నడికూడలో బైక్‌ చోరీ | bike theft in nadikuda | Sakshi
Sakshi News home page

నడికూడలో బైక్‌ చోరీ

Aug 4 2016 12:16 AM | Updated on Sep 4 2017 7:40 AM

మండలంలోని నడికూడలో దొంగలు మంగళవారం రాత్రి హల్‌చల్‌ చేశారు. గ్రామంలోని ఓ బైక్‌ను అపహరించారు. మరో బైక్‌ను అపహరించేందుకు విఫల యత్నం చేశారు.

పరకాల : మండలంలోని నడికూడలో దొంగలు మంగళవారం రాత్రి హల్‌చల్‌ చేశారు. గ్రామంలోని ఓ బైక్‌ను అపహరించారు. మరో బైక్‌ను అపహరించేందుకు విఫల యత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. నడికూడకు చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఊర రవీందర్‌రావు, చింతలపల్లి భీమ్‌రావులు తమ ఇళ్ల ఎదుట బైక్‌లను నిలిపారు. కాగా, రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అపహరించారు. అయితే గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో భీమ్‌రావు బైక్‌ కనిపించింది.  రవీందర్‌రావు బైక్‌ మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement