విశ్వశాంతిని కాంక్షిస్తూ గాయత్రి యజ్ఞం | gayathri yagnam in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

విశ్వశాంతిని కాంక్షిస్తూ గాయత్రి యజ్ఞం

Published Sat, Apr 15 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

విశ్వశాంతిని కాంక్షిస్తూ గాయత్రి యజ్ఞం

పుట్టపర్తి టౌన్‌ : విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలో తమిళనాడు, కేరళ సత్యసాయి భక్తులు గాయత్రి జపం, యజ్ఞం నిర్వహించారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేలాది మంది భక్తులు నడుమ వేదపండితులు వేదమంత్రోచ్చారణ నడుమ గాయత్రి జపం, యజ్ఞం కృతువులను నిర్వహించారు. సత్యసాయి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ భక్తులు తరించారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యుడు ఆర్‌.జె.రత్నాకర్‌రాజు, ప్రసాద్‌రావు, విజయభాస్కర్‌లతోపాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సత్యసాయి ట్రస్ట్‌ ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల భక్తులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement
Advertisement