Panjagutta
-
ఆస్తికోసం తాతను హత్య చేసిన మనవడు
-
పంజాగుట్ట నిమ్స్ దగ్గర ఉద్రిక్తత.. సిబ్బంది నిరసన
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్స్ వర్కర్ను పంజాగుట్ట పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. నిన్న(గురువారం) ఓ పేషెంట్ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా.. బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆ రోగి విధుల్లో ఉన్న వర్కర్పై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది. విచారణలో భాగంగా నిమ్స్ వర్కర్ను పంజాగుట్ట పోలీసులు కొట్టారంటూ ఇతర సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పూర్తిగా నిర్థారణకు రాకుండానే చోరీ పేరుతో వర్కర్ను కొట్టారంటూ పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. అత్యవసర విభాగం వద్ద సిబ్బంది ఆందోళన చేపట్టారు.ఇదీ చదవండి: దీని వెనుక ఏదో మతలబు ఉంది -
బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్రరావుపై కేసు
-
ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు..హరీశ్రావుపై కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్గౌడ్ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్ఫోర్స్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్రావుపై ఫోన్ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్షీట్: హరీశ్రావు -
HYD: పంజాగుట్టలో కారు బీభత్సం.. హోంగార్డును ఈడ్చుకెళ్లి..
సాక్షి,హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం(నవంబర్ 8) ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఆపకుండా దూసుకెళ్లాడు. కారు ఆపిన హోంగార్డును కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాగుట్టలో కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా నాగార్జున సర్కిల్ వద్ద హోంగార్డ్ రమేష్ ఓ కారును ఆపాడు. అయితే కారును ఆపకుండా హోం గార్డు రమేష్ని కారు డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడి ఆపకుండా ఈడ్చుకెళ్లాడు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో చోరీ.. పోలీస్స్టేషన్కు ప్రయాణికులు -
గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
-
పంజాగుట్ట డ్రగ్స్ కేసు: స్టాన్లీ కాంటాక్ట్ లిస్ట్లో ప్రముఖల పేర్లు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్తో స్టాన్లీ పట్టుబడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్లో పలువురు ఏజెంట్లను స్టాన్లీ రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టాన్లీ కాంటాక్ట్ లిస్ట్లో ప్రముఖల పేర్లు ఉండటం గమనార్హం. స్టాన్లీ డ్రగ్స్ లింక్స్.. పోలీసుల కస్టడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతునన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అతనికి నైజీరియాలో డ్రగ్స్ తయారీదారులతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ అప్డేట్
-
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం
-
దుబాయ్ పారిపోయిన సోహిల్..పంజాగుట్ట సీఐ సస్పెండ్
-
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. సోహైల్ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోహైల్కు బదులు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిమనిషి అబ్దుల్ అసిఫ్ను కేసులో పోలీసులు చేర్చారు. ప్రమాద సమయంలో కారు అబ్దుల్ నడిపినట్లు కేసు నమోదు చేశారు. దుబాయ్ నుంచి షకీల్ ఈ వ్యవహారం అంతా నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాగుట్ట సీఐ దుర్గారావుకు అస్వస్థతకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐను బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్తో రాత్రి ఫోన్ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కాగా షకీల్ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్ను తప్పించి మరొకరు డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు.షకీల్ కొడుకు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కొడుకు సోహైల్గా తేల్చారు. అయితే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్తోపాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం
-
పంజాగుట్టలోని శ్మశానవాటికలో జరగనున్న చంద్రమోహన్ అంత్యక్రియలు
-
HYD: పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ !
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు. అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
టీబీజెడ్లో ‘మంగళ 2023 కలెక్షన్’
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ టీబీజెడ్ ‘మంగళ 2023 కలెక్షన్’ ఆవిష్కరించింది. పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కొత్త కలెక్షన్ విడుదల చేసింది. ‘‘భారతదేశ సంస్కృతి స్ఫూర్తితో తీర్చిదిద్దిన ఈ బంగారు వజ్రాభరణాలు ఏ సందర్భంలో ధరించినా ప్రత్యేకత చాటుతాయి. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అని రకుల్ తెలిపారు. పంజాగుట్ట స్టోర్ పునః ప్రారంభంతో భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని టీబీజెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభిõÙక్ మాలూ ఆశించారు. -
హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్లకు డైరెక్టర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్ను కెనరా బ్యాంక్ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్ల లిస్ట్లో నాన్ పర్ఫామింగ్ అసెట్గా మారింది ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి -
మెట్రో స్టేషన్ల కిందా తాగుడే!
హైదరాబాద్: బహిరంగ ప్రదేశాలు, బస్టాప్లే కాకుండా ఇప్పుడు మెట్రోస్టేషన్ల కింద కూడా తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారని నగరానికి చెందిన టీఏవీ శ్రీనివాస్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. పంజగుట్ట మెట్రో స్టేషన్ కింద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న దృశ్యాలను తన సెల్ఫోన్లో బంధించి తన ట్వీట్తో జతపరిచారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. This is the current situation near Punjagutta @HyderabadMetroR station. Request @KTRBRS to take action @TelanganaDGP @NVSReddyIRAS pic.twitter.com/mf4fPj7vuF — T A V Srinivas (@TAVSrinivas1) July 7, 2023 -
ఆర్థిక విద్యలో శిక్షణ అవసరం
పంజగుట్ట: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం బలంగా ఉన్నామంటే మన పూర్వీకులదగ్గర నుండి మనం నేర్చుకున్న, సంపాదించిన దాంట్లో కొంత దాచుకునే అలవాటు వల్లే అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ఆదివారం రాజ్భవన్ సంస్కృతి హాల్లో హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ ఆధ్వర్యంలో రాజ్భవన్ సిబ్బందికి ‘ఫైనాన్షియల్ లిట్రసీ ట్రైనింగ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ .. ఆర్థిక మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఆర్ధిక విద్యలో శిక్షణ ఎంతో అవసరమన్నారు. కరోనా సమయంలో రాజ్భవన్ మహిళలకు పలు రంగాల్లో శిక్షణ ఇప్పించామని దీంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు నేను ఏదైనా సాధించవచ్చు అనే ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ తెలుగు రాష్ట్రాల రీజనల్ హెడ్ సిద్దార్ధ చటర్జీ, వైస్ ప్రసిడెంట్, సౌత్ జోనల్ హెడ్ జి.శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, ట్రైనర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన దుండగులు
-
K Viswanath Funeral: ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు
సినీ దిగ్గజం కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్(92)మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జీవో 317: ప్రగతి భవన్ వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, కార్యాలయం అయిన ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు యత్నించారు. ఆదివారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జీవో 317ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు ముట్టడికి యత్నించారు. ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ జీవో కారణంగా ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, జీవోకు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపై ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి ఉప్పల్ పీఎస్కు తరలించారు పోలీసులు. ఇక ముట్టడి భగ్నం కాగా.. పంజాగుట్ట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317. అందుకు సంబంధించిన మార్గదర్శకాలే ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సైతం జీవో రద్దు కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
వైఎస్సార్ సర్కిల్ వద్ద అభిమానులు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
Hyderabad National Book Fair: బుక్ఫెయిర్కు 10 లక్షల మంది!
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్ఫెయిర్కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. -
ఒక్క ప్రమాదం.. ఎన్నో పాఠాలు.. ఆ కాస్త దూరం వెళ్లలేక!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం వాహనచోదకులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో స్పష్టం చేస్తోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఆదివారం నాటికీ ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అసలేం జరిగిందంటే... బల్కంపేటకు చెందిన విద్యార్థి యాదగిరి (22) తన ద్విచక్ర వాహనంపై, తన సమీప బంధువు అనిల్తో (20) కలిసి ఉప్పల్ నుంచి వస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నాంపల్లి వాసి నవీన్ (31) తన బైక్పైప్రయాణిస్తూ రాజ్భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నవీన్ వాహనాన్ని యాదగిరి వాహనం ఢీ కొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలూ దాదాపు వంద అడుగులు జారుకుంటూ వెళ్లాయి. దీంతో అనిల్, యాదగిరి తీవ్రంగా గాయపడగా... నవీన్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కాస్త దూరం వెళ్లలేక... తన వాహనంపై వస్తున్న నవీన్ ఘటనాస్థలి వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని మళ్లీ రాజ్భవన్ వైపు వెళ్లాల్సి ఉంది. వేగంగా వస్తున్న అతడు దాన్ని దాటి కాస్త ముందుకు వచ్చేశారు. ఇలా జరిగినప్పుడు కేవలం 500 మీటర్ల లోపు దూరంలో ఉన్న ఖైరతాబాద్ చౌరస్తా వరకు వచి్చ, అక్కడ యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంది. ఈ కాస్త దూరం ముందుకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహించిన అతడు తాను ప్రయాణిస్తు మార్గంలోనే రాంగ్ రూట్లో వెనక్కు వచ్చి నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నుంచి రాజ్భవన్ వైపు వెళ్లే రోడ్డులోకి రావాలని ప్రయత్నించారు. పరిమితికి మించిన వేగం... ఈ ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన పోలీసులు దాన్ని విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో యాదగిరి తన వాహనాన్ని అత్యంత వేగంగా నడిపినట్లు గుర్తించారు. సిటీ రోడ్లలో ఏ సమయంలోనైనా గరిష్టంగా గంటలకు 40 కిమీ వేగం మంచిది కాదు. అయితే ప్రమాద సమయంలో ఈ వాహనం గంటలకు దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర వేగమని చెప్తున్నారు. హఠాత్తుగా ఇటు రావడంతో... ఇంత స్పీడుగా వస్తున్న వీరి దృష్టి యూ టర్న్ వద్ద రాజ్భవన్ వైపు నుంచి వచ్చి యూటర్న్ తీసుకునే వాహనాలపై మాత్రమే ఉంటుంది. నిబంధనల ప్రకారం అలానే రావాలి. అయితే నవీన్ అదే రోడ్లో, రాంగ్ రూట్లో వ్యతిరేక దిశలో వచ్చి యూ టర్న్ వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చి రాజ్భవన్ వైపు వెళ్లే మార్గంలో ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని యాదగిరి తన వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేక నవీన్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ధాటికి ఆ వాహనం పెట్రోల్ ట్యాంక్ వద్ద వంగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. హెల్మెట్ వాడకపోవడంతోనే... ప్రమాదానికి కారణమైన, ప్రమాదానికి గురైన రెండు వాహనాలపై ఉన్న చోదకులూ హెల్మెట్లు ధరించలేదు. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ రెండూ 220 సీసీ, 180 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలైనప్పటికీ చోదకులు హెల్మెట్లు ధరించలేదు. చిన్న పాటి నిర్లక్ష్యాలు, నిబంధనలు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది వాహనచోదకులకు గుణపాఠం కావాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
ఉద్రిక్తతల నడుమ ‘చలో రాజ్భవన్’
పంజగుట్ట: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ చేపట్టిన ‘చలో రాజ్భవన్’తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వందలాదిగా సీపీఐ కార్యకర్తలు ఖైరతాబాద్ కూడలి వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ భారీ గా మోహరించిన పోలీసులు బ్యారికేడ్లు వేసి వారిని అక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కార్యకర్తలు మక్తా రైల్వేగేటు మీదుగా రాజ్భవన్ ముట్టడికి యత్నించగా వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఖైరతాబాద్ కూడలివద్ద ఆందోళనకారులు సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫెడరల్ సిస్టం, గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలి అని నినాదాలు చేస్తూ బైఠాయించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు అజీజ్ పాషా, చాడా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్తో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ...గవర్నర్ పదవిని అడ్డంపెట్టుకుని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి వ్యతిరేక పార్టీలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఎన్టీఆర్లేని సమయంలో అప్పటి గవర్నర్ రాంలాల్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని గుర్తుచేశారు. ఇటీవల మహారాష్ట్రలో, గోవాలో అలానే జరిగిందన్నారు. ఈ నెల 29న అన్ని రాష్ట్రా ల్లో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్తో రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కిలాడీ ఆటో డ్రైవర్.. పంజగుట్టకు చేరుకోగానే ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసి..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసిన ఓ ఆటో డ్రైవర్ సదరు వ్యక్తి సెల్ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా రూ. 57 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్కు చెందిన పి.వీరప్రతాప్ సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చిన అతను అర్జెంట్గా మంచిర్యాల వెళ్లే క్రమంలో తెల్లవారు జామున 4:25కు ఈఎస్ఐ వద్ద సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఆటో పంజగుట్ట కూడలికి చేరుకోగానే ఆటోడ్రైవర్ వీరప్రతాప్ను ఆటోలోనుంచి బలవంతంగా బయటకు నెట్టివేసి ఆటో తీసుకుని బంజారాహిల్స్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వీరప్రతాప్ తేరుకుని కొద్దిసేపు తర్వాత చూసుకోగా అతని సెల్ఫోన్ కనిపించలేదు. అర్జెంట్గా ఊరు వెళ్లే క్రమంలో అతను మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఎటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు చూడగా నో బ్యాలెన్స్ చూపించింది. దీంతో మంచిర్యాల యాక్సిస్ బ్యాంకులో సంప్రదించగా తన అకౌంట్ నుండి గూగుల్ పే ద్వారా 57362 రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. దీంతో తిరిగి నగరానికి వచ్చిన వీరప్రతాప్ శుక్రవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శంషాబాద్లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు -
Hyderabad: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్లు చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట) -
హైదరాబాద్లో వ్యభిచార దందా బట్టబయలు
సాక్షి, హైదరాబాద్(పంజగుట్ట): స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడి చేసి సబ్ ఆర్గనైజర్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... సోమాజిగూడలోని సూర్యానగర్ కాలనీలో ఉన్న నేచ్యురల్ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారం అందుకున్న పంజగుట్ట అడిషనల్ ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు నేతృత్వంలో బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. సబ్ ఆర్గనైజర్ నర్సింహ, ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్లో భార్యను చంపిన భర్త) -
పంజాగుట్టలోని ఓ జ్యువెలరీ ప్రారంభోత్సవంలో బిగ్బాస్ఫేమ్ దివి సందడి (ఫోటోలు)
-
HYD: నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాలా చోట్ల మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కేబీఆర్ పార్క్ దగ్గర, అపోలో జంక్షన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, క్యాన్సర్ ఆస్పత్రుల చుట్టూరా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాలా సేపటి నుంచి పరిస్థితి అలాగే ఉండడంతో వాహనదారులు చిరాకు పడుతున్నారు. సోమవారం సాయంత్రం సైతం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం విశేషం. ఇక ఇవాళ(మంగళవారం) ఉదయం సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పంజాగుట్ట-ఎల్వీప్రసాద్ రూట్లో, పంజాగుట్ట, బేగంపేట దగ్గర్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి యత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వాహనాలు నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. -
పంజాగుట్టలో డైమండ్ షోరూం ప్రారంభోత్సంలో అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫోటోలు)
-
హైదరాబాద్లో మరోసారి దంచికొట్టిన వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్పేట, మణికొండలోనూ వాన కుమ్మేస్తోంది. వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కాగా గతకొన్నిరోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నేడు మరోసారి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Heavy rain at Punjagutta.@HiHyderabad @swachhhyd @balaji25_t @Rajani_Weather @RajenderPHP @PANDARAJATH @sai_koushika @aSouthIndian @puducherri @NallulaHere @GHMCOnline #HyderabadRains pic.twitter.com/ZyPjeWwWZF — Amar⚡ (@amartadi) July 31, 2022 Huge rain at budvel Rajendranagar since 30 mints @Hyderabadrains @balaji25_t pic.twitter.com/Js441CZsBA — L Tarun Kumar (@LTarunKumar1) July 31, 2022 -
అసభ్యకర మెసేజ్లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా అసభ్య మెసేజ్ పంపతూ.. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నటి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. అమీర్పేట, నాగార్జునానగర్ కాలనీలో ఉంటున్న నటి (42) కు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ పదిహేనేళ్లుగా పరిచయం. ప్రవీణ్ భవనాలు నిర్మించే బిల్డర్. 8 ఏళ్ల క్రితం ఆమె వద్ద రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాధితురాలు అపార్ట్మెంట్లో ఉండే మరో మహిళ వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని ప్రవీణ్కు ఇచ్చింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అసభ్యకర మెసేజ్లు పెడుతూ తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి -
పంజాగుట్టలో టీవీ నటి ఆత్మహత్యాయత్నం, నిమ్స్కు తరలింపు
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సదరు నటిని మైథిలిగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసి తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అంతేకాదు తన భర్త బండి సీజ్ చేయాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని మైథిలి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చదవండి: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు అప్పటికే మైథిలి 8 బ్రీజర్లు, స్లీపింగ్ ట్యాబ్లెటను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక ఫోన్ సిగ్నల్స్ ఆధారం పోలీసులు నటి ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని సమీపంలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. కాగా గతంలో కూడా మైథిలి మోతె పీఎస్లో తన భర్తపై కేసు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హైదరాబాద్: అపార్టుమెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: అపార్టుమెంట్లోని ఓ ఫ్లాట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు దాడిచేసి నిర్వాహకుడు, విటుడు, వీరికి సహకరించే వాచ్మెన్ను అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ మక్తాలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంలో పంజగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.నరసింహరాజు తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో సబ్ ఆర్గనైజర్ బీఎస్ మక్తాకు చెందిన దుర్గాప్రసాద్(26), విటుడు శేరిలింగంపల్లికి చెందిన షేక్ తాహేర్(28), వ్యభిచార నిర్వహణకు సహకరిస్తున్న వాచ్మెన్ చంద్రయ్యను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4 వేలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్బెంగాల్కు చెందిన మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు అమర్ అలియాస్ ప్రేమ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైదరాబాద్: నిషేధిత హారన్ కొడుతూ రోడ్లపై దూసుకుపోతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! -
పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని..
సాక్షి, పంజగుట్ట: యువతి కనిపించకుండా పోయిన సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చాంద్రాయణగుట్ట ఇబ్రహీం మజ్జిద్ సమీపంలో నివసించే ఉజ్మా బేగం(22) పంజగుట్టలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఆఫీస్ మేనేజర్కు కొద్దిగా డబ్బులు కావాలని అడిగింది. మేనేజర్ ఏటీఎం కార్డు ఇచ్చి డ్రా చేసుకోవాలన్నాడు. ద్వారకాపూరి కాలనీ సాయిబాబా ఆలయం వద్ద ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని సహోద్యోగికి కార్డు ఇచ్చి మేనేజర్కు ఇవ్వాలని వెళ్లిపోయింది. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆఫీస్లో చుట్టుపక్కల ఆరా తీసినా ఫలితంలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. దీంతో బుధవారం ఆమె తల్లి నజ్మాబేగం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది -
Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. పరారీలో ఇషిక
సాక్షి, పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్పై దాడిచేసిన ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. పంజగుట్ట దుర్గానగర్లో ఓ ఇంటోల స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ నర్సింహరాజు ముందుగా కానిస్టేబుల్ను విటుడిగా పంపారు. వ్యభిచారం జరుగుతోందని తెలుసుకుని ఆకస్మికంగా దాడి చేశారు. నిర్వాహకురాలు ఇషిక పరారీలో ఉండగా డార్జిలింగ్కు చెందిన ఓ బాధితురాలితో ఈ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండువేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (క్షుద్ర భయం కల్పించి.. మూడు నెలలుగా లైంగిక దాడి) -
పాదచారీ.. నీకో దారి!
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు దాటే సమయంలో పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు నిర్మించ తలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్లో (ఎఫ్ఓబీ) అయిదింటిని త్వరలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. వీటి అంచనా వ్యయం దాదాపు రూ.16 కోట్లు. వీటిలో రెండింటికి ఎస్కలేటర్ల సదుపాయం కూడా ఉంది. ఇవి వినియోగంలోకి వస్తే రోడ్డు దాటేందుకు పాదచారుల బాధలు తప్పుతాయి. అయిదు ఎఫ్ఓబీల్లో పంజగుట్ట హైదరాబాద్ సెంట్రల్మాల్, సికింద్రాబాద్ సెయింట్ఆన్స్ స్కూల్వద్ద నిర్మించినవి ఎస్కలేటర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని బహుశా వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్ తెలిపారు. వీటితోపాటు నేరేడ్మెట్ బస్టాప్, రాజేంద్రనగర్ సర్కిల్లోని స్వప్న థియేటర్, బాలానగర్లో మరో మూడు ఎఫ్ఓబీల పనులు పూర్తయ్యాయన్నారు. ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరి ఎఫ్ఓబీ పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు దాటేందుకు అవస్థలు పడుతున్న పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు వంద ప్రాంతాల్లో ఎఫ్ఓబీలు నిర్మించాలనుకున్నప్పటికీ, అంతిమంగా ఇరవై ప్రాంతాల్లో పనులు చేపట్టగా, ఇప్పటికే రెండు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారు. ఒక స్వచ్ఛందసంస్థ అధ్యయనం మేరకు రోడ్డు ప్రమాదాల్లో 52 శాతం రోడ్లు దాటుతుండగా జరిగినవే. ఎఫ్ఓబీలతో ఈ ప్రమాదాలు తగ్గగలవన్నారు. పురోగతిలో పనులు.. కూకట్పల్లి జోన్ రంగభుజంగ థియేటర్, ఖైరతాబాద్ జోన్లో బంజారాహిల్స్లోని జీవీకే వన్, ఎల్బీనగర్ జోన్లో సరూర్నగర్ స్టేడియం, దిల్సుఖ్నగర్ బస్టాప్, మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్, చార్మినార్ జోన్లో శాలిమార్ హోటల్, రక్షాపురం క్రాస్రోడ్స్, శేరిలింగంపల్లి జోన్లో ఖాజాగూడ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఎఫ్ఓబీల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. -
ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన కానిస్టేబుల్
-
సాహసి శ్రావణ్
హైదరాబాద్: పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగతో తల్లీ, కూతురు ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి తన ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా తల్లీకూతుళ్లను రక్షించారు. పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ బి.శ్రావణ్కుమార్ శనివారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో పంజాగుట్ట జూబ్లీమెడికల్ షాపుపైన మంటలు వ్యాపిస్తున్నట్లు సమాచారం అందుకుని వెంటనే అక్కడికి వెళ్లారు. అప్పటికే అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించడంతో పాటు దట్టంగా పొగలు అలుముకున్నాయి. మెట్లపై నుంచి వెళ్లేందుకు వీలులేకపోవడంతో డ్రెయినేజీ పైప్ ద్వారా పైకెక్కిన శ్రావణ్కు నాలుగో అంతస్తులోని ఫ్లాట్లో మౌనిక (13) కేకలు వినిపించాయి. వెంటనే ఆ ఫ్లాట్లోకి దూకి చిన్నారిని రక్షించి టెర్రస్ పైకి తీసుకెళ్లారు. తిరిగి అదే ప్లాట్లోకి వచ్చి మౌనిక తల్లి మహేశ్వరి (35)ని సైతం రక్షించారు. కొద్దిసేపటి తరువాత మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సాహసాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్రెడ్డి శ్రావణ్ను ప్రత్యేకంగా అభినందించారు. -
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా శ్రీనివాస్
పంజగుట్ట: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్యపరచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కోరారు. బుధవారం మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇటీవల మాల మహానాడు రాష్ట్ర కమిటీ రద్దు చేసిన నేపథ్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునిగా జంగా శ్రీనివాస్ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాల మహేశ్, గ్రేటర్ అధ్యక్షునిగా బైండ్ల శ్రీనివాస్ను నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పీవీ రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయా లని, రాష్ట్రంలో మాలలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ముందుండాలని కోరారు. -
ఆరు నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ఒంటిపై పంటిగాట్లు గుర్తించి..
పంజగుట్ట (హైదరబాద్): మైనర్బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. జహీరాబాద్కు చెందిన మహ్మ ద్ మోహిజ్ (20)ఎమ్ఎస్ మక్తాలో నివాసం ఉండే అక్క ఇంట్లో ఉంటూ జూబ్లీహిల్స్లో వెల్డింగ్ వర్క్ చేస్తుంటాడు. ఇతడు అద్దెకు ఉండే ఇంట్లోనే, మరో కుటుంబం అద్దెకుంటోంది. వారి కూతురు (13)ను గత ఆరు నెలలుగా బిల్డింగ్పైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. మంగళవారం బాలిక ఒంటిపై పంటిగాట్లు ఉన్న విషయం కుటుంబసభ్యులు గమనించారు. మహ్మద్ మోహిజ్ చేసే పైశాచికం గూర్చి బాలిక చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు మోహిజ్ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
పంజాగుట్ట రహదారిపై యువతి హల్చల్.. నడిరోడ్డుపై బైఠాయించి..
-
పంజాగుట్ట రహదారిపై యువతి హల్చల్.. నడిరోడ్డుపై బైఠాయించి..
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఓ యువతి హల్చల్ చేసింది. పంజాగుట్ట వైపు నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లే రహదారిపై బైఠాయించి హంగామా సృష్టించింది. రోడ్డుపై బైఠాయించడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకతో మరింత రెచ్చిపోయిన యువతి రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను కింద పడేసింది. పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. ముందుగా మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో యువతిని తరలించడం కష్టతరం మారింది. చివరికి మహిళ కానిస్టేబుల్ సహాయంతో యువతిని పంజాగుట్టు పోలీస్ స్టేషన్కు తరలించారు. చదవండి: మాదాపూర్లో నడిరోడ్డుపై నోట్లకట్టలు.. ట్రాఫిక్ జామ్.. తీరా చూస్తే.. -
జీవో 317ను రద్దు చేయాలి
పంజగుట్ట: జీవో 317తో రాష్ట్రాంలోని లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాజ్భవన్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021 జనగణనలో కుల గణన చేసేలా కేంద్రనికి లేఖ రాయా లని గవర్నర్ను కోరారు. జనవరి 3వ తేదీన బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరం లో జరిగే సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు కావా లని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ జీవో వల్ల స్థానికత, సీనియారిటీ ఉన్న వారిని పక్క జిల్లాలకు బలవంతంగా బదిలీ చేస్తున్నారని, దీంతో వారు సర్వీస్, సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మాదిరిగానే బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన, బిహార్ వాసి అయిన సీఎస్ సోమేష్ కుమార్కు జీవో 317 వర్తింపచేయాలని, అప్పుడు ఉద్యోగుల భాధ ఆయనకు అర్థం అవుతుందన్నారు. తమ విజ్ఞప్తుల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని, జనగణన కోసం కేంద్రానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. -
పంజాగుట్టలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
-
పంజాగుట్ట: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు యువతులు, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. చదవండి: బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం -
వాటా అడుగుతారనే బీసీ జనగణనపై వెనుకడుగు
పంజగుట్ట: బీసీలు వారికి రావల్సిన న్యాయపరమైన వాటా అడుగుతారనే భయంతోనే కేంద్రం బీసీ జనగణన చేపట్టడంలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసి జనగణన చేపట్టాలని టీఆర్ఎస్ కోరినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ జనగణన–కేంద్ర ప్రభుత్వ విధానం, బీసీల తక్షణ కర్తవ్యం’అంశంపై అఖిలపక్ష పార్టీలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో గొల్ల, కురుమ వర్గానికి చెందిన తనను, ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాష్ను రాజ్యసభకు పంపింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. బీసీ జనగణనతో పాటు కులగణన చేపట్టాలనే డిమాండ్తో ఈ నెల 13న ఢిల్లీలో తలపెట్టిన బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశానికి తన పూర్తి మద్దతు తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... కుక్కలు, పిల్లులు అన్నింటికీ లెక్కలు ఉన్నాయి కాని బీసీలకు మాత్రమే లెక్కలు లేకపోవడం బాధాకరమన్నారు. బీసీల లెక్కలు తేల్చకపోతే రాజకీయంగా దెబ్బతింటామని భావించేలా ఉద్యమం చేయాలని, అప్పుడే అన్ని పార్టీలు దిగివస్తాయన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీలతోపాట ఆఖరుకు 9 శాతం ఉన్న ఓసీలు కూడా 10 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, బీఎస్పీ నేత రమేష్, బీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దానకర్ణచారి, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్, బీసీ విద్యార్థి నేత విక్రమ్గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల జనగణన కోసం చలో ఢిల్లీ
పంజగుట్ట: బీసీ జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్తో డిసెంబర్ 13 నుంచి 15 వరకు ‘బీసీల చలో ఢిల్లీ’కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 13న బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీసీ జనగణన చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రశ్నించనందున తాడో పేడో తేల్చుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు 9 రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీల జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాపురం పద్మ, మణిమంజరి, నర్సింహా నాయక్, శ్రీనివాస్ గౌడ్, మాదాసి రాజేందర్, స్వర్ణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
-
Panjagutta: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
హైదరాబాద్: పంజగుట్టలో చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు.. చిన్నారి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నవంబరు 4న దీపావళిరోజు సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం.. ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప! చదవండి: యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం.. -
పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో వీడని మిస్టరీ
-
పంజాగుట్ట బాలిక అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగవంతం
-
పంజాగుట్టలో దారుణం.. చిన్నారి అనుమానాస్పద మృతి
-
పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ముఖం కమిలి పోయి ఎవరో తీవ్రంగా కొట్టినట్లు ఉండగా, కుడి చేయి విరిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ దీపావళి వేడుకల్లో ఉండగా గురువారం ఉదయం సుమారు 9:45 ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పాప మృతదేహాన్ని పంజగుట్ట ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు పడేశారు. పాప గులాబీ రంగు ప్యాంట్, బూడిద రంగు టీషర్ట్ వేసుకుని ఉండగా, ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టారు. పాపను గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసు బృందాల దర్యాప్తు: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా.. తాము ఉదయం 9:15 గంటల ప్రాంతంలో అక్కడే శుభ్రం చేశామని ఆ సమయంలో అక్కడ మృతదేహం కనిపించలేదని చెప్పారు. 9:30 నుంచి 9:45 ప్రాంతంలో అక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు కేసు మిస్టరీగా మారింది. డాగ్ టీం, క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించాయి. బాలిక ముఖంపై ఎవరో కొట్టినట్లు కమిలిపోయి ఉండటం, కుడిచేయి విరిగి ఉండటంతో ఎవరో హత్యచేసి ఉంటారని భావిస్తు న్నారు. గురువారం అమావాస్య ఉండటంతో క్షుధ్రపూజలు ఏమైనా చేశారా అనే దానితో పాటు ఇతర కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. టాస్క్ఫోర్స్, క్రైమ్ టీం, పంజగుట్ట పోలీసులు బృందాలుగా విడిపోయి అన్ని మార్గాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ అంతా బాలిక పోస్టర్లు, సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలు పెట్టి ఎవరికైనా తెలిస్తే సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం గాంధీలో ఇద్దరు ఫ్రొఫెసర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కిడ్నీ పైభాగం, ఊపిరితిత్తుల కింది ప్రాంతంలో బలమైన గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. చదవండి: అన్నయ్య చెప్పినా వినకుండా.. చివరికి ఏం జరిగిందంటే.. -
వ్యభిచారం నిర్వహిస్తున్న ఇళ్లపై దాడి: పలువురి అరెస్టు
సాక్షి,పంజగుట్ట( హైదరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, సీసీఎస్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... కర్నాటకకు చెందిన రాజేష్ నాయక్ (34) నగరంలో ఫలక్నామాలో ఉంటున్నాడు. ఇతను ఎర్రమంజిల్, హిల్టాప్ కాలనీలో ఓ భవనంలో ఫ్లాట్ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడని సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. మంగళవారం రాత్రి దాడి చేసి నిర్వాహకుడు రాజేష్నాయక్తో పాటు ఇద్దరు కస్టమర్లు, ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ నాయక్ను విచారించగా శ్రీనగర్కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఈస్ట్గోదావరి జిల్లాకు చెందిన కె.రాము(28) కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని దానిపై కూడా దాడి చేసి నిర్వాహకుడు రాము, ఒక సెక్స్ వర్కర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య -
త్వరలో శని విరగడ అవుతుంది: కోదండరాం
పంజగుట్ట: ఎవకైనా శని పట్టుకుంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుం దని జ్యోతిష్యులు అంటుంటారని, తెలంగాణ రాష్ట్రాని కి కూడా టీఆర్ఎస్ పాలన అనే శని పట్టుకుని ఏడున్నర సంవత్సరాలు కావొస్తుందని త్వరలోనే ఈ శనికూడా విరగడవుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్, రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మేగజైన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమస్యలపై గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కో దండరాం మాట్లాడుతూ, అక్రిడేషన్ కార్డులు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం వివక్ష చూ పుతోందని, గుర్తింపు కార్డులు ఇస్తే ప్రభుత్వ ఆస్తులు తగ్గుతాయా, బడ్జెట్ నుంచి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతున్నాయా అని ప్రశ్నించారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ..
సినిమా ఇండస్ట్రీలో కథలు రాయడం, సినిమా రిలీజ్ సహా చాలా అంశాలు సెంటిమెంట్తో ముడిపడి ఉంటాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించారు. ఈ క్రమంలో పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉండే ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. నటుడు సునీల్, డైరెక్టర్ దశరథ్లతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కిడి నుంచే త్రివిక్రమ్ ఎన్నో సినిమాలకు కథలు అందించారు. స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలకు ఆ ఇంట్లోనే ఉంటూ త్రివిక్రమ్ మాటలు అందించారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. అయినా తనకు మొదట ఆశ్రయం ఇచ్చిన ఆ అద్దె ఇల్లు అంటే త్రివిక్రమ్కు ఎంతో మమకారమట. అందుకే ఆ ఇంటిని వదులుకోలేక ప్రతి నెల ఐదు వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెంటిమెంట్గా ఇప్పటికీ కొన్ని సినిమాలకు అక్కడి నుంచే కథలు, మాటలు రాస్తారట. ప్రస్తుతం త్రివిక్రమ్కు సొంతంగా ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నా నేటికీ ఆ అద్దె ఇంటిని సెంటిమెంట్గా భావించి అప్పుడప్పుడు అక్కడికి వస్తారని సమాచారం. చదవండి : కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ 'మహమ్మద్ ఖయ్యుమ్'గా సునీల్.. -
ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్
సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఖైరతాబాద్ ప్రేమ్నగర్లో నివసించే బి. కీర్తన (27) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇప్పుడే వస్తానంటూ భర్త ప్రేమ్ సాయికుమార్కు చెప్పి వెళ్ళి అరగంటైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. బంధుమిత్రుల ఇళ్ళల్లో గాలించినా ఫలితం కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలింపు చేస్తున్నారు. జైలుకు వెళ్లొచ్చినా మారలేదు హిమాయత్నగర్: యువతి వెంటపడుతూ వేధిస్తున్న యువకుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. కింగ్కోఠి షేర్గేట్లో నివాసం ఉండే యాంకరింగ్ చేస్తున్న యువతి అదే ప్రాంతంలో నివాసం ఉండే సల్మాన్ఖాన్లు ప్రేమించుకున్నారు. గత ఏడాది ఇద్దరి మధ్య వాగ్వివాదాలు రావడంతో..యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. తరువాత కొద్దిరోజులుగా యువతి ఇంటి వద్దకు వచ్చి నిలబడటం, యువతిని వెంబడించడం, ఫోన్ మాట్లాడుతూ యువతిని తిట్టడం లాంటివి చేస్తున్నాడు. ఆమెతో మాట్లాడకపోయినా ఫాలో అవుతున్న తీరును చూసిన యువతి తల్లి బుధవారం యువతితో కలసి మరోమారు కేసు పెట్టింది. దీంతో గురువారం సల్మాన్ఖాన్ను కోర్టులో హాజరుపరచగా 14రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. చదవండి: భర్త ఇంట్లో ఉండగా.. తాళం వేసి బయటి వెళ్లి.. -
పంజగుట్ట వంతెన నిర్మాణంలో జాప్యం.. రూ.లక్ష జరిమానా
సాక్షి, బంజారాహిల్స్: పంజగుట్ట చౌరస్తాలో పాదచారుల వంతెన నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తవుతుందని ఇంజనీర్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతేడాది లాక్డౌన్ సమయంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. అడుగడుగునా పైప్లైన్లు అడ్డురావడం ఆటంకంగా మారింది. ఆరు వారాల్లో పూర్తి కావాల్సిన పనులు ఏడాదిన్నర గడిచినా పిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్కు లిక్విడిటీ డ్యామేజ్ కింద రూ.లక్ష జరిమానా విధించారు. సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా తీవ్ర జాప్యం చేయడంతో ఈ జరిమానా విధించినట్లు ఇంజనీర్లు తెలిపారు. -
మోడల్ హంట్.. ఫ్యాషన్ ఈవెంట్
-
కరోనాతో పంజగుట్ట పోలీస్ మృతి
సాక్షి, గాంధీఆస్పత్రి: కరోనా సెకండ్ వేవ్.. కరోనా వారియర్స్పై పంజా విసురుతోంది. పంజగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ కుమార్చారి కరోనా పాజిటివ్తో కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి అతడు మృతి చెందాడు. 2014 బ్యాచ్కు చెందిన విజయ్కుమార్ మృతిపట్ల పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. -
బంజారాహిల్స్లోయువతి కిడ్నాప్.. బలవంతంగా బైక్పై ఎక్కించి..
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్లో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని ఆల్మండ్ హౌస్ వెనుకాల నిర్మానుష్య చీకటి ప్రదేశంలో మద్యంమత్తులో ఉన్న ముగ్గురు యువకులు బైక్లపై వచ్చి ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ యువతి కూడా మద్యం మత్తులో ఉండగా ఆమెను తమ బైక్పై ఎక్కించుకునేందుకు తీవ్రంగా యత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు కిందపడుకుంది. అయితే అప్పటికే బైక్ స్టార్ చేసి ఓ యువకుడు సిద్ధంగా ఉండటంతో యువతి ‘హెల్ప్హెల్ప్’ అంటూ అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడికి చేరుకునే లోపే ఆమెను ఓ యువకుడు బలవంతంగా బైక్పై కూర్చుండబెట్టుకొని ఉడాయించాడు. స్థానిక మహిళలు పరిగెత్తుకుంటూ వచ్చేలోపే యువకులంతా బైక్లపై పరారయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఆరా తీశారు. ఆ యువతి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా స్పష్టమైన దృశ్యాలు నమోదు కాలేదు. అయితే బలవంతంగా యువతిని బైక్పై ఎక్కించుకొని పరారవుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. రాత్రంతా మూడు పోలీసు బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాయి. నిర్మానుష్య ప్రాంతామే కాకుండా చీకటి ఉండటంతో ఇక్కడ దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో సరిగ్గా నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తమకు ఇంత వరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్కు గురైన యువతి ఎవరన్న దానిపై స్పష్ట రావడం లేదు. యువతి అదృశ్యం పంజగుట్ట: యువతి అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో నివసించే గౌతం దుర్గేశ్వరి(18) పంజగుట్టలోని ఓ షాప్లో సేల్స్గర్ల్గా పనిచేస్తుంది. మంగళవారం రోజూ మాదిరిగానే విధులకు వెళ్లిన దుర్గేశ్వరి తిరిగి ఇంటికి రాలేదు. షాపులో సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 7:10కి షాపు నుంచి వెల్లిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, చుట్టుప్రక్కల సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616365 నెంబర్లో సంప్రదించాలని ఎస్సై సతీష్ తెలిపారు. చదవండి: విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఘోరం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..! -
బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు..
సాక్షి, పంజగుట్ట: జోగిని శ్యామలతోపాటు మరో 15 మందిపై పంజగుట్ట పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యింది. అనంతరం సదరు కేసును మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్కు బదలాయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాందీనగర్కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ఈ నెల 12వ తేదీన మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని నాగసాన్పల్లిలోని వనదుర్గ భవాణి దేవి దేవాలయానికి వెళ్లింది. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత అదే దేవాలయానికి వచ్చిన జోగిని శ్యామలను కలిసింది. శ్యామల తాను ఉంటున్న ప్రదేశానికి రావాలని సదరు యువతి, ఆమె తల్లిని ఆహ్వానించింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ అక్కడకు వెళ్లారు. అక్కడ శ్యామలతో పాటు మరో 15 మంది యువకులు, హెల్పర్ ఉమ ఉంది. ఈ క్రమంలో వారు మద్యం తాగుతుండగా యువతిని కూడా మద్యం తాగాలని ఒత్తిడి చేశారు. తాను దానికి ఒప్పుకోలేదని, దీంతో బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా బాధిత మహిళను, ఆమె తల్లిపై దాడి చేసి విపరీతంగా కొట్టి గాయపరిచారని పేర్కొంది. బాధితురాలు డ్రైవర్ సాయంతో అక్కడ నుంచి తప్పించుకుని 13వ తేదీ నగరానికి చేరుకున్నట్లు, గాయాలు కావడంతో నేడు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పంజగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసి పాపన్నపేట పోలీస్స్టేషన్కు బదలాయించారు. చదవండి: డాన్ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్ హత్య ఇద్దరూ తోడుగా వెళ్లారు.. ఒక్కరే తిరిగొచ్చారు! -
ఆస్పత్రిలో దంపతుల మృతి.. బెడ్ పక్కనే సూసైడ్ నోట్!
పంజగుట్ట: ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో భార్య, అపస్మారక స్థితిలో పడి చికిత్స పొందుతూ ఆమె భర్త మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే .. రహమత్నగర్లో నివసించే ఎన్.సుబ్బారావు కారు డ్రైవర్. ఇతడి భార్య ఎన్.సాయిలక్ష్మి(42) గృహిణి. సాయిలక్ష్మికి బ్రైయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స నిమిత్తం రాజ్భవన్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు సహాయకుడిగా భర్త సుబ్బారావు అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీన ఉదయం ఆస్పత్రి సిబ్బంది వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సిబ్బంది కూకట్పల్లి బాలాజీనగర్లో నివసించే వీరి కూతురు ఎన్.శివాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె ఉదయం 4:30 గంటల లోపు అక్కడకు వచ్చి చూసే సరికి తండ్రి అపస్మారక స్థితిలో ఉండగా తల్లి అప్పటికే మృతి చెందింది. ఇక, సుబ్బారావును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అతడు కూడా శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి బెడ్ పక్కనే సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ఆస్పత్రి సిబ్బందికి తన చావుకు ఎలాంటి సంబంధం లేదు. మానసిక వ్యధతో చనిపోతున్నాను. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమ దహన సంస్కారాలు చేయాలని రాసి ఉంది. కాగా అనారోగ్య సమస్యలతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక భార్యను గొంతునులిమి చంపి తర్వాత సుబ్బారావు ఏదైనా విష ప్రయోగం చేసుకున్నాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సెక్షన్–174, 309 ఐపీసీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెట్టుపై కూర్చున్నట్లుగా యువతి మృతదేహం.. అసలేం జరిగింది? -
పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది
-
పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్స్కు ఏర్పాటు చేసిన డెకరేషన్స్ సామాగ్రికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. నల్లని పొగ కమ్మేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. అగ్నిప్రమాదంతో పంజాగుట్ట వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. చదవండి : (పెళ్లి విషయం దాచిపెట్టి ప్రేమ నాటకం.. దాంతో) ('అమృత్ మహోత్సవ్'కు ప్రధాని మోదీ శ్రీకారం) -
పంజాగుట్ట: ఇంట్లో చొరబడి యువతిపై అత్యాచారం
సాక్షి, హైదరాబాద్ : ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..డీఎస్ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవలె కుటుంబసభ్యులు స్వస్థలం మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23)ఇంట్లోనే ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకు నుంచి వచ్చామంటూ ఇంట్లోకి ప్రవేశించారు. ఓ వ్యక్తి ఇంటి బయట కాపలా ఉండగా, మరొక వ్యక్తి పాలసీ పేరుతో యువతితో మాటలు కలిపి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతిని వివస్త్రను చేసి లైంగిక దాడి అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చదవండి : (పెట్రోల్తో భార్యకు నిప్పంటించి..) (బయటకు వెళ్లకుండా తల వెంట్రుకలను కట్ చేయించి..) . -
హైదరాబాద్ ట్రాఫిక్; ఈ రూట్లో వెళ్లకపోవడమే బెటర్!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణం వాహన చోదకులకు నిత్యనరకంగా మారుతోంది. గత రెండు రోజులుగా ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీఐపీలు బయటకు వచ్చినప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపి వేస్తుండటంతో హైదరాబాదీలు ఇక్కట్ల పాలవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ స్తంభించింది. గురువారం కూడా ఇదే సీన్ రిపీటయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్యారడైజ్ నుంచి బేగంపేట వరకు గంటల తరబడి ట్రాఫిక్ జామయింది. ఇక బంజారాహిల్స్ రోడ్ నంబరు 1, 3లతో పాటు పంజాగుట్ట ఫ్లైఓవర్పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంబులెన్స్లు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సహనం కోల్పోయిన వాహనదారులు పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులతో వాదనలకు దిగారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ నిలిపివేయడం సరికాదని భాగ్యనగర వాసులు మండిపడుతున్నారు. మామూలుగానే బేగంపేట మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బేగంపేట ఫ్లైఓవర్ మీద ఏదైనా వాహనం ఆగిపోతే అంతే సంగతులు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే. ఇక ప్రముఖుల రాకపోకల సమయంలోనూ వాహనాలను నియంత్రించడం వల్ల ట్రాఫిక్కు త్రీవ అంతరాయం కలుగుతోంది. అయితే వీఐపీలు రావడానికి చాలా సమయం ముందే పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారని చోదకులు ఆరోపిస్తున్నారు. వీఐపీలు వెళ్లడానికి కొద్ది సమయం ముందు వాహనాలను నియంత్రిస్తే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికీ తీరతాయోనని ఈ మార్గంలో ప్రయాణించే వారు వాపోతున్నారు. చదవండి: ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి గర్భిణి మృతి 22 రెగ్యులర్ రైళ్లకు పచ్చజెండా -
సినీ నిర్మాత సాగరికపై ఫిర్యాదు
పంజాగుట్ట: ఒప్పందం ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాతపై చర్యలు తీసుకోవాలంటూ ఓ నటుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాలోని పడాల రామిరెడ్డి లా కాలేజీ సమీపంలో నివాసముంటున్న సినీ నటుడు కెప్టెన్ చౌదరీ 2018లో రాధాకృష్ణ అనే చిత్రంలో నటించాడు. ఇందుకుగాను నటించే సమయంలో రోజుకు 30000 రూపాయలు రెమ్యూనరేషన్ అందించడంతోపాటు రవాణా, అసిస్టెంట్లకు సైతం వేతనాలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నామని కెప్టెన్ చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సినీమాలో 14రోజులపాటు నటించిన తనకు ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాత సాగరికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అయన కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని.. -
మాయమైపోతున్న మనిషి!
సాక్షి, హైదరాబాద్: రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను వేట కొడవళ్లతో నరికి చంపుతుండగా వంద మందికిపైగా ప్రత్యక్ష్యంగా చూశారు. అయినా ఈ పాశవిక ఘటనను ఒక్కరంటే ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం సమాజంలో మానవ విలువలు మృగ్యం అవుతున్నాయనేందుకు నిదర్శనం. పాత కక్షల కారణంగా జరిగిన జంటహత్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పట్టపగలు, నడిరోడ్డు మీద కాపుకాసి, దాడి చేసి అత్యంత పాశవికంగా హతమార్చిన తీరు చాలా ఆందోళనకరం. మంథని డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల నిండా జనం ఉన్నారు. ఆ బస్సులు హత్య జరుగుతున్నంత సేపు హత్యోదంతాన్ని చూసి, నిందితులు పరారయ్యాక అక్కడి నుంచి కదిలారు. అంతేకాకుండా కల్వచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆ దారి వెంబడి వెళ్తున్న వారు, బైక్పై వెళ్తున్నవారు దాదాపు 100 మందికిపైగా అక్కడే ఆగిపోయారు. దారుణం జరుగుతున్నంత సేపు తమ జేబుల్లో ఉన్న సెల్ఫోన్లకు పనిచెప్పారే తప్ప.. ఎవరూ కూడా వారిని ఆపేందుకు సాహసించలేదు. నిందితులు అక్కడ నుంచి వెళ్లిపోయారని నిర్ధరించుకున్నాక.. కొన ఊపిరితో ఉన్న వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తూ వీడియోలు తీశారు. పట్టపగలు జరిగిన ఈ ఘోరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు వంద మంది. వీరిలో చాలామంది వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి సోషల్మీడియాలో పోస్టులు, స్టేటస్లు పెడుతూ సమాజాన్ని, పోలీసులను, రాజకీయ నేతలను నిందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్నప్పుడు హత్యోదంతాన్ని వేడుకలా చూసి, తీరా అక్కడి నుంచి వెళ్లిపోయాక బాధ్యత, సమాజం, అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ఖండిస్తున్నారు. అసలు ప్రత్యక్ష సాక్షులు అంతమంది ఉన్నా.. వారిలో ఎంతమంది కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతారన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిందే. హేయమైన చర్యలు.. రాజకీయ నేతలే ఇలాంటి హత్యలకు దిగడం అత్యంత హేయమైన చర్చగా చెప్పొచ్చు. అందులోనూ హైకోర్టు లాయర్లయిన గట్టు వామనరావు, పీవీ నాగమణిలను వేటాడి వేట కొడవళ్లతో నరకడం చాలా దారుణం. రాష్ట్రంలో ఇలాంటి ఘటన మొదటిది కాదు. గతంలోనూ పలు ఉదంతాలు జరిగాయి. అయితే, అందులో బాధితులు, నిందితులు సామాన్యులు. కానీ ఈ ఘటనలో సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వ్యక్తుల హస్తం ఉండటం అన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో పట్టపగలు జరిగిన దారుణ హత్యలన్నీ కూడా హైదరాబాద్లోనే చోటు చేసుకున్నాయి. ఈ వికృత సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగించే పరిణామం. రాళ్లతో నుజ్జునుజ్జుగా.. (రాజేంద్ర నగర్ హత్య జనవరి11, 2021) రాజేంద్రనగర్లో జనవరి 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఖలీల్ను అత్తాపూర్లో నడిరోడ్డు మీద ప్రజలంతా చూస్తుండగా అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేస్తూ, తరుముతూ గాయపరిచారు. కిందపడిన వెంటనే వ్యక్తి చనిపోయాడు. రాళ్లతో శవాన్ని కొడుతూ, నుజ్జునుజ్జుగా చేస్తూ తమ పాశవికతను ప్రదర్శించారు. ఈ హత్యను పలువురు వాహనదారులు వీడియోలు తీసి వైరల్ చేశారు. పంజగుట్ట పోలీస్స్టేషన్ ముందే.. (జూన్ 26, 2019) హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజగుట్ట ఠాణా ముందు జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. సయ్యద్ అన్వర్ అనే ఆటోడ్రైవర్పై మరో ఆటోడ్రైవర్ రియాసత్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ ప్రాణ భయంతో పంజగుట్ట స్టేషన్లోకి పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్ కన్నుమూశాడు. ఈ హత్యోదంతం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. దగ్గరికి వెళ్లేందుకు జంకిన పోలీసులు.. (నయాపూల్ మర్డర్.. 2018, నవంబర్ 28) ఆటోడ్రైవర్ గొంతుకోసి, పోలీసుల ముందే 2018 నవంబర్లో నయాపూల్ వంతెన పక్కన జరిగిన మరో హత్య కూడా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. షకీర్ ఖురేïÙ, అబ్దుల్ ఖాజా ఇద్దరూ ఆటోడ్రైవర్లు. ఆటో అద్దెల విషయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అవి తీవ్రమవడంతో షకీర్ ఖురేïÙని అబ్దుల్ ఖాజా కత్తితో పొడిచి చంపాడు. షకీర్ను చంపాక, ఖాజా అక్కడే కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. ఈ హత్య అనంతరం నిందితుడిని పోలీసులు కనీసం ప్రతిఘటించలేకపోవడం, కనీసం అతడిని సమీపించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పోలీసుల ముందే హత్య.. అత్తాపూర్ మర్డర్ (సెప్టెంబర్ 26, 2018) 2018 సెపె్టంబర్ 26న అత్తాపూర్ పిల్లర్ నంబర్ 138 వద్ద రమేశ్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. మహేశ్ అనే యువకుడి హత్య కేసులో రమేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా.. మహేశ్ తండ్రి రమేశ్ను అత్తాపూర్ వద్దకు రాగానే మరో వ్యక్తి సాయంతో గొడ్డళ్లతో నరికి చంపాడు. ఈ హత్య జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు, పెట్రో కార్ సిబ్బంది కనీసం స్పందించలేదు. మనకెందుకులే అన్న ధోరణి సమాజంలో తోటి మనిషి పట్ల జాలి చూపే గుణం రోజురోజుకూ తగ్గిపోతుంది. ముఖ్యంగా గతంలో రోడ్డుపై ఎవరైనా దాడి చేస్తుంటే.. దారిన వెళ్లేవాళ్లు నచ్చజెప్పేవారు, వారిని నిలువరించేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. జరుగుతున్న దాడిని ఆపాల్సింది పోయి జేబులోని సెల్ఫోన్ తీసి వీడియోలు తీసే సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. కనీస బాధ్యతగా రక్షించాల్సిన తోటిపౌరులే ప్రేక్షకులుగా మారడం శోచనీయం. ‘ఎవరిని ఎవరు చంపితే మనకెందుకులే మనం బానే ఉన్నాం కదా’అనే సంకుచిత ధోరణి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారే తాము ఎలాంటి సాయం చేయకపోగా.. వ్యవస్థలను నిందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. –వీరేందర్, సైకాలజిస్టు చదవండి: న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
ఆస్పత్రి నిర్వాకం: ‘కనుపాప’ను దూరం చేశారు
సాక్షి, హైదరాబాద్: లేకలేక ఆ దంపతులకు పుట్టిన ‘కనుపాప’ను వైద్య నిర్లక్ష్యం దూరం చేసింది. దృష్టి లోపాన్ని సరిదిద్దుకొని రంగుల ప్రపంచాన్ని చూడాలనుకున్న ఆ చిన్నారిని మత్తుమందు శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లింది. మోతాదుకు మించి అనస్తీ్తషియా ఇవ్వడం వల్ల కంటి సర్జరీకి ముందే ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఆల్విన్ కాలనీ సమీపంలోని శంషాగూడకు చెందిన పానీపూరి వ్యాపారి గణపతిరెడ్డి, కీర్తి దంపతులకు పెళ్లైన పన్నెండేళ్ల తర్వాత కుమారుడు ప్రశాంత్ (12) జన్మించాడు. అయితే చిన్నతనం నుంచే అతనికి కంటిచూపు సరిగా లేదు. దీంతో తమ కుమారుడికి చికిత్స చేయించాలని తల్లిదండ్రులు భావించారు. ఈ నెల 20న పంజాగుట్టలోని అగర్వాల్ కంటి ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు... రెండు కళ్లలోనూ పొరలున్నాయని, వాటిని తొలగించేందుకు రెండింటినీ ఒకే సమయంలో సర్జరీ చేయాలని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఈ నెల 21న వైద్యులు సర్జరీకి సిద్ధమయ్యారు. చికిత్స సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియనిస్ట్ మత్తుమందు ఇచ్చాడు. అయితే మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో బాలుడు చికిత్సకు ముందే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. చదవండి: (భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు) గుట్టుచప్పుడు కాకుండా... ఆపరేషన్ థియేటర్ టేబుల్పై అచేతన స్థితిలో పడి ఉన్న బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యులు అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తమ వల్ల కాదని, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో అదే ఆస్పత్రి అంబులెన్సులో బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడాల్సిందిగా తల్లిదండ్రులు ఆ ఆస్పత్రి వైద్యులను వేడుకోవడంతో వారు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు మృతిచెందినట్లు సోమవారం రాత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆస్పత్రి వైద్యులు తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తమ బిడ్డ మరణించాడంటూ తల్లిదండ్రులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం పంజాగుట్ట అగర్వాల్ కంటి ఆస్పత్రిలో వైద్యం వికటించి ఇద్దరికి పూర్తిగా చూపు పోయిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజగుట్ట పీఎస్లో కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రికి తాళం.. వైద్యులు పరార్ బాలుడు మృతి చెందిన విషయం తెలిసి బంధువులు భారీగా ఆస్పత్రికి చేరుకొని వైద్యు లను నిలదీశారు. దీంతో పోలీ సులకు సమాచారం ఇచ్చిన వైద్యులు... ఆ తర్వాత ఆస్పత్రికి తాళం వేసి పరారైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మా తప్పేమీ లేదు: అగర్వాల్ కంటి ఆస్పత్రి ‘కొందరు పిల్లలకు మత్తుమందు పడదు. లక్ష మందిలో ఒకరిలో ఇలాంటి రియాక్షన్స్ వెలుగు చూస్తాయి. సర్జరీకి ముందే కార్డియాక్ అరెస్ట్ అయి అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిం చాం. చికిత్సలో వైద్యుల తప్పిదం లేదు. వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తగు మోతాదులో మత్తుమందు ఇచ్చాం. అధిక డోసు ఇచ్చామనే ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని మీడియా బులెటిన్లో అగర్వాల్ కంటి ఆస్పత్రి పేర్కొంది. -
వివాహేతర సంబంధం: భర్త దారుణ హత్య
సాక్షి, పంజగుట్ట: ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది. సోమవారం పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్కు చెందిన లక్ష్మణ్ ఝా, ఖుష్బూ దంపతులు మక్తా, రాజ్నగర్లో నివాసముంటున్నారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా, పగలు జ్యూస్షాపు నడుపుతూ లక్ష్మణ్ జీవనం సాగిస్తున్నాడు. దీంతో న్యూరాలజీ సమస్య వచ్చింది. ఇతని జ్యూస్ సెంటర్ వద్ద లక్ష్మణ్ దూరపు బంధువు లాల్బాబు పనిచేస్తుంటాడు. లక్ష్మణ్కు మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చేందుకు ఖుష్బుదేవి వస్తుండేది. ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్డౌన్ అనంతరం లాల్బాబు మరోచోట పనిచేయడం ప్రారంభించాడు. అయినా వీరి మధ్య బంధం కొనసాగింది. దీంతో లక్ష్మణ్ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ పడుకున్నాక లాల్బాబు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్ చేతులు కట్టేశారు. ఖుష్బుదేవి లక్ష్మణ్ ఛాతీపై కూర్చుని చున్నీ మెడకు బిగించి ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కి చంపేశారు. ఉదయం లక్ష్మణ్ సోదరుడికి ఖుష్చుదేవి ఫోన్ చేసి నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. మెడపై గాట్లు చూసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. -
కిలాడి లేడీ అరెస్ట్: రూ 8 కోట్లకు టోకరా
సాక్షి, పంజగుట్ట: ఓ వ్యక్తిని సుమారు రూ.8 కోట్ల మేర మోసం చేసిన కేసులో మహిళను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్భవన్ రోడ్డులోని సేథీ టవర్స్కు చెందిన పి.విజయ్ ఎన్.రాజు ఇన్వెస్టర్. 2013లో అతని వద్దకు కూకట్పల్లి, వసంత్నగర్కు చెందిన శ్రీనివాస రాజు, కేపీహెచ్బీకి చెందిన సామల పద్మజ, ఆమె భర్త సామల నర్సిరెడ్డి, సోదరి విజయలక్ష్మి, సురేష్బాబులు వచ్చారు. పద్మజ తమకు గోపనపల్లిలోని సర్వేనెంబర్ 124/2 నుండి 124/5 వరకు 6.20 ఎకరాల స్థలం ఉందని, ఆ స్థలంలో విల్లాల నిర్మాణం చేపడతామని చెప్పారు. సదరు స్థలంపై బ్యాంకులో రుణం ఉందని, ఆ రుణం మీరు తీరిస్తే మీకు రెండున్నర ఎకరాల స్థలం ఇస్తామని చెప్పారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు. దీంతో బ్యాంకుకు సుమారు రూ.5 కోట్లు చెల్లించడమే కాకుండా, రూ.3 కోట్లు వారివద్ద ఇన్వెస్ట్ చేశాడు. వారు బ్యాంకు నుంచి కాగితాలు తీసుకున్నారు. ఆ స్థలంలో విల్లాల నిర్మా ణం చేయకపోగా ఇస్తామన్న రెండున్నర ఎకరాలు కూడా ఇవ్వకుండా మోసం చేశా రు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పంజగు ట్ట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సామల పద్మజ మిగిలిన వారిపై కేసు నమోదు చేశారు. గోవాలో ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపి సామల పద్మజను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఐపీఎల్ బెట్టింగ్కు యువకుడు బలి
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఒక యువకుడి ప్రాణం తీసింది. వివరాలు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ యాదవ్ (19) పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీలో స్నేహితులతో కలిసి కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్లో పాల్గొంటున్న సోను కుమార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు.కాగా మంగళవారం ఉదయం స్నేహితులు బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లోని గ్రిల్ కు ఉరి బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చి..
సాక్షి,హైదరాబాద్ : కరోనాతో ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా రాకుండా ఉండేందుకు మందు తెచ్చానని తండ్రికి తాగించి, తాను కూడా తాగాడు. యువకుడు మృతి చెందగా అతని తండ్రి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. అదృష్టవశాత్తూ తల్లి పనిలో ఉండి తర్వాత తాగుతాననడంతో ఆమె బతికి బయటపడింది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ హిల్స్ కాలనీలోని గిరిశిఖర అపార్ట్మెంట్లో నివసించే అల్లంపాటి రామిరెడ్డి (61), ఎ.శ్రావణి రెడ్డిలు భార్యాభర్తలు. వీరికి ఎ.అనీష్ రెడ్డి (33) కొడుకు ఉన్నాడు. (చదవండి : తండ్రీ- ఇద్దరు కొడుకులు కరోనాతో మృతి..) అనీష్ రెడ్డి ఐటీ సంస్థల్లో క్యాంటీన్లు నిర్వహిస్తుంటాడు. ఆరు నెలలుగా కరోనా వల్ల ఐటీ సంస్థలన్నీ వర్క్ఫర్ హోం పెట్టాయి. దీంతో ఇతని క్యాంటీన్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. తీవ్ర మనస్థాపానికి గురైన అనీష్ రెడ్డి గత కొంత కాలంగా తీవ్రంగా మానసిక క్షోభలో ఉన్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చనిపోతే ఈ ఏజ్లో తల్లిదండ్రులు ఎలా బతుకుతారు అనుకున్నడో ఏమో అనీష్ రెడ్డి బుధవారం రాత్రి 11:10 ప్రాంతంలో గుర్తుతెలియని మందు ఇంటికి తీసుకువచ్చాడు. ఇది కరోనా రాకుండా ఉండే మందు అని నమ్మబలికాడు. మొదట తండ్రి రామిరెడ్డికి తాగించాడు. తల్లిని కూడా తాగమనగా తాను వంటచేస్తున్నాను తర్వాత తాగుతాను అని చెప్పడంతో అనీష్ రెడ్డి కూడా తాగాడు. పది నిమిషాల తర్వాత తల్లి వంటగది నుండి బయటకు రాగా ఇద్దరూ వాంతులు చేసుకుంటున్నారు. దీంతో కంగారు పడ్డ శ్రావణి రెడ్డి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఇద్దర్నీ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనీష్ రెడ్డి మృతి చెందగా, రామిరెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ప్రస్తుతం క్రిటికల్ కేర్లో చికిత్స పొందుతున్నాడు. -
ప్రాథమిక ఆధారాల తర్వాతే నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘పంజాగుట్ట అత్యాచార కేసు’లో దర్యాప్తు నకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ కేసు నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ కావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళా ఠాణా ఏసీపీ శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. ఈమె శనివారం బాధితురాలితో మాట్లా డారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడిస్తానంటూ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. తనపై 11 ఏళ్ళుగా 143 మంది అత్యాచారానికి ఒడిగట్టారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొం టున్న వారికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే వారిపై తదుపరి చర్యలు చేపట్టాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. మరోపక్క బాధితురాలితో ఫిర్యాదు చేయించిన గాడ్ పవర్ ఫౌండేషన్కు చెందిన రాజా శ్రీకర్ అలియాస్ డాలర్ భాయ్ వ్యవహారమూ ఈ కేసులో కీలకంగా మారింది. 4నెలల కిందట స్వచ్ఛంద సంస్థగా దీన్ని రిజిస్టర్ చేయించిన అతడు సోమాజిగూడ కేంద్రంగా నిర్వహి స్తున్నాడు. ఈ కేసు నమోదైన తర్వాత యువతి ఫిర్యాదులోని అంశాల ఆధారంగా జాబితాలోని నిందితులకు కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వారిని ఇతడు బెదిరించినట్లు కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో ఈ కేసులో డాలర్ భాయ్ పాత్రపై పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. బాధితు రాలు ఫిర్యాదు చేసేందుకు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసేందుకు సహకరి స్తున్నట్లు నటిస్తూ తన స్వలాభం చూసుకు న్నాడా? అనే కోణంలో పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. దీంతో డాలర్ భాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిం చారు. అక్కడ పోలీసులకు కొందరు యువతుల సర్టిఫికెట్లు, బయోడేటాలు లభించాయి. దీంతో ఇతడి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ సంస్థ కార్యాలయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సర్టిఫికెట్లు, బయోడేటాల్లోని వివరాల ఆధారంగా యువతుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీ లభించిన తర్వాత మాట్లాడితేనే డాలర్ భాయ్కి సంబంధిం చిన మరిన్ని కోణాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే కార్యాల యంలో కొన్ని ఆడియో, వీడియో టేపుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా బ్లాక్మెయిలింగ్కు సంబంధించినవే అని అనుమానిస్తున్నారు. కాగా, డాలర్ భాయ్పై అతని భార్య గతంలోనే సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యి చార్జిషీటు కూడా దాఖలైంది. ఇప్పుడు ఆ కేసు స్థితిగతుల్నీ అధికారులు ఆరా తీస్తున్నారు. -
పంజాగుట్ట సర్కిల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
వైఎస్సార్ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు
సాక్షి, పంజాగుట్ట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు దేశవ్యాప్తంగా పాలకులు అందరూ పాటిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్సార్ అని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 71వ జయంతిని పురస్కరించుకుని పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. (నాలో... నాతో.. వైఎస్సార్) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు, విద్యార్థులకు, మహిళలకు.. వైఎస్సార్ ఒక ల్యాండ్ మార్క్ను క్రియేట్ చేశారన్నారు. తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకు తాము విశేషంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కెవీపీ రామచంద్ర రావు, అంజన్ కుమార్ యాదవ్, వంశీచంద్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ పలువురు నేతలు పాల్గొన్నారు. (తాడిపత్రిపై రాజన్న ముద్ర..) -
పంజాగుట్టలో దోపిడి దొంగల హల్చల్
-
పంజాగుట్టలో దోపిడి దొంగల హల్చల్
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో దోపిడి దొంగలు హల్చల్ చేశారు. ముగ్గురు మహిళలు నివాసం ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా చోరీకి ప్రయత్నించారు. అయితే దొంగలను అడ్డుకునేందుకు మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగ ఓ మహిళపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో మహిళ తలపై తీవ్రగాయలవ్వగా.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. -
లిస్బన్ పబ్పై పోలీసుల దాడి..
సాక్షి, హైదరాబాద్: పంజగుట్టలోని లిస్బన్ పబ్పై పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా పబ్లో గానాబజానా సాగుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఫీజు లేకుండానే యువతులను ఉచితంగా పబ్లోకి నిర్వాహకులు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గర్ల్ఫ్రెండ్ లేకుండా వచ్చే యువకులకు పబ్ నిర్వాహకులే డ్యాన్సర్ల సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో యువతుల్ని వ్యభిచారంలోకి దింపి.. డబ్బులు దండుకుంటున్నారని నిర్వాహకులపై ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా పబ్లో డ్యాన్సర్లతో అర్ధనగ్న వస్త్రాలతో, మద్యం మత్తులో నృత్యాలు చేయిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఈ పబ్ ఎదుటే ఓ డ్యాన్సర్ను వివస్త్రను చేసిన ఘటన కలకలం రేపింది. తాజా దాడిలో 21 మంది యువతులతోపాటు, 9 మంది యువకులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.47 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. -
సందడిగా హాలోవీన్ నైట్
-
చలో ప్రగతి భవన్: నగరంలో భారీ ట్రాఫిక్ జామ్!
-
సికింద్రాబాద్ టు పంజాగుట్ట భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో ప్రగతి భవన్కు దారితీసే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ప్యారడైజ్నుంచి బేగంపేట వరకు ప్రస్తుతం వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ మార్గం మీదుగా ప్రగతి భవన్కు రాకుండా కాంగ్రెస్ శ్రేణులను నిలువరించేందుకు పోలీసులు బేగంపేటలో మోహరించారు. ఇక్కడ ఆందోళనకారులు కనిపించిన వెంటనే అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ప్రగతి భవన్ వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వాహనదారులకు రోడ్డుమీద తీవ్ర పడిగాపులు తప్పడం లేదు. మరోవైపు ఈ మార్గంలోని మెట్రరైల్ స్టేషన్లలోనూ పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనకారులు మెట్ర రైళ్లలో ప్రగతి భవన్కు చేరుకోకుండా ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. ఇక, సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో నగరంలో రద్దీ భారీగా పెరిగింది. నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ నిదానంగా కదులుతోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికులు, స్కూలు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పలు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకుంది. నగరంలో చెప్పుకోదగిన స్థాయిలోని ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే, ఇవి ఏమాత్రం సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు తగినంత అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు పెద్దసంఖ్యలో సెట్విన్ బస్సులపై ఆధారపడుతున్నారు. దీంతో సెట్విన్లు చోటులేనంతగా. కిక్కిరిసిపోతున్నాయి. పలుచోట్ల సెట్విన్బస్సుల్లో మహిళలు సైతం ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. -
వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారంపై పంజాగుట్ట పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడలోని శ్రీతి నిలయం అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఎస్సై మహ్మద్ జాహిద్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగయ్య, ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకులు భానుప్రకాష్, పవన్లతో పాటు నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకులను రిమాండ్ తరలించి, యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. -
పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్ట ఫ్లై ఓవర్పై శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న కారు, బైక్ ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మహ్మద్ తాజుద్దీస్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడి మృతి చెందారు. మృతుడు నగరంలో ఓ పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆటోవాలాల ఫైట్.. ఒకరి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మహ్మద్ అన్వర్ అనే డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. రియాసత్ అలీ అనే వ్యక్తి మహ్మద్ అన్వర్పై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అన్వర్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని రియసత్ అలీని అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. -
పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలి
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట చౌరస్తాలో బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, భాజపా నేత కిషన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే అంబేడ్కర్ విగ్రహం తొలగించిన ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ విగ్రహాన్ని కూల్చివేసిన తర్వాత ప్రభుత్వ పెద్దలు కొన్ని ప్రకటనలు చేసి దిద్దుబాటు చర్యలు తీçసుకోకపోవడాన్ని గవర్నర్కు తెలిపినట్లు చెప్పారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన స్థానంలోనే కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పోరాటాలను ఈ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తోందని కిషన్రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని అవమానించేలా వ్యవహరిస్తోందన్నారు. విగ్రహం కూల్చివేత వెనుక ఉన్న వారి పేర్లను బయటపెట్టి నిందితుల్ని జైలుకు పంపాలని కోరామని ఎల్.రమణ అన్నారు. -
కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు
-
కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు
హైదరాబాద్: పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్లో సెక్యూరిటీ వింగ్లో పని చేస్తోన్న శ్రీనివాస్ అనే గన్మెన్గా నిర్ధారణకు వచ్చారు. శ్రీనివాస్ ఓ ప్రముఖుడి దగ్గర గన్మెన్గా పనిచేస్తోన్నట్లు తెలిసింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కిన శ్రీనివాస్ ప్రయాణికులతో గొడవపడి కోపంలో కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం బస్సు దిగి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో శ్రీనివాసే నిందితుడని తెలిసింది. శ్రీనివాస్ను కూకట్పల్లిలో టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఏపీ పోలీసులకు హైదరాబాద్ పోలీసులు సమాచారం అందించారు. నిందితుడు ఏపీ ఇంటెలిజెన్స్కు చెందిన పోలీస్ కావడంతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఆరా తీశారు. జనాల మధ్య కాల్పులు జరపటం చట్టారీత్యా నేరమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ బస్సులో ఫైరింగ్ కలకలం..! కాల్పులు జరిపిన వ్యక్తిని చూస్తే గుర్తుపడతా -
పంజాగుట్టలో ఇదేమీ ‘చెత్త’
స్వచ్ఛ హైదరాబాద్ పేరుకు మాత్రమే. నగరంలో మాత్రం ఎక్కడ చెత్త అక్కడ ’పేరు’కు పోయినా పట్టించుకునే నాథుడే కరువు. అది కూడా ఏ గల్లీలోనో, వీధిలోనే అనుకుంటే పొరపాటు. హైదరాబాద్ నగర నడిబొడ్డు..పంజాగుట్ట సర్కిల్లోనే. ప్రతిరోజు ఆ మార్గంలో వీఐపీల వాహనాలు రయ్యమంటూ దూసుకుపోతాయే...కానీ పక్కనే ఉన్న ’చెత్త’ను పట్టించుకునేదెవరు?. రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా అంటూ జీహెచ్ఎంసీ ప్రకటనలతో ఊదరగొట్టినా....డో కేర్ అనేవాళ్లే. డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకోకుండా తమ షాపుల్లోని చెత్తను తెచ్చి దర్జాగా రోడ్డు మీదే వేసేస్తూ... నడక దారిని ’చెత్త’తో మూసేస్తున్నారు. పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద రెండు రోడ్లను కలుపుతూ నడక దారిన వెళ్లేవారికి...’గట్ట’లుగా చెత్తా చెదారం దర్శనమిస్తూ...నడిచేందుకు దారే లేకుండా పోయింది. గత కొద్ది రోజులుగా ఇదే దృశ్యం కనిపిస్తున్నా జీహెచ్ఎంసీ సిబ్బందికి మాత్రం చెత్త కనిపించకపోవడం విడ్డూరం. ఇక స్వచ్ఛనగరం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అధికారులు ఎన్ని చర్యలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా, పలు ర్యాంకులు సాధించినా నగరంలో ‘చెత్త’శుద్ధి కనిపించడంలేదు. చుట్టపక్కల హోటళ్లతో పాటు పలువురు ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన చెత్త కుమ్మరిస్తున్నారు. చెత్త సమస్యకు యాప్ పరిష్కారం అంటూ జీహెచ్ఎంసీ అధికారులు ...స్మార్ట్ ఫోన్లో ఫొటో తీసి జీహెచ్ఎంసీ ప్రత్యేక యాప్కు పంపితే చాలు చిటికెలో చెత్త మాయం అని చెబుతున్న అధికారులు ఈ సమస్యను ఎప్పటికి తీరుస్తారో చూడాలి మరి. -
‘నీతో ఉండాలని మనసు కోరుకుంటోంది’
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ తిరునగరి ప్రశాంత్ ఆత్మహత్యకు అతడి భార్య పావని కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు పావనిని అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 306 కింద (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కేసు నమోదు చేశారు. పైళ్లైన కొద్ది రోజుల తర్వాత తన భార్య వేముల ప్రణయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రశాంత్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. వారిని విడదీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రశాంత్, పావని మధ్య గతంలో జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రశాంత్ అంటే ఏమాత్రం, తనను వదిలేయాలని పావని చెబుతున్నట్టు ఆడియోలో స్పష్టంగా ఉంది. ప్రేమగా చూసుకుంటానని భర్త ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చచ్చిపోతానని బెదిరించిన ఆమె భయపడలేదు. తనకు ప్రణయ్ ముఖ్యమని, భర్త కాదని తేల్చిచెప్పింది. (పరువుపోయింది.. చచ్చిపోతున్నా..) ఆడియోలో ఏముంది..? ‘నువ్వో పనికిరానివాడివి. నన్ను సరిగా చూసుకోలేదు. నీతో కలిసుండాలని నాకు లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు నాతో ఉండలేవు. నీ మీద నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నిన్ను వదిలి వెళ్లిపోతా. వెళ్లేటప్పుడు నీకు చెప్పే వెళ్లిపోతాను. పెళ్లికి ముందు ఎలా ఉన్నానో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అతడిని ఏమీ అనొద్దు. తప్పంతా నాదే. ఏదన్నా ఉంటే నన్ను అను. లేదంటే నిన్ను నువ్వు అనుకో. నన్ను నువ్వు పూర్తిగా అంగీకరించలేద’ని పావని పేర్కొంది. ‘నీతో ఉండాలని మనసు కోరుకుంటోంది. నువ్వంటే చచ్చేంత ప్రేమ నాకు. పెళ్లైన కొత్తలో ఎలా ఉన్నావో అలాగే ఉండు. ప్రణయ్ను నీ లైఫ్లోంచి తీసేయ్. అదొక్కటే కోరుకుంటున్నా. ప్రణయ్ మన మధ్య రావడం వల్లే నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతానంటున్నావు. ప్రణయ్ మన జీవితాన్ని నాశనం చేశాడు. దయచేసి వాడిని వదిలేయ్. నువ్వు కాదంటే చచ్చిపోతాన’ని ప్రశాంత్ భార్యను బతిమాలుకున్నట్టు ఆడియోలో రికార్డైంది. -
పరువుపోయింది.. చచ్చిపోతున్నా..
సాక్షి, హైదరాబాద్: వారిద్దరూ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. అవమానం భరించలేక భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్ (34) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. వరంగల్కు చెందిన పావనితో అతడికి 2014లో వివాహం జరిగింది. వీరు శ్రీనగర్కాలనీలోని పద్మజ మెన్షన్ అపార్ట్మెంట్ ఉంటున్నారు. ప్రశాంత్ గత కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఆమె వైఖరిలో మార్పు రానందున ఆత్మహత్య చేసుకుటున్నట్లు సూసైడ్నోట్ రాసిన ప్రశాంత్ ఆదివారం బెడ్రూంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి లక్ష్మినర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరువుపోయింది.. చచ్చిపోతున్నా.. ఆత్మహత్యకు వారం రోజుల ముందు తన బావతో ప్రశాంత్ ఫోన్లో మాట్లాడాడు. భార్య కారణంగా పరువుపోయిందని, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు తన బావతో చెప్పాడు. తనకు మనశ్సాంతి లేకుండాపోయిందని, చచ్చిపోతేనే తనకు విముక్తి లభిస్తుందన్నాడు. ఆత్మహత్యకు పాల్పడవద్దని, చచ్చిపోయి సాధించేది ఏమి ఉండదని ప్రశాంత్ బావ నచ్చజెప్పారు. కావాలంటే విడాకులు తీసుకోవాలని సూచించారు. కోడలిని కఠినంగా శిక్షించాలి తమ కోడలు పావని కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు. అవమానాలు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. తమ కోడలిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తోటి ఉద్యోగితో పావని వివాహేతరం సంబంధం పెట్టుకుందని, పద్ధతి మార్చుకోవాలని ప్రశాంత్ హితవు పలికినా ఆమె పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక్కడి పంపిస్తే భార్య మనసు మారుతుందన్న ఉద్దేశంతో భార్యను మూడు రోజుల క్రితమే బెంగళూరులో ఉద్యోగంలో చేర్పించినట్టు వెల్లడించారు. అనుమానంతో హింసించాడు లేనిపోని అనుమానంతో ప్రశాంత్ తనను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడని పావని అంటోంది. అతడి చావుకు తాను కారణం కాదని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పన్నెండు దాటింది
మగవాడి మంచితనమైనా, చెడ్డతనమైనా.. మగవాడి మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి కాకుండా.. ఆడవాళ్లు అనుకోడాన్ని బట్టి ఉంటుంది. రాత్రి పన్నెండు దాటింది. పన్నెండు తర్వాత ఉప్పల్కి బస్సులు ఉండవు. పన్నెండుకి లాస్ట్ బస్. లాస్ట్ బస్ ఇంకా రాలేదు కాబట్టి, పన్నెండు దాటిన తర్వాత ఇక అది ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ముందే వెళ్లిపోయిందా అని అనుకోడానికి లేదు. పదకొండున్నర నుంచి అతడు ఆ బస్టాప్లో ఉన్నాడు. టెలిఫోన్ భవన్ బస్టాప్ అది. మెహిదీపట్నం డిపో నుంచి వచ్చే ఉప్పల్ బస్సులకు, పంజాగుట్ట మీదుగా వచ్చే ఉప్పల్ బస్సులకు టెలిఫోన్ భవన్ బస్టాప్ జంక్షన్. పంజాగుట్ట మీదుగా వచ్చే ఉప్పల్ బస్సుల టైమ్ పన్నెండుకు ముందే అయిపోతుంది కనుక ఇక రావలసింది మెహదీపట్నం నుంచి వచ్చే ఉప్పల్ బస్సే అనుకున్నా.. పంజాగుట్ట నుంచి వచ్చే ఆఖరి బస్సూ లేటయితే.. రెండు బస్సులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బస్టాప్లో మొదట అతడొక్కడే ఉన్నాడు కానీ, తర్వాత.. ఆమె కూడా వచ్చి అతడికి కాస్త దూరంలో నిలబడింది. పదకొండున్నర నుంచి అతడు అక్కడ ఉంటే.. పావు తక్కువ పన్నెండు నుంచి ఆమె అక్కడ ఉంది. ఇద్దరే ఉన్నారు బస్టాప్లో. ఎవరూ ఎవరితో మాట్లాడుకోవడం లేదు. సెల్ఫోన్లో టైమ్ చూసుకుంటూ.. బస్సు వచ్చే దారి వైపు చూస్తూ నిలుచున్నారు. బస్టాప్లో రిన్నోవేషన్ ఏదో జరుగుతున్నట్లుంది. అంతా తవ్వేశారు. పోల్స్కి ఉండవలసిన లైట్స్ కూడా లేవు. కాస్త దూరంలో ట్రాఫిక్ ఐలండ్లో ఉన్న స్ట్రీట్ లైట్ నుంచి ఇక్కడికి మసగ్గా వెలుతురు పడుతోంది. ఆ మసక వెలుతురులోనే ఆమె అందంగా ఉండడం గమనించాడు అతడు. అందంగా కాదు. చాలా అందంగా! ఆ ‘చాలా అందం’ బహుశా ఆమె జుట్టుది కావచ్చు. లేదా ఆ మెడ! లేదంటే.. ఆమెలో ఇంకేదో.. చూడబుద్ధయ్యేలా ఉన్న చోటు. ఎంతోసేపు బస్సుకోసమే చూడలేడు కాబట్టి అప్పుడప్పుడు ఆమెవైపు కూడా చూస్తున్నాడు అతడు. భుజానికి హ్యాండ్ బ్యాగ్ ఉంది. చేతిలో క్యారీ బ్యాగ్ ఉంది. ఇన్ని బ్యాగులతో ఆడవాళ్లకు ఎన్ని పనులో అనుకున్నాడు అతడు. అలా అనుకోడానికి ముందు.. ఇంత రాత్రివరకు ఆమె తన పని ఎందుకు తెముల్చుకోలేక పోయిందో అనుకున్నాడు. తనొక్కటే ఉన్నందుకు భయపడుతోందేమోనని ఆమెక్కొంచెం ధైర్యం ఇవ్వాలని అతడికి అనిపించింది. ధైర్యం ఇవ్వడం అంటే.. తను చెడ్డవాడిని కాదన్న భావన ఆమెకు కల్పించడం. అంతకన్నా కూడా.. అంతసేపటిగా ఒక ఆడ, ఒక మగ.. ఎంత అపరిచితులైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడంలోని అసహజత్వం అతడిని ఇబ్బంది పెడుతోంది. ఆ ఇబ్బందిని పోగొట్టుకోడానికైనా అతడు ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ‘‘మీరూ ఉప్పలేనా?’’ అన్నాడు. ఆమె చికాగ్గా చూసింది. అతడు కొంచెం హర్ట్ అయ్యాడు. ఆడవాళ్లు వాళ్లకైవాళ్లు మంచి అనుకుంటే తప్ప మగవాళ్ల మంచితనాన్ని ఆమోదించరని జీవితంలో అనేకసార్లు అతడికి అనుభవమైంది. మగవాడి మంచితనమైనా, చెడ్డతనమైనా.. మగవాడి మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి కాకుండా.. ఆడవాళ్లు అనుకోడాన్ని బట్టి ఉంటుంది. ‘‘వేరేలా అనుకోకండి. మీరూ ఉప్పలేనా అని అడగడంలో నా ఉద్దేశం.. నేనూ ఉప్పలే అని చెప్పడం కాదు. నేనూ మీలా మనిషినే అని మీరు అర్థం చేసుకోవాలని అలా అడిగాను. ఎందుకంటే.. ఈ చీకటి రాత్రి, ఈ ఒంటరి రాత్రి నేను మీకు మనిషిలా కాకుండా మరోలా కనిపిస్తున్నానేమోనని నాకు అనిపిస్తోంది’’ అన్నాడు అతడు. అతడివైపు చిత్రంగా చూసింది ఆమె. చూసిందే కానీ అతడితో మాట్లాడలేదు. మళ్లీ బస్సు వచ్చే దారి వైపు చూసింది. బస్సు వస్తూ కనిపించలేదు. ‘‘ఏమైందీ దెయ్యం బస్సుకు?!’’ అన్నాడతడు ఆమెకు సానుభూతిగా. ఆ మాటకు మళ్లీ అతడివైపు ఆమె చికాగ్గా చూసింది. ‘‘సారీ..’’ అన్నాడు అతడు. ‘ఎందుకు సారీ..’ అన్నట్లు చూసింది ఆమె. ‘‘బస్సులు దెయ్యాలు ఎందుకవుతాయి? వేళ తప్పి బస్సుల కోసం చూసే మనమే దెయ్యాలం’’ అన్నాడు అతడు. ఫక్కున నవ్వింది ఆమె. ‘‘హమ్మయ్య.. నవ్వారు’’ అన్నాడు అతడు. ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నారు. ‘‘మీరూ ఉప్పలేనా?’’ మళ్లీ అడిగాడు అతడు. ‘‘ఎందుకనుకుంటున్నారు.. నేనూ ఉప్పలేనని?’’ అంది ఆమె. అతడు నవ్వాడు. ‘‘ఈవేళప్పుడు ఈ స్టాప్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే బస్సులు, కోఠి వెళ్లే బస్సులు ఉండవు. అందుకే ఉప్పలేనా అని అడిగాను’’ అన్నాడు. ఆమె నవ్వింది. ‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అడిగాడు. ‘‘ఉప్పల్ బస్సు ఎక్కితే ఉప్పలే వెళ్తారా? మధ్యలో పది స్టాపులు ఉంటాయి. ఏ స్టాపులోనైనా దిగొచ్చు కదా నేను. నారాయణగూడనో, బర్కత్పురానో, రామంతపూరో..’’ అంది ఆమె. అతడు నవ్వాడు. ‘‘సో.. నేను మిమ్మల్ని అడగవలసిన ప్రశ్న.. ‘మీరూ ఉప్పల్ బస్ కోసమేనా?’ అనే కదా’’ అన్నాడు. ఆమె మళ్లీ నవ్వింది.అతడికి సంతోషంగా ఉంది. అక్కడ తామిద్దరే ఉండడం అతడికి బాగుంది. తెల్లారే వరకు బస్సు రాకపోతే బాగుండనుకున్నాడు. అయితే అలా అనుకోగానే.. ఇలా వస్తూ కనిపించింది ఉప్పల్ వెళ్లే బస్సు! పావు తక్కువ ఒంటిగంటకు. ‘‘వచ్చేసింది’’ అన్నాడు అతడు ఆమెవైపు తిరిగి. అయితే ఆమె అక్కడ లేదు. బస్సు ఎక్కుతూ కనిపించింది! అరె.. అంత వేగంగా ఎప్పుడు వెళ్లిపోయింది అనుకున్నాడు అతడు. అతడు ఎక్కేలోపే బస్సు కదలిపోయింది! తనొక్కడే ఉసూరుమంటూ బస్టాప్లో ఉండిపోయాడు. కనీసం నేనొకణ్ని బస్టాప్లో ఉన్నానని డ్రైవర్కి చెప్పి ఆపించలేకపోయింది అనుకున్నాడు అతడు. వెంటనే అతడికి ఇంకో ఆలోచన కూడా వచ్చింది. బస్సులో తనొక్కటే లేదు కదా.. అని. ఎస్.. తనొక్కటే ఉన్నట్లుంది. బస్సు ఆగినప్పుడు చూశాడు. డ్రైవర్, కండక్టర్ తప్ప లోపల ఎవరూ లేరు. బస్సు ఫెయిలైందని, రూటు మళ్లించి, ఏ మూలో ఆపి, ఆమెను వాళ్లు ఏమైనా చేస్తే? పైగా అందంగా ఉంది. ఒంటరిగా ఉంది. బస్టాపులో తన ఒంటరితనం మర్చిపోయి, బస్సులో ఆమె ఒంటరితనం గురించి ఆలోచిస్తున్నాడు అతడు. పది నిముషాల తర్వాత ఇంకో బస్సు వచ్చింది! ఉప్పల్ బస్సు. పరుగున వెళ్లి ఎక్కేశాడు. అందులో కూడా డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. వెనక్కు వెళ్లి కూర్చున్నాడు. బస్సు వేగంగా వెళుతోంటే కిటికీలోంచి రయ్యిన చల్లటి గాలి ముఖానికి తగులుతోంది. కళ్లు మూసుకున్నాడు. అతడు కళ్లు మూసుకున్నాడే కానీ, మళ్లీ వెంటనే కళ్లు తెరిచాడు. అప్పటికింకా బస్సు తర్వాతి స్టాపుకు కూడా చేరుకోలేదు. ఎవరూ లేని బస్సులో.. తన సీటు వెనుక సీట్లో ఎవరో ఉన్నట్లనిపించి వెనక్కు తిరిగి చూశాడు. ఆమె!!!అతడి గొంతు కండరాలు భయంతో బిగుసుకుపోయాయి. ‘‘ముందెక్కిన బస్సు ఫెయిలయింది. అందుకే ఈ బస్సెక్కాను’’ అంది.. నోటి దగ్గర రక్తాన్ని నాలుకతో చప్పరిస్తూ. వెంటనే లేచి ముందు సీట్లలోకి వెళ్లిపోతే ఏం గొడవోనని... ప్రాణాల్ని బిగబట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు అతడు. - మాధవ్ శింగరాజు -
పంజాగుట్ట జువెల్లరీ షాపులో చోరీ
-
ఐదేళ్ల బుల్లి మేధావి ‘శౌనక్’
పంజగుట్ట : ఐదేళ్ల బుడతడు తన అద్భుత జ్ఞాపకశక్తితో ఆశ్చర్యపరుస్తున్నాడు. కొండాపూర్కు చెందిన మాస్టర్ శౌనక్ శశాంఖ్ ఓఖ్డే(5) పిన్నవయసులోనే విశేష ప్రతిభ పాఠవాలతో ‘ఇండియన్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటుదక్కించుకున్నాడు. ఇటీవల జాతీయ స్థాయిలో ‘ఇండియస్ యంగెస్ట్ చైల్డ్ విత్ ఇన్క్రిడిబుల్ మెమోరీ పవర్’తో పాటు ‘ఇండియాస్ ఎంగెస్ట్ మల్టీ టాలెంటడ్ చైల్డ్’ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బాలుడి ప్రతిభ గురించి అతని తల్లి శ్రీయ ఓఖ్డే, తండ్రి శశాంఖ్ ఓఖ్డే ఆసక్తికరమైన అంశాలను వివరించారు. నానక్రాంగూడలోని ది శ్రీరామ యూనివర్సల్ స్కూల్లో పీపీ–2 చదువుతున్న శౌనక్ చిన్నతనం నుండే అటు చదువులతో పాటు క్రీడలు, ఒక్కసారి విన్న పాటను తిరిగి పాడడం, డైలాగ్లు విన్నవెంటనే తిరిగి చెప్పడం చేస్తుండేవాడన్నారు. అలాగే 196 దేశాల జెండాలు చూపిస్తే వెంటనే ఆ దేశం పేరు చెపుతాడని, ఆరు ఖండాల పేర్లు చెపుతారన్నారు. సైక్లింగ్, స్విమ్మింగ్ స్వయంగా నేర్చుకున్నాడని, కీబోర్డ్ వాయించడంతో పాటు, ఆరో తరగతి పుస్తకాలు కూడా సులువుగా చదువుతాడన్నారు. ఎంతటి లెక్కలైనా సులువుగా చేయడం, ఆంగ్లంలో వెయ్యి వర్డ్స్ స్పెల్లింగ్ చెపుతాడన్నారు. బాలుడి తల్లి శ్రీయ మాట్లాడుతూ.. తాను గర్భవతిగా ఉన్నప్పుడే పిల్లల మెదడు ఎలా అభివృద్ధి చెందుతుందో టిప్స్ పాటించానన్నారు. బాబుకు ట్యాబ్ గాని, ఫోన్ గాని ఎప్పుడూ ఇవ్వమని, దాని ప్రభావం బ్రెయిన్పై పడుతుందన్నారు. అవార్డులు అందుకున్న తర్వాత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బాలుడి ప్రతిభను అభినందించారన్నారు. -
శ్రీరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తమ అభిమాన హీరోపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పవన్కల్యాణ్ అభిమాని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పంజగుట్ట కాలనీ, బత్తిన అపార్ట్మెంట్కు చెందిన శశాంక్ వంశీ పవన్ కల్యాణ్ అభిమాని. ఇటీవల పవన్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో గాయపర్చాయని శశాంక్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు అతను చెప్పారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాక ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లోనూ ప్రియాంక అనే పవన్ అభిమాని శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. -
అమీర్పేట వెళుతున్నారా.. ఇది గమనించండి
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట ప్రధాన రహదారిలో ప్రారంభమైన ట్రాన్స్కో 132 కేవీ అండర్గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనుల కారణంగా అమీర్పేట నుంచి పంజగుట్ట నిమ్స్ వరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 24 నుంచి మే 31వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు. మళ్లింపు ఇలా... సంగారెడ్డి, జహిరాబాద్, పటాన్చెరువు వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పంజగుట్ట నుంచి అనుమతించరు. కూకట్పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ క్రాస్ రోడ్, బాలానగర్, ఫిరోజ్గూడ, బోయిన్పల్లి జంక్షన్, తాడ్బంద్జంక్షన్, బాలంరాయి జంక్షన్,ప్యారడైజ్ హోటల్ ఎంజీ రోడ్, రాణిగంజ్, ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా ఇమ్లిబన్ బస్స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. పఠాన్చెరువు, మియాపూర్, కూకట్పల్లి నుంచి వచ్చే ఆంధ్ర, రాయలసీమ ప్రైవేట్ బస్సులు అమీర్పేట, పంజగుట్ట వైపు అనుమతించరు. మైత్రివనం వద్దే మళ్లించి ఎస్ఆర్నగర్ గౌతండిగ్రీ కాలేజీ వద్ద యూ టర్న్ తీసుకొని అక్కడే ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సిటీ బస్సులు, లారీలు, పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ట్యాంకులు, పటాన్ చెరువు, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి నుంచి ఖైరతాబాద్ వెళ్లాలంటే ఎస్ఆర్నగర్ చౌరస్తాలో ఉమేష్ చంద్రా విగ్రహం వద్ద ఎడమ వైపు తీసుకొని కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్బి సిగ్నల్, సోనాబాయి టెంపుల్, అమీర్పేట్, బీకే రోడ్డు, కాకతీయ హోటల్, సోమాజిగూడ రాజీవ్గాంధీ విగ్రహం చౌరస్తా వద్ద ఎడమ వైపు తీసుకొని రాజ్భవన్ రోడ్డులో ఖైరతాబాద్ జంక్షన్కు వెళ్లాల్సి ఉంటుంది. -
శ్మశానంలో మందు కొడుతున్న యువత
-
మేయర్ వెళ్లేసరికి మందేస్తూ యువకులు.. షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ శ్మశాన వాటికలో దూరి మందు కొడుతున్న యువకులను చూసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ షాకయ్యారు. అనంతరం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయించి వారికి షాకిచ్చారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యువకులు సమాధులను టేబుళ్లుగా మార్చుకొని దర్జాగా మందుకొడుతూ కనిపించి మేయర్ను అవాక్కయ్యేలా చేశారు. వారిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వారిని అదుపులోకి తీసుకోని స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాగా, మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం. 21 ఏళ్ల లోపు వారికి వైన్స్లలో మద్యం ఇవ్వకపోవడం, మద్యం షాపుల్లో కూర్చొనివ్వకపోవడం చేస్తున్న కారణంగా కొంతమంది యువకులు ఇలా స్మశానాలను సైతం ఆశ్రయించి మందుకొడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్మశానాల భద్రతలోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. -
శ్రీనివాస్ ముసుగులో ఉన్న క్రూర మృగం
-
లైంగిక వేధింపుల కేసులో ’గజల్’ అరెస్ట్
-
ఆత్మసాక్షిగా...నా తప్పేం లేదు..
-
మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టిన బైక్
-
మెహరీన్తో ’ ప్రిన్సెస్ వెడ్డింగ్’ ప్రారంభం
-
సీఎం కార్యాలయం వద్ద కలకలం
హైదరాబాద్: పంజాగుట్టలోని సీఎం క్యాంపు ఆఫీస్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. నల్లగొండ జిల్లాకు చెందిన నాగరాజు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం కార్యాలయం వద్దకు కూతురు నవ్య(13), మేనల్లుడు శ్రీనివాస్(18)తో కలిసి వచ్చారు. సీఎం లేకపోవడంతో పాటు, కార్యాలయంలోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో ముగ్గురు కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. విషయం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
పని వాళ్లుగా చేరి.. కానిచ్చేస్తారు
⇔ పంజగుట్ట భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు ⇔ నలుగురు బిహారీ గ్యాంగ్ అరెస్టు, ఒకరు పరారీ ⇔ రూ. 65 లక్షల విలువైన సొత్తు స్వాధీనం పంజగుట్ట: వారు బిహారీ ముఠా సభ్యులు, విడివిడిగా సంపన్నుల ఇళ్లల్లో వంట పనివారిగా చేరతారు. ఎక్కడ అదను దొరికినా అందరూ కలిసి ఆ ఇంట్లో అందినంత దోచుకుని పరారవుతారు. ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ –1, నవీన్నగర్లో బంగారు వ్యాపారి జితేందర్ కుమార్ గుప్త ఇంట్లో దొంగతనానికి పాల్పడింది కూడా వీరే. ఈ ముఠా సభ్యుల్లో ఐదుగురిని పంజగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మంగళవారం పంజగుట్ట పోలీస్స్టేషన్లో డీసీపీ వెంకటేశ్వర్ రావు వివరాలు వెల్లడించారు. నవీన్నగర్కు చెందిన జితేందర్ కుమార్ ఆబిడ్స్లో బంగారు నగల దుఖానం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 1న అతను కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్లోని తమ బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరై తెల్లవారుజామున తిరిగి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా 1.29 కిలోల బంగారం, వెండి, రూ. 4 లక్షల విలువైన వాచీలతో సహా, రూ. 68 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లేందుకు బయో మెట్రిక్ సిస్టమ్ ఉండడంతో నిందితులు కిచెన్ కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లినట్లు నిర్ధారించారు. బీరువా బద్దలగొట్టి ఖరీదైన వస్తువులు మాత్రమే ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పరిచయస్తులే చోరీకి పాల్పడి ఉంటారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. బాధితులను ఆరా తీయగా నెల రోజుల క్రితమే మధ్యవర్తి ద్వారా బిహార్లోని మధుబని జిల్లాకు చెందిన ఉమేష్ కుమార్ ముఖియా కబాద్ను వంట మనిషిగా పెట్టుకున్నట్లు తెలిపాడు. సర్వెంట్ క్వార్టర్స్లో ఉండే అతను కనిపించకపోవడంతో అతని సెల్కు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అతనే దొంగతనానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తూ మధ్యవర్తి దినేష్ ద్వారా అతని వివరాలు సేకరించారు. ఇతనితోపాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లోని సంపన్నుల ఇళ్లల్లో వంట పనివాళ్లుగా చేరిన బిహార్కు చెందిన హరేరామ్ షానే, ఉపేందర్ ముఖియా, రాజేందర్ ముఖియా, జోగేందర్ ముఖియాల వివరాలు సేకరించారు. వీరి ఫోన్లు ట్యాప్ చేయగా ఒకరి ఫోన్ అందుబాటులోకి రావడంతో టవర్ లొకేషన్ ఆధారంగా నింది తులు చోరీ అనంతరం రాజేందర్ ముఖియా ఇంటికి వెళ్లి అక్కడ బంగారం వాటాలు వేసుకుని అక్కడి నుంచి క్యాబ్లో వరంగల్ చేరుకున్నట్లు కనుగొన్నారు. అక్కడ నుంచి విజయవాడకు వెళ్లి గౌహతి ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం చేరుకున్నట్లు నిర్ధారించా రు. విశాఖపట్నం పోలీ సులకు సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయడంతో అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇతర ముఠా సభ్యులను పట్టుకున్నారు. నిందితులందరూ సోదరులు, సమీప బంధువులేనని, గతంలోనూ వీరికి నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.29 కిలో ల బంగారు, వజ్రాల నగలు, 2.8 కిలోల వెండి, 25 చేతి గడియారాలు, 5 సెల్ఫోన్లు, రూ.65వేల నగదు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇళ్లల్లో పనివా రిని నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. గతంలో నూలంగర్హౌస్, బల్కంపేట్ ప్రాంతాల్లో ఇదే త రహాలో చోరీ లు జరిగాయన్నారు. 24 గంటల్లో కే సును చేధిం చిన పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ రవీందర్, క్రైమ్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సైలకు రి వార్డులు అందజేయనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. పక్కాగా దర్యాప్తు బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని నవీన్ నగర్లో నగల వ్యాపారి జితేందర్ కుమార్ గుప్త ఇంట్లో దొంగతనం చేసిన ముఠా పోలీసులకు చిక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ పంజగుట్ట పోలీసులు పక్కాగా దర్యాప్తు చేయడం, విశాఖపట్నం అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకోవడంతో నిందితులను పట్టుకోగలిగారు. సాధారణంగా ఇలాంటి చోరీలు జరిగిన వెంటనే పోలీసులు ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లపై నిఘా ఉంచుతారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న దొంగలు తెలివిగా వ్యవహరించారు. నవీన్నగర్లో రాత్రి 8 గంటలకు దొంగతనం చేసిన నిందితులు అక్కడి నుంచి బంజారాహిల్స్లోని తమ సహచరుడి ఇంటికి వెళ్లారు. అక్కడే రెండు బ్యాగుల్లోకి చోరీ సొత్తును సర్దుకుని మాదాపూర్ చేరుకున్నారు. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఉప్పల్కు వెళ్లారు. కాస్సేపు అక్కడ గడిపిన దొంగలు బస్సులో వరంగల్కు, అక్కడ నుంచి మరో బస్సులో విజయవాడ చేరుకున్నారు. నగరం నుంచి నేరుగా విజయవాడ వెళ్ళే అవకాశాలు ఉన్నా నిందితులు పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఈ పని చేశారు. పక్కాగా సాంకేతిక దర్యాప్తు చేసిన పంజగుట్ట పోలీసులు అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటలకు నిందితులు వినియోగించిన సెల్ఫోన్ విజయవాడ రైల్వేస్టేషన్ దాటి కాస్తా ముందు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో విజయవాడ నుంచి అటు వైపు వెళ్లే రైళ్ల జాబితా ను పరిశీలించగా, గౌహతి ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 1.10 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్కు వచ్చి, 1.20 గంటలకు బయలుదేరి విశాఖ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు విశాఖపట్నం పోలీసు కమిషనర్ యోగానంద్కు విషయం చేరవేశారు. దీంతో అప్రమత్తమైన అక్కడి అధికారులు మరుసటి రోజు ఉదయం విశాఖ రైల్వే స్టేషన్ వద్ద కాపుకాశారు. ఉదయం 7.15కు రైలు ఆ రైల్వే స్టేషన్కు చేరుకోగా, అప్పటికే పంజగుట్ట పోలీసులు వాట్సాప్ ద్వారా నిందితుల ఫొటోలు, వివరాలను విశాఖ అధికారులకు పంపారు. ఓ వైపు కంపార్ట్మెంట్స్లో గాలింపు కొనసాగుతుండగానే, పంజగుట్ట అధికారులు వారితో సంప్రదింపులు జరుపుతూ సమాచారం ఇస్తూనే ఉన్నారు. రైలు కదలడానికి మూడు నిమిషాల ముందు జనరల్ బోగీలో నిందితులతో పాటు పూర్తి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
పంజాగుట్టలో భారీ చోరీ
వెండి, బంగారం, రూ.4 లక్షల నగదు అపహరణ హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నవీన్ నగర్కు చెందిన జితేందర్ అనే వ్యక్తి బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబంతో వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించారు. కిలోన్నర బంగారం, 7 కిలోల వెండి, రూ.4 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
నిమ్స్ ఆస్పత్రి దగ్గర భారీ వరద నీరు
-
హోటళ్లలో ఇంత దారుణమా ?
-
మృత్యువుతో పోరాటం..
చిన్నారి వైద్యానికి రోజూ రూ. 50 వేల ఖర్చు దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సరదాగా అందరితో కలిసి ఆడుకోవాల్సిన ఆ చినారి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నగరానికి చెందిన ఆంగోతు శ్రీనివాస్, కవితల కుమారుడు మాస్టర్ జితేందర్(6)కు ఇటీవల మెదడులో రక్తం గడ్డ కట్టింది. చికిత్స కోసం తల్లిదండ్రులు పంజగుట్ట నాగార్జునహిల్స్లోని లిటిల్స్టార్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు రోజుకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. వైద్యఖర్చుల కోసం ఇప్పటికే ఉన్నదంతా అమ్ముకున్నారు. ఇక వైద్యం చేయించే స్తోమత లేక, అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడి పరిస్థితిని చూడలేక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దాతలు ఎవరైనా వైద్యం కోసం ఆర్థిక సహాయం చేసి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వారు వేడుకుంటున్నారు. -
టార్గెట్ ఠాణా
పంజగుట్ట, అఫ్జల్గంజ్, బహదూర్పురనే లక్ష్యం జేకేబీహెచ్ ఉగ్రవాదులు టార్గెట్ చేసిన ఠాణాలు ఇవే సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ‘ఐసిస్’అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫ్ ఫీ బిలాద్ అల్ హింద్(జేకేబీహెచ్)’ఉగ్రవాదులు నగరంలోని పంజగుట్ట, అఫ్జల్గంజ్, బహదూర్పుర పోలీస్స్టేషన్లను టార్గెట్ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నిర్థారించారు. దీనికి సంబంధించి ఓ ఉగ్రవాది హైటెక్ పద్ధతిలో రెక్కీ సైతం నిర్వహించినట్లు కీలకాధారాలు సేకరించిన అధికారులు.. అభియోగపత్రాల ద్వారా నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జేకేబీహెచ్ ఉగ్రవాదులనే ఆరోపణలపై ఎన్ఐఏ అధికారులు గత ఏడాది జూన్, జూలైలో పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్ అథవుర్ రెహ్మాన్, అబ్దుల్ బిన్ అహమద్ అల్మౌదీ అలియాస్ ఫహద్, హబీబ్ మహ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్లను, మంగళవారం మహ్మద్ ఇర్ఫాన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జీపీఎస్ ఆధారంగా రెక్కీ: ఉగ్రవాదులు సహా ముష్కరమూకలు ఎవరైనా ప్రముఖులు, ఏదైనా ప్రాంతాన్ని టార్గెట్ చేసినప్పుడు పక్కాగా రెక్కీ నిర్వహి స్తారు. దాడి చేయడానికి ముందు ఆ ప్రాంతానికి సంబం« దించిన భౌగోళిక పరిస్థితులు, వ్యక్తుల కదలికలు తెలుసు కోవడానికి ఇలా చేస్తుంటారు. సాధారణంగా ఈ రెక్కీలో పాల్గొన్న ముష్కరులే ఆపరేషన్లోనూ ఉండాల్సి ఉంటుం ది. రెక్కీతో ఆ ప్రాంతం/వ్యక్తిపై వారికే పూర్తి అవగాహన ఉండే నేపథ్యంలో ఇది కచ్చితం. అయితే సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఐసిస్ భారత చీఫ్ షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు పని చేస్తున్న జేకేబీహెచ్ మాడ్యుల్ మాత్రం హైటెక్ పద్ధతిలో రెక్కీ నిర్వహించింది. మూడు పోలీసుస్టేషన్ల వద్దా రెక్కీ చేసే బాధ్యతల్ని ఈ మాడ్యుల్ ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్కు అప్పగించింది. ఆధునిక పం«థాలో ఈ పని చేసిన ఇతగాడు ఆయా పోలీసుస్టేషన్లకు సంబంధించిన జీపీఎస్ కోఆడినేట్స్ (అక్షాంశ, రేఖాంశ వివరాలు) తన సెల్ఫోన్లో మ్యాప్పై నిక్షిప్తం చేసుకున్నాడు. ఇలా చేయడంతో విధ్వంసం సృష్టించాల్సిన రోజు ఇతడు ఆ గ్యాంగ్లో ఉన్నా, లేకపోయినా తన సెల్ఫోన్లో సమాచారం షేర్ చేస్తే సరిపోతుంది. ఈ కోఆడినేట్స్తో నావిగేటర్ వినియోగించి కొత్త వ్యక్తులు సైతం దాడులు చేసే అవకాశం ఉంటుందనే ఇలా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రిజ్వాన్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు ఈ కోఆడినేట్స్తో కూడిన మ్యాప్ను గుర్తించారు. మెషిన్గన్స్ కోసం ప్రయత్నించారా..? ఈ ఉగ్రవాదులు పోలీసుస్టేషన్లతో పాటు పోలీసులు, ప్రముఖుల్నీ టార్గెట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విధ్వంసాలు సృష్టించడానికి పేలుడు పదార్థాలు, ఎంపిక చేసుకున్న వ్యక్తుల్ని కాల్చి చంపడానికి తుపాకులు, తూటాలు సంగ్రహించే ప్రయత్నాలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఠాణాల వద్ద రెక్కీ పూర్తయినా.. వ్యక్తుల ఎంపికకు సంబంధించి షఫీ ఆర్మర్ నుంచి ఆదేశాలు రాని నేపథ్యంలోనే ఆ కుట్ర అమల్లోకి రాలేదని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఇబ్రహీం యజ్దానీ ఆదేశాల మేరకు ముష్కరులు నల్లగొండ జిల్లా పోచంపల్లి నుంచి యూరియా సహా ఇతర పేలుడు పదార్థాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కూడా వెళ్లొచ్చారు. ఉగ్రవాది హబీబ్ నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో పేలుడు పదార్థాలతో పాటు 17 తూటాలు ఉన్నాయి. ఇవి సాధారణ పిస్టల్తో పాటు సబ్–మెషిన్గన్లోనూ వాడేవని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ముష్కరులు వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కోసం సబ్–మెషిన్గన్స్ సేకరించే ప్రయత్నాలు చేసినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మంగళవారం అరెస్టు చేసిన ఇర్ఫాన్ను కస్టడీకి తీసుకోనున్నారు. మ్యాప్లో స్పష్టంగా మార్కింగ్.. జేకేబీహెచ్ మాడ్యుల్లో కీలక పాత్ర పోషించిన ఇబ్ర హీం యజ్దానీ ఆదేశాల ప్రకారం తాను మూడు పోలీసు స్టేషన్ల వద్ద హైటెక్ రెక్కీ నిర్వహించినట్లు రిజ్వాన్ అంగీ కరించాడు. ఇతడి సెల్ఫోన్ను ఫోరెన్సిక్ లాబ్లో విశ్లేషిం చిన ఎన్ఐఏ అధికారులు అందులో జీపీఎస్ కోఆడినేట్స్ తో కూడిన మ్యాప్ను సంగ్రహించి, అధ్యయనం చేశారు. ఆ మ్యాప్లో నెహ్రూ జులాజికల్ పార్క్, సాలార్జంగ్ మ్యూజియం, ఖైరతాబాద్–అమీర్పేట మధ్య మార్కిం గ్స్ ఉండటాన్ని గుర్తించారు. వీటి ఆధారంగానే బహదూ ర్పుర, అఫ్జల్గంజ్, పంజగుట్ట ఠాణాలే హిట్ లిస్ట్లో ఉన్నట్లు నిర్థారించారు. ఎన్ఐఏ అధికారుల విచారణలో రిజ్వాన్ సైతం ఇదే అంశాన్ని బయటపెట్టడం గమనార్హం. ఈ మాడ్యుల్ ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల నుంచి దర్యాప్తు అధికారులు కీలక ఫొటోలు, సాకేంతిక ఆధారాలు సేకరించగలిగారు. -
పంజగుట్టలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం.3 ఖైరతాబాద్ మండల పరిధిలోని పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో నిర్మించిన అక్రమ కట్టడాలను శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. శ్మశాన వాటికలో అమ్మవారి గుడిని అడ్డుగా పెట్టుకొని నిర్మించిన పది గదులను నేలమట్టం చేశారు. కొంతకాలంగా అమ్మవారి గుడి పక్కన అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తుండగా పంజగుట్ట హిందూ శ్మశానవాటిక కమిటీతోపాటు స్థానికులు కొందరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. గత నాలుగేళ్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించలేదు. ఇటీవల నాలాలు, చెరువుల ఆక్రమణలను కూల్చివేయాలని స్వయంగా మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఇదే అదనుగా జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు శ్మశాన అక్రమ నిర్మాణాల తొలగింపుకు రంగంలోకి దిగారు. బంజారాహిల్స్ పోలీసులు వంద మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా అధికారులు బుల్డోజర్లు, జేసీబీల సహాయంతో గదులన్నింటిని నేలమట్టం చేశారు. అమ్మవారి గుడికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు ఒకరిద్దరు ప్రయత్నించగా పోలీసులు వారిని వారించారు. మూడు రోజుల నుంచి శ్మశానంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించగా స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వాయిదా పడుతూ వచ్చినా ఎట్టకేలకు కూల్చివేతల కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఫెన్సింగ్ వేసి రక్షిస్తారా, మళ్లీ గాలికొదిలేస్తారా అన్నది చూడాల్సి ఉంది. -
వేధింపులపై వాట్సాప్లో ఫిర్యాదు చేయండి
పంజగుట్ట: పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే స్పందించేందుకు బాలల హక్కుల సంఘం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. బాల కార్మికులు, వీధిబాలలు, స్కూల్లో వేధింపులు, అత్యాచారాలు, కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేసినా 9491292424 నంబరుకు వాట్సాప్ చేస్తే వెంటనే స్పందిస్తామని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సంఘం అధ్యక్షురాలు అనూరాధా రావు, స్లేట్ స్కూల్ విద్యార్ధులతో కలిసి వాట్సాప్ నెంబర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో రేఖారాణి, నటరాజ్ భట్, వెంకటరమణ, సిరి చిన్మయి, సాయి చరిత, శరత్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్ కౌంటర్లో రూ.40 వేలు చోరీ
పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది. ఓపీలోని ఓ మహిళా ఉద్యోగి పక్కనే ఉన్న మరో ఉద్యోగితో మాట్లాడుతుండగా సెకండ్ల వ్యవధిలో కౌంటర్లో ఉన్న రూ. 40 వేలు దొంగిలించింది. అక్కడే విధుల్లో ఉన్న మహిళా గార్డు ఇది గమనించి వెంటనే గౌసియా బేగంను పట్టుకుంది. అప్పటికే ఆమె మద్యం మత్తులో ఉన్న ఆమెను నిమ్స్ సెక్యూరిటీ అధికారులు పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నయీంను పోషించింది రాజకీయ జోక్యమే
పంజగుట్ట: రాజకీయ జోక్యమే నయీంను పెంచి పోషించిందని,ఈ కేసునుహైకోర్టు చీఫ్ జస్టిస్చే విచారణ జరపాలని పలువురు పేర్కొన్నారు. ఆది వారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చిక్కుడు ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక ఉద్యమకారుడు సాంబశివరావు (ఉసా) మాట్లాడుతూ.. గతంలో చట్టం, రాజ్యాంగం, ప్రభుత్వ పరిధిలో నేరస్తులకు శిక్షవిధించేదని, ప్రస్తుతం బూటకపు ఎన్కౌంటర్లు అనే విచ్చిన్నకర కార్యక్రమాలు చంద్రబాబు సృష్టించాడన్నారు. గ్రేహౌండ్స్ను ఎలా తయారు చేశారో అందుకు సమాంతరంగా నయీంను కూడా అలానే తయారు చేశారని ఆరోపిచారు. ప్రజా ఉద్యమకారులను మట్టుబెట్టేందుకు 10 శాతం గ్రేహౌండ్స్ సిబ్బందిని నయీం గ్యాంగ్లో ఉంచారని ఆరోపించారు. సీపీఐ నాయకురాలు పశ్య పద్మ మాట్లాడుతూ.. కేవలం నయీం ఆస్తులు, స్థలాలపైనే విచారణ జరుగుతోందని, అతను హత్యలు చేసిన కుటుంబాల ఆవేదనను ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, పౌరహక్కుల సంఘం నాయకుడు నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఎగ్జిబిషన్
పంజగుట్ట: రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఎగ్జిబిషన్’ ఆకట్టుకుంటోంది. అన్ని అంశాలను మేళవించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు ఖైరతాబాద్లోని నాసర్ స్కూల్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ శుక్రవారం ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ప్రదర్శన రెండు రోజుల పాటు కొనసాగుతుందని ప్రిన్సిపాల్ మధుబాబాలా కపూర్, వైస్ ప్రిన్సిపాల్ శోభా జయశంకర్ తెలిపారు. -
ఫేస్బుక్ మోసగాడి అరెస్టు
ఫేస్బుక్ ద్వారా స్నేహం చేసుకుని పలువుర్ని మోసం చేసిన నిందితున్ని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 3 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వివరాలు సోమవారం పంజగుట్ట పోలీస్స్టేషన్లో పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర రావు, ఎసీపీ వెంకటేశ్వర్లు వివరించారు. మెహిదీపట్నం హుడా కాలనీకి చెందిన రియాజ్ అహ్మద్ అలియాస్ మహ్మద్ యాహ ఉల్ హసన్ అలియాస్ అకిత్ (32) ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడు. ఫేస్బుక్లో కొద్దిగా అమాయకంగా కనిపించే ఫోటోలను ఎంపికచేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేవాడు.. వారు యాక్సెప్ట్ చేయగానే వారి ఫోటోలకు మంచి కామెంట్లు, లైక్లు కొట్టి వారు ఆన్లైన్లో ఉన్న సమయంలో చాటింగ్ చేయడం మొదలు పెట్టేవాడు. ఫోన్ నెంబర్లు తీసుకుని పోన్చేసి పరిచయం పెంచుకుని ఒక్కసారి కలవాలి అని వారిని పర్సనల్గా కలిసి మాటల్లో పెట్టి వారు తాగే మంచి నీళ్లల్లో, కూల్డ్రింక్లల్లో మత్తు పదార్ధం కలిపి.. వాళ్లు స్పృహ తప్పగానే.. వారివద్ద ఉన్న బంగారు ఆభరణాలు, పర్సులు, ఫోన్, ల్యాప్ట్యాప్ దోచుకుంటాడు. ఇదే తరహాలో ఇతను నగరంలో పంజగుట్ట, గచ్చిబౌలి, జవహర్నగర్, నేరేడిమెట్ పోలీస్స్టేషన్ పరిధుల్లో ఒక్కొక్కరిని చొప్పున మోసం చేశాడు. దొంగిలించిన సొమ్ము అమ్ముతుండగా సోమవారం నిందితున్ని పంజగుట్ట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఫేస్బుక్లో అపరిచితులు ఎవరైనా ఫ్రెండ్ రిక్వస్ట్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయరాదని డిసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. అపరిచితుల పట్ట జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
కేసు వాపసు కోసం మంత్రి బెదిరింపులు!
పంజగుట్ట: కట్నం వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం... ఎల్లారెడ్డిగూడ పద్మావతి ప్లాజాలో నివాసం ఉండే సారయ్య, సాలీలకు కుమారులు వీరన్న, రాములు సంతానం. వీరిద్దరూ మహేశ్వరం మండలానికి చెందిన స్వరూప, సుశీల (24) అక్కాచెల్లెళ్లను 2009 మార్చి 21న పెళ్లి చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు, 15 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చి.. ఘనంగా పెళ్లి చేశారు. సుశీలకు ఆడ పిల్ల పుట్టగానే భర్త రాములు వేధింపులు మొదలెట్టాడు. అదనపు కట్నం తెమ్మని చితకబాదేవాడు. దీంతో సుశీల కుటుంబ సభ్యులు ఇద్దరూ అన్నదమ్ములకు అదనపు కట్నం కింద చెరో అర ఎకరం రాసి ఇచ్చారు. అయినా తృప్తి చెందని రాములు వేధించి, చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన సుశీల మంగళవారం ఉదయం కుమార్తె భవిష్య (6)ను పాఠశాలకు పంపించి తలుపు గడియ పెట్టుకుంది. సాయంత్రం వరకు గదిలోంచి బయటకు రాకపోవడంతో సుశీల సోదరి స్వరూప, ఆమె భర్త వీరన్న కలిసి గడియ విరగొట్టి చూడగా సుశీల ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెంది ఉంది. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరి స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రాములు, అత్తామామలతో పాటు బావ వీరన్నపై కేసు నమోదు చేశారు. మంత్రి బెదిరిస్తున్నారు: బాధితుల ఆరోపణ సుశీల మృతికి కారణమైన భర్త, అత్తామామలతో పాటు బావను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబసభ్యులు పంజగుట్ట పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కేసు విత్డ్రా చేసుకోవాలని ఓ మంత్రి తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, విత్డ్రా చేసుకోకపోతే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కేసు మాఫీ చేయిస్తామని అంటున్నారని మృతురాలి బంధువులు కంటతడిపెట్టారు. నిందితులు కూడా సదరు మంత్రి ఇంట్లోనే తలదాచుకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనే వీరన్న, రాములుకు వేరేవారితో పెళ్లిళ్లు అయినట్టు తమకు సమాచారం అందిందని బాధితులు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
మంత్రి ఆదేశిస్తే మాకేంటి..!
బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక ముందు గత నెల 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యతోపాటు ఆమె తాత మధుసూదనాచారి, బాబాయి పమ్మి రాజేష్ మృతిచెంది నెలన్నర కావొస్తున్నది. ఇక్కడ ప్రమాదాలు జరుగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సరిగ్గా నలభై రోజుల క్రితం మంత్రి కేటీఆర్ పర్యటించి నెల రోజుల్లో నివేదిక అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అయినా సంబంధిత అధికారులు ఇంతవరకు నివేదిక అందజేయలేదు. ఇక్కడున్న బాటిల్ నెక్ రోడ్డుతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు గతంలోనే ట్రాఫిక్ పోలీసులు నివేదికలు అందించారు. శ్మశాన వాటిక ప్రహరీ ఆనుకొని ర్యాంప్ నిర్మించాలని, దీనివల్ల ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలుంటుందని, వాహనాల రద్దీ బాటిల్ నెక్ వద్ద తగ్గుతుందని నిర్ధారించారు. ఆ మేరకు ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ పర్యటించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు బుట్టదాఖలయ్యాయి. ఆ కొద్ది రోజులకే చిన్నారి రమ్య ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అనంతరం మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన ఆదేశాలు కూడా బుట్టదాఖలయ్యాయి. ఇంతవరకు ఇక్కడ ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన పోలేదు. రోడ్డులో ఇంజనీరింగ్ లోపాలున్నాయని, మధ్యలో ఉన్న డివైడర్ ఎత్తు పెంచాలని, రోడ్డును వెడల్పు చేయాలని ప్రతిపాదించారు. అయితే రమ్య మృతి తరువాత మంత్రి కేటీఆర్ తప్పితే ఆ శాఖ అధికారులు ఒక్కసారి కూడా ఇక్కడ పర్యటించలేదు. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం కూడా చేయలేదు. దీంతో రమ్య మృతి తరువాత సరిగ్గా అదే ప్రాంతంలో మరో నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఇంత జరిగినా అధికారుల్లో చలనం ఉండటం లేదు. మంత్రి ఆదేశిస్తే మాకేంటి అన్న చందంగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డుపై ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వ్యాన్ ఢీకొని పెంపుడు కుక్క మృతి
సాక్షి,పంజగుట్ట: డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మూగజీవిని బలిగొంది. బేకరీకి వస్తువులను తరలిస్తున్న వాహనం పెంపుడు కుక్కపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు... పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రేమ్నగర్ బస్తీలో బికనీర్వాలా బేకరీకి చెందిన కిచెన్ ఉంది. ఇక్కడ తయారైన బ్రెడ్ తదితరాలను సదరు బేకరీకి తరలిస్తుంటారు. మంగళవారం రాత్రి ప్రేమ్నగర్ బస్తీ మీదుగా బీకనీర్వాలా కిచెన్ వద్దకు వస్తున్న వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి అక్కడే ఉన్న పామలిన్ జాతికి చెందిన ఓ పెంపుడు కుక్కపైకి ఎక్కించడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆగ్రహించిను కుక్క యజమానులు, స్థానికులు బికనీర్వాలా వాహనాలతో పాటు కిచెన్పైన దాడి చేశారు. అనంతరం కక్క మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని యజమానులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. జనావాసాల మధ్య బేకరీ బట్టీలా? ఇళ్ల మధ్య ఉన్న ఈ బేకరీ బట్టీలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రేమ్నగర్ బస్తీవాసులు తెలిపారు. అసలు ఇక్కడ బేకరీ కిచెన్ ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయా? ఉంటే... అగ్నిమాపకశాఖ, పొల్యూషన్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తాయి అని ప్రశ్నించారు. నిత్యం ఉదయం సాయంత్రం వేళ్లలో తమ బస్తీ మీదుగా బేకరీ కిచెన్ వద్దకు పదుల సంఖ్యలో ట్రాన్స్పోర్టు వాహనాలు వెళ్తుండటంతో తాము ఇబ్బందులు ఎదుర్కొటున్నామని బికనీర్వాలా బేకరీ యజమానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు కుక్క చనిపోయిందని, అదే బస్తీలో ఆడుకొనే చిన్నారులకు ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే బస్తీ మధ్యలో ఉన్న ఈ కిచెన్ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
కేసు వాదిస్తుండగా న్యాయవాదిపై దాడి
పంజగుట్ట: న్యాయస్థానంలోనే న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన దీక్ష అమోల్, బాలకృష్ణ అమోల్ భార్యాభర్తలు. దీక్ష తన భర్త అయిన బాలకృష్ణపై గృహహింస కేసు పెట్టగా ఎర్రమంజిల్ కోర్టులో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కూకట్పల్లికి చెందిన న్యాయవాది వసంత్రావు దేశ్పాండే కేసు వాదిస్తుండగా, తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ న్యాయవాదిని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. కోర్టు సిబ్బంది, స్థానికులు వారించినా వినకపోవడంతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి రద్దుతో యువకుడి ఆత్మహత్య
పంజగుట్ట: వివాహం రద్దు కావడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం .. నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ (38) సోమాజిగూడ క్రాంతిశిఖరా అపార్ట్మెంట్ 3వ అంతస్తులో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వీడియో ఎడిటింగ్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇతనికి పెళ్లి కుదిరింది. పేరు బలాలు కుదరకపోవడంతో వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామని పెళ్లికూతురు తరఫువారు ఇటీవల ఫోన్ చేసి చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన రాజశేఖర్ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదుగురి జీవితాల్లో వెలుగునిచ్చిన మహిళ
పంజగుట్ట: రోడ్డు ప్రమాదానికి గురైన ఓ గృహిణి తాను మరణిస్తూ అవయవాలు దానం చేసి మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిది. నిమ్స్ జీవన్దాన్ ప్రతినిధులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన మంజుల (43) మంజుల ఈ నెల 27న నగరంలో ఉంటున్న తన సోదరుని ఇంటికి వచ్చింది. మలక్పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మలక్పేట గంజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మంజులను మలక్పేట యశోదా ఆసుపత్రికి తరలించగా శుక్రవారం బ్రెయిన్డెడ్ అయినట్లు నిర్ధారించారు. మంజుల భర్త యాదయ్య, కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన చేయడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో మంజులకు శస్త్రచికిత్స నిర్వహించి కిడ్నీలు, కాలేయం, కళ్లు తొలగించి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అవసరమైన వారికి అమర్చారు. -
పంజాగుట్టలో డీసీఎం బీభత్సం
హైదరాబాద్: పంజాగుట్టలో శనివారం డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న రెండు బైక్లను ఢీకొట్టింది. అనంతరం వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారులు పవన్ (45). ప్రసాద్ (26)లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రహదారిపై వ్యాన్ బోల్తా పడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై నుంచి వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. డీసీఎం ఓవర్ లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. -
పంజాగుట్టలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘జోయాలుక్కాస్’ జూలై 30న పంజాగుట్టలో హైదరాబాద్లోనే అతిపెద్ద జువెలరీ షోరూమ్ను ప్రారంభించనున్నది. ఇందులో వినూత్న డిజైన్లతో కూడిన పలు బంగారు, వజ్రాభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. షోరూమ్ ప్రారంభోత్సవానికి సంస్థ చైర్మన్, ఎండీ జోయ్ ఆలుక్కాస్ సహా పలువురు తారలు విచ్చేయనున్నారు. -
రైతులపై చిన్న చూపు తగదు
పంజగుట్ట: తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతోందని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షులు జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీరా ఏటా రూ. 25 వేలు చెల్లించేందుకు నిర్ణయించిందని, వారిచ్చే మొత్తం వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. పాత అప్పులు కట్టనందుకు బ్యాంకులు రైతులకు రుణాలివ్వడం లేదన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితిపైప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వడంలోనూ విఫలమైందని ఆరోపించారు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతులకు ఆర్ధికసాయం చేయడమేగాక, వారిలో ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. వివరాలకు 8978385151, 7801091111 నెంబర్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో నైనాల గోవర్ధన్, శ్రీనివాస్ యాదవ్, మన్నారం నాగరాజు, రామనర్సయ్య, శ్రీనివాస్, భిక్షపతి పాల్గొన్నారు. -
ఇది భరించలేని తీరని శోకం
-
మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పంజగుట్ట : మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... రాజ్భవన్ రోడ్డులోని సాగర్ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో నివాసం ఉండే శైలజ (34) బేగంపేటలోని టాటా కన్సల్టెన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఈమె భర్త శరత్బాబు విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ పాప ఉంది. ఆమె కాకినాడలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో భర్త లేని సమయంలో శైలజ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. భార్య మరణవార్త తెలిసినా సాయంత్రం వరకు భర్త ఇంటికి చేరుకోలేదని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'దేశంలోనే ప్రతిష్టాత్మక ఆస్పత్రిగా నిమ్స్'
పంజగుట్ట (హైదరాబాద్) : నిమ్స్ను దేశంలోనే ప్రతిష్టాత్మక ఆసుపత్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు నిమ్స్ డెరైక్టర్ మనోహర్ అన్నారు. ఆదివారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయం ఎదురుగా 520 గజాల స్థలంలో కోటి 40 లక్షల వ్యయంతో నిమ్స్ పేషెంట్స్ అటెండర్స్ కోసం నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రౌండ్తో పాటు రెండు ఫ్లోర్లు జీహెచ్ఎంసీ అనుసంధానంతో నిమ్స్ ఆసుపత్రి నిర్మించగా మరో మూడు ఫ్లోర్లు క్యాన్సర్ ఆశ్రయం ట్రస్ట్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యంగా డయాలసిస్, రేడియేషన్ పేషెంట్ల సహాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిమ్స్ వర్గాలు వెల్లడించాయి. 200 మందికి పైగా బసచేసేందుకు వీలుగా నిర్మిస్తున్నట్లు, ఒక్కో ఫ్లోర్లో సుమారు 38 గదులు, స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా ఒక్కో ఫ్లోర్లో 18 స్నానాల గదులు, 18 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్లో ఈ భవనం మెయింటెనెన్స్ రోటరీ క్లబ్కు అప్పగించే దిశగా ఆలోచిస్తున్నట్లు, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి రూ.5 భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసే యత్నం చేస్తామని తెలిపారు. దీపావళి వరకు దీనిని ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు నిమ్స్ డెరైక్టర్ వెల్లడించారు. ఎర్రమంజిల్లో నిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన 16 ఎకరాల స్థలం ఉందని అందులో నెఫ్రాలజీ, యూరాలజీ టవర్స్తో పాటు, ఆడిటోరియం, డాక్టర్స్కు, రెసిడెన్స్ వైద్యులకు, స్టాఫ్కు క్వార్టర్లు కట్టించడంతో పాటు, డెరైక్టర్ భవనం కట్టించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నిమ్స్కు వచ్చే ప్రతీ రోగీ సంతోషంగా నవ్వుతూ ఇంటికి వెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వైద్యపరికరాలు అందుబాటులోకి తెచ్చి మరిన్ని వసతులు కల్పించి రోగులకు సేవలందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి, ఆర్ఎంఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమ సంబంధం అంటగట్టాడని...
పంజగుట్ట: వేరొకరితో సంబంధం అంటగట్టిన భర్తను ఓ భార్య అంతం చేసింది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండలోని ఇందిరానగర్లో అశోక్, భీమమ్మ నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన అశోక్ పనీపాటా లేకుండా తిరుగుతుండేవాడు. ఇళ్లలో పనులు చేసే భార్యను డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో భీమమ్మ సొంతూరైన మహబూబ్నగర్ జిల్లాకు కొన్ని రోజులు పిల్లలతో సహా వెళ్లింది. ఇటీవలే ఆమె తిరిగొచ్చింది. ఈ క్రమంలో ఆమెకు బంధువుతో అక్రమ సంబంధం ఉందంటూ అశోక్ వేధించసాగాడు. ఈ క్రమంలో భర్తపై కోపం పెంచుకున్న భీమమ్మ మే 7వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న అశోక్ను టవల్తో గొంతుకు బిగించి చంపింది. మితిమీరి మద్యం తాగినందునే అతడు చనిపోయాడని అందరినీ నమ్మించింది. అయితే, మృతుని సోదరుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భీమమ్మను విచారించగా నేరం అంగీకరించింది. ఈ మేరకు నిందితురాలిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. -
గజ గజ
బీభత్సం సృష్టించిన గాలివాన గంటకు 60 నుంచి 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వేలాదిగా నేలకూలిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు కుప్పకూలిన విద్యుత్ సరఫరా వ్యవస్థ వందలాది కాలనీల్లో కారు చీకట్లు భారీగా ట్రాఫిక్ జామ్లు సిటీబ్యూరో: ‘‘సాయంత్రం 5 గంటలు...నాంపల్లి నుంచి పంజగుట్టకు వెళ్లేందుకు విజయ్ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. జడివాన కురియడంతో రహదారిపై ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. లక్డీకాపూల్ నుంచి పంజగుట్ట వరకు వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్ రద్దీలో పంజగుట్ట చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టింది. రాత్రి 8 గంటలకు కాని పంజగుట్ట చేరుకోవాల్సి వచ్చింది’’. ‘‘సమయం సాయంత్రం 5.30 గంటలు...అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లేందుకు స్నేహ బస్సులో బయలుదేరింది. రాత్రి 8.50 గంటలకు గాని సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోలేదు’’. ‘‘పవన్ హైటెక్సిటీ నుంచి సాయంత్రం 6 గంటలకు తన కారులో దిల్సుఖ్నగర్కు బయలుదేరాడు. రాత్రి 9.30 గంటలకు ఇళ్లు చేరాల్సి వచ్చింది’. ఇవన్నీ గ్రేటర్లో శుక్రవారం కురిసిన జడివానకు లక్షలాదిమంది వాహనచోదకులు, ప్రయాణికులు పడిన నరకయాతన ఇది. సాయంత్రం 5 నుంచి 6 గంటలవరకు కురిసిన జడివానతో ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు,వృద్ధులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడారు. కుండపోత వర్షానికి తడిసి ముద్దవడంతోపాటు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేక నరకయాతన అనుభవించారు. ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో బయలుదేరిన వారు కూడా రాత్రి పొద్దుపోయాక గాని ఇంటికి చేరుకోలేక పోయారు. ఫ్లైఓవర్లపైనా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ప్రధాన రహదారులు, షాపింగ్మాల్స్ ఎదుట పార్క్ చేసిన వాహనాలపై చెట్లు, హోర్డింగ్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు పోటెత్తింది. బహదూర్పురా, గాంధీనగర్, కాలాపత్తర్, చార్మినార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, ఎస్.ఆర్.నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో వర్ష విలయానికి లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. నాలాలు ఉప్పొంగాయి. పురాతన భవనాల సమీపంలో ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా జాగారం చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఉప్పొంగిన నాలాలు,డ్రైనేజి లైన్లు.. కుండపోత కురియడంతో నాలాలు, డ్రైనేజి లైన్లు పొంగిపొర్లాయి. మూతలు లేని మ్యాన్హోళ్ల వద్ద వరద ప్రవాహం భయానకంగా మారింది. పలు లోతట్టు ప్రాంతాలు, బస్తీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో వరదనీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. లక్డికాపూల్, చింతల్బస్తీ, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో రహదారులపై పార్కింగ్ చేసిన వాహనాలు నీటి మునిగేంత స్థాయిలో వరద పోటెత్తింది. గ్రేటర్లో ప్రధాన రహదారులపై 100 లోత ట్టు ప్రాంతాల(వాటర్లాగింగ్ పాయింట్స్)వద్ద భారీగా వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జామ్ రహదారులపై వరద పోటెత్తడంతో నెక్లెస్రోడ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజగుట్ట, నాంపల్లి,సెక్రటేరియట్, అమీర్పేట్, ఎస్.ఆర్.నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, సికింద్రాబాద్, మసాబ్ట్యాంక్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాంబాగ్, ఎర్రమంజిల్, లక్డికాపూల్,సికింద్రాబాద్,ఆబిడ్స్,కోఠి,తార్నాక, తదితరప్రాంతాలతోపాటు బేగంపేట్,సికింద్రాబాద్,ఖైరతాబాద్ ప్రాంతాల్లోనూ ఫ్లైఓవర్ల మీద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం.... సికింద్రాబాద్లోని అంబేద్కర్నగర్, ఇందిరమ్మనగర్, రసూల్పురా,అన్నానగర్,గాంధీనగర్లలోని లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. మెహిదీపట్నంలో గుడిమల్కాపూర్-మందుల బస్తీ,నదీంకాలని,అంజయ్యనగర్ ప్రాంతాల్లో భారీగావర్షపు నీరు చేరడంతో స్థానికులు నానా అవస్థలు పడ్డారు. అంబర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, అబిడ్స్, చార్మినార్, బహదూర్పురా, శేరిలింగంపల్లి, తార్నాక, ఉప్పల్లోనిపలు బస్తీల్లో వరద నీరు చేరింది. ఇక బేగంపేట్లో 14 ఎం.ఎం, రుద్రారం 8.9, లయోలా అకాడమీ 1.5, కండ్లకోయ 11.7, శంషాబాద్ 22.44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గాలివాన కారణంగా నగరంలో అర్ధరాత్రి వరకు పలు కాలనీలు చీకట్లో మగ్గాయి. విద్యుత్ ట్రాన్సఫార్మర్లు, స్తంభాలు, చెట్లు కూలిన కారణంగా ఫీడర్లు ట్రిప్పయి విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. -
పనిచేస్తున్న ఇంట్లోనే చేతివాటం
పంజగుట్ట : యజమాని ఇంటికే కన్నం వేసిన మహిళను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమాజిగూడ ద్వారకా అపార్ట్మెంట్లో నివసించే ఆర్. రమేష్ యాదవ్ వ్యాపారవేత్త. ఆయన ఇంట్లో గత కొంతకాలంగా పంజగుట్ట పోచమ్మబస్తీకి చెందిన పి.మరియమ్మ(40) పని మనిషిగా ఉంటోంది. ఈ నెల 7వ తేదీన రమేష్ యాదవ్ తన కుటుంబసభ్యులతో నాందేడ్ వెళ్లారు. ఇంటి తాళాలు పని మనిషి మరియమ్మకు ఇచ్చి ఇల్లు శుభ్రంచేసి మంచినీరు పట్టాలని పురమాయించారు. తిరిగి 12వ తేదీన ఇంటికి చేరుకున్న రమేష్ యాదవ్ కుటుంబం.. లాకర్లో ఉన్న రూ.65 వేలు, బీరువాలోని ఒక డైమండ్ నెక్లెస్, మరో చైన్, రెండు సెట్ల డైమండ్ చెవికమ్మలు, రెండు డైమండ్ చేతి ఉంగరాలు కనిపించని విషయం గుర్తించారు. దీనిపై వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియమ్మను విచారించగా ఆమె చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంది. ఆమె ఇంట్లో దాచిన ఏడు లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, రూ.65 వేలు పూర్తిగా స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. -
మియాపూర్ టు పంజగుట్ట
-
మియాపూర్ టు పంజగుట్ట
హైదరాబాద్: నగర వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెట్రో రైళ్లు వచ్చే ఏడాది ప్రారంభంలో మియాపూర్-పంజగుట్ట మార్గంలో పరుగులు తీయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముందుగా అనుకున్నట్టు నాగోల్-మెట్టుగూడ మార్గంలో మెట్రో రాకపోకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ స్టేషన్ వరకు మార్గాన్ని పొడిగిస్తే వాణిజ్య పరంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందన్న అంచనాతో అక్కడ ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసిన విషయం విదితమే. సికింద్రాబాద్ స్టేషన్ వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించాలంటే ఆలుగడ్డ బావి, ఒలిఫెంటా బ్రిడ్జి, చిలకలగూడ వద్దనున్న రైల్వేట్రాక్ల పైనుంచి రైల్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి. ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ట్రాక్ల పైనుంచి భారీ స్టీలు బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఈ మూడు ఆర్ఓబీల నిర్మాణానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి దశలో మియాపూర్-పంజగుట్ట మార్గంలో సుమారు 15 కి.మీ. పరిధిలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు మెట్రో కారిడార్లు కలిసే అమీర్పేట్ వద్ద ఇంటర్ఛేంజ్ మెట్రో స్టేషన్ నిర్మాణం పూర్తి కాలేదు.ఎస్.ఆర్.నగర్లో మెట్రో స్టేషన్ అందుబాటులో ఉన్నందున ఈ మార్గంలో రాకపోకలను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఎల్అండ్ టీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా ఎప్పు డు ప్రారంభించాలనే విషయంలో సీఎం కేసీఆర్దే తుది నిర్ణయమని మెట్రో రైలు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నగర మెట్రో రైళ్లలో కనిష్టం గా రూ.10, గరిష్టంగా రూ.25 చార్జీని వసూలు చేయాలని నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లు తెలిసిం ది. పొరుగునే ఉన్న చెన్నైలో కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 వసూలు చేస్తున్న విషయం విదితమే. దీనిపై ప్రభుత్వ నిర్ణయమే కీలకం. తొలగని ప్రతిష్టంభన అసెంబ్లీ వెనుక వైపు నుంచి మెట్రో మార్గం మళ్లించే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ.. సుల్తాన్ బజార్, కోఠి ఉమెన్స్ కళాశాల,పాత నగరంలో అలైన్మెంట్ మార్పుపై ప్రతిష్టంభన తొలగలేదు. సీఎం ఆదేశాల మేరకు పాతనగరంలో 3.2 కి.మీ. మార్గంలో మెట్రో అలైన్మెంట్ను పూర్తిగా మూసీ నది మధ్య నుంచే వేయాల్సి ఉంది. వాణిజ్య, సాంకేతిక పరంగా అవాంతరాలు ఎదురవుతాయని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అధ్యయనంలో తేలినట్లు సమాచారం. సుల్తాన్బజార్ నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల మీదుగా మెట్రో మార్గం మళ్లించేందుకు నిర్మాణ సంస్థ అధ్యయనం చేసి, రెండు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిసింది. వీటిలో ఏదో ఒక మార్గానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో పనులు ఊపందుకుంటాయి. 60 కి.మీ. మేరకు ఊపందుకున్న పనులు నాగోల్-రహేజా ఐటీ పార్క్, ఎల్బీ నగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్నుమా కారిడార్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు జరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుతానికి 60 కి.మీ. మార్గంలో పనులు ఊపందుకున్నాయి. నాగోల్-సికింద్రాబాద్ స్టేషన్, మియాపూర్-పంజగుట్ట, మెట్టుగూడ-బేగంపేట్, బేగంపేట్-శిల్పారామం, ఎల్బీనగర్-నాంపల్లి మార్గాల్లో సుమారు 60 కి.మీ. మేరకు మెట్రో పిల్లర్లు, వాటిపై ట్రాక్ల ఏర్పాటుకు వయడక్ట్ సెగ్మెంట్లు, స్టేషన్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కోఠి-ఫలక్నుమా మార్గంలో పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. పార్కింగ్ స్థలాల అన్వేషణ షురూ... మెట్రో స్టేషన్లకు సమీపంలో ప్రయాణికుల వాహనాలు పార్క్ చేసేందుకు మూడు కారిడార్ల పరిధిలో సుమారు 18 చోట్ల స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఓల్డ్ గాంధీ ఆస్పత్రి, తార్నాక, ఖైరతాబాద్, గడ్డిఅన్నారం, నాగోలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఖరారైనట్టుసమాచారం. ఇతర ప్రాంతాల్లోనూ అవసరమైతే ప్రైవేటు స్థలాలను లీజుకు తీసుకొని పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు హెచ్ఎంఆర్ అధికారుల బృందం కసరత్తు చేస్తోంది. త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుందని ‘మెట్రో’ అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఎన్ని బస్సులు కొనుగోలు చేయాలన్న అంశంపై ఎల్అండ్టీ కసరత్తు చేస్తోంది. -
పంజాగుట్టలో భారీగా స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్: పంజాగుట్ట ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లిహిల్స్ చెక్పోస్టు, బంజారాహిల్స్ నుంచి కిలోమీటర్ పైగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి అటు వాహనదారులు, ఇటు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
సిటీ జామ్
జడి వాన.. నగరంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం బస్తీలను ముంచెత్తిన మురుగునీరు లోతట్టు ప్రాంతాలు జలమయం నీట మునిగిన ప్రధాన రహదారులు ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ సిటీబ్యూరో:...సమయం సాయంత్రం 4.30 గంటలు. నాంపల్లి నుంచి పంజగుట్టకు వెళ్లేందుకు విజయ్ ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జడివాన కారణంగా లక్డీకాపూల్ నుంచి పంజగుట్ట వరకు వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్ రద్దీలో పంజగుట్ట చేరుకునేందుకు గంటన్నర సమయం పట్టింది. 6 గంటలకు కానీ గమ్యానికి చేరుకోలేకపోయాడు. ...సాయంత్రం 5 గంటలు... అమీర్పేట్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లేందుకు స్నేహ బస్సులో బయలుదేరింది. రాత్రి 7.40 గంటలకు గానీ నిర్ణీత స్థలానికి చేరుకోలేదు. ...పవన్ హైటెక్ సిటీ నుంచి సాయంత్రం 5.30 గంటలకు కారులో దిల్సుఖ్నగర్కు బయలుదేరాడు. రాత్రి 8.30 గంటలకు ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. ...సుభాష్ రాత్రి 7 గంటలకు బంజారాహిల్స్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఉప్పల్లోని తన నివాసానికి చేరేసరికి రాత్రి 9.30 అయ్యింది. ...గ్రేటర్లో శుక్రవారం కురిసిన జడివానకు లక్షలాది మంది వాహన చోదకులు, ప్రయాణికుల నరక యాతనకు ఇవి తార్కాణాలు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ నరకాన్ని చవిచూశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడారు. కుండపోత వర్షానికి తడిసి ముద్దవడంతోపాటు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకపోయింది. ఆర్టీసీ బస్సులు,ఆటోల్లో బయలుదేరిన వారు కూడా రాత్రి పొద్దుపోయాక గానీ ఇళ్లకుచేరుకోలేకపోయారు. ఫ్లైఓవర్లపైనా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ప్రధాన రహదారులు, షాపింగ్మాల్స్ ఎదుట పార్క్ చేసిన వాహనాలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. రహదారులపై మోకాలి లోతున నీరు ప్రవహించింది. బహదూర్పురా, గాంధీనగర్, కాలాపత్తర్, చార్మినార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, ఎస్.ఆర్.నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు జనం అవస్థలు పడ్డారు. పురాతన భవనాల సమీపంలో ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా జాగారం చేయాల్సిన దుస్థితి తలెత్తింది. రాత్రి 8.30 గంటల వరకు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో నరకం.. ప్రధాన రహదారులపై నీరు నిల్వ కేంద్రాలు 40 వరకు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఆప్రాంతాల్లో మరమ్మతులు పూర్తి కాకపోవడంతో శుక్రవారం పెద్దఎత్తున వర్షపునీరు చేరి వాహనదారులకు నరకం చూపింది. కిమ్స్ ఆస్పత్రి, డీవీ కాల నీ, సీతాఫల్మండి-ఆడిక్మెట్, మెహదీ ఫంక్షన్ హాల్, రవీంద్ర భారతి (ఫ్రీలెఫ్ట్), ఎన్టీఆర్ నగర్-కొత్తపేట్, మలక్పేట్-చాదర్ఘాట్, తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, ఆంధ్రా ఫ్లోర్మిల్, పిల్లర్నెంబర్ 78-80, 102 నుంచి లంగర్హౌస్, బాపూఘాట్ న్యూబ్రిడ్జి, బేగంబజార్ పీ ఎస్ తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. జంక్షన్ల వద్ద జంఝాటం.. ప్రధాన రహదారులపై మోకాలి లోతున వరదనీరు పోటెత్తింది. ప్రధాన రహదారులు, కూడళ్లలో వర్షపునీరు భారీగా నిలిచిపోవడం... ట్రాఫిక్ సిగ్నళ్లు పని చేయకపోవడంతో అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, పంజగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్.ఆర్.నగర్, బేగంపేట్, ప్యారడైజ్ తదితర కూడళ్లు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. ఉప్పొంగిన మ్యాన్హోళ్లు గ్రేటర్ పరిధిలో సుమారు 4600 కి.మీ. మురుగునీటి కాల్వలు ఉన్నాయి. వీటిపై 1.85 లక్షల మ్యా న్హోళ్లు ఉన్నాయి. వేసవిలో వీటిలో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్, మట్టిని 60 శాతం మేరకే తొలగించారు. దీంతో మురుగునీరు రహదారుల ను ముంచెత్తింది. వాహన చోదకులు, పాదచారులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వచ్చింది. జలమండలికి ఉన్న 18 అద్దె ఎయిర్టెక్ యంత్రాలతో వేసవిలో అరకొరగా పూడికతీత పనులు చేపట్టడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని బస్తీల వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. వర ్షవిలయానికి ఆనవాళ్లివిగో.. బర్కత్పుర, కాచిగూడ డివిజన్లలోని లోతట్లు ప్రాంతాలురత్నానగర్, శాస్త్రీనగర్, కృష్ణానగర్ తదితర బస్తీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి.సికింద్రాబాద్ పరిధిలోనిబోరుుగూడ రైల్వే బ్రిడ్జి, రాణిగంజ్ వుుంబ రుు హోటల్, బన్సీలాల్పేట కవూన్, బైబిల్ హౌస్ సమీపంలోని బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో నడువుు లోతున వరదనీరు పోటెత్తింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చిపొయే ప్రజలు, మోండా వూర్కెట్ వైపు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యూరు. ఆర్.పి రోడ్, రాణిగంజ్, బోరుుగూడ, ఒలిఫెంటాబ్రిడ్జి ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. దిల్సుఖ్నగర్ పరిధిలోని ఆర్కేపురం హరిపురి కాలనీలో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.పాతనగరంలో ఛత్రినాక చౌరస్తాపై ప్రాంతం నుంచి వచ్చిన భారీ వరదతో నదిని తలపించింది. అక్కడినాలా ఉప్పొంగింది. జనం ప్రమాదపుటంచున నాలా ఒడ్డు నుంచే వెళ్లాల్సి వచ్చింది. వరద నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొరాయించాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం గాలివాన బీభత్సానికి శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడ్డాయి. ఫీడర్లు ట్రిప్పవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్, చంపాపేట్, సంతోష్నగర్, ఐఎస్సదన్, మీర్పేట్, బీఎన్రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్నగర్, జిల్లెలగూడ, బడంగ్పేట్, సరూర్నగర్, కర్మన్ఘాట్, నాగోలు, కొత్తపేట్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, ఉప్పల్, రామంతాపూర్, చైతన్యపురి, మేడిపల్లి, హబ్సీగూడ, తార్నాక, ఉస్మానియా విశ్వవిద్యాలయం, నల్లకుంట, చాంద్రాయణగుట్ట, ఓవైసీ కాలనీ, పహడీషరీఫ్, జల్పల్లి, అబిడ్స్, అఫ్జల్ గంజ్, మెహిదీపట్నం, తదితర ప్రాంతాల్లో రెండు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరించగా... మరికొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు గంటలు పట్టింది. వర్షానికి తోడు వీధుల్లో లైట్లు కూడా వెలగకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
మెట్రో మహల్స్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో ప్రాజెక్టులో మరో విశేషం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న మెట్రో మాల్స్తో వివిధ ప్రధాన రహదారులు తళుకులీనబోతున్నాయి. పంజగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ ప్రాంతాల్లో సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ మాల్స్తో నగరంసింగపూర్ తరహా అందాలు సంతరించుకుంటుందని భావిస్తున్నారు. ఈ మాల్స్తో ఐటీ, బీపీఓ, కేపీఓ వంటి బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, బ్రాండెడ్ దుస్తులు, రెస్టారెంట్లు, హెల్త్కేర్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. రాబోయే పదేళ్లలో మాల్స్ సంఖ్య 12కు చేరుకోనుందనిమెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్టులో ప్రతి అంశం విశేషంగా మారింది. భారీ మెట్రో మాల్స్ నిర్మాణం, స్టేషన్లలో ఏర్పాటు కానున్న దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, వాణిజ్య ప్రకటనలపై అందరి దృష్టి పడింది. కొంగొత్త హంగులతో రూపుదిద్దుకోనున్న వాటి కథాకమామీషు ఇదిగో.. నగరానికి నయా లుక్ మెట్రో ప్రాజెక్టులో భారీ మాల్స్ నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పంజ గుట్ట వద్ద 50 వేల చదరపు అడుగులు, హైటెక్సిటీ వద్ద 20 వేల చదరపు అడుగులు, ఎర్రమంజిల్ వద్ద 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా మెట్రో మాల్స్ సిటీజన్లకు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే పదేళ్లలో ఉప్పల్ మెట్రో డిపో, మూసారాంబాగ్, మలక్పేట్, ఎల్బీనగర్, ఎర్రమంజిల్, బేగంపేట్, రాయదుర్గం, అమీర్పేట్, బాలానగర్, మియాపూర్ మెట్రో డిపోల వద్ద కూడా భారీ వాణిజ్య మాల్స్ను మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ నిర్మించనుంది. మొత్తంగా 18.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య, రియల్ ఎస్టేట్ స్థలాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మాల్స్లో ఆఫీస్ స్పేస్, రిటైల్ స్టోర్లు, బహుళజాతి కంపెనీలు, ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీల కార్యాలయాలు, హోటళ్లు, హెల్త్కేర్ సెంటర్లు, పాలిక్లినిక్స్, రిటైల్ స్టోర్లు, బ్రాండెడ్ వస్త్రాల దుకాణాలు, మల్టిప్లెక్స్లు ఏర్పాటు కానున్నాయి. కాగా మెట్రో మాల్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు సుమారు రూ.4 వేలు వ్యయం అవుతోందని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చదరపు అడుగుకు నెలవారీగా రూ.50 నుంచి 150 వరకు అద్దె ఉంటుందన్నారు. వాణిజ్య ప్రకటనలు ఇలా.. కాదేదీ వాణిజ్య ప్రకటనలకు అనర్హం అన్న చందంగా మెట్రో రైళ్లకు లోపల, బయట, స్మార్ట్ కార్డుల వెనకాల, స్టేషన్ల బయట, లోపల, మెట్రో పిలర్లు, పోర్టల్స్, వయాడక్ట్లపై ఆసక్తిగల సంస్థలు వాణిజ్య ప్రకటనల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ఆయా స్థలాలను అద్దె కిచ్చేందుకు ఎల్అండ్టీ సంస్థ సన్నాహాలు చేస్తోంది. వాణిజ్య ప్రకటనల ద్వారా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సుమారు 5 శాతం ఆదాయాన్ని దశలవారీగా రాబట్టుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్లు, బోర్డుల ఏర్పాటుకు భారతీయ మహిళా బ్యాంక్, హెచ్పీ, కియోలిస్, థేల్స్, మిత్సుబిషి ఎలక్ట్రిక్, ఓస్లో, ఓటీఐఎస్, ఫీడ్బ్యాక్ ఇన్ఫ్రా, ఏఈకామ్ వంటి సంస్థలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీతో ఒప్పందాలు కదుర్చుకున్నాయి. వాణిజ్య ప్రకటనలకు అద్దెలు ప్రాంతాన్ని బట్టి, మార్కెట్ డిమాండ్ను బట్టి మారుతుంటాయన్నారు. టేషన్లలో ఏముంటాయంటే.. -నాగోల్- రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్నుమా మార్గాల్లో మొత్తం 72 కి.మీ మార్గంలో 64 ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మించనున్నారు. - 64 స్టేషన్లలో మొత్తం 4.50 లక్షల చదపు అడుగుల విస్తీర్ణంలో పలు దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. - 55 స్టేషన్లు నిర్మాణ పరంగా అత్యంత క్లిష్టమైనవి. వీటిలో ఒక్కో స్టేషన్లో 2500 నుంచి 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. - స్టేషన్లోనికి ప్రవేశించే మార్గం, వెలుపలికి వచ్చే మార్గాల్లో మరో వెయ్యి నుంచి 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ రిటైల్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. - స్టేషన్లలో ప్రతి దుకాణం విస్తీర్ణం 100 నుంచి 2500 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉంటాయి. - అమీర్పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్ల వద్ద ఏర్పాటు కానున్న ఇంటర్ చేంజ్ (రెండు కారిడార్లు కలిసే చోటు) స్టేషన్లు, హైటెక్సిటీ, పంజ గుట్ట, రాయదుర్గం, బేగంపేట్ మెట్రో స్టేషన్లలో ఒక్కో స్టేషన్లో సుమారు పది వేల నుంచి 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలం అందుబాటులో ఉంటుంది. తొలుత వచ్చినవారికే దుకాణం ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. - స్టేషన్లలో ఏర్పాటు చేసే దుకాణాల్లో నిత్యవసర సరుకులు, పండ్లు, కూరగాయలు, లాండ్రీ, పుస్తకాలు, కాఫీషాపులు, కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్స్, పిజ్జా, బర్గర్ దుకాణాలు ఏటీఎంలు, మొబైల్ రీచార్జి కార్డులు, సర్వీ సింగ్ సెంటర్లు, మెడికల్ షాపులుంటాయి. - మొత్తం 65 స్టేషన్లలో మెడ్ప్లస్ సంస్థ మందుల దుకాణాలు ఏర్పాటు చేయనుంది. కాగా ఇప్పటికే స్టేషన్లలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలాలను అద్దెకిచ్చినట్టు ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. - నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్.ఆర్నగర్ రూట్లలో ఏర్పాటు కానున్న స్టేషన్లలో స్థలానికి భారీగా గిరాకీ ఉన్నట్లు తెలిపారు. - ప్రస్తుతం రాయదుర్గం, పంజ గుట్ట, హైటెక్సిటీ, బేగంపేట్ మెట్రో స్టేషన్లలో దుకాణాల ఏర్పాటుకు పోటీ అధికంగా ఉందని ఇక్కడ చదరపు అడుగుకు సుమారు రూ.450 నెలసరి అద్దె ఉండనుంది. - స్టేషన్లో దుకాణం నెలకొల్పేవారు స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ప్రతి చదరపు అడుగుకు నెలవారీగా కనిష్టంగా రూ.90 నుంచి గరిష్టంగా రూ.450 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. షాప్ ఏర్పాటు చేయాలంటే.. - ఫర్మ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫర్మ్ పాన్కార్డు, టిన్ నెంబరు, బ్యాంక్ కరెంట్ అకౌంట్, సంబంధిత రంగంలో అనుభవం, అర్హత ఉన్నవారు హైటెక్సిటీ వద్దనున్న ఎల్అండ్టీ సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు. - ఇప్పటివరకు మెట్రో స్టేషన్లలో వాణిజ్య స్థలాలు అద్దెకు తీసుకున్న ప్రముఖ కంపెనీలు: డొమినోస్, పోలిటస్, మెడ్ప్లస్, అమూల్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలు. -
స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొందాం : విజయారెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్ను సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకురాలు పి. విజయారెడ్డి అన్నారు. శుక్రవారం పంజగుట్ట డివిజన్ పరిధిలోని తబేలా బస్తీలో ఆమె స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. తబేలాబస్తీలో ఉన్న మజీద్లో ప్రార్థనల అనంతరం పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రమదానం చేసి ఆయా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. మట్టికుప్పలు, చెత్తను పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్ ఓ బృహత్తర కార్యక్రమమని, దీన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మన పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటామని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. -
పంజాగుట్టలో అగ్రిగోల్డ్ ఆఫీస్ వద్ద ఆందోళన
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద డిపాజిట్దారులు, ఏజెంట్లు మంగళవారం ఆందోళనకు దిగారు. తమ డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా చెల్లింపుల్లో ఇటీవల జరుగుతున్న జాప్యం.. కొందిరికి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడం.. సంస్థ విజయవాడ కార్యాలయంలో సీబీఐ సోదాలు.. తదితర పరిణామాలు అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారుల్లో అలజడి, ఆందోళనకు కారణమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక,ఒడిశాలో ఉన్న ఖాతాదారులు పెద్దసంఖ్యలో ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ సంస్థలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు కాలపరి మితి ముగిసిన తర్వాత సొమ్ము చెల్లింపులో కొన్ని నెలులుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. గట్టిగా అడిగిన వారికి చెక్కులిచ్చి పంపిస్తున్నారు. వాటిని బ్యాం కులో వేస్తే సంస్థ ఖాతాలో సొమ్ము లేక తిరిగి వచ్చేస్తున్నాయి. తమను మోసం చేసి బోర్డు తిరగేసేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పలువురు ఆరోపించారు. -
యువతిపై యాసిడ్దాడి
-
బోర్డు తిప్పేసిన 'ఐఐపీఎం'
పోలీసులను ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్ : బీబీఏ, ఎంబీయే కోర్సులంటూ ఆర్భాటపు ప్రకటనలు ఇచ్చి విద్యార్థులను ఆకర్షించి వారి నుంచి లక్షలకొద్దీ ఫీజుల రూపేణా వసూలు చేసిన ఓ ప్రైవేటు విద్యా సంస్థ చివరికి బిచాణా ఎత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన నగరంలోని పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్కు చెందిన ఐఐపీఎం అనే విద్యా సంస్థ బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలంటూ సుమారు 29 మంది విద్యార్థుల నుంచి రూ.79 లక్షల మేర వసూళ్లు చేసింది. ఏడాది నుంచి విద్యార్థుల దగ్గర డబ్బు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేసింది. దీంతో మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు నిర్వాహకులు సాయినాథ్ యాదవ్, లోకేశ్రెడ్డిలను శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఫీజుల రూపేణా భారీగా డబ్బులు చెల్లించిన బాధిత విద్యార్థులు శనివారం సాయత్రం పంజాగుట్ట పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఐఐపీఎం నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత షఫీయుద్దీన్, ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ మండె గోవర్ధన్రెడ్డి అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చి హల్ చల్ సృష్టించినట్టు తెలిసింది. (పంజాగుట్ట) -
ఆమెది ఆత్మహత్యే..!
యువతి సజీవ దహనం కేసులో వీడిన మిస్టరీ మృతురాలు నందిగామకు చెందిన పూజితగా గుర్తింపు సీఏ పాస్ కాలేక పోతున్నాననే మనోవేదనే కారణం ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిన మృతురాలు హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఐపీఎస్, ఐఏఎస్ క్వార్టర్స్ వద్ద యువతి సజీవ దహనం కేసులో పంజగుట్ట పోలీసులు పురోగతి సాధించారు. మృతిచెందిన యువతి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విద్యార్థి వాసిరెడ్డి పూజిత (19)గా తేలింది. ఆమె ధరించిన వాచీ, చెవిదిద్దులు, చెప్పుల ఆధారంగా హైదరాబాద్లోనే నివాసముంటున్న ఆ యువతి బాబాయ్ నరేష్ పూజిత మృతదేహాన్ని గుర్తించారు. నాలుగు సార్లు పరీక్షలు రాసినా సీఏ ఇంటర్లో తప్పిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజిత హైదరాబాద్కు వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన శ్రీనివాస్, అన్నపూర్ణ దంపతులకు రోహిత, పూజిత (19) కుమార్తెలు. రోహిత చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం చేస్తుండగా, పూజిత చార్టెడ్ అకౌంట్ (సీఏ ఇంటర్) చదువుతోంది. గతంలో పూజిత అమీర్పేటలో ఉంటూ సీఏ ఎంట్రన్స్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే లక్డీకాపూల్లో బ్యాచిలర్గా ఉంటున్న బిహార్ రాష్ట్రానికి చెందిన అక్షయ్కుమార్తో పరిచయమైంది. ఇతను కూడా సీఏ చదువుతున్నాడు. ఇదిలావుండగా ప్రస్తుతం గుంటూరులో సీఏ ఇంటర్ చదువుతున్న పూజిత నాలుగు సార్లు పరీక్షలు రాసినా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఈ నెల 19న తెల్లవారుజామున ఇంట్లో సూసైడ్నోట్ రాసి పెట్టి అదేరోజు తన స్నేహితుడు అక్షయ్ను చివరిసారిగా చూసేందుకు హైదరాబాద్ వచ్చింది. ఇద్దరూ కలిసి సికింద్రాబాద్లో షాపింగ్ చేశారు. పూజిత ఒక టీషర్టును తన స్నేహితుడికి కొనిచ్చింది. తరువాత తాను ఇంటికి వెళ్తానని చెప్పడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రాత్రి 10 గంటలకు అక్షయ్ ఆమెకు వీడ్కోలు చెప్పి తన గదికి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు రాత్రి తనకు కొనిచ్చిన టీషర్టును అక్షయ్ విప్పి చూడగా అందులో పూజిత సూసైడ్ నోట్ దారికింది. అర్ధరాత్రి తరువాత అక్షయ్ సూసైడ్నోట్ను తీసుకుని నాంపల్లి పోలీసు స్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించాడు. అప్పటికే పూజిత కాలినగాయాలతో పంజగుట్ట పరిధిలోని మున్సిపల్ గార్డెన్లో శవమై తేలింది. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి పూజిత తిరిగి పంజగుట్టకు చేరుకుంది. అదే రోజు అర్ధరాత్రి దాటిన తరువాత 1.20కి ఆమె గార్డెన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కాలిన గాయాలే కారణమని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అయితే సికింద్రాబాద్ నుంచి పంజగుట్టకు ఎలా వచ్చింది, పెట్రోల్ ఎక్కడ ఖరీదు చేసింది అనే వివరాలు తేలాల్సి ఉంది. కాగా పూజిత మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా మృతురాలి బంధువులు శని వారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద ధర్నా చేశారు. ఇదిలా ఉండగా పూజిత మృతిపై ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాలపై మృతురాలి తల్లి అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ రాసి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని.. వేరే కారణాలు ఏమీ లేవని ఆమె వాపోతున్నారు. పూజిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి అయితే పూజిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తాత వాసిరెడ్డి రామలింగయ్య కోరారు. గాంధీ మార్చురీ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనుమరాలి మృతికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఎస్సెమ్మెస్ ద్వారా: సూసైడ్ నోట్ రాసిన పూజిత తన సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లింది. ఫోన్ను పరిశీలించగా ఎస్సెమ్మెస్ ఆధారంగా విచారిస్తే తన బోయ్ఫ్రెండ్ అక్షయ్కుమార్కు ఆఖరు ఎస్సెమ్మెస్ చేసినట్లు తెలిసింది. సూసైడ్ నోట్:‘‘మమ్మీ నాకు బతకాలని లేదు. సోదరి రోహితకు కూడా ఉద్యోగం వచ్చింది. కానీ నాకు ఎప్పటికీ రాదు. డిగ్రీ పరీక్షలకు సిధ్దం అయ్యే సమయంలో ఓ లెసన్లో చదివాను. నిరుద్యోగులు డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకుంటారని. అది చదవగానే ఏడుపు వచ్చింది. నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నాకోసం ఏడవద్దు, రోహితకు ఏడెకరాల పొలం కట్నంగా ఇచ్చి పెళ్లి చేయండి. ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుందామనుకున్నాను కాని దూరంగా వెళ్లి చనిపోదామని నిశ్చయించుకున్నాను. రూ.2000 తీసుకువెళ్తున్నాను, నేను పుట్టలేదు అనుకొండి. మీకు ఎప్పటికీ భారంకాను. ఈ రోజు రాత్రికల్లా చనిపోతాను. అక్కా ఆల్ ది బెస్ట్ కీప్ స్మైలింగ్’’అని రాసి ఉంది. ఇంట్లో రాసిన సూసైడ్నోట్ను పంజగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీషర్టులో లభించిన నోట్ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజీవ దహనం కేసు: ఆ యువతి పూజిత
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన యువతి మృతి కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ పంజాగుట్ట ఐఏఎస్ కాలనీలో శుక్రవారం కలకలం రేపిన యువతి సజీవ దహనానికి సంబంధించిన వివరాలను వారు కనుగొన్నారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఆ యువతి పేరు పూజితగా తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆమె ప్రస్తుతం సీఏ ఇంటర్ చదువుతోంది. యువతి హైదరాబాద్ బయలుదేరే ముందు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తన అక్క రోహితకు ఉద్యోగం వచ్చిందని, తను ఇంకా ఉద్యోగం సాధించలేకపోయానని, జీవితం మీద విరక్తి చెంది చనిపోతున్నట్లుగా పూజిత సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజితను అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూజిత బాయ్ ఫ్రెండ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజిత మరణవార్త విని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు పూర్తి విషాదంలో మునిగిపోయారు. -
సజీవ దహనం కేసు: ఆ యువతి పూజిత
-
పంజాగుట్టలో యువతి సజీవ దహనం!
హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. శ్రీనగర్ కాలనీ సిగ్నల్స్ సమీపంలోని అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనుక ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ ఖాళీ స్థలంలో 25ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆ యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కాగా మృతురాలి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
మోనో హోటల్లో గ్యాస్ లీకేజీ పేలుడు
హైదరాబాద్లోని పంజాగుట్ట మోనో హోటల్లో బుధవారం ఉదయం ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీకై పేలుడు సంభవించడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. కొంతమంది బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు. గాయాలపాలయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, పైర్ సిబ్బంది ఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. హోటల్లోని వంటగది మొత్తం విడివిడి వస్తువులుగా చిందరవందరగా మారి పూర్తిగా దెబ్బతిన్నది. -
ఎంత ఎత్తయినా.. చకచకా కట్టేస్తాం
ఎంత ఎత్తయినా మాకేంటి చకచకా కట్టేస్తామంటున్నారు కార్మికులు. పంజగుట్ట ఫ్లైఓవర్ వద్ద మెట్రో పనుల్లో వేగంగా సాగుతున్నాయి. భారీ పిల్లర్ నిర్మాణ పనులను జోరుగా చేపడుతున్నారు కార్మికులు. మధ్యాహ్నం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులను కొనసాగిస్తున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి ఈ దృశ్యాలను చూసిన వారు ఆహా అనక మానరు. - ఫొటో: దయాకర్ తూనుగుంట్ల -
పంజాగుట్టలో బోర్డు తిప్పేసిన కంపెనీ