indrakiladri
-
ఇంద్రకీలాద్రిపై వసంతపంచమి వేడుకలు (ఫొటోలు)
-
రెండవ రోజు దీక్షల విరమణకు తరలివచ్చిన భవానీలు
-
మహిషాసురమర్ధనిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరి దశకు చేరాయి. తొమ్మిదోరోజు శుక్రవారం మహిషాసురమర్ధని రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక ఈ ఉత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగియనున్నాయి. ఈ ఏడాది ఉత్సవాల్లో మూలానక్షత్రం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేసినప్పటికీ గత ఏడాదితో పోల్చుకుంటే భక్తుల సంఖ్య తగ్గింది. ఇప్పటికి దాదాపు 7 లక్షల నుంచి 7.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మహర్నవమి సందర్భంగా తరలి వచ్చిన భక్తులు నగరోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని తరించారు. పట్టువ్రస్తాలు సమర్పించిన టీటీడీ కనకదుర్గమ్మకు టీటీడీ తరఫున శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ అధికారులకు, దుర్గమ్మ దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, సిబ్బంది, అర్చకులు స్వాగతం పలికారు. మేళతాళాలతో సంప్రదాయ బద్ధంగా అమ్మవారి అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. మహిషాసురమర్థిని అలంకారంలో ఉన్న దుర్గమ్మకు పట్టు వ్రస్తాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ అధికారులకు ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు. నేడు తెప్పోత్సవం దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి రోజు కనకదుర్గాదేవికి కృష్ణానదిలోని దుర్గాఘాట్లో సాయంత్రం 5 గంటలకు శ్రీగంగా, దుర్గ అమ్మవార్ల సమేత మల్లేశ్వరస్వామి తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కమనీయ దృశ్యాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా గుర్తించిన పది ప్రాంతాల్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చివరిరోజు అమ్మవారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. -
ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం
‘నా పేరు నందిని. మాది కోదాడ. కుటుంబంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చాను. పావు గంటలో అమ్మవారి దర్శనం అవుతుందని చెప్పడంతో రూ.500 టికెట్లు తీసుకున్నాం. క్యూ లైన్లోకి వచ్చి గంటన్నర గడచినా చిన గాలిగోపురం వద్దే పోలీసులు నిలిపేశారు. టికెట్లు కొనని వారిని మాత్రం పంపించారు. ఇదేం అన్యాయం అని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను పంపిస్తూ టికెట్లు కొన్న భక్తులను గంటల తరబడి నిలబెట్టేశారు’. ఇది ఒక్క నందిని అభిప్రాయమే కాదు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల అందరి విమర్శ.విజయవాడస్పోర్ట్స్: ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడో తేదీన దసరా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొండను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని భక్తులతో పాటు, ఉత్సవ విధులకు హాజరైన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తొలి రోజు నుంచే పోలీసుల దౌర్జన్యంపై పలువురు అధికారులు, సిబ్బంది తమ శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. మంగళవారం పోలీసుల తీరు మరింత శృతిమించడంతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై ఎన్నడూ లేని విధంగా నల్ల రిబ్బన్లతో నిరసనలు కొనసాగాయి. అన్నింటా వారే.. పోలీస్శాఖ అధికారులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించిన తరువాత దసరా ఉత్సవాలు ప్రారంభం కావడం కొన్నేళ్లగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అమ్మవారు తమ ఆడపడుచని, ఉత్సవం తమదేననే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దసరా ఉత్సవాలకు దేవదాయ శాఖ 1,200 మంది, మునిసిపల్ 1,500 మంది, ఎన్సీసీ 400 మంది, రెవెన్యూ 300 మంది, వైద్య–ఆరోగ్య 250 మంది, అగి్నమా పక శాఖ 150 మంది అధికారులు, సిబ్బందిని ఉత్సవాలకు కేటాయించగా. పోలీస్ శాఖ మాత్రం ఆరు వేల మందిని కొండ చుట్టూ మోహరించింది. భక్తులకు అవసరమైన సేవలను దేవదాయ, రెవెన్యూ, మునిసిపల్, ఎన్సీపీ, వైద్య ఆరోగ్య శాఖలు అందిస్తుంటే రక్షణ పేరుతో వచ్చిన పోలీసులు పెత్తనం చెలాయిస్తున్నారు. మహామంటపం దిగువనున్న లిఫ్ట్ను పూర్తిగా స్వాదీనం చేసుకుని తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మినహా ఎవరినీ లిఫ్ట్లోకి అనుమతించడం లేదని, క్యూ లైన్ సజావుగా సాగకుండా నిరంతరం అడ్డుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజే దేవదాయ శాఖ ఇంజినీర్ను పోలీసులు అడ్డుకుని జులుం ప్రదర్శించారు. దీంతో సదరు ఉద్యోగి మహామంటపం కింద పోలీసుల కోసం వేసిన టెంట్లు, కురీ్చలను తొలగించేశారు. ఈ పంచాయితీ రాష్ట్ర సచివాలయం అధికారులు వరకు వెళ్లింది. లిఫ్ట్ల వద్ద పోలీసులు చేస్తున్న అతికి నిరసనగా అదే లిఫ్ట్ల వద్దే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను డంప్ చేస్తున్నారు. ఓం రింగ్ నుంచి ప్రొటోకాల్ వరకు వెళ్లకుండా ఓ న్యాయమూర్తిని పోలీసులు ఇబ్బంది పెట్టారు. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి సదరు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రూ.500 టిక్కెట్లు కొన్న భక్తులను నిలిపివేసి, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పోలీసులు పంపించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్, వినాయకుడి గుడి, ఘాట్రోడ్డు గాలిగోపురం ప్రాంతాల్లో తమను నిలిపివేస్తున్నారని, ఆలయంపై వరకు బైక్లను అనుమతించడం లేదని, తమను ఆలయంలోకి వెళ్లనీయడంలేదని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు అసభ్యకరంగా ఉందని పోలీస్ కమిషనర్ వద్ద పలువురు మహిళలు వాపోయారు. ఉత్సవ సేవా కమిటీలో ఉన్న తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నల్ల రిబ్బన్లతో నిరసన ఖాకీల తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు మంగళవారం ఆందోళనకు దిగారు. మీడియా పాయింట్ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరసన కొనసాగింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వస్తున్నారని తెలుసుకున్న పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు హుటా హుటిన మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. మీడియా పాయింట్ నుంచే డీజీపీ అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. డీజీపీ వెళ్లే సమయంలో పోలీస్ శాఖకు వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు నినాదాలు చేస్తే పరువు పోతుందని గ్రహించి, వారితో చర్చలు జరిపారు. డీసీపీ గౌతమి సాలి తీరు సరిగ్గా లేదని సీపీకి మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మీడియా వాళ్లను కొండపైకి అనుమతించవద్దని డీసీపీ పదేపదే ఆదేశాలిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని సీపీ హామీ ఇవ్వడంతో మీడియా ప్రతినిధులు నిరసన విరమించారు. ఆ వెంటనే అదే మార్గంలో డీజీపీని అమ్మవారి దర్శనానికి సీపీ వెంట బెట్టుకుని వెళ్లారు. -
మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం మహాలక్ష్మిదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాయంత్రం నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్లో కళావేదికపై ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి 11 గంటల నుంచే ఇంద్రకీలాద్రిపైకి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూలా నక్షత్రం నాడు 2 లక్షల మందికిపైగా భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. క్యూలైన్లలో మార్పులు చేసింది. వీఐపీ దర్శనాలనూ రద్దు చేసింది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటల నంచి రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తోంది. ఫ్లైవోవర్ కింద వాహనాలకు అనుమతి రద్దు చేసింది. సీఎం చంద్రబాబు బుధవారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.నేడు శ్రీ సరస్వతిదేవిగా... ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం శ్రీ సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. ఈ రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు. -
మేయరా...అయితే మాకేంటి?
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై విజయవాడ నగ ర మేయర్కు సోమవా రం ఘోర అవమానం ఎదురైంది. కొండపై ఆమెను అడుగడుగునా అధికారులు అవమానించారు. ఆమె కారు ను పదేపదే నిలిపివేశారు. ఆమె కారులోంచి బయటకు వచ్చి తాను మేయర్ని అని, తనకు ప్రొటోకాల్ ఉంటుందని చెబుతున్నా ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కష్టాలుపడి కొండపైకి చేరుకున్న ఆమెను ఆలయ చిన్న రాజగోపురం వద్ద పోలీసులు, దేవస్థానం సిబ్బంది నిలిపివేశారు.దీంతో ఆమె కొద్దిసేపు పక్కనే నిలబడి ఎదురు చూశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న మీడియా ఆమె వద్దకు వచ్చి వీడియో తీస్తుండగా అప్పటికప్పుడు సిబ్బంది స్పందించి గేట్ తీసి ఆమెను లోపలకు పంపించారు. రూ.300 క్యూ లైన్ నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేయర్ బయటకు వచ్చేశారు. సాధారణంగా మేయర్ వచ్చినప్పుడు ఆమెకు ప్రొటోకాల్ అధి కారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వాదాలను, ప్రసాదాలను అందించి పంపాల్సి ఉంటుంది.బీసీ మహిళను అవమానించారు ‘అమ్మవారి దర్శనానికి వస్తే నన్ను అవమానించారు. దేవస్థానం చెప్పిన సమయంలోనే నేను కొండపైకి వచ్చాను.నాకు వెహికల్ పాస్ ఇవ్వమని కలెక్టర్, సీపీ, నగర కమిషనర్ను కోరాను. మీరు మేయర్.. మిమ్మల్ని ఎవరు ఆపుతారని అధికారులు అన్నారు. కానీ నాకు అడుగడుగునా అడ్డంకులే. నేను మేయర్ని అని అందరికీ చెప్పుకోవాలి్సన పరిస్థితి కల్పించారు. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరు సరిగాలేదు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా..? కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. నగర పాలకసంస్థ సహకారం లేకుండా భవానీదీక్షలు, దసరా ఉత్సవాలను నిర్వహించగలరా? మేయర్ను అందులోనూ బీసీ వర్గానికి చెందిన మహిళను కావాలనే నన్ను అవమానించారు. –రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడ -
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. సాయంత్రం ఆదిదంపతుల నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్లో కళావేదికపై ప్రదిర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. సోమవారం శ్రీ మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. వీఐపీలకే పెద్దపీట... ఇంద్రకీలాద్రిపై రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసు లేఖలు రావడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. వీఐపీలు తమకు నిర్దేశించిన సమయంలోనే దర్శనానికి రావాలని కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదు. రూ.500 టికెట్ కొన్నవారికి దర్శనానికి ఐదు గంటలు పట్టింది. రూ.100, రూ.300 దర్శనం టికెట్లు కొన్న వారికే త్వరగా దర్శనమవుతోంది. జత్వానీకి రాచమర్యాదలు చీటింగ్ కేసులో నిందితురాలు, సినీ నటి కాదంబరీ జత్వానీకి ఇంద్రకీలాద్రిపై రాచమర్యాదలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆమెకు పోలీసులు ప్రత్యేక ప్రొటోకాల్ ఏర్పాటు చేశారు. ఆమెకు ఇద్దరు కానిస్టేబుళ్లు దగ్గరుండి మరీ వీఐపీ దర్శనం చేయించారు. -
నవరాత్రి అలంకరణలో నవనవోన్మేషంగా...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.3వ తేదీ గురువారం – శ్రీబాలా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.4వ తేదీ శుక్రవారం – శ్రీగాయత్రిదేవిరెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేదమాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం ΄÷ందుతారు.5వ తేదీ శనివారం – శ్రీఅన్నపూర్ణాదేవిదసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని ΄÷ందగలుగుతారు.6వ తేదీ ఆదివారం- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.7వ తేదీ సోమవారం – శ్రీ మహాచండీదేవిఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయి.8వ తేదీ మంగళవారం – శ్రీమహాలక్ష్మీదేవిఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక స్ధితికారిణిగా, «అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య్ర΄ాప్తి కలుగుతుంది. 9వ తేదీ బుధవారం – శ్రీసరస్వతిదేవిఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం ΄÷ందుతారు.10వ తేదీ గురువారం – శ్రీదుర్గాదేవి 8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను ΄ోగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని ఆర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.11వ తేదీ శుక్రవారం – శ్రీమహిషాసుర మర్ధనిదేవిదసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధనిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిష్ట్వర్గాలు నశించి, సాత్విక బావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.12వ తేదీ శనివారం – శ్రీరాజరాజేశ్వరిదేవిదసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తం తో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.– సుభాని, సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పర్పింమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మూడోరోజు అన్నపూర్ణాదేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. సెలవుల నేపథ్యంలో ఆదివారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దర్శనానికి వచ్చే వీఐపీలు తమకు నిర్దేశించిన సమయంలోనే రావాలని కలెక్టర్ డాక్టర్ సృజన, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు. దుర్గమ్మకు మంగళ సూత్రాల సమర్పణ ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన చిరువ్యాపారి కళ్లకుంట అంకులయ్య, రాజేశ్వరి దంపతులు దుర్గమ్మకు బంగారు మంగళ సూత్రాలు తయారు చేయించారు. రూ.18 లక్షలు విలువ చేసే 203 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను శనివారం సమర్పించారు. అలాగే గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు 5.7 కిలోల వెండితో తయారు చేసిన హంస వాహనాన్ని శనివారం జగన్మాతకు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో కె.ఎస్.రామారావు దాతలను అభినందించారు. కనులవిందుగా నగరోత్సవం దసరా మహోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల నగరోత్సవం నయనమనోహరంగా సాగింది. ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, పండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నేటి అలంకారం.. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో నాలుగోరోజైన ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహా మంత్రాధిదేవతగా వేం చేసి ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా, చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరుకుగడను చేత పట్టుకుని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నది.ద్వారకా తిరుమల నుంచి పట్టువ్రస్తాలు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టువ్రస్తాలను సమర్పించేందుకు ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో మూర్తి, ఆలయ అర్చకులు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆయనకు, దేవస్థాన అర్చకులకు, దుర్గగుడి దేవస్థానం తరఫున ఈవో కె.ఎస్.రామారావు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. -
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
-
అంబరాన్నంటిన అమ్మ పండుగ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/వన్టౌన్(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా మహోత్సవాల తొలి రోజున అమ్మవారు శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున దుర్గమ్మకు స్నపనాభిõÙకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం ఉదయం 8.40 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలిగా రాష్ట్ర మంత్రులు ఆనం, పార్థసారథి అమ్మవారి తొలి దర్శనం చేసుకున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద గణపతి పూజ నిర్వహించారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక కుంకుమార్చన, ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద శ్రీచక్ర నవార్చన, యాగశాలలో చండీహోమాలు నిర్వహించగా ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ కనుల పండువగా సాగింది. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, ఘాట్రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. మహారాష్ట్రకు చెందిన సౌరభ్గౌర్తో పాటు ఏపీకి చెందిన రాజే‹Ù, సూర్యకుమారి రూ.4 కోట్ల విలువైన వజ్రాభరణాలను అమ్మవారికి సమర్పించారు. ఇందులో వజ్రాలు పొదిగిన 2 కిలోల బంగారంతో తయారు చేసిన వజ్ర కిరీటం, సూర్యచంద్ర ఆభరణాలు, ముక్కెర, నత్తు, బులాకీ ఉన్నాయి. ఈ ఆభరణాలతో శుక్రవారం అమ్మవారు శ్రీగాయత్రిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు.వైభవంగా మైసూరు దసరా ఉత్సవాలుదసరా నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ ప్రఖ్యాత మైసూరులో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవత చాముండేశ్వరి దేవి కొలువైన చాముండి కొండపై ఉదయం శుభ వృశ్చిక లగ్నంలో దీపాన్ని వెలిగించి, అమ్మవారి ఉత్సవమూర్తికి పుష్పార్చన గావించి అగ్ర పూజ చేయడం ద్వారా దసరా సంబరాలకు నాంది పలికారు. ఈ ఏడాది ప్రముఖ సాహితీవేత్త డా.హంపా నాగరాజయ్య ఉత్సవాలను ప్రారంభించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉదయం కొండకు విచ్చేసిన హంపా, సీఎం తదితరులకు కళాబృందాల ప్రదర్శనల మధ్య పూర్ణకుంభ స్వాగతం లభించింది. జానపద కళా బృందాలతో ఊరేగింపుగా చాముండేశ్వరి ఆలయానికి చేరుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల ఉన్న దసరా వేదికకు చేరుకుని వెండి రథంలో ప్రతిష్టించిన చాముండేశ్వరి దేవికి పూజలు చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. మైసూరు రాజప్రసాదంలో రాజవంశీకుడు, స్థానిక బీజేపీ ఎంపీ యదువీర్ చామరాజ ఒడియార్ దర్బార్ నిర్వహించారు. బంగారు, వజ్రకచిత సింహాసనంపై ఆశీనులైన అలనాటి రాజుల కాలంలో మాదిరిగా దర్బార్ చేశారు. రాజమాత ప్రమోదాదేవి, యదువీర్ భార్య, తనయుడు పాల్గొన్నారు. బెంగళూరులో 10 కి పైగా వేదికల్లో సాంస్కృతిక నృత్య ప్రదర్శనల కోలాహలం మిన్నంటింది. – మైసూరు -
దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
-
ఇంద్రకీలాద్రి అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు (ఫొటోలు)
-
హిందువులంతా ఏకం కావాలి
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై.. కలసికట్టుగా మాట్లాడాలని ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే, ఆ మౌనం భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా, నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం ఇంద్రకీలాద్రిపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సనాతన ధర్మానికి సంబంధించి పోరాటం చేయాలనుకుంటే తనను ఆపేవారు ఎవరూ లేరన్నారు. ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవడానికి సిద్ధమని, కానీ, అక్కడిదాకా తీసుకెళ్లనని చెప్పారు. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా..? మాట్లాడేవారు ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి అని చెప్పారు. సెక్యులరిజం అనేది వన్ వే కాదని అది టూ వే అని చెప్పారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మసీదులో చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారా అని అన్నారు. హిందూ దేవుళ్లపైన మాట్లాడేవారు అల్లాహ్ పైన, మహ్మద్ ప్రవక్తపైన, జీసస్పైన మాట్లాడగలరా అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఇస్లాంపైన మాట్లాడితే ఆ మతం వారు పెద్దఎత్తును బయటకు వస్తారు అంటూ చెప్పారు. హిందువులను రోడ్లపైకి రమ్మని చెప్పడం లేదన్నారు. కనీసం హిందువులకు కోపం రాకపోతే ఏం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ వారికి కూడా విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం జోకులు వేయడం, మీమ్స్ చేయడం సరికాదన్నారు. ఓ సినిమా ఫంక్షన్లో జోకులు వేస్తున్నారని, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. దేశమంతటికి కలిపి ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ తప్పనిసరి అని చెప్పారు. అంతకుముందు పవన్ కళ్యాణ్కు ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయం మెట్లను కడిగి, పసుపు రాశారు.మహిళలను అడ్డుకున్న సిబ్బంది ఆలయంలో మెట్లను పవన్కళ్యాణ్ శుభ్రం చేసే కార్యక్రమానికి అర్ధగంట ముందు, ఆ తర్వాత కూడా మహిళా భక్తులు మెట్ల పూజ చేసుకోకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్న మహిళా భక్తులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని క్యూలైన్లోకి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, మహిళా భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెట్ల పూజ మొక్కు పూర్తి చేసుకోకుండా దర్శనానికి వెళ్లమని చెప్పడం ఎంత వరకు సబబని మహిళలు మండిపడ్డారు. -
అందుబాటులో దుర్గమ్మ దసరా ఆర్జిత సేవా టికెట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో వచ్చాయి. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను నిర్వహిస్తారు. ఆయా టికెట్ల ధరలను దేవస్థానం ఖరారు చేయగా, ఆన్లైన్తో పాటు దేవస్థానం ఆవరణలోని టికెట్ కౌంటర్, మహామండపం దిగువన టోల్ఫ్రీ నంబర్ కౌంటర్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ. 3 వేలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన టికెట్ ధర రూ. 5 వేలు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు టికెట్ ధర రూ. 3 వేలు, ప్రత్యేక చండీహోమం టికెట్ ధర రూ. 4 వేలుగా నిర్ణయించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే వేద విద్వత్ సభ అక్టోబర్ 10న, అర్చన సభ 11న నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి విశేష అలంకారాలు, ప్రత్యేక పూజలు, నివేదనలు, వేద సభ, అర్చక సత్కారం వంటి వైదిక కార్యక్రమాలపై వైదిక కమిటీ సభ్యులతో ఈవో రామారావు గురువారం సమావేశం నిర్వహించారు. -
ఇంద్రకీలాద్రీపై ఇవాళ్టి నుంచి భవానీ దీక్షల విరమణ
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
ఇంద్రకీలాద్రిపై రూ. 216 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
Updates 9:13AM, Dec 7 , 2023 రూ. 216 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ. 57 కోట్ల రాష్ట్ర నిధుల్లో రూ. 30 కోట్లతో అన్నప్రసాద భవన నిర్మాణం రూ. 27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం రూ. 13 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ రూ. 15 కోట్లతో రాజగోపారం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం రూ. 23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్ రూ. 7. 75 కోట్లతో కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం రూ. 18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్ మార్పు రూ. 19 కోట్లతో నూతన కేశఖండన శాల నిర్మాణం రూ. 10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయంగా మార్పు 9:01AM, Dec 07, 2023 ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్ 8:35AM, Dec 07, 2023 విజయవాడకు బయల్దేరిన సీఎం జగన్ దుర్గగుడిపై పలు ప్రారంభోత్సవాలు, శంకస్థాపనలు చేయనున్న సీఎం జగన్ అనంతరం కనకదుర్గమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్ రూ. 216 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకస్థాపనలు కనకదుర్గ గుడి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తోంది. అందులో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. గురువారం ఈ మాస్టర్ ప్లాన్లోని రూ. 216.05కోట్ల విలువైన పలు పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన మల్లేశ్వరాలయంతో పాటు పలు ఆలయాలను ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాలు ఇవే.. ప్రభుత్వ నిధులు రూ.5.60 లక్షలతో చేపట్టిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం, రూ.4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, రూ.3.25 కోట్లతో చేపట్టిన ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు పూర్తయ్యాయి. దుర్గగుడి అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.70 కోట్ల నుంచి ఈ పనులు చేపట్టారు. వీటిని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. దేవదాయ శాఖ నిధులు రూ. 3.87 కోట్లతో చేపట్టిన 8 ఆలయాల పునఃనిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆయా ఆలయాలను కూడా ప్రారంభించనున్నారు. అలాగే పాతపాడు గ్రామంలోని ఆలయానికి చెందిన స్థలంలో దేవస్థాన నిధులు రూ. 5.66 కోట్లతో ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం, కొండ దిగువన రూ. 23 లక్షలతో బొడ్డు బొమ్మ, అమ్మవారి పాత మెట్ల మార్గంలోని ఆంజనేయస్వామి, వినాయక స్వామి ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. శంకుస్థాపనలు ఇలా.. దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అమ్మవారి అన్నప్రసాద భవనం రూ.30 కోట్లు, అమ్మవారి లడ్డూ ప్రసాదం పోటు భవనం రూ. 27 కోట్లతో నిర్మించనున్నారు. వీటితో పాటు దేవస్థాన నిధులు రూ.13 కోట్లతో కనకదుర్గనగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్, రూ.23.50 కోట్లతో రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం, రూ.7.75 కోట్లతో కనకదుర్గనగర్ ప్రవేశ ద్వారం వద్ద మహారాజ ద్వారం నిర్మాణం, రూ.7 కోట్లతో కొండపైన పూజా మండపం, రూ.18.30 కోట్లతో మల్లికార్జున మహామండపం క్యూకాంప్లెక్స్ నిర్మాణం, రూ.19 కోట్లతో నూతన కేశఖండనశాల, రూ.10 కోట్లతో గోశాల వద్ద బహుళ ప్రయోజన సౌకర్య సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇవే కాకుండా దాతలు సహకారంతో అమ్మవారి ఆలయం నుంచి మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకునే మార్గంలో రూ.5 కోట్లతో గ్రానైట్ రాతి యాగశాల, దేవస్థానం, ప్రయివేటు భాగస్వామ్యంతో రూ.33 కోట్ల వెచ్చించి కనకదుర్గనగర్లో మల్టీలెవల్ కారు పార్కింగ్ నిర్మాణం జరుగుతుంది. ఈ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 8.35గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరి, 8.45 గంటలకు విజయవాడ కనకదుర్గానగర్కు చేరుకుంటారు. అక్కడ పలు పనులను ప్రారంభిస్తారు. 9.05 నుంచి 9.25 గంటల మధ్య కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 9.25 గంటలకు తిరిగి బయలుదేరి 9.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఏర్పాట్ల పరిశీలన ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం ఇంద్రకీలాద్రికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. మహా మండపం దిగువన శంకుస్థాపన కోసం చేస్తున్న ఏర్పాట్లను దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో కేఎస్ రామారావులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.216 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావడంతో వాటిని ప్రారంభిస్తారని చెప్పారు. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, సబ్కలెక్టర్ అదితి సింగ్, డీసీపీ విశాల్గున్ని, ఆలయ ఈఈలు కోటేశ్వరరావు, ఎల్.రమాదేవి, పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మకు 2 లక్షల గాజులతో అలంకరణ మహోత్సవం (ఫొటోలు)
-
23 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నవంబర్ 23 నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్.రామారావు తెలిపారు. ఆలయం మహామండపం ఆరో అంతస్తులో ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, వైదిక కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దీక్షలు 27 వరకు స్వీకరించవచ్చన్నారు. 23న మూలవిరాట్కు పూజలు నిర్వహించి పగడాల మాలాధారణ చేస్తారని, అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం ప్రారంభమవుతుందని వివరించారు. అర్ధమండల దీక్షలు డిసెంబర్ 13–17 వరకు స్వీకరించవచ్చన్నారు. 26న అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శ్రీశివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 3–7 వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయని తెలిపారు. 14 నుంచి కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షణ, బిల్వార్చన చేపడతారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న సరస్వతి యాగాన్ని, 17న నాగుల చవితి నిర్వహిస్తారు. -
ముగిసిన గ్రహణం..తెరుచుకున్న ఆలయం
తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ ఆదివారం తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. తిరుమలలో ఆదివారం ఉదయం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శ్రీకాళహస్తిలో గ్రహణ కాల పూజలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల పూజలను శాస్త్రోక్తం గా నిర్వహించారు. గ్రహణాల సమయాల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ కాల సమయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేకాభిõషేకాలు నిర్వహించారు. ఆదివారం వేకువజాము 1 గంటకు మొదటి కాలాభిషేకం, 1:45 గంటలకు రెండోకాలాభిషేకం, 2.30 గంటలకు మూడో కాలాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. -
28న పాక్షిక చంద్రగ్రహణం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం కవాట బంధనం (తలుపులు మూసివేయడం) చేయనున్నట్లు పేర్కొంది. 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేపట్టి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 29న సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరగనున్నాయి. 28న శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలాలయ ద్వారాలు 28న సాయంత్రం 5 గంటల నుంచి 29న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. 29న ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకే సర్వదర్శనం, మధ్యాహ్నం 12.30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. సర్వదర్శనానికి ఉదయం మాత్రమే అవకాశం ఉంటుంది. 28న అన్నప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని..ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. -
ముగిసిన దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/కోడూరు/పెందుర్తి/శ్రీశైలం టెంపుల్: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తోన్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం 9వ రోజున దుర్గమ్మ 2 అలంకారాల్లో అభయమిచ్చారు. ఉదయం మహిషాసురమర్దినిగా.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమ్మవారి అలంకరణ మార్పు కారణంగా దర్శనాలను నిలిపివేశారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని నిర్వహించారు. సోమవారం రాత్రి ఆది దంపతులకు కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. దుర్గాఘాట్ వద్ద హంస వాహనంపై శ్రీగంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వారు తెప్పపై విహరించారు. 8.95 లక్షల మందికి దర్శనం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15–23 వరకు నిర్వహించిన దసరా ఉత్సవాల్లో 8.95 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 14.17 లక్షల లడ్డూలను విక్రయించినట్లు చెప్పారు. స్వర్ణం, వెండి, పట్టుతో నేసిన చీరలో నాంచారమ్మ కృష్ణా తీరంలో భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి బంగారం, వెండి, పట్టుతో నేసిన చీరను అలంకరించారు. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన పసుపులేటి మణికంఠ వృత్తి పరంగా విదేశాల్లో స్థిరపడ్డాడు. దసరా ఉత్సవాలకు నాంచారమ్మ అమ్మవారికి రూ.2 లక్షలతో బంగారం, వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరను మణికంఠ కుటుంబసభ్యులు సోమవారం ఆలయాధికారులకు అందజేశారు. పట్టుతో పాటు చీర మొత్తం బంగారం, వెండి తీగలతో నేయించారు. ఈ చీరను మూలమూర్తికి అలంకరించారు. బంగారం, వెండి చీరలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మణికంఠ కుటుంబీకులను ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య సన్మానించారు. విశాఖ శ్రీశారదాపీఠంలో.. విశాఖ శ్రీశారదాపీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం విజయదశమి సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలు శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చిన శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్రెడ్డి శ్రీశారదాపీఠాన్ని మంగళవారం సందర్శించి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో.. శ్రీశైలంలో ఆధ్యాత్మికభరితంగా సాగిన దసరా మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. అమ్మవారు నిజరూప అలంకారంలో భ్రమరాంబాదేవిగా దర్శనమిచ్చారు. నంది వాహన సేవలో ఆది దంపతులు విహరించారు. ప్రత్యేక అలంకృతులైన అమ్మవారికి, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక వేదికలో ఆశీనులను చేయించి విశేష పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలతో పాటు శమీ పూజ చేపట్టారు. అమ్మవారి యాగశాలలో, స్వామివారి యాగశాలలో శాస్త్రోక్తం గా పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీగిరిలో దసరా మహోత్సవాలు ముగిశాయి. కాగా, సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు మంత్రి గుమ్మనూరు జయరాం దంపతులు పట్టువ్రస్తాలను సమర్పించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు. -
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..4వ రోజు పోటెత్తిన జనం
-
సిఫారసులకు చెల్లుచీటీ!.. టికెట్ ఉంటేనే దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనంలో అధికారులు భారీ మార్పులు చేశారు. సిఫారసులు ఉన్నవారికే దుర్గమ్మ దర్శనం అనే భావన తొలగించి, ఎటువంటి సిఫారసులతో పనిలేకుండా కేవలం గంటన్నర వ్యవధి లోపే దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవదాయశాఖ మంత్రితోపాటు అధికారులు, చైర్మన్ చెబుతూనే ఉన్నారు. ఏటా ఇలానే చెబుతారు కదా అని సాధారణ భక్తులు భావించినా, ఈసారి దాన్ని చేతల్లో అమలు చేసి చూపించారు. టికెట్ ఉంటేనే దర్శనం అనే రీతిలో ఏర్పాట్లు జరిగాయి. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి దర్శనం పూర్తయి కొండ దిగేవరకూ కేవలం గంటన్నర వ్యవధిలోపే దర్శన సమయం పడుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఏర్పాట్లను మంగళవారం విజయవాడ సీపీ టీకే రాణా తనిఖీ చేశారు. క్యూలైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు. దర్శనానికి ఎంత సమయం పడుతుందనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రొటోకాల్ వాహనాలపైనే కొండకు... పాలకమండలి, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా దేవస్థానానికి చెందిన ప్రొటోకాల్ వాహనాలపైనే కొండపైకి చేరుకోవాలి. టికెట్ ఉంటేనే వాహనాల్లోకి ప్రవేశం అని ప్రకటించారు. వారితో వచ్చిన ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే అని పేర్కొన్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లోనైనా, వీఐపీలైనా టికెట్ కొనుగోలు చేస్తున్నారు. ఇక టికెట్ కొనుగోలు చేసిన సామాన్య భక్తులు ఎవరైనా నేరుగా ఆలయానికి చేరుకునే వీలులేకుండా పక్కా ప్రణాళికతో కట్టడి చేశారు. ఘాట్ రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి ఆలయం చేరుకునే లోపు ఐదు చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వాటికి ఎంఆర్వోలు, ఇతర రెవెన్యూ ముఖ్య అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో సీఎం గేట్, ఆలయ సిబ్బంది రాకపోకలు సాగించే మార్గాల్లో ఉన్న గేట్లకు సైతం తాళాలు వేశారు. ఎవరైనా సరే క్యూలైన్లోనే దర్శనానికి వెళ్లాలని అటు పోలీసులు, ఇటు రెవెన్యూ శాఖల అధికారులు చెబుతున్నారు. అలానే సిఫారసులు ఉన్నా, నేరుగా దర్శనానికి కాకుండా, క్యూలైన్లోనే అనుమతిస్తుండటంతో ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా కనబడుతోంది. మరోవైపు డీసీపీ విశాల్గున్నీ ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ భక్తులు ఎవ్వరూ అనధికార మార్గాల్లో అమ్మవారి దర్శనానికి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. పోలీసు అధికారులు సిఫారసు చేసిన వారిని సైతం పోలీసులు నేరుగా దర్శనానికి కాకుండా రూ.500 టికెట్ క్యూలైన్లోనే పంపుతున్నారు. చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన విశేష ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గమ్మకు అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం నుంచి పట్టువ్రస్తాలను సమర్పించారు. అన్నవరం దేవస్థాన ఈవో, దుర్గగుడి దసరా ఉత్సవాల ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ అమ్మవారికి సమర్పింంచేందుకు పట్టువ్రస్తాలను తీసుకురాగా, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో కేఎస్ రామారావు సాదరంగా స్వాగతం పలికారు. ఉత్సవాల ఏర్పాట్లను సీపీ టీకే రాణా పర్యవేక్షించగా, ఆలయ ప్రాంగణంలో డీసీపీ విశాల్గున్ని క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం ఆది దంపతుల నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. నగరోత్సవంలో ఆలయ చైర్మన్ రాంబాబు, ఈవో కెఎస్ రామారావు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
బాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.40గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆదివారం, దసరా సెలవులు కావడంతో తొలి రోజు నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. స్నానఘాట్లల్లో ప్రత్యేకంగా షవర్లు, తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలుగకుండా వీవీఐపీల సమాచారం ముందుగా తెలియజేస్తే ప్రొటోకాల్కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు చెప్పారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నగరోత్సవం నిర్వహించి, పంచహారతులను సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం నాడు శ్రీ కనకదుర్గమ్మవారు భక్తులకు శ్రీ గాయత్రీదేవీగా దర్శనమివ్వనున్నారు. దుర్గమ్మ సేవలో గవర్నర్ దంపతులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన గవర్నర్కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. గవర్నర్కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, చైర్మన్ కర్నాటి రాంబాబు అందజేశారు. గవర్నర్ వెంట కలెక్టర్ ఢిల్లీరావు తదితరులున్నారు. అలాగే, మంత్రులు ఆర్కే రోజా, విశ్వరూప్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. -
నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నందు ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు, ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్కు పలు సూచనలు చేశారు. నేడు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను తొలిరోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వి తమైనది. శ్రీ బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలా త్రిపురసుందరీదేవి. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరస సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్నాటక నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తమ వాహనాలను సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం, పున్నమి ఘాట్, వీఎంసీ కార్యాలయాల వద్ద నిలుపుకొని దేవస్థాన బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. పలువురు భక్తులు కనకదుర్గనగర్ మీదుగా మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లో గంటకు పైగా సమయం పట్టింది. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పిస్తున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 22 రోజులకు గాను రూ.2,92,28,842ల నగదు లభించింది. సరాసరిన రోజుకు రూ.13.28 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు. 740 గ్రాముల బంగారం, 6.95 కిలోల వెండి, భారీగా ఇతర దేశాల కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ–హుండీ ద్వారా రూ.89,193 విరాళాలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు సమర్పించినట్లు చెప్పారు. -
దసరాకు సన్నాహాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సన్నాహాలు జరుగు తున్నాయని సుమారు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను వారు మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు 10 విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూ.2.50 కోట్లతో ఇంజినీరింగ్ పనులు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో గతేడాది ఆరు లక్షలకు పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఉత్సవాల్లో 16 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం అందించిందని, ఈ ఏడాది సుమారు 20 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. మూలా నక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున రూ. 500 వీఐపీ టికెట్లను విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తారని తెలిపారు. రూ.500 వీఐపీ టికెట్ తీసుకున్నా ముఖ మండపం దర్శనం మాత్రమే కల్పిస్తామని వివరించారు. మిగిలిన రోజుల్లో రూ. 100, రూ.300, రూ. 500 టికెట్ల విక్రయాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు సుమారు రెండు వందల మంది పని చేస్తున్నారని, భక్తుల తలనీలాలు తీసేందుకు ఇతర ఆలయాలు, బయట నుంచి ఆరు వందల మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 22న వేదసభ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఆది దంపతుల నగరోత్సవం మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద యాగశాల నుంచి ప్రారంభమవుతుందన్నారు. మహా మండపం, కనకదుర్గనగర్, దుర్గాఘాట్, దేవస్థాన ఘాట్రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందన్నారు. రాజగోపురం ఎదుట పూజతో నగరోత్సవం ముగుస్తుందన్నారు. 21న అర్చక సభ, 22న వేద సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో చివరి రోజు 23వ తేదీ నుంచి భవానీల రాక ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, మూడు రోజుల పాటు తాకిడి ఉండే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ, చింకా శ్రీనివాసులు, తొత్తడి వేదకుమారి, వైదిక కమిటీ సభ్యులు యజ్జనారాయణశర్మ, మురళీధర్శర్మ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 20న పట్టువస్త్రాల సమర్పణ ఉత్సవాల్లో తొలిసారిగా అమ్మవారిని మహా చండీదేవిగా అలంకరిస్తామని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పేర్కొన్నారు. తొలిరోజున అమ్మవారి శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారన్నారు. 20వ తేదీ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించ నున్నారన్నారు. 23వ తేదీ రెండు అలంకారాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చునన్నారు. ఉదయం మహిషాసురమర్దని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 23వ తేదీ సాయంత్రం శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్లకు పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. -
రవికల పేరుతో నిలువు దోపిడీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు అమ్మవారికి చీరలు సమర్పిస్తే మరి కొందరు రవికలు సమర్పిస్తుంటారు. భక్తులు తమకు కావాల్సిన చీరలు, రవికలను ఆలయ పరిసరాల్లోని దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు. అయితే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్, మహా మండపం 5వ అంతస్తులోని దుకాణాల్లో రవికల పేరిట గుడ్డ పీలికలను అందమైన ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శనివారం విచ్చేసిన ఎం. హారిక దంపతులు అమ్మవారికి రవికను సమర్పించేందుకు మహా మండపం ఐదో అంతస్తులోని షాపునకు వెళ్లి రూ. వంద చెల్లించి రవికను కొనుగోలు చేశారు. రూ. 10 చెల్లించి పసుపు, కుంకుమ ప్యాకెట్ను కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కౌంటర్లో ఆ రవికను ఇచ్చారు. అయితే దేవస్థాన కౌంటర్లోని సిబ్బంది అది చెత్తలో వేయాలని సూచించారు. దీంతో షాక్కు గురైన వారు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. తమకు విక్రయించినది రవిక ముక్క కాదని, కనీసం ఖర్చీపు కూడా కాదని తెలుసుకున్నారు. అడిగినంత ఇస్తున్నా.. ఆలయ ప్రాంగణంలోనే ఇలా భక్తులను మోసం చేయడం ఎంత వరకు సబబని కౌంటర్లో సిబ్బందిని నిలదీశారు. దీనిపై మీరు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. దీంతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఇదంతా సాధారణమని ఆ అధికారి సలహా ఇవ్వడంతో వారు ఆలయ ఈవో భ్రమరాంబను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈవో అందుబాటులో లేరని తెలుసుకుని వెను తిరిగారు. ప్రతి నిత్యం ఇలా వందలాది మంది భక్తులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆలయ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్పై రాకపోకలు బంద్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి ఘాట్ రోడ్ మీదుగా వెళ్లే భక్తుల రాకపోకలను నిలుపుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండపై ఉన్న రాళ్లు మెత్తబడటంతో మంగళవారం రాత్రి కొండపై నుంచి చిన్నపాటి రాళ్లు ఘాట్ రోడ్పై జారి పడ్డాయి. కొండ చరియలు విరిగి కింద పడకుండా ఘాట్ రోడ్లో కొండ చుట్టూ మెష్ ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలుగా వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను బంద్ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో దర్భముళ్ల భ్రమరాంబ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు బోనం సమర్పించింది. 11 రకాల బోనాలు, పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి బంగారు బోనంతో పాటు అందజేసింది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీన్మార్ డప్పులు, కోలాట నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఇంద్రకీలాద్రికి చేరిన ఊరేగింపునకు దుర్గగుడి చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు బంగారు బోనం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న శాకంబరీదేవి ఉత్సవాలు ఆదివారం రెండో రోజూ వైభవంగా కొనసాగాయి. రికార్డు స్థాయిలో సుమారు 70 వేల పైచిలుకు భక్తులు అమ్మవారిని శాకంబరీదేవిగా దర్శించుకున్నారు. కాగా, దుర్గమ్మను శాకంబరీదేవి అలంకారంలో రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం దర్శించుకున్నారు. -
శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాకంబరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులు, భక్తుల నుంచి సేకరించిన కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. తొలి రోజు రాత్రి 9.30గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ శ్రీనివాసరెడ్డి తదితరులు శనివారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వేర్వేరుగా ఆలయానికి వచ్చిన న్యాయమూర్తులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈఈ కె.వి.ఎస్.కోటేశ్వరరావు అమ్మవారి ప్రసాదం, శేషవ్రస్తాలతో సత్కరించారు. -
దుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం
-
ఘనంగా ఆషాడమాసం ఉత్సవాలు ప్రారంభం
-
దుర్గమ్మకు రూ.7.50 లక్షల ఆభరణాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తురాలు రూ.7.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పించారు. హైదరాబాద్ ఏఎస్రావు నగర్కు చెందిన డి.వెంకట సత్యవాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 104 గ్రాముల బంగారపు లక్ష్మీకాసుల హారం, 29 గ్రాముల బంగారపు పచ్చల నక్లెస్, 391 గ్రాముల వెండి పళ్లెం దేవస్థానానికి సమర్పించారు. వీటిని అమ్మవారి ఉత్సవాలలో ఉపయోగించాలని దాత కోరారు. కాగా, దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి చెన్నై ఇందిరానగర్కు చెందిన భోగరం వెంకట మార్కాండేయ శర్మ కుటుంబం రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందచేశారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మీ యాగం
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలు అత్యుత్సాహం
-
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
-
దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది : వైవి సుబ్బారెడ్డి
-
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్
-
ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
పండగ వేళ : మూడవ రోజు గాయత్రీ అలంకారంలో అమ్మవారు
-
ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శరన్నవరాత్రులు
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
-
దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైన ఇంద్రకీలాద్రి
-
Ashada Masam 2022: ముగిసిన ఆషాఢ మాసం ఉత్సవాలు
-
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
ద్వారకాతిరుమల/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): సకల శుభాలు కలిగించే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు వచ్చి పూజలు చేశారు. ప్రధానంగా అన్నవరం, సింహాచలం, అరసవిల్లి వంటి ముఖ్యమైన ఆలయాల్లో భక్తజనం పెద్దఎత్తున వచ్చారు. ఇక ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోని దాదాపు అన్ని విభాగాలూ భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రంలో రద్దీ కొనసాగింది. భజన మండళ్ల సభ్యులు కోలాట భజనలతో ఆకట్టుకున్నారు. అలాగే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా ఆదివారం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. విజయవాడ లబ్బీపేట, వన్టౌన్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో స్వామి వారికి పలు ప్రత్యేక పూజలు, లక్ష తులసీదళార్చన నిర్వహించారు. అభినవ మేల్కొటెగా పేరుగాంచిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెంలోని శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పులకించింది. 11 అడుగుల శ్రీమన్నారాయణుడి మూలమూర్తికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మచిలీపట్నం చిలకలపూడి కీర పండరీపురంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే, బెజవాడ కనకదుర్గమ్మ, పట్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో పెద్దఎత్తున బారులుతీరారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ మాల దీక్షల విరమణ
-
కార్తీక పౌర్ణమి: దేదీప్యం.. ఇంద్రవైభోగం
సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): కోటి కార్తిక జ్యోతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగొందింది. పున్నమి చంద్రుడితో పోటీ పడినట్లు.. కృష్ణమ్మ బంగారు తరంగాలను మైమరపిస్తూ దీప కాంతులతో మెరిసిపోయింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ విశిష్ట అతిథిగా విచ్చేశారు. అమ్మవారికి పంచహారతుల అనంతరం స్వా మిజీ పూజలు నిర్వహించి.. రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన కోటి ఒత్తుల భారీ దీపాన్ని వెలిగించారు. ఆలయ మర్యాదలతో స్వామీజీకి స్వాగతం కోటి దీపోత్సవానికి విచ్చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, దుర్గగుడి చైర్మన్ పైలాసోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శనానంతరం రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పుష్పాలతో రంగవల్లులు కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో ముగ్గులను తీర్చిదిద్దారు. వివిధ వర్ణాల పుష్పాలతో శ్రీచక్రాన్ని తీరిదిద్ది దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు, మహా గణపతి ప్రాంగణం, మల్లేశ్వర స్వామి వారి ఆలయం, మహా మండప, కనకదుర్గనగర్లో దీపాలను ఏర్పాటు చేయగా, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దీపార్చన నిర్వహించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జ్వాలా తోరణాన్ని అర్చకులు వెలిగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు.. సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అంతరాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. (చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ) ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్ జగన్.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు దుర్గమ్మను దర్శించుకున్న వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మకు సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.6782 కోట్లు ఆసరా అందించారని తెలిపారు. ఎంతమంది విఘ్నాలు తలపెట్టినా.. రాక్షసుల రూపంలో అడ్డుతగిలినా కనకదుర్గమ్మ, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు సీఎం జగన్పై ఉంటాయని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చదవండి: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయవాడ: కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
-
విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
సాక్షి, విజయవాడ: సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం నేరుగా ఇంద్రకిలాద్రికి వెళ్లి కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరిని చల్లగా కాపాడాలని ఆ అమ్మవారిని కొరుకున్నా అని తెలిపారు. కాగా కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా మారారు సోనూసూద్. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రకాలుగా సేవలు అందించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలెండర్లను సప్లై చేశారు. అంతేగాక ఇందుకోసం ఆయన ప్రత్యేకం ఫౌండేషన్ కూడా ప్రారంభించి దాని ద్వారా ప్రజల కోసం విరాళాలు సేకరించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం సోనూ సూద్ తన బాధ్యత భావించిన లక్షలాదిమంది అవసరాలు తీర్చి అపర దాన కర్ణుడుగా కీర్తించబడుతున్నారు. దీంతో ఈ రీయల్ హీరోను నేరుగా చూసేందుకు విజయవాడకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు. -
దసరాకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి
-
ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతములు
-
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ
-
ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
-
ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
-
భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్
సాక్షి, విజయవాడ: అమ్మవారి మాల ఎక్కడైతే స్వీకరిస్తారో అక్కడే దీక్ష విరమణ చేయాలని దుర్గగుడి ఈఓ సురేష్ బాబు భక్తులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నదీ స్నానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. కాగా కోవిడ్ నిబంధనల కారణంగా భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ బ్రేక్ పడింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు భవానీ దీక్షా విరమణ ఆన్లైన్ స్లాట్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ సురేష్ బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన.. జనవరి 5 నుంచి 9 వరకు భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా భవానీ దీక్షకు వచ్చే భక్తులను రోజుకు పది వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షణను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ‘‘దీక్షా విరమణ రోజుల్లో రోజుకు 9 వేల మందికి ఉచిత దర్శనం... 100 రూపాయల టిక్కెట్లు 1000 ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. ప్రతిభక్తుడు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో ఐడీ తప్పనిసరి. www.kanakadurgamma.org వెబ్సైట్లో టిక్కెట్లు పొందవచ్చు. దీక్షా విరమణ రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. కాగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటలకు ఆలయ సిబ్బందితో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి గిరిప్రదక్షిణ చేయనున్నారు.(చదవండి: మూడు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు) -
శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవరోజు దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్బుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీమహాలక్ష్మీ అమితరమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్ధితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృత స్వరూపాణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. (చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు) దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మహాలక్ష్మి రూపంలో కనక దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రీ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే! శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే!! -
దుర్గమ్మకు సారె
-
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఫొటోలు
-
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్కు ఘనస్వాగతం పలికారు. కొండమీదకు చేరుకున్న సీఎం జగన్ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్కు వివరించారు. అనంతరం వస్త్రధారణ పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు పార్థ సారధి, వల్లభనేని వంశీ,అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు దుర్గగుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. లడ్డూ పోటు, ఘాట్రోడ్ అభివృద్ధి, సోలార్ సిస్టమ్తో పాటు అభివృద్ధి పనులకు సీఎం నిధులు ప్రకలించారని తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు
సాక్షి, విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రీ సమీపంలో కొండచరియలు బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌనస్వామి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డుపెట్టారు. రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే బుధవారమే కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంద్రకీలాద్రికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగిరమేష్, వసంత కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. -
కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనం
-
రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోన్లో సమీక్షించారు. రేపు(బధవారం) ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న సందర్భంగా మంగళవారం మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు. దసరా ప్రారంభమై గత మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లను భక్తుల విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. మంత్రితోపాటు ఈవో సురేష్ బాబు ఇతర అధికారులు ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు: రేపు(బుధవారం) మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరన్నారు. మధ్యాహ్నం 3:40 గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. -
ఇంద్రకీలాద్రి : గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం
-
ఇంద్రకీలాద్రిపై కొవిడ్ అంక్షలు
-
ఇంద్రకీలాద్రీపై భారీ వర్షం
-
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
-
విగ్రహాలు మాయం కావడం దురదృష్టకరం
-
దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే!
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు. 2019 ఏప్రిల్ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. గతంలో పాలక మండలి హయాంలోనే.. దుర్గగుడికి గత ఏడాది ఉగాది ఉత్సవాల నాటికి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఉంది. ఆ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్ కవర్తో కప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలా సోమినాయుడు సారథ్యంలో పాలకమండలి ఏర్పటైంది. రథం యథావిధిగా ఉందని భావించారే తప్ప రథం మీద ఉన్న సింహం బొమ్మలు మాయం అవుతాయని అనుమానించలేదు. రథాన్ని పరిశీలించలేదు. గతంలో పాలకమండలి సభ్యులకు, దేవాలయ ఈఓలకు మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో వారే ప్రతిదాన్ని వివాదస్పదం చేసుకునేవారు. వారిపై అనుమానాలు.. ఇక దుర్గగుడి పరిసరాల్లో టీడీపీ నేతలు కొంతమంది కొన్నేళ్లుగా పాగా వేశారు. వారు ఇంద్రకీలాద్రిపైనే చిరు వ్యాపారం చేసి తర్వాత రూ.కోట్లకు పడగలెత్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇరకాటంలో పెట్టాలని రథంపై సింహాల ప్రతిమలను మాయం చేసి పాపానికి ఒడికట్టారా.. అనే అనుమానాలు దేవస్థానం సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక సంస్థకు గతంలో సెక్యురిటీ బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది వారి కాంట్రాక్టు పూర్తి కావడంతో తిరిగి వేలం నిర్వహించడంతో మాక్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే గత సంస్థలో పనిచేసిన అనేక మంది సిబ్బంది మాక్స్ సంస్థలో చేరి ఇక్కడే దుర్గగుడిలో పనిచేస్తున్నారు. తమ ప్రతిష్ట దెబ్బతీయడానికి గత సంస్థలో పనిచేసిన వారు ఎవరైనా ఈ తప్పుడు పని చేశారా? అనే అనుమానం మాక్స్ సెక్యురిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే! టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రార్థనా స్థలాలపై ఏ విధమైన భక్తి భావం లేదు. తన హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారు. 2016లో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చి వేయించారు. అప్పట్లో ఈ కూల్చివేతల్లో ఎంపీ కేశినేని నాని, నాటి కలెక్టర్ అహ్మద్ బాబు కీలకపాత్ర పోషించారు. రామవరప్పాడులో ఉన్న మసీదును కూల్చివేయడంతో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను సంతోష పరచడానికే స్థానిక టీడీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడుతున్నారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. రథాన్ని పరిశీలించిన మంత్రి వెలంపల్లి ఇంద్రకీలాద్రికి ఉన్న వెండి రథాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు ఈఓ ఎన్వీఎస్ఎస్ మూర్తిని విచారణాధికారిగా నియమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇంద్రకీలాద్రి: ఆషాఢ సారె మహోత్సవం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆషాడ మాస సారెను దేవస్థానం తరపున అందజేయటం ఆనందంగా ఉందన్నారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 20 వరకు సారె మహోత్సవం.. వచ్చే నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుందని దుర్గ గుడి ఈవో సురేష్బాబు తెలిపారు. సారె సమర్పించడానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే అమ్మవారికి సారె సమర్పించాలని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, మాస్క్లు ధరించాలని కోరారు. గుంపులు గుంపులుగా రావొద్దని భక్తులకు ఈవో సురేష్బాబు విజ్ఞప్తి చేశారు. -
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం
-
రేపటి నుంచి భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం
-
కరోనా అలర్డ్ : దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ద్వారకా తిరుమల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 31 వరకు కేశఖండనశాల, అంతరాలయ దర్శనం, అన్ని ఆర్జిత సేవలు, సుప్రభాత సేవ, అష్టోత్తర పూజలు, ప్రచార రథం నిలుపుదల చేసినట్లు దేవస్థానం ప్రకటించింది. దీంతోపాటు ఆన్లైన్ ద్వారా టికెట్ల సేవను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. కాగా ఆన్లైన్ ద్వారా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు పరిస్థితి మెరుగుపడ్డాక స్వామి వారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. విజయవాడ : కరోనా వైరస్ నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి చేయించే ప్రత్యేక పూజలతో పాటు, అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలతో పాటు అన్ని రకాల సేవలను రద్దు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రికి బస్ సౌకర్యం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3 వరకు సౌరాష్ట్రక్షరి మహా మంత్ర హవనం, మహా మృత్యుంజయ మంత్ర హవనం, శీతల మహా మంత్ర హవనం, అరుణ పారాయణం, సౌర పారాయణం, సూర్యనామస్కరరాలు, చండీహోమం వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఘాట్ రోడ్డుతో పాటు మహామండపం వద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు
-
దుర్గమాతను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: సరస్వతి మాత వసంత పంచమి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విద్యార్థులకు కంకణం, పెన్నులు, ప్రసాదం అందజేశారు. నేడు(గురువారం) అమ్మవారి జన్మనక్షత్రం కావండంతో ఇంద్రకీలాద్రీ దుర్గామాత సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గమాతను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరికి జ్ఞానం కలగాలని, మంచి జరగాలని సరస్వతి యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా అమ్మవారి దర్శనార్థం స్థానిక పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు దుర్గగుడికి తరలివచ్చారు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకున్నారు. అందరికిఅమ్మవారి ఆశీస్సులు అందేలా ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా రూ. 15వేలు ప్రతి విద్యార్థికి అందిస్తున్నామన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
‘భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దు’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ఈ ఏడాది సుమారు ఏడు లక్షలకుపైగా భవానీలు అమ్మవారి దర్శనార్థం వస్తారని అంచనా వేస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేశామని దేవాదయశాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇంద్రకీలాద్రిపై భవనీదీక్షా విరమణల ఏర్పాట్లను ఆయన బుధవారం పర్యవేక్షించారు. అదేవిధంగా భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దని మంత్రి వెల్లపల్లి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షణకు భవానీలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. గిరి ప్రదక్షణ సమయంలో భవానీలు ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా చూడాలిని ఆయన అధికారులను ఆదేశించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు వేగవంతంగా జరుగుతున్నందున వచ్చే ఏడాదికి ఆ సమస్య తీరుతుందని మంత్రి వెల్లపల్లి తెలిపారు. ప్రతి భవానీ భక్తుడు అమ్మవారిని దర్శించుకొని మాల విరమణ చేసే వరకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లపల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా హోమగుండాలు, గిరి ప్రదక్షణ ఏర్పాట్లు ఉన్నాయని భవానీ భక్తులను అడిగి తెలుసుకున్నారు. -
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం
-
కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం
సకలశుభాల తల్లి కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రి గాజుల మహోత్సవానికి ముస్తాబవుతోంది. ఏటా దుర్గమ్మను, ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 29వ తేదీ గాజుల ఉత్సవాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమవుతోంది. సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 29వ తేదీన గాజుల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూలవిరాట్ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరిస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో ముస్తాబు చేస్తారు. ఇంద్రకీలాద్రిపై 2016 నుంచి ప్రారంభించిన ఈ విశేష పూజ ఎంతో ప్రాచుర్యం పొందింది. తొలి ఏడాది కేవలం 5 లక్షల గాజులతో ఉత్సవాన్ని ప్రారంభించగా, ఈ ఏడాది కోటి గాజుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి గాజుల అలంకరణకు అవసరమైన కొన్ని గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుంది. భక్తుల నుంచి కూడా భారీ స్థాయిలో గాజులు విరాళంగా దేవస్థానానికి అందుతాయి. భక్తులు అందించే గాజులను స్వీకరించేందుకు దేవస్థానం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పలువురు భక్తులు అందచేసిన గాజులు దేవస్థానానికి చేరాయి. ఉత్సవానికి మరో 5 రోజులు ఉండటంతో గాజులు మరిన్ని విరాళాలుగా దేవస్థానానికి అందే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ప్రాచీనకాలం నుంచి చేస్తున్న పూజ 15, 18వ శతాబ్దంలో అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది. 15వ శతాబ్దంతో విజయనగర మహారాజు అమ్మవారి అలంకరణ నిమిత్తం బంగారు ఆభరణాలను తయారు చేయించడంతో పాటు గాజులతో విశేష అలంకరణ చేసినట్లు చెప్పబడుతోంది. కార్తీక మాసంలో రెండో రోజున భగిని హస్త భోజనం అని, యమ ద్వితీయ అని పిలవబడుతుంది. ఆ రోజున తమ్ముళ్లు, అన్నయ్యలు అక్కాచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి.. వారి చేతి భోజనం చేసి చల్లగా ఉండాలని దీవించి పసుపు, కుంకుమ, గాజులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు గాజులు, పసుపు, కుంకుమను సమర్పిస్తారు. అమ్మవారి ప్రసాదంగా వితరణ అమ్మవారికి అలంకరించే ఆభరణాల నుంచి పూల వరకు అన్నీ గాజులతోనే తయారు చేసి ముస్తాబు చేయడం ఈ ఉత్సవంలో విశేషం. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులుకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ గాజులను ధరించడం శుభకరం.. మంగళకరమని భక్తులు భావించి గాజుల కోసం దేవస్థానానికి తరలివస్తారు. దుర్గమ్మకు 10 లక్షల గాజులు విరాళం ఇంద్రకీలాద్రి : దుర్గమ్మ అలంకరణ కోసం అవసరమైన మట్టి గాజులను బుధవారం భక్తులు విరాళంగా అందజేశారు. శ్రీకనకదుర్గా లలితా పారాయణ బృందానికి చెందిన గ్రంథి శ్రీరామసుబ్రహ్మణ్యం, రాధిక, ఇతర భక్త బృంద సభ్యులు సుమారు పది లక్షల గాజులను దేవస్థానానికి అందించారు. గాజులు, పూజాసామగ్రి, పసుపు, కుంకుమతో ఆలయానికి చేరుకున్న భక్త బృందం సభ్యులకు ఆలయ ఈవో ఎంవీ సురేష్బాబు, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్శర్మ సాదరంగా స్వాగతం పలికారు. దాతలు అమ్మవారికి గాజులను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. -
దుర్గమ్మ చీరలపై కమిటీ వేసిన ఈఓ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శనివారం చీరలపై రేట్ల పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఈఓ సురేష్ బాబు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చీర అసలు ధర అంచనా వేసి.. రేటు మార్చి మళ్లీ అమ్మకానికి పెట్టనున్నారు. దీంతో భక్తులు సమర్పించేటప్పుడు చీర ధర ఎంత చెబితే అంత రేటుకే అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది నుంచి సుమారు 2 వేలకు పైగా చీరలు మూలనపడి ఉన్నాయి. రూ.1000 చీరను రూ.5000కు ధర నిర్ణయించడంతో కొనుగోలు చేయడానికి భక్తులు వెనుకాడుతున్నారు. దుర్గమ్మ చీరల కొనుగోలుకు భక్తులు ఆసక్తి చూపకపోవడంతో.. గుట్టలుగా పేరుకుపోయాయి. చీరల కౌంటర్లని, భద్రపరిచిన స్టోర్ రూమ్ను పరిశీలించిన దేవాదాయశాఖ కమిషనర్ పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దసరా సమయంలో కూడా చీరలు అమ్ముడుపోలేదు. భక్తులు సమర్పించే చీరలను.. అమ్మవారి ప్రసాదంగా తిరిగి భక్తులకే దుర్గగుడి అధికారులు అమ్ముతున్నారు. -
విజయవాడలో ఘనంగా దసరా ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భక్తజనం
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భక్తజనం
సాక్షి, విజయవాడ : దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. నవరాత్రులలో భాగంగా ఏడవరోజున అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం కావడంతో వేకువజాము నుంచే భక్తుల రద్దీ అధికసంఖ్యలో ఉంది. అమ్మవారి దర్శనానికి మూడుగంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని శనివారం అన్నిరకాల వీఐపీ, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ముఖమండపం ద్వారానే అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కెనాల్ రోడ్డులోని కంపార్ట్మెంట్లు దర్శనానికి వచ్చిన భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి వచ్చేవారు తొక్కిసలాటకు గురవకుండా రోప్ సహాయంతో క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులను వదులుతున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. ఈ ఏడాది శరన్ననవరాత్రుల ఏర్పాట్లు గతంలో కంటే బాగున్నాయని ఆమె పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు : మంత్రి వెల్లంపల్లి మూలా నక్షత్రం కావడంతో లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉదయం 9గంటల వరకు దాదాపు లక్షన్నర మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. కాగా దర్శనం సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారమే అమ్మవారిని దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించినట్లు గుర్తుచేశారు. -
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: సీపీ
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీమహాలక్ష్మి అమ్మవారిని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్(సీపీ) ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం భద్రతా కారణాల దృష్ట్యా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. సీఎం దర్శనానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అంతేగాక భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి కోసం 3 క్యూలైన్లు పూర్తి స్థాయిలో యథావిధిగా కొనసాగుతాయని సీపీ తెలిపారు. ఈ రోజు శుక్రవారం కావటంతో ఉదయం 7 గంటల నుంచే రద్దీ పెరిగిందనీ, పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయని చెప్పారు. కాగా దేవస్థానంలో విధులు నిర్వహించే వారి వాహనాలకు సైతం కిందే పార్కింగ్ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శనం ఉత్సవాలలో భాగంగా ఏడో రోజు అనగా 5వ తేదీ శనివారం అమ్మవారు శ్రీసరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజామున ఒంటి గంట నుంచే దర్శనాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నామని సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. అదేవిధంగా రేపు భక్తులకు సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్ ఏరియాగా ఏర్పాటు చేసి, వారు వేచి చూసే అవకాశం కల్పించి తర్వాత క్యూలైన్లలో వదలనున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ అందిస్తున్నామని తెలిపారు. అంతేగాక అంతరాలయ దర్శనం ఉండబోదని ఈ మేరకు సీపీ స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వారికి ఎటువంటి టిక్కెట్ రుసుము అవసరం లేకుండా, పూర్తి ఉచిత దర్శనం కల్పిస్తామని అన్నారు. -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
ఇంద్రకీలాద్రిపై నాల్గవరోజు జగన్మాత శ్రీఅన్నపూర్ణాదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్తజనబాంధవి, అన్నార్తుల పాలిట అన్నపూర్ణమ్మగా అందరింటా పూజలందుకునే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం బారులు తీరారు. ఓ వైపు కుంకుమార్చనలు, మరోవైపు చండీయాగం, వేదఘోషతో కృష్ణాతీరం బుధవారం పులకించింది. సెలవు దినం కలసి రావడం పిల్లా–పెద్దా కొండకు బారులు తీరారు. క్యూలైనులన్నీ భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. వచ్చిన ప్రతిభక్తుడికి సులభంగా ‘అమ్మ’ దర్శనం లభించేలా.. సంతృప్తిగా భోజన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లేలా యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ) : అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు అశేష భక్తజనం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ కనిపించింది. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ ఈవో ఎంవీ. సురేష్బాబు, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిట లాడాయి. సర్వదర్శనం, రూ. 100 టికెట్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా, రూ. 300, వీఐపీ క్యూలైన్లో నాలుగు గంటల సమయం పట్టింది. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన విశేష కుంకుమార్చన, మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన చండీయాగంలో ఉభయదాతలు పాల్గొన్నారు. అంతరాలయం దర్శనం రద్దు రూ. 300, వీఐపీ టికెట్లు, ఉత్సవ కమిటీ సభ్యుల సిఫార్సుతో దర్శనానికి విచ్చేసిన భక్తులతో ప్రత్యేక క్యూలైన్ మార్గంలో రద్దీ కనిపించింది. దీంతో బుధవారం అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. అయితే ముందస్తుగా ఎటువంటి ప్రకటన చేయకుండా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. క్యూలైన్లో సీపీ టికెట్ల తనిఖీ వీఐపీ క్యూలైన్లో రద్దీ అధికంగా ఉండటం, ఆర్జీత సేవలలో పాల్గొన్న ఉభయదాతలకు దర్శనం ఆలస్యం కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దేవస్థానానికి విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు క్యూలైన్లను పరిశీలించారు. దీంతో సీపీని పలువురు భక్తులు నిలదీయడంతో ఆయన క్యూలైన్లో ఉన్న భక్తుల వద్ద టికెట్లను తనిఖీ చేశారు. అయితే వీరిలో అనేక మంది ఎటువంటి టికెట్లు లేకుండా దర్శనానికి క్యూలైన్లో వేచి ఉండటం గమనించారు. దీనిపై ఈవో ఎంవీ. సురేష్బాబుతో మాట్లాడారు. అంతే కాకుండా వీఐపీలకు కేటాయించిన సమయంలోనే దర్శనానికి అనుమతించాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీఐపీల పేరిట వచ్చేవారు దేవస్థానం నిర్ణయించిన సమయంలోనే క్యూలైన్లోకి అనుమతిస్తామని పోలీసులు సిబ్బంది పేర్కొనడంతో కొద్దిసేపు ప్రాంగణంలో గందరగోళ పరిస్ధితి ఏర్పడింది. మార్మోగిన పురవీధులు ఆలయాల్లో నిత్య పూజలు అందుకునే ఆది దంపతులు, దసరా మహోత్సవాల సందర్భంగా పల్లకిలో ఊరేగుతూ తమ మధ్యకు రావడంతో భక్తజనం పులకించారు. కోలాట నృత్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, పంచ వాయిద్యాలతో నగరోత్సవం కోలాహలంగా సాగింది. యాగశాల నుంచి ప్రారంభమైన ఈకార్యక్రమం మహా మండపం, కనక దుర్గనగర్, కెనాల్రోడ్డు, వినాయకుడి గుడి, దుర్గాఘాట్, మీదగా ఆలయానికి చేరుకుంది. శ్రీచక్ర సంచారిణే వన్టౌన్ (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ నిత్యం శ్రీచక్రంలోనే సంచారం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయ కారిణి, లోకమాతగా పేర్కొనే జగన్మాత నిత్యం కొలు ఉండే పవిత్ర స్థలమే శ్రీచక్రమే. ఈ శ్రీచక్రానికి అధిష్టాన దేవత శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి. అయితే లలితాదేవే దుర్గమ్మ, ఈ దుర్గమ్మే లలితాదేవని, రెండిటికీ బేధం లేదని పండితులు చెబుతారు. పూర్వం ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినీగా ఉగ్రరూపంలో దర్శనమిచ్చే దుర్గమ్మను శంకరాచార్యులవారు దర్శించారు. ఆమెను శాంతపరిచేందుకు శ్రీచక్రాన్ని దుర్గమ్మ సన్నిధిలో ప్రతిష్టించారు. అమ్మవారికి నిర్వహించే పూజలన్నీ శ్రీచక్రానికే నిర్వహించాలని సూచించారు. అప్పటి నుంచి అమ్మవారి సన్నిధిలో పూజలన్నీ శ్రీచక్రానికే నిర్వహిస్తున్నారు. లోకపావని కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీచక్ర నవావరణార్చన నిత్యం అత్యంత వైభవంగా జరుగుతోంది. లలితా త్రిపురసుందరీ దేవికి సాక్షాత్తూ లక్ష్మీ, సరస్వతులే వింజామరులు విసురుతూ సేవలందిస్తుంటారు. అత్యంత మహిమాన్వితమైన శ్రీచక్రం రెండు విధాలుగా మనకు కనిపిస్తుంది. మొదటిది భూప్రస్తరం. ఇది యంత్ర రూపంలో ఒక రాగి లేక వెండి రేకు మీద రేఖలతో చెక్కించబడి ఉంటుంది. రెండోది మేరు ప్రస్తరం. ఇది శ్రీచక్రంలోని బిందు త్రికోణాది రేఖలు, వృత్తాలు, దళాలు పైకి శిఖరంలాగా కనిపించేలా పోతపోయబడి ఉంటుంది. ఈ మేరు ప్రస్తరం శ్రీ చక్రం నవావరణార్చన జరపటానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో లక్ష కుంకుమార్చన జరిగే అమ్మవారి దగ్గర, నిత్యపూజల అమ్మవారి దగ్గర, నవావరణార్చన దగ్గర మేరు ప్రస్తమైన శ్రీచక్రాల్నే ప్రతిష్టించడం జరిగింది. వాటికే అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. సాధారణ పూజలకు భిన్నంగా శ్రీచక్ర నవావరణార్చన జరగడం విశేషం. శక్తి ప్రధానమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం దినదిన ప్రవర్ధమానమై లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షించటానికి కారణం ఇక్కడ నిరంతరం శ్రీచక్రానికి జరుపబడే పూజలే. అందుకే అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా శ్రీచక్రానికి నిత్యం శాస్త్రోక్తంగా పూజలను నిర్వహిస్తారు. ఈ పూజల నిమిత్తం దేవస్ధానం ప్రత్యేకంగా ఒక అర్చకుడిని సైతం నియమించింది. అనుకున్న కొర్కెలు తీరటం కోసం, ఐశ్వర్య ప్రాప్తికోసం, వ్యాపారాభివృద్ధి కోసం, సమస్త శుభాలు జరగటం కోసం ఈ అర్చనను అందరూ జరిపించుకుంటారు. దుర్గమ్మ సేవలో పీవీపీ ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ సీపీ నాయకులు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) బుధవారం అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పీవీపీని ఆలయ ఈవో ఎంవీ. సురేష్బాబు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న పీవీపీకి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. ప్రముఖుల రాక దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ విశ్వజిత్, ఆలయ పూర్వ ఈవో, సివిల్ çసప్లయిస్ ఎండీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, మీడియా పాయింట్లో మాట్లాడారు. దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ విశ్వజిత్, ఆలయ పూర్వ ఈవో, సివిల్ çసప్లయిస్ ఎండీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, మీడియా పాయింట్లో మాట్లాడారు. నాల్గో రోజు ఆదాయం రూ. 35.56 లక్షలు దసరా ఉత్సవాలలో నాల్గో రోజున దేవస్థానానికి రూ. 35.56 లక్షల మేర ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ. 12.75 లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ. 7.10 లక్షలు, వీఐపీ టికెట్ల దర్శనం రూ. 1.62 లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం రూ. 8.40 లక్షలు, లక్ష కుంకుమార్చన టికెట్ల విక్రయం ద్వారా రూ. 66 వేల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడో రోజున దేవస్థానానికి మొత్తంగా రూ. 32.90 లక్షల మేర ఆదాయం సమకూరింది. గత ఏడాది దసరా ఉత్సవాలలో మూడో రోజున దేవస్థానానికి రూ. 42.97 లక్షల మేర ఆదాయం సమకూరగా, ఈ ఏడాది సుమారు రూ. 10 లక్షల మేర ఆదాయం తగ్గింది. –ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) నేటి అలంకారంశ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఐదో రోజు గురువారం అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా అలంకరిస్తారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్నలను చిందిస్తూ, చెరుకు గడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు. -
భక్తజనకీలాద్రి.. నవరాత్రుల శోభ
దిగువన కృష్ణమ్మ పరవళ్లు.. ఎగువన దుర్గమ్మ దీవెనలు.. కొండంతా సంబరమే.. అల కైలాసం ఇల దిగినంత వైభోగమే.. జగన్మాత కనక దుర్గమ్మ స్వర్ణరూప ధారిణిగా సాక్షాత్కరించిన వేళ.. దేదీప్యమానమైన ఇంద్రకీలాద్రి భక్తకోటితో మరింత తేజోమయమైంది. నవరాత్రుల శోభ విజయవాడ నలుదిశలా పండువెన్నెలలా ప్రకాశించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్బాబు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆది దంపతుల నగరోత్సవం కనులపండువగా సాగింది. ఇంద్రకీలాద్రి / విజయవాడ పశ్చిమ: ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారి సన్నిధికి తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తజనకీలాద్రిగా మారింది. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్బాబు దంపతులు, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఫెస్టివల్ ఆఫీసర్ రామచంద్రరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు అమ్మవారి తొలి దర్శనం చేసుకొని తరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తరలించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించారు. ఆలయ ఈవో, సీపీ దంపతులు ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిటకిటలాడిన క్యూలైన్లు దసరా ఉత్సవాల తొలి రోజు, ఆదివారం కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో వేచిఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మల్లేశ్వరాలయం, మహా మండపం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకున్నారు. లక్ష కుంకుమార్చన, శత చండీ హోమం మహామండపం ఆరో అంతస్తులో లక్ష కుంకుమార్చన, యాగశాలలో శత చండీహోమం నిర్వహించారు. పలువురు ఉభయదాతలు, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విశేష అర్చనలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సేవలో పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఐ.సీతారామమూర్తి, జస్టిస్ జి.శ్యామ్ప్రసాద్, గుంటూరు జిల్లా జడ్జి జస్టిస్ కె.వాసంతి, దేవదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ దంపతులు, మంత్రి మోపిదేవి వెంకటరమణ దంపతులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ‘దసరా’లో ప్రత్యేక పూజలు ఇవే.. ఇంద్రకీలాద్రి: దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఉత్సవాలు జరిగే పది రోజులు లక్ష కుంకుమార్చన, ఛండీయాగం నిర్వహిస్తారు. మహా మండపం ఆరో అంతస్తులో రెండు షిప్టుల్లో లక్ష కుంకుమార్చన జరుగుతుండగా, మొదటి షిప్టులో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రెండో షిప్టులో 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. మల్లేశ్వరాలయానికి చేరుకునే మార్గంలోని యాగశాలలో ప్రతి రోజు 9 గంటల నుంచి ఛండీయాగం నిర్వహిస్తారు. ప్రతి నిత్యం జరిగే శ్రీచక్రనవార్చన దసరా ఉత్సవాల్లో యథావిధిగా జరిగినా భక్తులు పాల్గొనే అవకాశం లేదు. ఉత్సవాల పది రోజులు ప్రత్యేకంగా మహా మండపం ఆరో అంతస్తులో సూర్య నమస్కారాలు, బాలా, సుహాసిని పూజలు జరుగుతాయి. మనోహరం.. కళార్చనం విజయవాడ : వికారినామ దసరా మహోత్సవాల్లో భాగంగా దేవదాయ శాఖ, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మల్లికార్జున మహామండపంలో ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై ఆదివారం ఉదయం 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తిరంజనిలో భాగంగా అమృత, నవ్య సిస్టర్స్, పి.ప్రమీల తదితరులు భక్తి గీతాలు, కీర్తనలను ఆలపించారు. దుర్గమ్మకు నృత్య హారతి నృత్య కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులు భారతీయ నృత్య రీతులను ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ అంశాలను కళాకారులు మనోహరంగా అభినయించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి. నాట్యాచార్యులు మునిపల్లి నాగమల్లి, సప్పా శివకుమార్, దావులూరి అపర్ణ, ఎం.అనూషా నాయుడు తదితర బృందాలు అన్నమయ్య కీర్తనలు, జయదేవుని అష్టపదులు, రామదాసు కీర్తనలకు నృత్యాలను అభినయించాయి. నిర్వాహకులు కళాకారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. నేటి కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు భక్తిరంజని, శాస్త్రీయ సంగీతం, వయోలిన్, మృద ంగం కార్యక్రమాలు సాగుతాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు కూచిపూడి, భరతనాట్యం అంశాలను ప్రదర్శిస్తారు. -
'ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం'
సాక్షి, విజయవాడ: ఈనెల 29 నుంచి వచ్చే నెల 8 వరకు జరిగే ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. దుర్గమాత పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. రేపు నిర్వహించే స్వప్నాభిషేకం అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు ప్రతీ రోజు ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే మొత్తం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 7 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దసరా ఉత్సవాలలో భక్తులకు అమ్మవారి దర్శనార్థం ఆర్జిత సేవలను నిలుపు చేసింది. అదేవిధంగా కుంకుమార్చనకు ప్రత్యేక సమయం, స్థలం కేటాయించారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన 29వ తేదీ ఆదివారం కావడంతో అమ్మవారు శ్రీ స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా రెండో రోజు(30న) శ్రీ బాలత్రిపురసుందరీ దేవిగా, మూడవ రోజు (అక్టోబర్ 1) శ్రీగాయత్రీ దేవిగా, 4వ రోజు శ్రీఅన్నపూర్ణాదేవిగా, 5వ రోజు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా, 6వ రోజు శ్రీమహాలక్ష్మి దేవిగా, 7వ రోజు శ్రీసరస్వతీ దేవిగా, 8వ రోజు శ్రీదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అలానే నవరాత్రి రోజు అమ్మవారు శ్రీమహిషాసుర మర్ధినీ దేవిగా కనిపించనున్నారు. ఉత్సవాల ఆఖరి రోజున (అక్టోబర్ 8) అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్నారు. అదేరోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందుకు అనుగుణంగానే భారీ సంఖ్యలో పోలీసులను మొహరించి పటిష్ట బందోబస్తుకు ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది విధుల్లో మొత్తం 5500 పోలీసులు, 1200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 350 మంది సెక్యూరిటి సిబ్బంది, 900 మందికి పైగా వలంటీర్లు పాల్గొననున్నారు. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపేందుకు సమీపంలోని 12 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. -
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే వేడుకలకు రాష్ట్ర నలుమూల నుంచి గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు దర్శనంఉత్సవాలలో భాగంగా తొలి రోజైన 29వ తేదీ ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాలలో తొలి రోజు ఆదివారం కావడంతో అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక కుంకుమార్చన, విశేష ఛండీయాగాలు ప్రారంభం అవుతాయి. ఆదివారం ఉత్సవాలలో తొలి రోజు కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తులు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ప్రారంభయ్యే క్యూలైన్లను టోల్గేటు వద్ద మొయిన్ క్యూలైన్లో కలుపుతారు. కొండపై భాగంలో క్యూలైన్లు దాదాపు పూర్తి కాగా, కొండ దిగువన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దుర్గాఘాట్, దర్గా, రథం సెంటర్లో క్యూలైన్లు పనులు పూర్తి కావాల్సి ఉంది. మరో వైపున ఉత్సవాలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఆదివారం నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఉత్సవాల నాటికి రెండు లక్షల లడ్డూలు సిద్ధం దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ప్రసాదాలు అందేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొండ దిగువన ఉన్న లడ్డూ తయారీ కేంద్రంలో రోజుకు లక్ష లడ్డూలను తయారు చేసే విధంగా సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉత్సవాలు ప్రారంభం అయ్యే నాటికి రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపున కొండపైన పాత వేద పాఠశాలలో పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మేరకు పులిహోర తయారు చేస్తామని, ప్రతి రోజు 10 నుంచి 15 క్వింటాళ్లకు పైగా పులిహోర ప్రసాదం తయారు చేసే విధంగా సిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు వివరిస్తున్నారు. ప్రసాదాల విక్రయాల కోసం దేవస్థానం కనకదుర్గనగర్లో ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు. అర్జున వీధిలో అన్నదానం.. దసరా ఉత్సవాలలో నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్జున వీధిలో దేవస్థానం నిర్మించిన షెడ్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక మూలా నక్షత్రం, విజయదశమి రోజున భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాద వితరణ చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మెట్ల మార్గంలో హోమగుండం దసరా ఉత్సవాల పది రోజులు భక్తులు అమ్మవారి దీక్షను స్వీకరించడం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని మెట్ల మార్గం దిగువన దేవస్థానం హోమ గుండాన్ని ఏర్పాటు చేసింది. హోమ గుండం సమీపంలోనే ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది దసరా ఉత్సవాల చివరి రెండు రోజులలో సుమారు 2 లక్షలు పైగా భవానీలు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ దఫా కూడా ఇదే తరహాలో భవానీలు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఇన్చార్జి మంత్రితో పాటు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్లు పరిశీలించారు. తొలుత కెనాల్రోడ్డులో ఏర్పాటు చేసిన క్యూలైన్లు.. తర్వాత సీతమ్మ వారి పాదాల వద్ద కేశఖండన శాలను పరిశీలించారు. ఉత్సవ ఏర్పాట్ల గురించి దేవస్థాన ఈవో ఎంవీ సురేష్బాబు, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు 15 నుంచి 18 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, ఆ రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. 5న సీఎం పట్టువస్త్రాల సమర్పణ.. కన్నబాబు మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన సీఎం జగన్మోహన్రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాల సందర్భంగా గతంలో ఎదురైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని మరింత సమర్థంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవాలలో దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలను వినియోగిస్తున్నామన్నారు. తుది దశకు పనులు.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులకు అమ్మవారి దర్శనం త్వరతిగతిన పూర్త అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యటనలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ సీహెచ్, విజయరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి తదితరులు ఉన్నారు. సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులు, యాత్రికుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపడుతున్నామని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ.. వీఐపీల రాక కారణంగా వారు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 4,500 మంది అధికారులు, సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయవాడ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు..అంచనా 16 లక్షల మంది..ఈ ఏడాది జరిగే దసరా ఉత్సవాలకు సుమారు 16 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు సీపీ చెప్పారు. సాధారణ రోజుల్లో 50వేల నుంచి లక్ష మంది వరకు, మూలా నక్షత్రం రోజున 2.5లక్షల మంది వస్తారని.. ప్రారంభోత్సవం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయన్నారు. తెప్పోత్సవం సందర్భంగా కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంటారని భావిస్తున్నామని.. దీంతో అదే స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 25 సెక్టార్లుగా విభజన.. ఈ ఏడాది బందోబస్తును 25 సెక్టార్లుగా విభజించి, కమిషనరేట్ పరిధిలోని 2వేల మంది సిబ్బందితోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే మరో 2,500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు. వీరితోపాటు 35 సాయుధ పోలీసు ప్లటూన్లను వినియోగిస్తున్నామన్నారు. ఎక్కువ మందిని ఆలయం, దుర్గా ఘాట్, పరిసర ప్రాంతాల్లో మోహరించామని.. మిగిలిన వారిని ట్రాఫిక్, కీలకమైన చోట్ల ఉంచుతామని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఈసారి ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను వినియోగిస్తున్నామని.. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. సీసీ కెమెరాలతో పాటు, మఫ్తీలో పోలీసు సిబ్బంది గమనిస్తుంటారని.. చోరీలు, వంటి వాటిని అరికట్టే లక్ష్యంతో వీరు పనిచేస్తారని తెలిపారు. çకంట్రోల్ రూమ్ల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ఒకటో పట్టణ స్టేషన్, నగర పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని.. 24 గంటల పాటు ఇక్కడ సిబ్బంది పరిశీలిస్తుంటారని పేర్కొన్నారు. వర్షాలు పడుతున్నందున విధుల్లో ఉన్న సిబ్బందికి రెయిన్ కోట్లు కూడా ఇస్తున్నామన్నారు. భవానీ సేవాదళ్ ఆసరా గత ఏడాది మాదిరిగానే ఈసారి భవానీ సేవాదళ్ సిబ్బంది ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు సాయం అందిస్తారని చెప్పారు. మొత్తం 120 మంది విధుల్లో ఉంటారని.. ప్రతి షిఫ్ట్లో 40 మంది పనిచేస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలు.. ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం నగరంలో ఏడు చోట్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో రద్దీ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చని తెలిపారు. పరిస్థితిని బట్టి దర్శనానికి వెళ్లొచ్చని. వన్టౌన్, భవానీపురం, పోలీసు కంట్రోల్ రూమ్, పోలీసు కమిషనర్ కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, కమాండ్ కంట్రోల్ కేంద్రం, పండిట్ నెహ్రూ బస్స్టేషన్, రైల్వేస్టేషన్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు. వీఐపీల దర్శనానికి ప్రత్యేక సమయాలు.. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వీఐపీలు కూడా రానున్నారన్నారు. దీని వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రముఖులకు నాలుగు సమయాల్లో ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వీఐపీలు కచ్చితంగా ఆ సమయాలలోనే రావాల్సి ఉంటుందన్నారు. ఉదయం 7 నుంచి 8, 11 నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి 4, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతించే ఆలోచన ఉందని చెప్పారు. పార్కింగ్కు ప్రత్యేక యాప్.. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం సమీపంలో పలుచోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. దాదాపు 12 చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపేందుకు ఆస్కారం ఉదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా పార్కింగ్ యాప్ను రూపొందించామని.. మొబైల్లోనే తమ సమీపంలోని పార్కింగ్ ప్రాంతాలను చూసుకునే అవకాశంతోపాటు అక్కడ ఎంత జాగా ఉందో కూడా తెలుసుకోవచ్చన్నారు. -
5న దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు
దసరా సంబరానికి ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, దేవస్థానం అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, విజయవాడ: ఏటా ఆశ్వీయుజ మాసంలో 10 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కనకదుర్గ అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానున్నారు. దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో అధికార యంత్రాంగం, దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పిస్తారు. మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. అందువల్ల ఆ రోజు వీఐపీల దర్శనం రద్దు చేశారు. అన్ని క్యూలైన్లను సర్వదర్శనంగా పరిగణిస్తారు. రాష్ట్ర పండుగ కావడంతో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, అగ్నిమాపక, విపత్తుల నివారణ, దేవదాయ, మత్స్య, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అక్టోబర్ 8న దుర్గమ్మ నదీవిహారం విజయదశమి రోజు అక్టోబర్ 8న అమ్మవారి తెప్పోత్సవం కృష్ణానదిలో కనుల పండువగా జరుగుతుంది. హంస వాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లు వేద మంత్రాలు, అర్చకుల ప్రత్యేక పూజల మధ్య నదీ విహారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన, విశేష చండీహోమం నిర్వహిస్తారు. అలాగే నిత్యం నగరోత్సవం నిర్వహిస్తారు. అర్జున వీధిలోని దేవస్థానం అన్నదాన సత్రంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచిత అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించవచ్చు. -
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి పండుగ శోభను తరించుకుంది. జగతిని కాచే తల్లి మహోత్సవానికి వేళయింది. ఆదివారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దుర్గగుడి కళకళలాడుతోంది. కూరగాయలు.. ఆకుకూరలు.. ఫలాలతో దుర్గమ్మ సర్వాంగసుందరంగా అలలారుతోంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాదిలాగానే తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు సుమారు 200మందితో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ దుర్గమ్మకు బోనం సమర్పించేందుకు వచ్చినవారికి దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అంతకు ముందు బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, మంగలవాద్యాల నడుమ ఊరేగింపు అమ్మవారి ఆలయానికి చేరింది. మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారి అలంకరణకు ఆకుకూరలు వినియోగించారు. రెండోరోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడోరోజు అయిన మంగళవారం బాదం. జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్తో అలకరించనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తాయి. కాగా మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి దర్శానాన్ని నిలిపివేస్తారు. కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడురోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకుకూరలను దండగలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరిదేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాదిలానే తెలంగాణా నుంచి అమ్మ వారికి బోనాలను సమర్పించేందుకు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం ఇంద్రకీలాద్రికి విచ్చేయనుంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మ వారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్త బృందాలు అమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఉత్సవాలు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తాయి. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు అమ్మ వారి దర్శనాన్ని నిలిపివేస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు అమ్మ వారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాలను, మూలవిరాట్లకు కాయగూరలు, పండ్లు, డ్రైప్రూట్స్తో అలంకరిస్తారు. ఆలయాలను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించేందుకు అవసరమైన కూరగాయల దండలను సేవా సిబ్బంది, భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపుగా బోనాలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనాలను సమర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది. కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ అమ్మ వారి అలంకరణకు తొలి రోజైన ఆదివారం ఆకుకూరలను వినియోగిస్తారు. రెండో రోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడో రోజైన మంగళవారం బాదం, జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ప్రూట్స్తో అలంకరిస్తారు. అమ్మ వారి అలంకరణకు ఉపయోగించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడు రోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకూకూరలను దండలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తుంటారు. దేవస్థానం కదంబం ప్రసాదాన్ని అమ్మ వారి మహా ప్రసాదంగా భక్తులకు వితరణ జరుగుతుంది. దేవస్థాన ఉచిత ప్రసాదాల కౌంటర్లో కదంబం ప్రసాదాన్ని వితరణ చేస్తారు. నేడు లక్ష మంది దర్శనం ఒక వైపు శాకంబరిదేవి ఉత్సవాలు, మరో వైపున తెలంగాణా నుంచి బోనాలు, ఆదివారం, ఆషాఢ సారెను సమర్పించేందుకు తరలివచ్చే భక్త బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ నెలకొంది. ఒకే రోజు మూడు విశేషమైన ఉత్సవాలు జరుగుతుండటంతో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష పైబడి భక్తులు అమ్మ వారి దర్శనానికి విచ్చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మ వారి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి. మరో వైపున ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాలను దేవస్థాన కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
కనకదుర్గమ్మను దర్శించుకున్న మోహన్ భగవత్
విజయవాడ: నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఆరెస్సెస్స్ ఛీఫ్ మోహన్ భగవత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు ఈవో కోటేశ్వరమ్మ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, అమ్మవారి చీర ప్రసాదం, చిత్రపటం మోహన్ భగవత్కు అందచేశారు. విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోహన్ భగవత్ విజయవాడకి వచ్చారు. -
దుర్గగుడి పాలకమండలి సభ్యుల రాజీనామా
ఇంద్రకీలాద్రి(విజయవాడ): దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్, పాలకవర్గ సభ్యులు తమ పదవులకు శుక్రవారం రాజీనామాలు చేశారు. జూన్ నెలాఖరు వరకు ట్రస్టు బోర్డు పదవీ కాలం ఉన్నప్పటికీ, ఎన్నికలలో టీడీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడంతో ట్రస్టు బోర్డు సభ్యులు నెల రోజులు ముందుగానే రాజీనామాలు చేశారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని చైర్మన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చెందడంతో ఇక పాలక మండలిలో కొనసాగలేమనే అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. పదవీ కాలం కంటే ముందుగానే రాజీనామాలు చేస్తే కాస్త గౌరవంగా ఉంటుందని మెజారిటీ సభ్యులు చెప్పడంతో సభ్యులందరూ రాజీనామాలకు అంగీకరించారు. సభ్యులందరూ ఒకేసారి రాజీనామాలు చేసి చైర్మన్ గౌరంగబాబుకు అందచేశారు. చైర్మన్ తాను కూడా రాజీనామా చేసి సభ్యుల రాజీనామా పత్రాలతో కలిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు మరో ఏడాది పొడిగింపునకు యత్నం... వాస్తవానికి ఎన్నికల ముందు ట్రస్టు బోర్డును మరో ఏడాది పాటు పొడిగించేలా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. జిల్లా మంత్రితో పాటు ఎంపీల సహకారంతో పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేలా పాలక మండలి సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించే క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ నగారా మోగింది. దీంతో ఆ ప్రయత్నాలకు గండి పడింది. తెలుగుదేశం ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని, తమ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశాలున్నాయని సభ్యులు బహిరంగం గానే ప్రకటించేవారు. అయితే తమ ఊహలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు రావడం, వైఎస్సార్ సీపీ తిరుగులేని మెజారిటీ సాధించడంతో పాలక మండలి సభ్యుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. చివరకు నెల రోజులు ముందుగానే పాలక మండలి సభ్యులు, చైర్మన్ తమ పదవులకు రాజీనామాలు చేసే పరిస్థితి ఏర్పడింది. తొలి నుంచి వివాదాలే... దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యుల తీరు తొలి నుంచి వివాదాలే... కేశ ఖండన శాలలో క్షురకులతో వివాదం, అమ్మవారి చీర మాయం, ఆలయ అభివృద్ధి విషయంలో కాకుండా ఆలయ వ్యవహారాలు, పరిపాలనలో జోక్యం, దసరా ఉత్సవాలలో హడావుడి, ఎన్ఎంఆర్లకు హెచ్ఆర్ఏడీఏ అమలు చేసేశామని ముందే ప్రచారం చేసుకోవడం వంటి అంశాలతో పాటు ట్రస్టు బోర్డు సమావేశ విషయాలను ఆలయ ఈవోలకు చేరవేయడంతో ట్రస్టు బోర్డు తరుచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. వాస్తవానికి ట్రస్టు బోర్డు సభ్యులు భక్తులకు ఎటువంటి సదుపాయాలు కల్పించాలనే విషయాలపై దృష్టి పెట్టింది లేదు. -
దుర్గాఘాట్లో ప్రైవేటు దర్జా
సాక్షి, విజయవాడ: పవిత్ర కృష్ణానదీ తీరంలోని ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న దుర్గాఘాట్లో ప్రైవేటు వ్యక్తులకు ఆదాయ వనరుగా మారింది. నిర్వహణ వ్యయం దుర్గగుడి భరిస్తుండగా గత కొన్నేళ్లుగా జలవనరుల శాఖ ముసుగులో ప్రైవేటు వ్యక్తులు బోటింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అన్నీ తెలిసినా ప్రభుత్వ పెద్దలు మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. వందల ఏళ్లుగా దుర్గగుడి అధీనంలో ఉన్న దుర్గాఘాట్లో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015లో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించే సమయంలో ఈ ఘాట్ను జలవనరులశాఖ స్వాధీనం చేసుకుంది. పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దుర్గాఘాట్ను రివర్ ఫ్రంట్గా మార్చేసింది. ప్రస్తుతం ఈ ఘాట్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని దుర్గగుడి భరిస్తుండగా.. ఘాట్పై ఇరిగేషన్ శాఖ ముసుగులో ప్రైవేటు బోటింగ్ ఆపరేటర్లు పెత్తనం సాగిస్తున్నారు. దుర్గాఘాట్లో దేవస్థానానికి చెందిన కేశఖండనశాల ఉండేది. దీన్ని 25ఏళ్ల కిందట సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించారు. భక్తులు ఇక్కడ తలనీలాల మొక్కు చెల్లించి కృష్ణానదిలో పవిత్రస్నానం చేసిన తరువాత అమ్మవార్ని దర్శనం చేసుకునేవారు. ప్రభుత్వం కృష్ణానదీ తీరంలో 40 దేవాలయాలను కూల్చివేసినప్పుడే దీన్నీ కూల్చివేసింది. ఘాట్లోని మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, రూమ్ను, పిండప్రదానాల షెడ్లనూ తొలగించింది. దీంతో భక్తులకు కనీస సౌకర్యాలు లేక అగచాట్లు పడుతున్నారు. కనీసం షెల్టర్స్ లేకపోవడంతో ఘాట్లోనే మహిళలు కళ్లు తిరిగిపడిపోతున్నారు. నదిలో స్నానం చేసిన తరువాత దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యాలు లేకపోయినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రైవేటు బోటింగ్ ఆపరేటర్లు ఆక్రమించుకుని యథేచ్ఛగా తమ బోటింగ్ పార్కింగ్లను ఏర్పాటు చేసుకుని భక్తుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు. ఖర్చులు మాత్రం దుర్గగుడి ఖాతాలోనే... దుర్గాఘాట్లో మూడు షిప్టులలో క్లీనింగ్ చేయిస్తున్నారు. ఘాట్లో అత్యంత ఖరీదైన సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వీటి అంతటికి ఏడాదికి రూ.15లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చంతా దుర్గగుడి ఖాతా నుంచే చెల్లించమని ప్రభుత్వం ఆదేశించింది. దుర్గా ఘాట్ను తమకు అప్పగిస్తే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. దుర్గగుడికి కోనేరు లేనందున దుర్గాఘాట్నే కోనేరుగా అభివృద్ధి చేస్తే కోనేరు లోటు తీరుతుందని అంటున్నారు. మంత్రి ఉమాకి అంతా ఎరుకే.... దుర్గగుడిలో జరిగే ప్రతి విషయం జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి వెళుతుంది. ఆయన కనుసన్నల్లోనే దుర్గాఘాట్ను జలవనరులశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కృష్ణానదిలో స్నానాలు చేసే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు తెలుసు. ఆయనతోపాటు స్థానికంగా ఉన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు ఘాట్ను దుర్గగుడికి అప్పగించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు బోటింగ్ ఆపరేటర్లతోపాటు వ్యాపారస్తుల నుంచి ప్రతినెలా వచ్చే వాటాలు కోల్పోవాల్సి వస్తుందనే ఘాట్ను జలవనరులశాఖ ఆధీనంలో ఉంచుకున్నారని పేర్కొంటున్నారు. -
భారీ వర్షం : తడిసిముద్దయిన దుర్గమ్మ భక్తులు
సాక్షి, విజయవాడ : భారీ వర్షంతో విజయవాడ నగరం తడిసి ముద్దయింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.కొండపైకి మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్ల లో వున్న భక్తుకు తడిసిపోయారు. కొండ పైన భారీవర్షం ఒక్కసారిగా కురవడంతో అధికారులు సైతం కంగారు పడ్డారు. చిన్నపిల్లలు, వృద్దులతో కొండపైకి వచ్చిన భక్తులు పూర్తిగా తడిచిపోయారు. అరగంట పాటు కురిసిన వర్షం తరువాత తెరపి ఇవ్వడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం ఇదే విధంగా కొనసాగితే విద్యుత్ సరఫరాను వర్షం తగ్గే వరకు నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడేదని అధికారుల ఆందోళన వ్యక్తం చేశారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
చిక్కులు తొలగించి శక్తిని ఇవ్వు
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి. అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించిన ట్లుగా, సనాతన సంప్రదాయం, శృంగేరి పీఠాధిపతి, శ్రీవిద్యోపాసకులు నిర్ణయించిన విధంగా అలంకరిస్తారు. స్వర్ణకవచాలంకృత కనకదుర్గ, బాలాత్రిపురసుందరి, గాయత్రీ, లలితా త్రిపురసుందరి, సరస్వతి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, దుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అలంకారాల్లో కన్నులపండువగా దర్శనమిస్తుంది. దసరాల్లో పది అలంకారాల్లో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి, సుఖశాంతులతో జీవిస్తారని భక్తుల విశ్వాసం. ఒకప్పుడు అమ్మవారిని అలంకరించే ఆయుధాలు, వస్తు, వాహనాలను తయారు చేయడానికి చెక్కసామగ్రిని; ఆభరణాలుగా సాధారణ దండలను ఉపయోగించేవారు. దాతలు, భక్తుల సంఖ్య పెరిగి దేవస్థానం ఆదాయం పెరగడంతో, బంగారు ఆయుధాలు, వజ్రాలు, రత్నాలు పొదిగిన సామగ్రిని వినియోగిస్తున్నారు. గజమాలలు, ఐదారు రకాల పట్టు చీరలు, బంగారు ఆభరణాలతో అలంకరిస్తున్నారు. ఆలయంలోనే మూల విరాట్టుకు అలంకరణ... దసరా ఉత్సవాల్లో మూల విరాట్టును అలంకరించడం మన దేశంలో కేవలం ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గగుడిలోనే మాత్రమే కనపడుతుంది. నిత్యం వేద మంత్రోచార్చరణల మధ్య పూజలు, ధూపదీపనైవేద్యాలు అందుకునే మూలవిరాట్టును వివిధ అలంకారాల్లో దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని వేదపండితుల అభిప్రాయం. – ఉప్పులూరు శ్యామ్ ప్రకాష్/సుభానీ సాక్షి, ఇంద్రకీలాద్రి, విజయవాడ అమ్మవారి దీక్షలోనే... తల్లికి ఒక బిడ్డ సేవ చేసే విధంగా మేము దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం. ఏ విధంగా అలంకరిస్తే అమ్మవారు నిండుగా కనిపిస్తుందో ముందే ఊహించుకుని దానికి తగ్గట్లుగా అలంకరిస్తాం. నేను ఐదు దశాబ్దాలుగా దసరా ఉత్సవాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వందల సంవత్సరాలుగా జరుగుతున్నాయి.అమ్మవారిని వివిధ రూపాలుగా అలకరించడంలో ‘లింగభొట్ల’ వంశీకులదీ అందెవేసిన చెయ్యి. ఆ వంశంలో నేను పదిహేడవ తరం వాడిని. మా కుటుంబసభ్యులమంతా పది రోజులూ అమ్మవారి దీక్ష చేపడతాం. ఇంట్లో కూడా నిత్యం అమ్మవారి ప్రతిరూపాలుగా చిన్నారి బాలికలకు, సువాసినులకు పూజలు నిర్వహిస్తాం. ఏకభుక్తం, బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తాం. అమ్మవారిని అలంకరిస్తున్నంతసేపు ఆ తల్లి మీదే మనసు లగ్నం చేసి ఆవిడ నామాన్ని జపిస్తూంటాం. దశాబ్దం క్రితం దసరాల్లో ఒకరోజు తెల్లవారుజామున అమ్మవారి అలంకరణకు బయలుదేరాం. అలంకరణ సామగ్రి కోసం ఎంత వెతికినా కనపడలేదు. ఎక్కడ పెట్టామో తెలియదు. తెల్లవారేలోపు అలంకరణ పూర్తి కాకపోతే భక్తులకు దర్శనం ఆలస్యం అవుతుంది. అమ్మవారి పైనే భారం వేసి అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఇతర వస్తువులతో అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాం. ఆశ్చర్యం.. ఆరోజు అమ్మవారికి అలంకరించాల్సిన సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. ఇది అమ్మవారి మహిమేనని భావించి, ఆ తల్లికి సాష్టాంగపడి, అలంకరణ పూర్తి చేశాం. – బదరీనాథ్ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, విజయవాడ -
కనకదుర్గమ్మ ఆలయంలో వెలుగులోకి మరో వివాదం
-
కనకదుర్గమ్మ గుడిలో మరో వివాదం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇటీవల అమ్మవారికి అలంకరించిన ఖరీదైన చీర గల్లంతయింది. ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు మహామంటపంలో అమ్మవారికి ఈ చీరను సమర్పించారు. ఈ చీర విలువ రూ. 18వేలు. ఉత్సవ విగ్రహానికి అలంకరించిన కొద్దిసేపటికే చీర కనిపించకుండా పోయింది. అమ్మవారికి ఎంతో భక్తితో సమర్పించిన చీరను.. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలికి ఇచ్చారని భక్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవారికి సమర్పించిన చీర మాయం కావడంతో ఆలయ సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ దృశ్యాలను ఆలయ అధికారులు పరిశీలిస్తున్నారు. చీర ఎలా గల్లంతయిందీ.. ఆరా తీస్తున్నారు. -
సరస్వతి అవతారంలో కనకదుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహామంటపంలో విద్యార్ధుల కోసం విజయీభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న విద్యార్ధులకు శక్తి కంకణాలతోపాటు పెన్ను, అమ్మవారి చిత్రపటం, కంకుమ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. -
తాంత్రిక పూజలు: ఈవోపై వేటు..
-
తాంత్రిక పూజలు: ఈవోపై వేటు.. సీఎం స్పందన!
సాక్షి, విజయవాడ: దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. అనధికార వ్యక్తులు గుడిలో ప్రవేశించినట్టు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్వవహరించారని, ఈ ఘటనపై లోతుగా విచారణ జరుగుతోందని చెప్పారు. జరిగిన తప్పిదానికి ఈవో బదిలీ చేశామన్నారు. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఈవోపై వేటు! మరోవైపు దుర్గగుడి తాంత్రిక పూజల వివాదంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. దుర్గమ్మ గుడిలో అపచారం జరిగినమాట నిజమేనని ..ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంలో నిజనిర్ధారణ కమిటీతో పాటు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన వెనక ఉన్నది ఈవో సూర్యకుమారి అంటూ...ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో వెంటనే సూర్యకుమారిని బదిలీ చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఇన్చార్జ్ ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్గా అనురాధకు బాధ్యతలు అప్పగించారు. పెద్దలు ఎవరో తేలాల్సి ఉంది! విజయవాడ దుర్గగుడిలో తాంత్రికపూజలు జరిగాయని రుజువైంది కాబట్టి...ఈ పూజలు చేయించిన పెద్దలు ఎవరో తేలాల్సి ఉందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానదేంద్రస్వామి అన్నారు. అనంతపురంలోని రాంనగర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో ఆయన పాల్గొన్నారు. అసలైన దోషులను వదిలి అర్చకులను వేధించటం సరికాదని... ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాంత్రిక పూజలు జరిగాయో బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాంత్రికపూజలపై దిద్దబాటు జరక్కపోతే రాష్ట్రానికే అరిష్టమని స్వరూపానదేంద్రస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. -
దుర్గగుడిలో తాంత్రిక పూజలు: తెరవెనుక టీడీపీ ఎమ్మెల్సీ!
సాక్షి, విజయవాడ: కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ కోసమే దుర్గగుడిలో బుద్ధా వెంకన్న తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే అమ్మవారి అభరణాలు చోరీకి గురయ్యాయని అన్నారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడారు. గుడి పవిత్రతను టీడీపీ నేతలే దెబ్బతీస్తున్నారని, హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. దుర్గగుడే కాదు.. అన్ని ప్రధాన ఆలయాల సీసీటీవీ దృశ్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాంత్రిక పూజలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అమ్మవారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా దుర్గగుడిలో శాంతిపూజలు జరిపించాలని ప్రభుత్వానికి సూచించారు. పులివెందులలో సీఎం చంద్రబాబు సభ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి చేతిలోని మైక్ లాక్కోవడం దారుణమని మండిపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన తప్పు ఏంటి, నిజాలు మాట్లాడితే తట్టుకోలేరా అని ప్రశ్నించారు. ఒక ఎంపీపై రౌడీషీటర్లతో దాడికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు అన్నారు. -
తాంత్రిక పూజలు ఎవరి కోసం?
పెందుర్తి: కనకదుర్గమ్మ గర్భాలయంలో తాంత్రిక పూజలు ఎవరి కోసం జరిగాయో బహిర్గతం చేయాలని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా క్షుద్ర పూజలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ఘటన దురదృష్టకరమని, దేశానికి అరిష్టమని, భక్తులకు ప్రమాదకరమని స్వరూపానం దేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని శారదా పీఠంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మ సాత్విక శక్తులను అణచివేసేలా.. భయంకరమైన క్షుద్రశక్తులను ఆలయంలోకి రప్పిస్తారా అని స్వరూపానందేంద్ర మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. -
అమ్మవారి పట్ల మహాపచారం
సాక్షి, అమరావతి బ్యూరో: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం మహాపచారానికి ఒడిగట్టింది. వేల ఏళ్లుగా పాటిస్తున స్మార్త వైదిక ఆగమ శాస్త్రాన్ని అపహాస్యం చేసింది. ఆది శంకరాచార్యులు ఏనాడో పరిపుష్టం చేసిన కళాన్యాసాన్ని దెబ్బతీసింది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శాంత స్వరూపిణిగా, శక్తి రూపంగా చేసిన కళాన్యాస కవచాన్ని తొలగించడం ద్వారా ఘోర తప్పిదానికి పాల్పడింది. కేవలం చినబాబు నారా లోకేశ్కు రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే కోట్లాది మంది మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసిందని భక్తులు మండిపడుతున్నా రు. ఆలయంలో తాంత్రిక పూజలు చేసిన సర్కారు దుశ్చర్య పట్ల రాష్ట్రవ్యాప్తంగా స్మార్త వైదిక ఆగమ పండితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాన్యాసం అంటే? కనకదుర్గమ్మ ఉగ్రరూపంలో ఇంద్రకీలాదిపై స్వయంభూగా వెలసింది. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలను తన చల్లని చూపులతో కటాక్షించాలని అమ్మవారిని వేడుకుంటూ మూలవిరాట్ను కళాన్యాసంతో పరిపుష్టం చేశారు. స్మార్త వైదిక ఆగమం ప్రకారం కళాన్యాసంలో 10 విభాగాల కింద మొత్తం 96 కళలు ఉంటాయి. ఈ కళలను అమ్మవారి మూలవిరాట్లో పరిపుష్టం చేసి, కవచం తొడిగారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు మహిమాన్వితమైన ఆ కవచాన్ని కదిపి ఘోర అపరాధానికి పాల్పడ్డారు. -
‘దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు వాస్తవమే’
సాక్షి, విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలపై పాలకమండలి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయంలో అర్థరాత్రి పూజలు జరిగిన విషయం వాస్తవమేనని పాలకమండలి పేర్కొంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశామని తెలిపింది. ఇటువంటి ఘటనల వల్ల భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని, ఆలయ ఈవో సూర్యకుమారి తనపై వస్తున్న ఆరోపణలను రూపుమాపుకునేందుకే ఇటువంటి పూజలు నిర్వహించారని పాలకమండలి ఆరోపించింది. ఈవో సూర్యకుమారికి తెలిసే ఇదంతా జరిగిందని, ఆమె చెప్పడం వల్లే పూజలు, అలంకారం చేశామని బయట వ్యక్తులు చెబుతున్నారని వ్యాఖ్యానించింది. గతంలో ఈవో ఘాట్రోడ్లోని పర్ణశాలలో హోమగుండాలు ఏర్పాటు చేసి క్షుద్రపూజలు చేశారని, ఆమె వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉందని పాలకమండలి ఆరోపణలు చేసింది. ఆలయ ప్రతిష్టను ఈవో సూర్యకుమారి దిగజార్చారని, ఆలయంలో అర్థరాత్రి పూజలపై గత నెల 30న జరిగిన సమావేశంలో ప్రశ్నిస్తే ఆమె అన్నీ అబద్ధాలు చెప్పారని, అలాగే టెండర్ల విషయంలోనూ ఈవో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని పాలకమండలి చెప్పుకొచ్చింది. ఈవోపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. బయటి వ్యక్తులు అంతరాలయంలోకి వెళ్లడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు తాంత్రిక పూజల వ్యవహారంపై ఈవో సూర్యకుమారి ప్రెస్మీట్లో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
నా మీద చాలామంది కోపంగా ఉన్నారు..
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ఆమె బుధవారం ప్రెస్మీట్ లో మాట్లాడుతూ.. తాంత్రిక పూజలు అంటే ఏంటో తనకు తెలియదని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు. గత నెల 26వ తేదీ రాత్రి సాధారణంగా చేసే అలంకారమే జరిగిందని, అందుకు సంబంధించిన సామాగ్రిని మాత్రమే లోనికి వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 14మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈవో స్పష్టం చేశారు. బదిలీకి సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆమె తెలిపారు. నా మీద చాలామంది కోపంగా ఉన్నారు.. ‘గుడిలో నా మీద చాలామందికి కోపం ఉంది. పాలకమండలికి, నాకు మధ్య కొంత దూరం ఉంది. పాలకమండలి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ వింగ్ ప్రారంభించాం. గుడిలో వంద గ్రూపులు ఉన్నాయి. నా మీద కొంత ఒత్తిడి వచ్చింది. కానీ నిబంధనల ప్రకారమే పని చేశాం. బయోమెట్రిక్ పెట్టడం, పని సక్రమంగా చేయడం, కొత్త పూజలు ప్రవేశ పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు. హుండీ 20శాతం, టిక్కెట్ ఆదాయం 80శాతం పెరిగింది. సుమారు 130 కోట్ల వరకు డిపాజిట్ లు వున్నాయి. ఒక్క కార్తీకమాసంలో కోటి రూపాయల ఆదాయం పెరిగింది. ఇక గుడిలో పూజలకు సంబంధించి ఎస్పీఎఫ్, దేవాదాయ సిబ్బంది, ఓపిడిఎస్ స్టాఫ్ ను ఆలయ ఈఈ వెంకటేశ్వర రాజు విచారిస్తున్నారు. పాలకమండలి కూడా రెండు రోజుల కిందటే సీసీ టీవీ ఫుటేజీ చూసింది. బయటి వ్యక్తులు ఎలా వచ్చారని పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు.’ అని అన్నారు. కాగా ఈ వివాదం నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సూర్యకుమారి స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్ర మోహన్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. -
బయట వ్యక్తులు అంతరాలయం వద్ద ఉన్నది నిజమే!
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో రహస్యంగా తాంత్రికపూజలు నిర్వహించిన వ్యవహారం వెలుగుచూడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఓ యువనేత పదవి కోసమే ఈ తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు వస్తుండటం రాజకీయ దుమారం రేపుతోంది. గత నెల 26న అర్ధరాత్రి శాంతస్వరూపినిగా ఉన్న దుర్గమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి.. భైరవీ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. భైరవీ పూజలు నిర్వహిస్తే శక్తులు వస్తాయనే నమ్మకముంది. ఈ నేపథ్యంలో భైరవీ పూజలు నిర్వహించి.. అనంతరం మళ్లీ దుర్గామాతగా అలంకారాన్ని మార్చినట్టు సమాచారం. బయట వ్యక్తులు అంతరాలయం వద్ద ఉన్నది వాస్తవమే! దుర్గగుడిలో తాంత్రిక పూజల కేసులో లీగల్ తీసుకొని.. ఆ ప్రకారం నడుచుకుంటామని విజయవాడ వన్టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు పూజారులను విచారించామని తెలిపారు. దుర్గగుడి అంతరాయలం వద్ద బయట వ్యక్తులు ఉన్నది వాస్తవమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ పూజలకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు. దుర్గగుడిలో ఎవరి కోసం పూజలు నిర్వహించారనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్నారు. ఈవో సూచనల మేరకే తాము అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు పూజారులు చెప్తున్నారు. మరోవైపు కిందిస్థాయి పూజారులపై నెపం నెట్టేసి.. ఈ వ్యవహారాన్ని ముగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అధికార పార్టీ నేతల అండ లేనిదే ఆలయంలో ఇంతటి అపచారం జరగదని పరిశీలకులు అంటున్నారు. ఈవోపై వేటు.. ఈ వివాదం నేపథ్యంలో కనకదుర్గ ఆలయం ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్రమోహన్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దుర్గగుడిలో తాంత్రికపూజల పేరిట అర్ధరాత్రి జరిగిన అపచారంపై హిందువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన, రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన దుర్గమ్మ సన్నిధిలో ఇలాంటి అపచారం జరగడమేమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా తాంత్రిక పూజలు నిర్వహించారని, ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకూడదని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంద్రకీలాద్రిలో ముగిసిన దసరా ఉత్సవాలు..
సాక్షి, విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ముగిసాయి. శనివారం అమ్మవారికి పూర్ణాహుతితో అర్చకులు శరన్నవరాత్రి వేడుకలను ముగింపు పలికారు. అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం జరగనుంది. దసరా పండుగ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ దర్శనానికి రెండు కిలోమీటర్లు భక్తులు బారులు తీరారు. మరోపక్క, విజయవాడ దుర్గ గుడికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పీఎన్బీఎస్ బస్టాండ్, కుమ్మరిపాలెం వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. కాలినడక ఎక్కువ కావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల చివరి రోజు కావడంతో వీఐపీలు, భవానీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. -
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు
-
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ: కార్తీక మాస చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలోని దుర్గాఘాట్ కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి కృష్ణానది తీరానికి చేరుకున్నారు. అరటి దొప్పలలో దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. కార్తీకమాసం సందర్భంగా రుద్రయాగం, ప్రత్యేక అభిషేకాలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల అవస్థలు
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కావడంతో పాటు దుర్గమ్మ స్వర్ణ కవచ ధారిణిగా దర్శనమిస్తుండటంతో.. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులతో కిటికిట లాడుతున్న క్యూలైన్లకు పైకప్పులు ఏర్పాటు చేయకపోవడంతో.. ఎండ తీవ్రతకు పలువురు వృద్ధులు స్పృహ తప్పిపడిపోతున్నారు. . భక్తుల కోసం సరైన తాగునీటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అర్ధరాత్రి పోలీసుల అత్యుత్సాహం
భక్తులపై పోలీసుల ప్రతాపం ఎదురు తిరిగిన భక్తులు అడుగడుగునా అంక్షలు.. విజయవాడ (వన్టౌన్/ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో భాగంగా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తే తమపై దౌర్జన్యం ఎమిటని భక్తులు ఎదురుతిరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ‘పోలీసులు డౌన్.. డౌన్..’ అంటూ భక్తులు నినాదాలు చేశారు. శనివారం సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలోనే ఘాట్రోడ్డులోని క్యూలైన్లలోకి చేరారు. గతంలో దర్శనానంతరం భక్తులను మెట్ల మార్గం ద్వారా దిగువకు పంపేవారు. ఈసారి ఘాట్రోడ్డు నుంచే కిందకు పంపడంతో దర్శనం చేసుకుని వెళ్తున్న కొంతమంది కూడా మళ్లీ క్యూలైన్లలో చేరారు. రాత్రి 11.45 గంటలకు ఘాట్రోడ్డులోని క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. సుమారు ఎనిమిది వేల మంది భక్తులు ఉన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు క్యూలైన్లలో ఉన్న భక్తులను ఖాళీ చేయించడం ప్రారంభించారు. భక్తులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు తమ స్టేషన్లో మాదిరిగా మాట్లాడారు. మనస్తాపానికి గురైన పలువురు భక్తులు తాము దొంగలం కాదని అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయన వెంటనే వ్యాన్లు తీసుకొచ్చి అందరినీ ఎక్కించండి.. అని సిబ్బందిని ఆదేశించారు. తన వద్ద ఉన్న ఫోన్లో భక్తులను వీడియో తీశారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏసీపీ అక్కడకు చేరుకుని భక్తులను బలవంతంగా బయటకు పంపాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మరింత రెచ్చిపోయారు. ఘాట్రోడ్డులోని సగం క్యూలైన్లు ఖాళీ చేసిన తర్వాత టోల్గేట్ వద్ద భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఘాట్రోడ్డులో ఉన్న వారిని క్యూలైన్లలోకి పంపించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు వారిని క్యూలైన్లలోకి పంపారు. అంతరాలయం వద్దకు కూడా భార్యాభర్తలపై ఓ సీఐ దుర్భాషలాడారు. సిబ్బందికి సైతం చుక్కలు చూపించారు భక్తులకే కాకుండా ఆలయ సిబ్బందికి సైతం పోలీసులు చుక్కలు చూపించారు. అర్ధరాత్రి ఎక్కువగా ఉన్న రద్దీ ఉదయం 6 గంటల కల్లా రద్దీ సాధారణంగా మారింది. మరో వైపున వర్షం కురియడంతో భక్తుల రద్దీ మరింత తగ్గినప్పటికీ పోలీసులు బందోబస్తును సడలించలేదు. కుమ్మరిపాలెం, ఇటు వినాయకుడి గుడి, అశోక స్తూపం వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ఎవరినీ అనుమతించలేదు. ఉదయం 7గంటలకు కొండపై విధులకు వస్తున్న ఆలయ ఉద్యోగులను కూడా పంపకపోవడం విమర్శలకు దారి తీసింది. డ్యూటీ పాస్లు ఉన్న మీడియా సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఉదయం 8 తర్వాత పరిస్థితి కొంత మార్పు వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రద్దీ పెరగడంతో పోలీసుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇలా రోజంతా ఆంక్షలతో భక్తులు, సిబ్బందిని ఇబ్బందుకలు గురిచేశారు. -
ఇంద్రకీలాద్రిపై భద్రతను పర్యవేక్షించిన సీపీ
విజయవాడ : మూలా నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించ వలసి వచ్చిందని చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లను గౌతం సవాంగ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ రోజు అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. అందులోభాగంగా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ గౌతం సవాంగ్ వివరించారు. -
దుర్గమ్మ సన్నిధిలో డెప్యూటీ సీఎం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా తరలివచ్చారు. ఆయనకు ఈవో సూర్యకుమారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఉత్సవ ఏర్పాట్లపై డెప్యూటీ సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. దుర్గమ్మను దర్శించుకున్న బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ దుర్గమ్మను బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. -
అమ్మవారికి ఆలస్యంగా నివేదన
విజయవాడ (ఇంద్రకీలాద్రి ) : దుర్గగుడి అధికారులు వీఐపీల సేవలో తరించడంతో మంగళవారం అమ్మవారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. మేళతాళాలతో ఆలయ అర్చకులు నివేదనను తీసుకుని అమ్మవారి ముఖ మండపం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆలయం లోపల కొందరు వీఐపీలు ఉండటంతో వారు బయటకు వచ్చే వరకు నివేదనను పట్టుకుని అర్చకులు వేచి ఉండాల్సి వచ్చింది. అర్చకులు ఎంత పిలిచినా అంతరాలయంలో ఉన్నవారు బయటకు రాలేదు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఆగ్రహంతో గట్టిగా కేకలు వేయడంతో వీఐపీలు బయటకు వచ్చారు. ఉద్యోగులపై చర్యలు: ఈవో అమ్మవారికి నివేదన సమర్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఈవో సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశామని, ఇన్స్పెక్టర్, ఏఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అమె పేర్కొన్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని స్థానాచార్యను కోరినట్లు తెలిపారు. -
అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం ఉదయం శాసనమండలి చైర్మన్ చక్రపాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిగా అలంకృతురాలైన దుర్గకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి మండలి సమావేశాలు వెలగపూడిలో శాసనమండలిలోనే జరుగుతాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టసభలు పూర్తిగా సహకరిస్తాయని తెలిపారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆకాంక్షించారు. -
ఇంద్రకీలాద్రిపై దసరా సందడి
-
ఇంద్రకీలాద్రి అందాలు డోన్లో నిక్షిప్తం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాలకు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ ఆలయ పరిసరాలను డోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. రాజగోపురం, ఘాట్రోడ్డు, అర్జున వీధితో పాటు ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ, అమ్మవారి బంగారు గోపురం, పచ్చదనంతో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి అందాలను డోన్ కెమెరాతో బంధించారు. -
రూ.4.50 కోట్లతో దుర్గమ్మకు ఆభరణాలు
- హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి విరాళం విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఇందుకు అవసరమైన స్వర్ణకవచం, బంగారు కిరీటం, ముక్కుపుడక, బొట్టుబిళ్ల, కర్ణాభరణాలు, మంగళసూత్రం, త్రిశూలాన్ని బండి పార్థసారథిరెడ్డి తయారుచేయించారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆయన తన కుటుంబసభ్యుల చేతులమీదుగా ఆభరణాలను ఈవో సూర్యకుమారికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఈ బంగారు ఆభరణాలు, కవచాన్ని శనివారం అమ్మవారికి అలంకరిస్తారు. -
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ శుక్రవారం దుర్గమ్మకు పట్టుచీర సమర్పించారు. తొలుత వన్టౌన్ పీఎస్కు చేరుకున్న సీపీ స్టేషన్లో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, తీన్మాన్ డప్పుల వాయిద్యాల నడుమ పట్టుచీరను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అమ్మవారికి పట్టుచీరను సమర్పించేందుకు విచ్చేసిన సీపీకి ఆలయ ఈవో సూర్యకుమారి సాదరంగా స్వాగతం పలికారు. చీరను సమర్పించి ఉత్సవాలు విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. -
దుర్గమ్మకు బంగారు తాడు, మంగళసూత్రాలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మకు నగరానికి చెందిన ఓ భక్తుడు రూ.4.50 లక్షల విలువైన బంగారు తాడు, మంగళసూత్రాలను సమర్పించారు. భవానీపురానికి చెందిన రాహుల్ మార్కెటింగ్ అసోసియేట్స్ యజమాని తవ్వ వెంకట లక్ష్మీప్రసన్నకుమార్ బుధవారం ఆలయ అధికారులను కలుసుకుని ఈ వస్తువులను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందించారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ఎంఎస్కే ప్రసాద్
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికైన ఎంఎస్కే ప్రసాద్ గురువారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత తొలి సారిగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎంఎస్కే ప్రసాద్కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంఎస్కేను వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన విషయాన్ని అమ్మవారికి చెప్పి, ఆశీస్సులు అందించాలని ప్రార్థించానని ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు. తనకు ఎప్పుడు సంతోషం కలిగినా అమ్మవారి దగ్గరకు వచ్చి దానిని పంచుకుంటానని ఆయన పేర్కొన్నారు. -
కుంకుమార్చన టికెట్లకు డిమాండ్
– మూలా నక్షత్రం రోజు కోసం ఉభయ దాతల పోటీ – తొలి బ్యాచ్కు టికెట్లు నిల్ విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారికి జరిగే కుంకుమార్చనలో పాల్గొనేందుకు ఉభయదాతలు పోటీ పడుతున్నారు. మూలా నక్షత్రం కుంకుమార్చన టికెట్లను గురువారం ఉదయం నుంచి కౌంటర్లలో అమ్మకానికి పెట్టగా, ఒక రోజులోనే దాదాపు రెండు బ్యాచ్లకు సంబంధించి పెద్ద ఎత్తున టికెట్లను భక్తులు కొన్నారు. మొదటి బ్యాచ్ టికెట్ల కోసం ప్రముఖల నుంచి డిమాండ్ ఎక్కువగా రావడంతో దేవస్థాన అధికారులు ఆ బ్యాచ్ టికెట్ల విక్రయాలను నిలిపివేసి తమ వద్దే ఉంచారు. మూలా నక్షత్రం రోజు కుంకుమార్చనలో పాల్గొనేందుకు మంత్రులు, ప్రముఖులు, సినీ నటులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలోనే మొదటి బ్యాచ్ టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. -
అర్ధాకలిలో అమ్మ భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : అమ్మవారి ప్రసాదం స్వీకరించడం మహాభాగ్యం.... అది అన్నప్రసాదమయినా.. ఇతర మరే ప్రసాదమయినా సరే... అయితే భక్తులు, యాత్రికుల కోసం సిద్ధం చేసిన ప్రసాదం కూలీలు, కార్మికుల పాలవుతోంది. అమ్మ సన్నిధిలో నిద్ర చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మవారి సన్నిధిలో రాత్రి వేళ నిద్ర చేసేందుకు రాష్ట్రంలోని వివిధ‡ ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. వీరందరికీ దుర్గగుడి అధికారులు నిత్యం దద్దోజనం ప్రసాదాన్ని అందజేస్తుంటారు. రాత్రి 8–30 గంటల నుంచి ఈ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. గతంలో కొండపై షెడ్డులో ఈ దద్దొజనం ప్రసాదం అందజేసేవారు. అయితే మహా మండపంలోని 1, 2వ అంతస్తులో భక్తులు నిద్ర చేసేందుకు వసతి కల్పించడంతో ఇప్పుడు మహా మండపం దిగువన ఈ ప్రసాదాన్ని రాత్రి వేళ పంపిణీ చేస్తున్నారు. భక్తులకు పంపిణీ చేసే ఈ ప్రసాదం కోసం కెనాల్ రోడ్డు, కాళేశ్వరరరావు మార్కెట్ పరిసరాలలో హోటళ్లు, ఇతర పనులు చేసుకునే కూలీలు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచే మహా మండపం దిగువన వరసగా కూర్చుని ఉండటంతో నిజమైన భక్తులకు అమ్మవారి ప్రసాదం అందడం లేదు. తొలుత క్యూలైన్లోకి ఈ కూలీలు వచ్చి చేరడంతో భక్తులు వారి వెనుక నిల్చోవాల్సి వస్తుంది. చివరకు అరకొరగా లభించే ప్రసాదాన్ని కుటుంబం మొత్తం సర్దుకుని ఆర్ధాకలిలో అమ్మవారి సన్నిధిలో నిద్ర చేయాల్సి వస్తుందని అనకాపల్లికి చెందిన వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. అన్న ప్రసాదం పంపిణీకి పక్కనే ఉన్న ప్రసాదం కౌంటర్లు వినియోగించుకుని భక్తులందరినీ ఓ క్రమపద్ధతిలో వచ్చేలా చేయవచ్చు. ఆలయ సిబ్బంది అటువంటి చర్యలేమీ పాటించకుండా ఆరుబయట భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నోరు, బలం ఉన్న వారు ముందుకు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని భోజనంలా లాగించేస్తున్నారు. విశ్రాంతి మందిరాలలోనే పంపిణీ చేస్తే మేలు.... అమ్మవారి సన్నిధిలో నిద్ర చేసేందుకు వచ్చే భక్తులు, యాత్రికులకు పంపిణీ చేసే దద్దోజన ప్రసాదాన్ని విశ్రాంతి మందిరాలలోనే పంపిణీ చేస్తే సద్వినియోగం భక్తులు భావిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో నిత్యం 300 నుంచి 500 మంది వరకు భక్తులు నిద్ర చేస్తుంటారు. భక్తులు నిద్ర చేసే మహా మండపంలోని 1, 2వ అంతస్తులలో ఈ ప్రసాద వితరణ జరిగితే అమ్మవారి ప్రసాదం అందరికీ అందుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు ఈ మార్పులు చేస్తారని భక్తులు భావిస్తున్నారు. -
కనకదుర్గమ్మా.. గొంతునింపమ్మా..
విజయవాడ (ఇంద్ర కీలాద్రి) : దుర్గగుడి అధికారుల తీరుతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇంతకాలం నిలువ నీడ మాత్రమే లేకుండా పోగా, తాజాగా కనీసం తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. శుక్రవారం దుర్గమ్మ దర్శనానికి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారు అధికంగా ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం దిగువన కౌంటర్లలో ప్రసాదాలు కొంటారు. అయితే, అమ్మ ప్రసాదం స్వీకరించిన తర్వాత గొంతు తడుపుకొనేందుకు మంచినీరు తాగుదామంటే కుళాయిల నుంచి చుక్కనీరు రావడం లేదు. దీంతో మహామండపానికి ఈశాన్య భాగంలో ఏర్పాటుచేసిన పైపు నుంచి వచ్చే నీటిని తాగేందుకు భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉన్న ఒక్క కుళాయి వద్ద పదుల సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు. అధికారులు అమ్మవారి ఆలయానికి వచ్చే ఆదాయంపై కాకుండా భక్తుల సదుపాయాలు, సౌకర్యాలపై దృష్టిసారిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
5 నుంచి దుర్గగుడిపై గణపతి నవరాత్రులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 5 నుంచి 13వ తేదీ వరకు గణపతి నవరాత్రుల మహోత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదో తేదీ ఉదయం గణపతి పూజ, కలశస్థాపన, విశేష పత్రి పూజతోపాటు కథా శ్రవణం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీగణపతి హోమం, సాయంత్రం ఆవాహన దేవతా హోమం నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు పూర్ణాహుతిలో ఉత్సవాలు ముగుస్తాయని, సాయంత్రం 5 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు ఉంటుందని అధికారులు తెలిపారు. -
ఇక దుర్గమ్మ శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.300
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో దుర్గగుడిని అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఆలయ అధికారులు తొలిగా అమ్మవారి దర్శనం టికెట్ల ధరలను పెంచారు. శీఘ్రదర్శనం టికెట్ ధరను రూ.100 నుంచి ఏకంగా రూ.300కు పెంచుతూ దుర్గగుడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాల్లో వీఐపీ, శీఘ్రదర్శనం టికెట్ల ధరలను దేవస్థానం రూ.500గా నిర్ణయించింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రూ.300కు మార్చారు. అయితే, ఈ ధర కేవలం పుష్కరాల వరకే అని భక్తులు భావించారు. పుష్కరాలు ముగిసినా అదే రేటు కొనసాగించారు. అలాగే, భవిష్యత్తులో అమ్మవారి అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారా, అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శుక్ర, ఆదివారాలు, పండుగ రోజుల్లో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తున్నారు. రూ.300 టికెట్ కూడా శీఘ్రదర్శనమే తప్ప అంతరాలయ దర్శనం కాదనే ప్రచారం జరుగుతోంది. కాగా, అమ్మవారి దర్శనం టికెట్ను ఒక్కసారిగా పెంచడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 టికెట్ను యధావిధిగా కొనసాగిస్తారా.. లేదా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత దర్శనం మూడు లైన్లు యధావిధిగానే కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. -
చుట్టాలబ్బాయిగా ఆదరిస్తున్నారు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : వరలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం మా ‘చుట్టాలబ్బాయి’ ద్వారా వచ్చింది. విజయవాడతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు వచ్చినా కృష్ణానదిలో చిల్లర వేస్తుంటాం. అమ్మ దీవెనలు ప్రతి ఒక్కరికీ అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించానని సినీ నటుడు, వ్యాఖ్యాత సాయికుమార్, ఆయన తనయుడు ఆది అన్నారు. ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను వారిద్దరితో పాటు చుట్టాలబ్బాయి చిత్ర దర్శకుడు వీరభద్రం శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపంలోని ఆరో అంతస్తులో జరుగుతున్న సామూహిక వరలక్ష్మీవ్రతాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. వరలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి, పుష్కరాల నవ హారతులకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని సాయికుమార్ పేర్కొన్నారు. ఆది నటించిన చుట్టాలబ్బాయి విజయవంతమైందని, ఆదితో కలిసి నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎక్కడికెళ్లినా ఆదిని చుట్టాలబ్బాయిగా ఆదరిస్తున్నారన్నారు. అమ్మవారి కరుణ, కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నానన్నారు. హీరో ఆది మాట్లాడుతూ చుట్టాలబ్బాయి సినిమా విజయవంతంగా నడుస్తోందన్నారు. నాన్నతో కలిసి నటించడం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ సినిమా తన జీవితంలో మరిచిపోలేనిదన్నారు. వరలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం కలగడం మరింత సంతోషంగా ఉందని ఆది పేర్కొన్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. సాయికుమార్, ఆదితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. -
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పల్లె
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన పల్లె రఘునాథరెడ్డికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల 12 రోజులలో 18.04 లక్షల మంది యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న యాత్రికులు 22 లక్షల లడ్డూలను ప్రసాదంగా అందుకున్నారు. అమ్మవారి అన్న ప్రసాదాన్ని రెండు లక్షల మందికి పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. చివరి రోజైన మంగళవారం అమ్మవారి సన్నిధికి యాత్రికుల తాకిడి అధికంగానే ఉంది. మంగళవారం 1.75 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ యాత్రికులతోపాటు పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వీఐపీలకు ఆలయ ఈవో సూర్యకుమారి సాదరంగా స్వాగతం పలికారు. పుష్కర యాత్రికులకు దుర్గమ్మ కుంకుమ ప్రసాదం నగరంలోని వేర్వేరు స్నానఘాట్లలో పుష్కర స్నానమాచరించిన యాత్రికులకు చివరి రోజున దుర్గమ్మ కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బస్టాండ్లోని నమూనా ఆలయంతోపాటు పున్నమి, భవానీ, సంగమం స్నాన ఘాట్లలో యాత్రికులకు అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కాకపోయినా కుంకుమ ప్రసాదాన్ని నేరుగా యాత్రికులకు అందచేయడం సంతోషదాయకమని యాత్రికులు పేర్కొన్నారు. 12వ రోజున 1.75 లక్షల మంది.. పుష్కరాలలో 12వ రోజున 1.75 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన యాత్రికులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. మంగళవారం 2.25 లక్షల లడ్డూలను దేవస్థానం విక్రయించింది. అమ్మవారి అన్న ప్రసాదాన్ని 21,600 మందికి అందచేశారు. -
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రికి కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు యాత్రికులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి యాత్రికులు బారులు తీరారు. ఆదివారం సుమారు 2.20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. ఇక భవానీపురం వైపు నుంచి వచ్చే యాత్రికులను ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి అనుమతించి ఓం టర్నింగ్ వద్ద క్యూలైన్లో కలిపారు. అమ్మవారికి దర్శించుకున్న మంత్రి, ఎంపీ దుర్గమ్మను కార్మికశాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు దంపతులు, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో సూర్యకుమారి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానానికి రూ. 26.05 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి పుష్కర యాత్రికులు బారులు తీరారు. పుష్కరాలు, శ్రావణ పౌర్ణమి కలిసి రావడంతో గురువారం రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. దేవస్థానికి రూ. 22.72 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అమ్మవారి సన్నిధిలో అశోకగజపతిరాజు దుర్గమ్మను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు, టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి ప్రసాదాలను ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం
సామూహిక వ్రత నిర్వహణకు ఏర్పాట్లు ఈవో సూర్యకుమారి వెల్లడి ఒక్కో టికెట్ రూ. 1500 ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 26వ తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో సూర్యకుమారి తెలిపారు. వ్రతం జరిగే రోజున అమ్మవారి మూలవిరాట్తో పాటు ఉత్సవ మూర్తిని మహాలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు. వ్రతంలో పాల్గొనేందుకు టికెటు ధరను రూ. 1500గా ఆలయ అధికారులు నిర్ణయించారు. మహా మండపంలోని ఆరో అంతస్తులోని ఆర్జిత సేవల ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 6 గంటల నుంచి 8–30 గంటల వరకు , రెండో షిప్టు ఉదయం 10–30 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు నిర్ణయించారు. ఇక వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజా సామాగ్రితో పాటు కుంకుమ భరిణ, అష్టలక్ష్మీ యంత్రం, కాళ్ల మెట్టెలు, రవిక, అమ్మవారి లామినేషన్ ఫోటో, అమ్మవారి ప్రసాదాలను దేవస్థానం అందచేస్తుంది. 24 నుంచి టికెట్ల విక్రయాలు స్థలాభావం కారణంగా టికెటు కొనుగోలు చేసిన ముల్తైదువునే వ్రతం ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ నెల 24వ తేదీ నుంచి టికెట్లు దేవస్థాన ఆర్జిత సేవాకౌంటర్లో లభిస్తాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇతర వివరాలకు దేవస్థాన టోల్ప్రీ నెం.1800 4259 099 కు సంప్రదించవచ్చు. -
ఆది దంపతుల దర్శనానికి బారులు
తరలివస్తున్న పుష్కర యాత్రికులు ఐదో రోజు కొనసాగిన రద్దీ విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకునేందుకు పుష్కర యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఐదో రోజు యాత్రికుల రద్దీ కొనసాగింది. మంగళవారం సుమారు 1.20 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వృద్దులు, వికలాంగులు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులకు గురి కావడం, మహా మండపం మీదగా కొండపైకి చేరేందకు లిఫ్టు వద్ద ఇబ్బందులకు గురి కావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా బస్సు సదుపాయాన్ని కల్పించారు. మహా మండపం వద్ద విజయనగరం సమీపంలోని జామికి చెందిన గంగాధర్ ఫిట్స్తో కుప్పకూలిపోయాడు. దీంతో గంగాధర్ ముఖానికి గాయం కావడంతో ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి మంగళవారం రూ. 20, 28,790 ఆదాయం సమకూరింది. అర్జున వీధిలో అన్నప్రసాదం.. అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి గంట పాటు యాత్రికులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు. మంగళవారం సుమారు 20 వేల మందికి అన్న ప్రసాదాన్ని అందించారు. అమ్మవారిని సన్నిధిలో ప్రముఖులు పుష్కర స్నానాల అనంతరం పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డి, ఏపీ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావు, సినీ నటుడు కోట శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు. -
దుర్గమ్మ దర్శనానికి కొనసాగుతున్న రద్దీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి ) : దుర్గమ్మను యాత్రికులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. సోమవారం సుమారు 1.30 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేశారు. 20 వేల మందికి అన్న ప్రసాదాన్ని అందజేశారు. 2.70 లక్షల లడ్డూలు సిద్ధం పుష్కర యాత్రికుల కోసం అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు 2.70 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. దేవస్థానానికి సోమవారం రూ. 22,75,600 ఆదాయం వచ్చింది. లిఫ్టుపై కొనసాగుతున్న వివాదం పుష్కరాల్లో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులకే లిఫ్టు సదుపాయం కల్పిస్తున్నామని దుర్గగుడి అధికారులు చెబుతుండగా, పూర్తి స్థాయిలో పోలీసు సిబ్బందే వినియోగించుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. -
దుర్గమ్మ దర్శనానికి భక్తుల పోటు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : పుష్కర యాత్రికులతో ఆదివారం దుర్గమ్మ సన్నిధి కిటకిటలాడింది. పుష్కరాల మూడో రోజు, ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో రికార్డు స్థాయిలో యాత్రికులు అమ్మవారి దర్శనానికై తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి మొదలైన యాత్రికుల రద్దీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్షన్నర మంది భక్తులు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం ఆగస్టు 15 సెలవు కావడంతో ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మహా మండపం, మల్లికార్జునస్వామి వారి ఆలయం వైపు నుంచి కొండ కిందకు చేరుకుంటున్నారు. మహా మండపంలోని ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీ, రూ.300 శీఘ్రదర్శనం టికెట్లతో పాటు నాలుగు ఉచిత సర్వ దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అన్ని క్యూలైన్ మార్గాలలో నిరంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థాన సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అశోకస్థూపం వరకు క్యూలైన్లలో రద్దీ అమ్మవారి దర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లలో రద్దీ నెలకుంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు రద్దీ మరింత పెరిగింది. దీంతో అశోకస్ధూపం వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు బారలు తీరి కనిపించారు. దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. రికార్డు స్థాయి ఆదాయం అమ్మవారికి ఆదివారం ఒక్క రోజే రూ. 20.87 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులతో పాటు పుష్కర యాత్రికులకు 20 వేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. -
దుర్గగుడిలో నిలువు దోపిడీ
ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతర్! గతంలో అన్నదానం రేట్లు పెంపు వ్యాపార కేంద్రంగా దుర్గమ్మ దేవాలయం సాక్షి, విజయవాడ : కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను నిలువునా దోచుకోవడమే లక్ష్యంగా దేవాదాయ శాఖ పనిచేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను కూడా దేవాదాయ శాఖ బేఖాతరు చేస్తోంది. అమ్మవారి డిపాజిట్లను ఇష్టానుసారంగా ఖర్చు చేసిన అధికారులు ఇప్పుడు ఆ సొమ్మును భక్తుల నుంచి రాబట్టేందుకు, దేవస్థానం తగ్గుతున్న ఆదాయాన్ని పెంచేందుకు టికెట్ల ధరను పెంచుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతర్ అమ్మవారిని భక్తులు శ్రీఘ్రదర్శనం చేసుకోవాలంటే రూ.500 టికెట్ తీసుకోవాలని ఇటీవల దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో పాటు మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. తిరుపతిలో బ్రేక్ దర్శనం రూ.300 ఉంటే ఇక్కడ రూ.500 ఏమిటని ప్రశ్నించారు. దీంతో రూ.500 టికెట్ను రూ.300కు తగ్గించాలని సీఎం ఆదేశించారు. అయితే అధికారులు ఆ ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఘట్రోడ్డులోని రాజగోపురం పక్కనే ఉండే వీఐపీ క్యూలైన్లోంచి వెళ్లే లైనును శ్రీఘ్రదర్శనంగా మార్చి దీని చార్జీని రూ.500గా నిర్ణయించారు. ఇక ఓం టర్నింగ్వద్ద క్యూలైన్లో వెళ్లేవారికి రూ.300 చార్జీ వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఈ రెండు క్యూలైన్లకు పెద్దగా తేడా లేకపోయినప్పటికీ రూ.200 అదనంగా వసూలు చేయడం భక్తులు పెదవి విరుస్తున్నారు. గతంలో రూ.100 ఉంటే ఇప్పుడు రూ.500లకు పెంచడం వ్యాపారమేనని భక్తులు ఆరోపిస్తున్నారు. లిఫ్టు మాటేమిటి? రూ.500 చెల్లించిన భక్తులు కూడా ఘాట్రోడ్డులోంచి వెళ్లాల్సిందే తప్ప లిఫ్టులో పైకి పంపబోమని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. లిఫ్టు కేవలం వృద్ధులు, వికలాంగులకేనని చెబుతున్నారు. అయితే లిఫ్టును పోలీసులు, దేవస్థానం అధికారులు మాత్రమే వినియోగించుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సాధారణ భక్తుల వద్ద రూ.500 వసూలు చేసే అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వచ్చే చోటామోటా నాయకులు, వారి కుటుంబసభ్యుల నుంచి కూడా రూ.500 చార్జీ వసూలు చేసి శ్రీఘ్రదర్శనంలో పంపించే ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే టికెట్ లేకుండా అమ్మవారి దర్శనానికి వెళ్లాలని, అయితే ఒకొక్క ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు వారితో పాటు కనీసం పది నుంచి పాతికమంది వందిమాగధలు వస్తుంటారని, వారితో ఈ టికెట్లు కొనిపిస్తే బాగుటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నదానం రేట్లు పెంపు!? గతంలో రూ.1116 చెల్లిస్తే ఒక భక్తుడు అతను కోరుకున్న రోజున అతని తరఫున 8 మందికి అన్నదానం చేసేవారు. అయితే గత ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పూర్తిగా వ్యాపారధోరణితో ఆలోచించి ఈ రేటును అమాంతంగా రూ.5,116కు పెంచేశారు. రూ.5,116 చెల్లిస్తే, ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో 8 మందికి అన్నదానం చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు పేద, మధ్య తరగతి వర్గాలు కూడా రూ.1116 చెల్లించి అన్నదానానికి తాము కష్టామని సంతృప్తి చెందేవారు. ఇప్పుడు రేటు పెంచడంతో అన్నదానం దాతలు తగ్గిపోయారని సమాచారం. కేవలం ధనిక వర్గాలకు మాత్రమే అన్నదానానికి రుసుం చెల్లిస్తున్నారు. ఏమైనా ఐఏఎస్ అధికారి ఈవోగా వచ్చినా అధికారుల తీరులో మార్పు లేదని భక్తులు వాపోతున్నారు. -
దుర్గమ్మకు చేరువగా కృష్ణమ్మ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మకు కృష్ణమ్మ మరింత చేరువైంది. నిన్నటి వరకు నీటి జాడలేని దుర్గాఘాట్లో గురువారం సాయంత్రానికి మూడు అడుగుల మేర నీరు చేరింది. దుర్గాఘాట్లో నీటిమట్టం పెరగడంతో అమ్మవారి భక్తులతోపాటు సందర్శకుల తాకిడి పెరిగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు దుర్గాఘాట్లోనే పుణ్యస్నానాలు ఆచరించారు. యాత్రకుల రద్దీ ప్రారంభం శుక్రవారం ఉదయం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచే యాత్రకుల రద్దీ ప్రారంభమైంది. బస్సు, రైళ్ల ద్వారా నగరానికి చేరుకున్న భక్తులు స్నానఘాట్లకు వస్తున్నారు. పుష్కర యాత్రికులతోపాటు నగరానికి చెందినవారు ఘాట్లలో ఏర్పాట్లను తిలకించేందుకు వస్తుండడంతో సదండి వాతావరణం నెలకొంది. -
తిరుమల తరహాలో దుర్గగుడి అభివృద్ధి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే దుర్గగుడిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పరిపాలనా భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహామండపాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహామండపంలో అందుబాటులో ఉన్నా.. కెనాల్ రోడ్డులో క్యూలైన్లు ఏర్పాటు చేయడంపై ప్రశ్నించగా, పుష్కరాల్లో రోజూ రెండు లక్షల మంది దుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, మహామండపంలోని క్యూ కాంప్లెక్స్ అందుకు తగినది కాదని సమాధానమిచ్చారు. మహామండపంలో అత్యాధునికమైన మరో రెండు లిప్టులను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. దుర్గగుడి అభివృద్ధి, మాస్టర్ ప్లాన్లో భాగంగా తొలగించిన ఇళ్లకు రూ.30 కోట్ల డిపాజిట్లను తీశామని, మరో రూ.35 కోట్లను తీసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. -
దుర్గమ్మకు 5,116 డాలర్ల విరాళం
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు యూఎస్ఏకు ఓ భక్తుడు 5116 డాలర్లు విరాళంగా అందచేశారు. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న మాడుగుల నాగభాస్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదానానికి 5116 డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ మొత్తం భారత దేశ కరెన్సీలో రూ.3.42లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నాగభాస్కర్కు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.