ అనేది ఓ మొండి కలుపు మొక్క. ఈ కలుపును అరికట్టడం రైతులకు శక్తికి మించిన పనిగా ఉంది. ఏది కలుపు మొక్కో... ఏది వైరస్ తెగులో తెలీయకుండా చంద్రబాబు మాట్లాడుతున్నా వేదిక మీద ఉన్న ఎవ్వరూ ఆయన మాటలను సరిచేసే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం. రాజును మించిన రాజభక్తి జిల్లా మంత్రులు పోటీపడి మరీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ‘రుణాలను మాఫీ చేసిన చంద్రబాబు రుణాన్ని రైతు, డ్వాక్రా మహిళలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు’ అని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇచ్చిన జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబుకు సదా రుణపడి ఉంటామని జిల్లా ప్రజలందరి తరఫునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరో మంత్రి పరిటాల సునీత తన ప్రసంగంలో ‘మహిళా రుణాలు మాఫీ చేసిన చంద్రబాబుకు ప్రాణం ఉన్నంత వరకూ రుణపడి ఉంటామని’ జిల్లా మహిళల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. రాజుగారిని పొగడటంతోనే తమ బాధ్యత తీరిపోలేదని.. పనిలోపనిగా ప్రతిపక్ష నేత జగన్పై కూడా మంత్రులిద్దరూ విమర్శలు గుప్పిస్తూ.. ఆ రకంగా ముందుకెళ్లారు. మంత్రుల తీరు చూసి.. ఒక్కటంటే ఒక్క హామీ సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ఇది ‘అనంత’ జనం కోసం చేయాల్సిందే అని అడిగిన పాపాన పోలేదంటూ ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలుపోయారు. కంగుతిన్న కామ్రేడ్లు చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా సీపీఐ నేతలు అనంతపురం బంద్కు పిలుపు ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్దిష్ట హామీలను కోరుతూ వారు ఆందోళన చేపట్టారు. అయితే, జిల్లా టీడీపీ నేతలు సీపీఐ వారితో మాట్లాడి, జిల్లా అభివృద్ధికి సంబంధించి మీ డిమాండ్లను చంద్రబాబుకు విన్నవించే అవకాశం కల్పిస్తాం. సీపీఐ ప్రతినిధి బృందాన్ని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి నేరుగా మాట్లాడిస్తాం అని హామీ ఇచ్చి వారిచేత బంద్ పిలుపును విరమింపచేశారు. అయితే రెండు రోజుల పర్యటనలో సీపీఐ వారికి చంద్రబాబుతో మాట్లాడే అవకాశం అటుంచి.. ఆ పరిసరాలకు కూడా వారిని అనుమతించలేదు. మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అని కామ్రేడ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ‘ఈ సీపీఐ వారికి చారిత్రక తప్పిదాలు చేయడం అలవాటే. తెలుగుదేశం వారి మాటలు నమ్మి ఆందోళన విరమించుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటుంటుందా’ అని జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. -
రంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం
-
పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు
-
దొంగళ్లు
-
ఆపార్ట్మెంట్లో టార్గెట్గా దోపిడీ