దుర్గమ్మకు బంగారు తాడు, మంగళసూత్రాలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మకు నగరానికి చెందిన ఓ భక్తుడు రూ.4.50 లక్షల విలువైన బంగారు తాడు, మంగళసూత్రాలను సమర్పించారు. భవానీపురానికి చెందిన రాహుల్ మార్కెటింగ్ అసోసియేట్స్ యజమాని తవ్వ వెంకట లక్ష్మీప్రసన్నకుమార్ బుధవారం ఆలయ అధికారులను కలుసుకుని ఈ వస్తువులను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందించారు.