పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది.
వెండి, బంగారం, రూ.4 లక్షల నగదు అపహరణ
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నవీన్ నగర్కు చెందిన జితేందర్ అనే వ్యక్తి బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబంతో వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించారు.
కిలోన్నర బంగారం, 7 కిలోల వెండి, రూ.4 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.