Panjagutta
-
ఆస్తికోసం తాతను హత్య చేసిన మనవడు
-
పంజాగుట్ట నిమ్స్ దగ్గర ఉద్రిక్తత.. సిబ్బంది నిరసన
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్స్ వర్కర్ను పంజాగుట్ట పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. నిన్న(గురువారం) ఓ పేషెంట్ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా.. బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆ రోగి విధుల్లో ఉన్న వర్కర్పై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది. విచారణలో భాగంగా నిమ్స్ వర్కర్ను పంజాగుట్ట పోలీసులు కొట్టారంటూ ఇతర సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పూర్తిగా నిర్థారణకు రాకుండానే చోరీ పేరుతో వర్కర్ను కొట్టారంటూ పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. అత్యవసర విభాగం వద్ద సిబ్బంది ఆందోళన చేపట్టారు.ఇదీ చదవండి: దీని వెనుక ఏదో మతలబు ఉంది -
బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్రరావుపై కేసు
-
ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు..హరీశ్రావుపై కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్గౌడ్ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్ఫోర్స్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్రావుపై ఫోన్ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్షీట్: హరీశ్రావు -
HYD: పంజాగుట్టలో కారు బీభత్సం.. హోంగార్డును ఈడ్చుకెళ్లి..
సాక్షి,హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం(నవంబర్ 8) ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఆపకుండా దూసుకెళ్లాడు. కారు ఆపిన హోంగార్డును కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాగుట్టలో కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా నాగార్జున సర్కిల్ వద్ద హోంగార్డ్ రమేష్ ఓ కారును ఆపాడు. అయితే కారును ఆపకుండా హోం గార్డు రమేష్ని కారు డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడి ఆపకుండా ఈడ్చుకెళ్లాడు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో చోరీ.. పోలీస్స్టేషన్కు ప్రయాణికులు -
గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
-
పంజాగుట్ట డ్రగ్స్ కేసు: స్టాన్లీ కాంటాక్ట్ లిస్ట్లో ప్రముఖల పేర్లు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్తో స్టాన్లీ పట్టుబడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్లో పలువురు ఏజెంట్లను స్టాన్లీ రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టాన్లీ కాంటాక్ట్ లిస్ట్లో ప్రముఖల పేర్లు ఉండటం గమనార్హం. స్టాన్లీ డ్రగ్స్ లింక్స్.. పోలీసుల కస్టడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతునన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అతనికి నైజీరియాలో డ్రగ్స్ తయారీదారులతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ అప్డేట్
-
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం
-
దుబాయ్ పారిపోయిన సోహిల్..పంజాగుట్ట సీఐ సస్పెండ్
-
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. సోహైల్ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోహైల్కు బదులు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిమనిషి అబ్దుల్ అసిఫ్ను కేసులో పోలీసులు చేర్చారు. ప్రమాద సమయంలో కారు అబ్దుల్ నడిపినట్లు కేసు నమోదు చేశారు. దుబాయ్ నుంచి షకీల్ ఈ వ్యవహారం అంతా నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాగుట్ట సీఐ దుర్గారావుకు అస్వస్థతకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐను బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్తో రాత్రి ఫోన్ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కాగా షకీల్ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్ను తప్పించి మరొకరు డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు.షకీల్ కొడుకు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కొడుకు సోహైల్గా తేల్చారు. అయితే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్తోపాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం
-
పంజాగుట్టలోని శ్మశానవాటికలో జరగనున్న చంద్రమోహన్ అంత్యక్రియలు
-
HYD: పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ !
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు. అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
టీబీజెడ్లో ‘మంగళ 2023 కలెక్షన్’
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ టీబీజెడ్ ‘మంగళ 2023 కలెక్షన్’ ఆవిష్కరించింది. పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కొత్త కలెక్షన్ విడుదల చేసింది. ‘‘భారతదేశ సంస్కృతి స్ఫూర్తితో తీర్చిదిద్దిన ఈ బంగారు వజ్రాభరణాలు ఏ సందర్భంలో ధరించినా ప్రత్యేకత చాటుతాయి. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అని రకుల్ తెలిపారు. పంజాగుట్ట స్టోర్ పునః ప్రారంభంతో భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని టీబీజెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభిõÙక్ మాలూ ఆశించారు. -
హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్లకు డైరెక్టర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్ను కెనరా బ్యాంక్ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్ల లిస్ట్లో నాన్ పర్ఫామింగ్ అసెట్గా మారింది ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి -
మెట్రో స్టేషన్ల కిందా తాగుడే!
హైదరాబాద్: బహిరంగ ప్రదేశాలు, బస్టాప్లే కాకుండా ఇప్పుడు మెట్రోస్టేషన్ల కింద కూడా తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారని నగరానికి చెందిన టీఏవీ శ్రీనివాస్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. పంజగుట్ట మెట్రో స్టేషన్ కింద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న దృశ్యాలను తన సెల్ఫోన్లో బంధించి తన ట్వీట్తో జతపరిచారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. This is the current situation near Punjagutta @HyderabadMetroR station. Request @KTRBRS to take action @TelanganaDGP @NVSReddyIRAS pic.twitter.com/mf4fPj7vuF — T A V Srinivas (@TAVSrinivas1) July 7, 2023 -
ఆర్థిక విద్యలో శిక్షణ అవసరం
పంజగుట్ట: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం బలంగా ఉన్నామంటే మన పూర్వీకులదగ్గర నుండి మనం నేర్చుకున్న, సంపాదించిన దాంట్లో కొంత దాచుకునే అలవాటు వల్లే అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ఆదివారం రాజ్భవన్ సంస్కృతి హాల్లో హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ ఆధ్వర్యంలో రాజ్భవన్ సిబ్బందికి ‘ఫైనాన్షియల్ లిట్రసీ ట్రైనింగ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ .. ఆర్థిక మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఆర్ధిక విద్యలో శిక్షణ ఎంతో అవసరమన్నారు. కరోనా సమయంలో రాజ్భవన్ మహిళలకు పలు రంగాల్లో శిక్షణ ఇప్పించామని దీంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు నేను ఏదైనా సాధించవచ్చు అనే ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ తెలుగు రాష్ట్రాల రీజనల్ హెడ్ సిద్దార్ధ చటర్జీ, వైస్ ప్రసిడెంట్, సౌత్ జోనల్ హెడ్ జి.శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, ట్రైనర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన దుండగులు
-
K Viswanath Funeral: ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు
సినీ దిగ్గజం కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్(92)మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జీవో 317: ప్రగతి భవన్ వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, కార్యాలయం అయిన ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు యత్నించారు. ఆదివారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జీవో 317ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు ముట్టడికి యత్నించారు. ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ జీవో కారణంగా ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, జీవోకు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపై ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి ఉప్పల్ పీఎస్కు తరలించారు పోలీసులు. ఇక ముట్టడి భగ్నం కాగా.. పంజాగుట్ట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317. అందుకు సంబంధించిన మార్గదర్శకాలే ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సైతం జీవో రద్దు కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
వైఎస్సార్ సర్కిల్ వద్ద అభిమానులు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
Hyderabad National Book Fair: బుక్ఫెయిర్కు 10 లక్షల మంది!
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్ఫెయిర్కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. -
ఒక్క ప్రమాదం.. ఎన్నో పాఠాలు.. ఆ కాస్త దూరం వెళ్లలేక!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం వాహనచోదకులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో స్పష్టం చేస్తోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఆదివారం నాటికీ ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అసలేం జరిగిందంటే... బల్కంపేటకు చెందిన విద్యార్థి యాదగిరి (22) తన ద్విచక్ర వాహనంపై, తన సమీప బంధువు అనిల్తో (20) కలిసి ఉప్పల్ నుంచి వస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నాంపల్లి వాసి నవీన్ (31) తన బైక్పైప్రయాణిస్తూ రాజ్భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నవీన్ వాహనాన్ని యాదగిరి వాహనం ఢీ కొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలూ దాదాపు వంద అడుగులు జారుకుంటూ వెళ్లాయి. దీంతో అనిల్, యాదగిరి తీవ్రంగా గాయపడగా... నవీన్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కాస్త దూరం వెళ్లలేక... తన వాహనంపై వస్తున్న నవీన్ ఘటనాస్థలి వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని మళ్లీ రాజ్భవన్ వైపు వెళ్లాల్సి ఉంది. వేగంగా వస్తున్న అతడు దాన్ని దాటి కాస్త ముందుకు వచ్చేశారు. ఇలా జరిగినప్పుడు కేవలం 500 మీటర్ల లోపు దూరంలో ఉన్న ఖైరతాబాద్ చౌరస్తా వరకు వచి్చ, అక్కడ యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంది. ఈ కాస్త దూరం ముందుకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహించిన అతడు తాను ప్రయాణిస్తు మార్గంలోనే రాంగ్ రూట్లో వెనక్కు వచ్చి నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నుంచి రాజ్భవన్ వైపు వెళ్లే రోడ్డులోకి రావాలని ప్రయత్నించారు. పరిమితికి మించిన వేగం... ఈ ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన పోలీసులు దాన్ని విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో యాదగిరి తన వాహనాన్ని అత్యంత వేగంగా నడిపినట్లు గుర్తించారు. సిటీ రోడ్లలో ఏ సమయంలోనైనా గరిష్టంగా గంటలకు 40 కిమీ వేగం మంచిది కాదు. అయితే ప్రమాద సమయంలో ఈ వాహనం గంటలకు దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర వేగమని చెప్తున్నారు. హఠాత్తుగా ఇటు రావడంతో... ఇంత స్పీడుగా వస్తున్న వీరి దృష్టి యూ టర్న్ వద్ద రాజ్భవన్ వైపు నుంచి వచ్చి యూటర్న్ తీసుకునే వాహనాలపై మాత్రమే ఉంటుంది. నిబంధనల ప్రకారం అలానే రావాలి. అయితే నవీన్ అదే రోడ్లో, రాంగ్ రూట్లో వ్యతిరేక దిశలో వచ్చి యూ టర్న్ వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చి రాజ్భవన్ వైపు వెళ్లే మార్గంలో ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని యాదగిరి తన వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేక నవీన్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ధాటికి ఆ వాహనం పెట్రోల్ ట్యాంక్ వద్ద వంగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. హెల్మెట్ వాడకపోవడంతోనే... ప్రమాదానికి కారణమైన, ప్రమాదానికి గురైన రెండు వాహనాలపై ఉన్న చోదకులూ హెల్మెట్లు ధరించలేదు. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ రెండూ 220 సీసీ, 180 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలైనప్పటికీ చోదకులు హెల్మెట్లు ధరించలేదు. చిన్న పాటి నిర్లక్ష్యాలు, నిబంధనలు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది వాహనచోదకులకు గుణపాఠం కావాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
ఉద్రిక్తతల నడుమ ‘చలో రాజ్భవన్’
పంజగుట్ట: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ చేపట్టిన ‘చలో రాజ్భవన్’తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వందలాదిగా సీపీఐ కార్యకర్తలు ఖైరతాబాద్ కూడలి వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ భారీ గా మోహరించిన పోలీసులు బ్యారికేడ్లు వేసి వారిని అక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కార్యకర్తలు మక్తా రైల్వేగేటు మీదుగా రాజ్భవన్ ముట్టడికి యత్నించగా వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఖైరతాబాద్ కూడలివద్ద ఆందోళనకారులు సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫెడరల్ సిస్టం, గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలి అని నినాదాలు చేస్తూ బైఠాయించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు అజీజ్ పాషా, చాడా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్తో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ...గవర్నర్ పదవిని అడ్డంపెట్టుకుని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి వ్యతిరేక పార్టీలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఎన్టీఆర్లేని సమయంలో అప్పటి గవర్నర్ రాంలాల్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని గుర్తుచేశారు. ఇటీవల మహారాష్ట్రలో, గోవాలో అలానే జరిగిందన్నారు. ఈ నెల 29న అన్ని రాష్ట్రా ల్లో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్తో రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కిలాడీ ఆటో డ్రైవర్.. పంజగుట్టకు చేరుకోగానే ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసి..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసిన ఓ ఆటో డ్రైవర్ సదరు వ్యక్తి సెల్ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా రూ. 57 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్కు చెందిన పి.వీరప్రతాప్ సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చిన అతను అర్జెంట్గా మంచిర్యాల వెళ్లే క్రమంలో తెల్లవారు జామున 4:25కు ఈఎస్ఐ వద్ద సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఆటో పంజగుట్ట కూడలికి చేరుకోగానే ఆటోడ్రైవర్ వీరప్రతాప్ను ఆటోలోనుంచి బలవంతంగా బయటకు నెట్టివేసి ఆటో తీసుకుని బంజారాహిల్స్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వీరప్రతాప్ తేరుకుని కొద్దిసేపు తర్వాత చూసుకోగా అతని సెల్ఫోన్ కనిపించలేదు. అర్జెంట్గా ఊరు వెళ్లే క్రమంలో అతను మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఎటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు చూడగా నో బ్యాలెన్స్ చూపించింది. దీంతో మంచిర్యాల యాక్సిస్ బ్యాంకులో సంప్రదించగా తన అకౌంట్ నుండి గూగుల్ పే ద్వారా 57362 రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. దీంతో తిరిగి నగరానికి వచ్చిన వీరప్రతాప్ శుక్రవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శంషాబాద్లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు -
Hyderabad: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్లు చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట) -
హైదరాబాద్లో వ్యభిచార దందా బట్టబయలు
సాక్షి, హైదరాబాద్(పంజగుట్ట): స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడి చేసి సబ్ ఆర్గనైజర్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... సోమాజిగూడలోని సూర్యానగర్ కాలనీలో ఉన్న నేచ్యురల్ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారం అందుకున్న పంజగుట్ట అడిషనల్ ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు నేతృత్వంలో బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. సబ్ ఆర్గనైజర్ నర్సింహ, ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్లో భార్యను చంపిన భర్త) -
పంజాగుట్టలోని ఓ జ్యువెలరీ ప్రారంభోత్సవంలో బిగ్బాస్ఫేమ్ దివి సందడి (ఫోటోలు)
-
HYD: నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాలా చోట్ల మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కేబీఆర్ పార్క్ దగ్గర, అపోలో జంక్షన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, క్యాన్సర్ ఆస్పత్రుల చుట్టూరా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాలా సేపటి నుంచి పరిస్థితి అలాగే ఉండడంతో వాహనదారులు చిరాకు పడుతున్నారు. సోమవారం సాయంత్రం సైతం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం విశేషం. ఇక ఇవాళ(మంగళవారం) ఉదయం సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పంజాగుట్ట-ఎల్వీప్రసాద్ రూట్లో, పంజాగుట్ట, బేగంపేట దగ్గర్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి యత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వాహనాలు నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. -
పంజాగుట్టలో డైమండ్ షోరూం ప్రారంభోత్సంలో అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫోటోలు)
-
హైదరాబాద్లో మరోసారి దంచికొట్టిన వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్పేట, మణికొండలోనూ వాన కుమ్మేస్తోంది. వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కాగా గతకొన్నిరోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నేడు మరోసారి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Heavy rain at Punjagutta.@HiHyderabad @swachhhyd @balaji25_t @Rajani_Weather @RajenderPHP @PANDARAJATH @sai_koushika @aSouthIndian @puducherri @NallulaHere @GHMCOnline #HyderabadRains pic.twitter.com/ZyPjeWwWZF — Amar⚡ (@amartadi) July 31, 2022 Huge rain at budvel Rajendranagar since 30 mints @Hyderabadrains @balaji25_t pic.twitter.com/Js441CZsBA — L Tarun Kumar (@LTarunKumar1) July 31, 2022 -
అసభ్యకర మెసేజ్లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా అసభ్య మెసేజ్ పంపతూ.. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నటి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. అమీర్పేట, నాగార్జునానగర్ కాలనీలో ఉంటున్న నటి (42) కు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ పదిహేనేళ్లుగా పరిచయం. ప్రవీణ్ భవనాలు నిర్మించే బిల్డర్. 8 ఏళ్ల క్రితం ఆమె వద్ద రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాధితురాలు అపార్ట్మెంట్లో ఉండే మరో మహిళ వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని ప్రవీణ్కు ఇచ్చింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అసభ్యకర మెసేజ్లు పెడుతూ తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి -
పంజాగుట్టలో టీవీ నటి ఆత్మహత్యాయత్నం, నిమ్స్కు తరలింపు
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సదరు నటిని మైథిలిగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసి తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అంతేకాదు తన భర్త బండి సీజ్ చేయాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని మైథిలి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చదవండి: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు అప్పటికే మైథిలి 8 బ్రీజర్లు, స్లీపింగ్ ట్యాబ్లెటను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక ఫోన్ సిగ్నల్స్ ఆధారం పోలీసులు నటి ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని సమీపంలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. కాగా గతంలో కూడా మైథిలి మోతె పీఎస్లో తన భర్తపై కేసు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హైదరాబాద్: అపార్టుమెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: అపార్టుమెంట్లోని ఓ ఫ్లాట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు దాడిచేసి నిర్వాహకుడు, విటుడు, వీరికి సహకరించే వాచ్మెన్ను అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ మక్తాలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంలో పంజగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.నరసింహరాజు తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో సబ్ ఆర్గనైజర్ బీఎస్ మక్తాకు చెందిన దుర్గాప్రసాద్(26), విటుడు శేరిలింగంపల్లికి చెందిన షేక్ తాహేర్(28), వ్యభిచార నిర్వహణకు సహకరిస్తున్న వాచ్మెన్ చంద్రయ్యను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4 వేలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్బెంగాల్కు చెందిన మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు అమర్ అలియాస్ ప్రేమ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైదరాబాద్: నిషేధిత హారన్ కొడుతూ రోడ్లపై దూసుకుపోతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! -
పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని..
సాక్షి, పంజగుట్ట: యువతి కనిపించకుండా పోయిన సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చాంద్రాయణగుట్ట ఇబ్రహీం మజ్జిద్ సమీపంలో నివసించే ఉజ్మా బేగం(22) పంజగుట్టలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఆఫీస్ మేనేజర్కు కొద్దిగా డబ్బులు కావాలని అడిగింది. మేనేజర్ ఏటీఎం కార్డు ఇచ్చి డ్రా చేసుకోవాలన్నాడు. ద్వారకాపూరి కాలనీ సాయిబాబా ఆలయం వద్ద ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని సహోద్యోగికి కార్డు ఇచ్చి మేనేజర్కు ఇవ్వాలని వెళ్లిపోయింది. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆఫీస్లో చుట్టుపక్కల ఆరా తీసినా ఫలితంలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. దీంతో బుధవారం ఆమె తల్లి నజ్మాబేగం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది -
Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. పరారీలో ఇషిక
సాక్షి, పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్పై దాడిచేసిన ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. పంజగుట్ట దుర్గానగర్లో ఓ ఇంటోల స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ నర్సింహరాజు ముందుగా కానిస్టేబుల్ను విటుడిగా పంపారు. వ్యభిచారం జరుగుతోందని తెలుసుకుని ఆకస్మికంగా దాడి చేశారు. నిర్వాహకురాలు ఇషిక పరారీలో ఉండగా డార్జిలింగ్కు చెందిన ఓ బాధితురాలితో ఈ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండువేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (క్షుద్ర భయం కల్పించి.. మూడు నెలలుగా లైంగిక దాడి) -
పాదచారీ.. నీకో దారి!
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు దాటే సమయంలో పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు నిర్మించ తలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్లో (ఎఫ్ఓబీ) అయిదింటిని త్వరలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. వీటి అంచనా వ్యయం దాదాపు రూ.16 కోట్లు. వీటిలో రెండింటికి ఎస్కలేటర్ల సదుపాయం కూడా ఉంది. ఇవి వినియోగంలోకి వస్తే రోడ్డు దాటేందుకు పాదచారుల బాధలు తప్పుతాయి. అయిదు ఎఫ్ఓబీల్లో పంజగుట్ట హైదరాబాద్ సెంట్రల్మాల్, సికింద్రాబాద్ సెయింట్ఆన్స్ స్కూల్వద్ద నిర్మించినవి ఎస్కలేటర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని బహుశా వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్ తెలిపారు. వీటితోపాటు నేరేడ్మెట్ బస్టాప్, రాజేంద్రనగర్ సర్కిల్లోని స్వప్న థియేటర్, బాలానగర్లో మరో మూడు ఎఫ్ఓబీల పనులు పూర్తయ్యాయన్నారు. ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరి ఎఫ్ఓబీ పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు దాటేందుకు అవస్థలు పడుతున్న పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు వంద ప్రాంతాల్లో ఎఫ్ఓబీలు నిర్మించాలనుకున్నప్పటికీ, అంతిమంగా ఇరవై ప్రాంతాల్లో పనులు చేపట్టగా, ఇప్పటికే రెండు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారు. ఒక స్వచ్ఛందసంస్థ అధ్యయనం మేరకు రోడ్డు ప్రమాదాల్లో 52 శాతం రోడ్లు దాటుతుండగా జరిగినవే. ఎఫ్ఓబీలతో ఈ ప్రమాదాలు తగ్గగలవన్నారు. పురోగతిలో పనులు.. కూకట్పల్లి జోన్ రంగభుజంగ థియేటర్, ఖైరతాబాద్ జోన్లో బంజారాహిల్స్లోని జీవీకే వన్, ఎల్బీనగర్ జోన్లో సరూర్నగర్ స్టేడియం, దిల్సుఖ్నగర్ బస్టాప్, మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్, చార్మినార్ జోన్లో శాలిమార్ హోటల్, రక్షాపురం క్రాస్రోడ్స్, శేరిలింగంపల్లి జోన్లో ఖాజాగూడ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఎఫ్ఓబీల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. -
ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన కానిస్టేబుల్
-
సాహసి శ్రావణ్
హైదరాబాద్: పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగతో తల్లీ, కూతురు ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి తన ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా తల్లీకూతుళ్లను రక్షించారు. పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ బి.శ్రావణ్కుమార్ శనివారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో పంజాగుట్ట జూబ్లీమెడికల్ షాపుపైన మంటలు వ్యాపిస్తున్నట్లు సమాచారం అందుకుని వెంటనే అక్కడికి వెళ్లారు. అప్పటికే అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించడంతో పాటు దట్టంగా పొగలు అలుముకున్నాయి. మెట్లపై నుంచి వెళ్లేందుకు వీలులేకపోవడంతో డ్రెయినేజీ పైప్ ద్వారా పైకెక్కిన శ్రావణ్కు నాలుగో అంతస్తులోని ఫ్లాట్లో మౌనిక (13) కేకలు వినిపించాయి. వెంటనే ఆ ఫ్లాట్లోకి దూకి చిన్నారిని రక్షించి టెర్రస్ పైకి తీసుకెళ్లారు. తిరిగి అదే ప్లాట్లోకి వచ్చి మౌనిక తల్లి మహేశ్వరి (35)ని సైతం రక్షించారు. కొద్దిసేపటి తరువాత మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సాహసాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్రెడ్డి శ్రావణ్ను ప్రత్యేకంగా అభినందించారు. -
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా శ్రీనివాస్
పంజగుట్ట: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్యపరచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కోరారు. బుధవారం మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇటీవల మాల మహానాడు రాష్ట్ర కమిటీ రద్దు చేసిన నేపథ్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునిగా జంగా శ్రీనివాస్ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాల మహేశ్, గ్రేటర్ అధ్యక్షునిగా బైండ్ల శ్రీనివాస్ను నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పీవీ రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయా లని, రాష్ట్రంలో మాలలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ముందుండాలని కోరారు. -
ఆరు నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ఒంటిపై పంటిగాట్లు గుర్తించి..
పంజగుట్ట (హైదరబాద్): మైనర్బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. జహీరాబాద్కు చెందిన మహ్మ ద్ మోహిజ్ (20)ఎమ్ఎస్ మక్తాలో నివాసం ఉండే అక్క ఇంట్లో ఉంటూ జూబ్లీహిల్స్లో వెల్డింగ్ వర్క్ చేస్తుంటాడు. ఇతడు అద్దెకు ఉండే ఇంట్లోనే, మరో కుటుంబం అద్దెకుంటోంది. వారి కూతురు (13)ను గత ఆరు నెలలుగా బిల్డింగ్పైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. మంగళవారం బాలిక ఒంటిపై పంటిగాట్లు ఉన్న విషయం కుటుంబసభ్యులు గమనించారు. మహ్మద్ మోహిజ్ చేసే పైశాచికం గూర్చి బాలిక చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు మోహిజ్ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
పంజాగుట్ట రహదారిపై యువతి హల్చల్.. నడిరోడ్డుపై బైఠాయించి..
-
పంజాగుట్ట రహదారిపై యువతి హల్చల్.. నడిరోడ్డుపై బైఠాయించి..
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఓ యువతి హల్చల్ చేసింది. పంజాగుట్ట వైపు నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లే రహదారిపై బైఠాయించి హంగామా సృష్టించింది. రోడ్డుపై బైఠాయించడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకతో మరింత రెచ్చిపోయిన యువతి రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను కింద పడేసింది. పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. ముందుగా మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో యువతిని తరలించడం కష్టతరం మారింది. చివరికి మహిళ కానిస్టేబుల్ సహాయంతో యువతిని పంజాగుట్టు పోలీస్ స్టేషన్కు తరలించారు. చదవండి: మాదాపూర్లో నడిరోడ్డుపై నోట్లకట్టలు.. ట్రాఫిక్ జామ్.. తీరా చూస్తే.. -
జీవో 317ను రద్దు చేయాలి
పంజగుట్ట: జీవో 317తో రాష్ట్రాంలోని లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాజ్భవన్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021 జనగణనలో కుల గణన చేసేలా కేంద్రనికి లేఖ రాయా లని గవర్నర్ను కోరారు. జనవరి 3వ తేదీన బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరం లో జరిగే సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు కావా లని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ జీవో వల్ల స్థానికత, సీనియారిటీ ఉన్న వారిని పక్క జిల్లాలకు బలవంతంగా బదిలీ చేస్తున్నారని, దీంతో వారు సర్వీస్, సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మాదిరిగానే బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన, బిహార్ వాసి అయిన సీఎస్ సోమేష్ కుమార్కు జీవో 317 వర్తింపచేయాలని, అప్పుడు ఉద్యోగుల భాధ ఆయనకు అర్థం అవుతుందన్నారు. తమ విజ్ఞప్తుల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని, జనగణన కోసం కేంద్రానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. -
పంజాగుట్టలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
-
పంజాగుట్ట: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు యువతులు, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. చదవండి: బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం -
వాటా అడుగుతారనే బీసీ జనగణనపై వెనుకడుగు
పంజగుట్ట: బీసీలు వారికి రావల్సిన న్యాయపరమైన వాటా అడుగుతారనే భయంతోనే కేంద్రం బీసీ జనగణన చేపట్టడంలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసి జనగణన చేపట్టాలని టీఆర్ఎస్ కోరినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ జనగణన–కేంద్ర ప్రభుత్వ విధానం, బీసీల తక్షణ కర్తవ్యం’అంశంపై అఖిలపక్ష పార్టీలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో గొల్ల, కురుమ వర్గానికి చెందిన తనను, ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాష్ను రాజ్యసభకు పంపింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. బీసీ జనగణనతో పాటు కులగణన చేపట్టాలనే డిమాండ్తో ఈ నెల 13న ఢిల్లీలో తలపెట్టిన బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశానికి తన పూర్తి మద్దతు తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... కుక్కలు, పిల్లులు అన్నింటికీ లెక్కలు ఉన్నాయి కాని బీసీలకు మాత్రమే లెక్కలు లేకపోవడం బాధాకరమన్నారు. బీసీల లెక్కలు తేల్చకపోతే రాజకీయంగా దెబ్బతింటామని భావించేలా ఉద్యమం చేయాలని, అప్పుడే అన్ని పార్టీలు దిగివస్తాయన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీలతోపాట ఆఖరుకు 9 శాతం ఉన్న ఓసీలు కూడా 10 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, బీఎస్పీ నేత రమేష్, బీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దానకర్ణచారి, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్, బీసీ విద్యార్థి నేత విక్రమ్గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల జనగణన కోసం చలో ఢిల్లీ
పంజగుట్ట: బీసీ జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్తో డిసెంబర్ 13 నుంచి 15 వరకు ‘బీసీల చలో ఢిల్లీ’కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 13న బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీసీ జనగణన చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రశ్నించనందున తాడో పేడో తేల్చుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు 9 రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీల జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాపురం పద్మ, మణిమంజరి, నర్సింహా నాయక్, శ్రీనివాస్ గౌడ్, మాదాసి రాజేందర్, స్వర్ణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
-
Panjagutta: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
హైదరాబాద్: పంజగుట్టలో చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు.. చిన్నారి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నవంబరు 4న దీపావళిరోజు సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం.. ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప! చదవండి: యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం.. -
పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో వీడని మిస్టరీ
-
పంజాగుట్ట బాలిక అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగవంతం
-
పంజాగుట్టలో దారుణం.. చిన్నారి అనుమానాస్పద మృతి
-
పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ముఖం కమిలి పోయి ఎవరో తీవ్రంగా కొట్టినట్లు ఉండగా, కుడి చేయి విరిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ దీపావళి వేడుకల్లో ఉండగా గురువారం ఉదయం సుమారు 9:45 ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పాప మృతదేహాన్ని పంజగుట్ట ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు పడేశారు. పాప గులాబీ రంగు ప్యాంట్, బూడిద రంగు టీషర్ట్ వేసుకుని ఉండగా, ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టారు. పాపను గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసు బృందాల దర్యాప్తు: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా.. తాము ఉదయం 9:15 గంటల ప్రాంతంలో అక్కడే శుభ్రం చేశామని ఆ సమయంలో అక్కడ మృతదేహం కనిపించలేదని చెప్పారు. 9:30 నుంచి 9:45 ప్రాంతంలో అక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు కేసు మిస్టరీగా మారింది. డాగ్ టీం, క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించాయి. బాలిక ముఖంపై ఎవరో కొట్టినట్లు కమిలిపోయి ఉండటం, కుడిచేయి విరిగి ఉండటంతో ఎవరో హత్యచేసి ఉంటారని భావిస్తు న్నారు. గురువారం అమావాస్య ఉండటంతో క్షుధ్రపూజలు ఏమైనా చేశారా అనే దానితో పాటు ఇతర కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. టాస్క్ఫోర్స్, క్రైమ్ టీం, పంజగుట్ట పోలీసులు బృందాలుగా విడిపోయి అన్ని మార్గాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ అంతా బాలిక పోస్టర్లు, సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలు పెట్టి ఎవరికైనా తెలిస్తే సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం గాంధీలో ఇద్దరు ఫ్రొఫెసర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కిడ్నీ పైభాగం, ఊపిరితిత్తుల కింది ప్రాంతంలో బలమైన గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. చదవండి: అన్నయ్య చెప్పినా వినకుండా.. చివరికి ఏం జరిగిందంటే.. -
వ్యభిచారం నిర్వహిస్తున్న ఇళ్లపై దాడి: పలువురి అరెస్టు
సాక్షి,పంజగుట్ట( హైదరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, సీసీఎస్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... కర్నాటకకు చెందిన రాజేష్ నాయక్ (34) నగరంలో ఫలక్నామాలో ఉంటున్నాడు. ఇతను ఎర్రమంజిల్, హిల్టాప్ కాలనీలో ఓ భవనంలో ఫ్లాట్ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడని సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. మంగళవారం రాత్రి దాడి చేసి నిర్వాహకుడు రాజేష్నాయక్తో పాటు ఇద్దరు కస్టమర్లు, ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ నాయక్ను విచారించగా శ్రీనగర్కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఈస్ట్గోదావరి జిల్లాకు చెందిన కె.రాము(28) కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని దానిపై కూడా దాడి చేసి నిర్వాహకుడు రాము, ఒక సెక్స్ వర్కర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య -
త్వరలో శని విరగడ అవుతుంది: కోదండరాం
పంజగుట్ట: ఎవకైనా శని పట్టుకుంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుం దని జ్యోతిష్యులు అంటుంటారని, తెలంగాణ రాష్ట్రాని కి కూడా టీఆర్ఎస్ పాలన అనే శని పట్టుకుని ఏడున్నర సంవత్సరాలు కావొస్తుందని త్వరలోనే ఈ శనికూడా విరగడవుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్, రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మేగజైన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమస్యలపై గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కో దండరాం మాట్లాడుతూ, అక్రిడేషన్ కార్డులు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం వివక్ష చూ పుతోందని, గుర్తింపు కార్డులు ఇస్తే ప్రభుత్వ ఆస్తులు తగ్గుతాయా, బడ్జెట్ నుంచి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతున్నాయా అని ప్రశ్నించారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ..
సినిమా ఇండస్ట్రీలో కథలు రాయడం, సినిమా రిలీజ్ సహా చాలా అంశాలు సెంటిమెంట్తో ముడిపడి ఉంటాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించారు. ఈ క్రమంలో పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉండే ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. నటుడు సునీల్, డైరెక్టర్ దశరథ్లతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కిడి నుంచే త్రివిక్రమ్ ఎన్నో సినిమాలకు కథలు అందించారు. స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలకు ఆ ఇంట్లోనే ఉంటూ త్రివిక్రమ్ మాటలు అందించారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. అయినా తనకు మొదట ఆశ్రయం ఇచ్చిన ఆ అద్దె ఇల్లు అంటే త్రివిక్రమ్కు ఎంతో మమకారమట. అందుకే ఆ ఇంటిని వదులుకోలేక ప్రతి నెల ఐదు వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెంటిమెంట్గా ఇప్పటికీ కొన్ని సినిమాలకు అక్కడి నుంచే కథలు, మాటలు రాస్తారట. ప్రస్తుతం త్రివిక్రమ్కు సొంతంగా ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నా నేటికీ ఆ అద్దె ఇంటిని సెంటిమెంట్గా భావించి అప్పుడప్పుడు అక్కడికి వస్తారని సమాచారం. చదవండి : కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ 'మహమ్మద్ ఖయ్యుమ్'గా సునీల్.. -
ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్
సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఖైరతాబాద్ ప్రేమ్నగర్లో నివసించే బి. కీర్తన (27) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇప్పుడే వస్తానంటూ భర్త ప్రేమ్ సాయికుమార్కు చెప్పి వెళ్ళి అరగంటైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. బంధుమిత్రుల ఇళ్ళల్లో గాలించినా ఫలితం కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలింపు చేస్తున్నారు. జైలుకు వెళ్లొచ్చినా మారలేదు హిమాయత్నగర్: యువతి వెంటపడుతూ వేధిస్తున్న యువకుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. కింగ్కోఠి షేర్గేట్లో నివాసం ఉండే యాంకరింగ్ చేస్తున్న యువతి అదే ప్రాంతంలో నివాసం ఉండే సల్మాన్ఖాన్లు ప్రేమించుకున్నారు. గత ఏడాది ఇద్దరి మధ్య వాగ్వివాదాలు రావడంతో..యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. తరువాత కొద్దిరోజులుగా యువతి ఇంటి వద్దకు వచ్చి నిలబడటం, యువతిని వెంబడించడం, ఫోన్ మాట్లాడుతూ యువతిని తిట్టడం లాంటివి చేస్తున్నాడు. ఆమెతో మాట్లాడకపోయినా ఫాలో అవుతున్న తీరును చూసిన యువతి తల్లి బుధవారం యువతితో కలసి మరోమారు కేసు పెట్టింది. దీంతో గురువారం సల్మాన్ఖాన్ను కోర్టులో హాజరుపరచగా 14రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. చదవండి: భర్త ఇంట్లో ఉండగా.. తాళం వేసి బయటి వెళ్లి.. -
పంజగుట్ట వంతెన నిర్మాణంలో జాప్యం.. రూ.లక్ష జరిమానా
సాక్షి, బంజారాహిల్స్: పంజగుట్ట చౌరస్తాలో పాదచారుల వంతెన నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తవుతుందని ఇంజనీర్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతేడాది లాక్డౌన్ సమయంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. అడుగడుగునా పైప్లైన్లు అడ్డురావడం ఆటంకంగా మారింది. ఆరు వారాల్లో పూర్తి కావాల్సిన పనులు ఏడాదిన్నర గడిచినా పిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్కు లిక్విడిటీ డ్యామేజ్ కింద రూ.లక్ష జరిమానా విధించారు. సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా తీవ్ర జాప్యం చేయడంతో ఈ జరిమానా విధించినట్లు ఇంజనీర్లు తెలిపారు. -
మోడల్ హంట్.. ఫ్యాషన్ ఈవెంట్
-
కరోనాతో పంజగుట్ట పోలీస్ మృతి
సాక్షి, గాంధీఆస్పత్రి: కరోనా సెకండ్ వేవ్.. కరోనా వారియర్స్పై పంజా విసురుతోంది. పంజగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ కుమార్చారి కరోనా పాజిటివ్తో కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి అతడు మృతి చెందాడు. 2014 బ్యాచ్కు చెందిన విజయ్కుమార్ మృతిపట్ల పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. -
బంజారాహిల్స్లోయువతి కిడ్నాప్.. బలవంతంగా బైక్పై ఎక్కించి..
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్లో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని ఆల్మండ్ హౌస్ వెనుకాల నిర్మానుష్య చీకటి ప్రదేశంలో మద్యంమత్తులో ఉన్న ముగ్గురు యువకులు బైక్లపై వచ్చి ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ యువతి కూడా మద్యం మత్తులో ఉండగా ఆమెను తమ బైక్పై ఎక్కించుకునేందుకు తీవ్రంగా యత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు కిందపడుకుంది. అయితే అప్పటికే బైక్ స్టార్ చేసి ఓ యువకుడు సిద్ధంగా ఉండటంతో యువతి ‘హెల్ప్హెల్ప్’ అంటూ అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడికి చేరుకునే లోపే ఆమెను ఓ యువకుడు బలవంతంగా బైక్పై కూర్చుండబెట్టుకొని ఉడాయించాడు. స్థానిక మహిళలు పరిగెత్తుకుంటూ వచ్చేలోపే యువకులంతా బైక్లపై పరారయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఆరా తీశారు. ఆ యువతి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా స్పష్టమైన దృశ్యాలు నమోదు కాలేదు. అయితే బలవంతంగా యువతిని బైక్పై ఎక్కించుకొని పరారవుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. రాత్రంతా మూడు పోలీసు బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాయి. నిర్మానుష్య ప్రాంతామే కాకుండా చీకటి ఉండటంతో ఇక్కడ దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో సరిగ్గా నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తమకు ఇంత వరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్కు గురైన యువతి ఎవరన్న దానిపై స్పష్ట రావడం లేదు. యువతి అదృశ్యం పంజగుట్ట: యువతి అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో నివసించే గౌతం దుర్గేశ్వరి(18) పంజగుట్టలోని ఓ షాప్లో సేల్స్గర్ల్గా పనిచేస్తుంది. మంగళవారం రోజూ మాదిరిగానే విధులకు వెళ్లిన దుర్గేశ్వరి తిరిగి ఇంటికి రాలేదు. షాపులో సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 7:10కి షాపు నుంచి వెల్లిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, చుట్టుప్రక్కల సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616365 నెంబర్లో సంప్రదించాలని ఎస్సై సతీష్ తెలిపారు. చదవండి: విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఘోరం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..! -
బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు..
సాక్షి, పంజగుట్ట: జోగిని శ్యామలతోపాటు మరో 15 మందిపై పంజగుట్ట పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యింది. అనంతరం సదరు కేసును మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్కు బదలాయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాందీనగర్కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ఈ నెల 12వ తేదీన మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని నాగసాన్పల్లిలోని వనదుర్గ భవాణి దేవి దేవాలయానికి వెళ్లింది. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత అదే దేవాలయానికి వచ్చిన జోగిని శ్యామలను కలిసింది. శ్యామల తాను ఉంటున్న ప్రదేశానికి రావాలని సదరు యువతి, ఆమె తల్లిని ఆహ్వానించింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ అక్కడకు వెళ్లారు. అక్కడ శ్యామలతో పాటు మరో 15 మంది యువకులు, హెల్పర్ ఉమ ఉంది. ఈ క్రమంలో వారు మద్యం తాగుతుండగా యువతిని కూడా మద్యం తాగాలని ఒత్తిడి చేశారు. తాను దానికి ఒప్పుకోలేదని, దీంతో బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా బాధిత మహిళను, ఆమె తల్లిపై దాడి చేసి విపరీతంగా కొట్టి గాయపరిచారని పేర్కొంది. బాధితురాలు డ్రైవర్ సాయంతో అక్కడ నుంచి తప్పించుకుని 13వ తేదీ నగరానికి చేరుకున్నట్లు, గాయాలు కావడంతో నేడు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పంజగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసి పాపన్నపేట పోలీస్స్టేషన్కు బదలాయించారు. చదవండి: డాన్ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్ హత్య ఇద్దరూ తోడుగా వెళ్లారు.. ఒక్కరే తిరిగొచ్చారు! -
ఆస్పత్రిలో దంపతుల మృతి.. బెడ్ పక్కనే సూసైడ్ నోట్!
పంజగుట్ట: ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో భార్య, అపస్మారక స్థితిలో పడి చికిత్స పొందుతూ ఆమె భర్త మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే .. రహమత్నగర్లో నివసించే ఎన్.సుబ్బారావు కారు డ్రైవర్. ఇతడి భార్య ఎన్.సాయిలక్ష్మి(42) గృహిణి. సాయిలక్ష్మికి బ్రైయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స నిమిత్తం రాజ్భవన్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు సహాయకుడిగా భర్త సుబ్బారావు అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీన ఉదయం ఆస్పత్రి సిబ్బంది వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సిబ్బంది కూకట్పల్లి బాలాజీనగర్లో నివసించే వీరి కూతురు ఎన్.శివాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె ఉదయం 4:30 గంటల లోపు అక్కడకు వచ్చి చూసే సరికి తండ్రి అపస్మారక స్థితిలో ఉండగా తల్లి అప్పటికే మృతి చెందింది. ఇక, సుబ్బారావును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అతడు కూడా శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి బెడ్ పక్కనే సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ఆస్పత్రి సిబ్బందికి తన చావుకు ఎలాంటి సంబంధం లేదు. మానసిక వ్యధతో చనిపోతున్నాను. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమ దహన సంస్కారాలు చేయాలని రాసి ఉంది. కాగా అనారోగ్య సమస్యలతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక భార్యను గొంతునులిమి చంపి తర్వాత సుబ్బారావు ఏదైనా విష ప్రయోగం చేసుకున్నాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సెక్షన్–174, 309 ఐపీసీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెట్టుపై కూర్చున్నట్లుగా యువతి మృతదేహం.. అసలేం జరిగింది? -
పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది
-
పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్స్కు ఏర్పాటు చేసిన డెకరేషన్స్ సామాగ్రికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. నల్లని పొగ కమ్మేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. అగ్నిప్రమాదంతో పంజాగుట్ట వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. చదవండి : (పెళ్లి విషయం దాచిపెట్టి ప్రేమ నాటకం.. దాంతో) ('అమృత్ మహోత్సవ్'కు ప్రధాని మోదీ శ్రీకారం) -
పంజాగుట్ట: ఇంట్లో చొరబడి యువతిపై అత్యాచారం
సాక్షి, హైదరాబాద్ : ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..డీఎస్ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవలె కుటుంబసభ్యులు స్వస్థలం మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23)ఇంట్లోనే ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకు నుంచి వచ్చామంటూ ఇంట్లోకి ప్రవేశించారు. ఓ వ్యక్తి ఇంటి బయట కాపలా ఉండగా, మరొక వ్యక్తి పాలసీ పేరుతో యువతితో మాటలు కలిపి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతిని వివస్త్రను చేసి లైంగిక దాడి అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చదవండి : (పెట్రోల్తో భార్యకు నిప్పంటించి..) (బయటకు వెళ్లకుండా తల వెంట్రుకలను కట్ చేయించి..) . -
హైదరాబాద్ ట్రాఫిక్; ఈ రూట్లో వెళ్లకపోవడమే బెటర్!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణం వాహన చోదకులకు నిత్యనరకంగా మారుతోంది. గత రెండు రోజులుగా ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీఐపీలు బయటకు వచ్చినప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపి వేస్తుండటంతో హైదరాబాదీలు ఇక్కట్ల పాలవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ స్తంభించింది. గురువారం కూడా ఇదే సీన్ రిపీటయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్యారడైజ్ నుంచి బేగంపేట వరకు గంటల తరబడి ట్రాఫిక్ జామయింది. ఇక బంజారాహిల్స్ రోడ్ నంబరు 1, 3లతో పాటు పంజాగుట్ట ఫ్లైఓవర్పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంబులెన్స్లు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సహనం కోల్పోయిన వాహనదారులు పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులతో వాదనలకు దిగారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ నిలిపివేయడం సరికాదని భాగ్యనగర వాసులు మండిపడుతున్నారు. మామూలుగానే బేగంపేట మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బేగంపేట ఫ్లైఓవర్ మీద ఏదైనా వాహనం ఆగిపోతే అంతే సంగతులు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే. ఇక ప్రముఖుల రాకపోకల సమయంలోనూ వాహనాలను నియంత్రించడం వల్ల ట్రాఫిక్కు త్రీవ అంతరాయం కలుగుతోంది. అయితే వీఐపీలు రావడానికి చాలా సమయం ముందే పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారని చోదకులు ఆరోపిస్తున్నారు. వీఐపీలు వెళ్లడానికి కొద్ది సమయం ముందు వాహనాలను నియంత్రిస్తే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికీ తీరతాయోనని ఈ మార్గంలో ప్రయాణించే వారు వాపోతున్నారు. చదవండి: ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి గర్భిణి మృతి 22 రెగ్యులర్ రైళ్లకు పచ్చజెండా -
సినీ నిర్మాత సాగరికపై ఫిర్యాదు
పంజాగుట్ట: ఒప్పందం ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాతపై చర్యలు తీసుకోవాలంటూ ఓ నటుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాలోని పడాల రామిరెడ్డి లా కాలేజీ సమీపంలో నివాసముంటున్న సినీ నటుడు కెప్టెన్ చౌదరీ 2018లో రాధాకృష్ణ అనే చిత్రంలో నటించాడు. ఇందుకుగాను నటించే సమయంలో రోజుకు 30000 రూపాయలు రెమ్యూనరేషన్ అందించడంతోపాటు రవాణా, అసిస్టెంట్లకు సైతం వేతనాలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నామని కెప్టెన్ చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సినీమాలో 14రోజులపాటు నటించిన తనకు ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాత సాగరికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అయన కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని.. -
మాయమైపోతున్న మనిషి!
సాక్షి, హైదరాబాద్: రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను వేట కొడవళ్లతో నరికి చంపుతుండగా వంద మందికిపైగా ప్రత్యక్ష్యంగా చూశారు. అయినా ఈ పాశవిక ఘటనను ఒక్కరంటే ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం సమాజంలో మానవ విలువలు మృగ్యం అవుతున్నాయనేందుకు నిదర్శనం. పాత కక్షల కారణంగా జరిగిన జంటహత్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పట్టపగలు, నడిరోడ్డు మీద కాపుకాసి, దాడి చేసి అత్యంత పాశవికంగా హతమార్చిన తీరు చాలా ఆందోళనకరం. మంథని డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల నిండా జనం ఉన్నారు. ఆ బస్సులు హత్య జరుగుతున్నంత సేపు హత్యోదంతాన్ని చూసి, నిందితులు పరారయ్యాక అక్కడి నుంచి కదిలారు. అంతేకాకుండా కల్వచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆ దారి వెంబడి వెళ్తున్న వారు, బైక్పై వెళ్తున్నవారు దాదాపు 100 మందికిపైగా అక్కడే ఆగిపోయారు. దారుణం జరుగుతున్నంత సేపు తమ జేబుల్లో ఉన్న సెల్ఫోన్లకు పనిచెప్పారే తప్ప.. ఎవరూ కూడా వారిని ఆపేందుకు సాహసించలేదు. నిందితులు అక్కడ నుంచి వెళ్లిపోయారని నిర్ధరించుకున్నాక.. కొన ఊపిరితో ఉన్న వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తూ వీడియోలు తీశారు. పట్టపగలు జరిగిన ఈ ఘోరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు వంద మంది. వీరిలో చాలామంది వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి సోషల్మీడియాలో పోస్టులు, స్టేటస్లు పెడుతూ సమాజాన్ని, పోలీసులను, రాజకీయ నేతలను నిందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్నప్పుడు హత్యోదంతాన్ని వేడుకలా చూసి, తీరా అక్కడి నుంచి వెళ్లిపోయాక బాధ్యత, సమాజం, అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ఖండిస్తున్నారు. అసలు ప్రత్యక్ష సాక్షులు అంతమంది ఉన్నా.. వారిలో ఎంతమంది కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతారన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిందే. హేయమైన చర్యలు.. రాజకీయ నేతలే ఇలాంటి హత్యలకు దిగడం అత్యంత హేయమైన చర్చగా చెప్పొచ్చు. అందులోనూ హైకోర్టు లాయర్లయిన గట్టు వామనరావు, పీవీ నాగమణిలను వేటాడి వేట కొడవళ్లతో నరకడం చాలా దారుణం. రాష్ట్రంలో ఇలాంటి ఘటన మొదటిది కాదు. గతంలోనూ పలు ఉదంతాలు జరిగాయి. అయితే, అందులో బాధితులు, నిందితులు సామాన్యులు. కానీ ఈ ఘటనలో సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వ్యక్తుల హస్తం ఉండటం అన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో పట్టపగలు జరిగిన దారుణ హత్యలన్నీ కూడా హైదరాబాద్లోనే చోటు చేసుకున్నాయి. ఈ వికృత సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగించే పరిణామం. రాళ్లతో నుజ్జునుజ్జుగా.. (రాజేంద్ర నగర్ హత్య జనవరి11, 2021) రాజేంద్రనగర్లో జనవరి 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఖలీల్ను అత్తాపూర్లో నడిరోడ్డు మీద ప్రజలంతా చూస్తుండగా అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేస్తూ, తరుముతూ గాయపరిచారు. కిందపడిన వెంటనే వ్యక్తి చనిపోయాడు. రాళ్లతో శవాన్ని కొడుతూ, నుజ్జునుజ్జుగా చేస్తూ తమ పాశవికతను ప్రదర్శించారు. ఈ హత్యను పలువురు వాహనదారులు వీడియోలు తీసి వైరల్ చేశారు. పంజగుట్ట పోలీస్స్టేషన్ ముందే.. (జూన్ 26, 2019) హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజగుట్ట ఠాణా ముందు జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. సయ్యద్ అన్వర్ అనే ఆటోడ్రైవర్పై మరో ఆటోడ్రైవర్ రియాసత్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ ప్రాణ భయంతో పంజగుట్ట స్టేషన్లోకి పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్ కన్నుమూశాడు. ఈ హత్యోదంతం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. దగ్గరికి వెళ్లేందుకు జంకిన పోలీసులు.. (నయాపూల్ మర్డర్.. 2018, నవంబర్ 28) ఆటోడ్రైవర్ గొంతుకోసి, పోలీసుల ముందే 2018 నవంబర్లో నయాపూల్ వంతెన పక్కన జరిగిన మరో హత్య కూడా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. షకీర్ ఖురేïÙ, అబ్దుల్ ఖాజా ఇద్దరూ ఆటోడ్రైవర్లు. ఆటో అద్దెల విషయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అవి తీవ్రమవడంతో షకీర్ ఖురేïÙని అబ్దుల్ ఖాజా కత్తితో పొడిచి చంపాడు. షకీర్ను చంపాక, ఖాజా అక్కడే కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. ఈ హత్య అనంతరం నిందితుడిని పోలీసులు కనీసం ప్రతిఘటించలేకపోవడం, కనీసం అతడిని సమీపించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పోలీసుల ముందే హత్య.. అత్తాపూర్ మర్డర్ (సెప్టెంబర్ 26, 2018) 2018 సెపె్టంబర్ 26న అత్తాపూర్ పిల్లర్ నంబర్ 138 వద్ద రమేశ్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. మహేశ్ అనే యువకుడి హత్య కేసులో రమేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా.. మహేశ్ తండ్రి రమేశ్ను అత్తాపూర్ వద్దకు రాగానే మరో వ్యక్తి సాయంతో గొడ్డళ్లతో నరికి చంపాడు. ఈ హత్య జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు, పెట్రో కార్ సిబ్బంది కనీసం స్పందించలేదు. మనకెందుకులే అన్న ధోరణి సమాజంలో తోటి మనిషి పట్ల జాలి చూపే గుణం రోజురోజుకూ తగ్గిపోతుంది. ముఖ్యంగా గతంలో రోడ్డుపై ఎవరైనా దాడి చేస్తుంటే.. దారిన వెళ్లేవాళ్లు నచ్చజెప్పేవారు, వారిని నిలువరించేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. జరుగుతున్న దాడిని ఆపాల్సింది పోయి జేబులోని సెల్ఫోన్ తీసి వీడియోలు తీసే సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. కనీస బాధ్యతగా రక్షించాల్సిన తోటిపౌరులే ప్రేక్షకులుగా మారడం శోచనీయం. ‘ఎవరిని ఎవరు చంపితే మనకెందుకులే మనం బానే ఉన్నాం కదా’అనే సంకుచిత ధోరణి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారే తాము ఎలాంటి సాయం చేయకపోగా.. వ్యవస్థలను నిందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. –వీరేందర్, సైకాలజిస్టు చదవండి: న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
ఆస్పత్రి నిర్వాకం: ‘కనుపాప’ను దూరం చేశారు
సాక్షి, హైదరాబాద్: లేకలేక ఆ దంపతులకు పుట్టిన ‘కనుపాప’ను వైద్య నిర్లక్ష్యం దూరం చేసింది. దృష్టి లోపాన్ని సరిదిద్దుకొని రంగుల ప్రపంచాన్ని చూడాలనుకున్న ఆ చిన్నారిని మత్తుమందు శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లింది. మోతాదుకు మించి అనస్తీ్తషియా ఇవ్వడం వల్ల కంటి సర్జరీకి ముందే ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఆల్విన్ కాలనీ సమీపంలోని శంషాగూడకు చెందిన పానీపూరి వ్యాపారి గణపతిరెడ్డి, కీర్తి దంపతులకు పెళ్లైన పన్నెండేళ్ల తర్వాత కుమారుడు ప్రశాంత్ (12) జన్మించాడు. అయితే చిన్నతనం నుంచే అతనికి కంటిచూపు సరిగా లేదు. దీంతో తమ కుమారుడికి చికిత్స చేయించాలని తల్లిదండ్రులు భావించారు. ఈ నెల 20న పంజాగుట్టలోని అగర్వాల్ కంటి ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు... రెండు కళ్లలోనూ పొరలున్నాయని, వాటిని తొలగించేందుకు రెండింటినీ ఒకే సమయంలో సర్జరీ చేయాలని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఈ నెల 21న వైద్యులు సర్జరీకి సిద్ధమయ్యారు. చికిత్స సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియనిస్ట్ మత్తుమందు ఇచ్చాడు. అయితే మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో బాలుడు చికిత్సకు ముందే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. చదవండి: (భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు) గుట్టుచప్పుడు కాకుండా... ఆపరేషన్ థియేటర్ టేబుల్పై అచేతన స్థితిలో పడి ఉన్న బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యులు అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తమ వల్ల కాదని, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో అదే ఆస్పత్రి అంబులెన్సులో బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడాల్సిందిగా తల్లిదండ్రులు ఆ ఆస్పత్రి వైద్యులను వేడుకోవడంతో వారు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు మృతిచెందినట్లు సోమవారం రాత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆస్పత్రి వైద్యులు తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తమ బిడ్డ మరణించాడంటూ తల్లిదండ్రులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం పంజాగుట్ట అగర్వాల్ కంటి ఆస్పత్రిలో వైద్యం వికటించి ఇద్దరికి పూర్తిగా చూపు పోయిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజగుట్ట పీఎస్లో కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రికి తాళం.. వైద్యులు పరార్ బాలుడు మృతి చెందిన విషయం తెలిసి బంధువులు భారీగా ఆస్పత్రికి చేరుకొని వైద్యు లను నిలదీశారు. దీంతో పోలీ సులకు సమాచారం ఇచ్చిన వైద్యులు... ఆ తర్వాత ఆస్పత్రికి తాళం వేసి పరారైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మా తప్పేమీ లేదు: అగర్వాల్ కంటి ఆస్పత్రి ‘కొందరు పిల్లలకు మత్తుమందు పడదు. లక్ష మందిలో ఒకరిలో ఇలాంటి రియాక్షన్స్ వెలుగు చూస్తాయి. సర్జరీకి ముందే కార్డియాక్ అరెస్ట్ అయి అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిం చాం. చికిత్సలో వైద్యుల తప్పిదం లేదు. వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తగు మోతాదులో మత్తుమందు ఇచ్చాం. అధిక డోసు ఇచ్చామనే ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని మీడియా బులెటిన్లో అగర్వాల్ కంటి ఆస్పత్రి పేర్కొంది. -
వివాహేతర సంబంధం: భర్త దారుణ హత్య
సాక్షి, పంజగుట్ట: ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది. సోమవారం పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్కు చెందిన లక్ష్మణ్ ఝా, ఖుష్బూ దంపతులు మక్తా, రాజ్నగర్లో నివాసముంటున్నారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా, పగలు జ్యూస్షాపు నడుపుతూ లక్ష్మణ్ జీవనం సాగిస్తున్నాడు. దీంతో న్యూరాలజీ సమస్య వచ్చింది. ఇతని జ్యూస్ సెంటర్ వద్ద లక్ష్మణ్ దూరపు బంధువు లాల్బాబు పనిచేస్తుంటాడు. లక్ష్మణ్కు మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చేందుకు ఖుష్బుదేవి వస్తుండేది. ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్డౌన్ అనంతరం లాల్బాబు మరోచోట పనిచేయడం ప్రారంభించాడు. అయినా వీరి మధ్య బంధం కొనసాగింది. దీంతో లక్ష్మణ్ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ పడుకున్నాక లాల్బాబు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్ చేతులు కట్టేశారు. ఖుష్బుదేవి లక్ష్మణ్ ఛాతీపై కూర్చుని చున్నీ మెడకు బిగించి ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కి చంపేశారు. ఉదయం లక్ష్మణ్ సోదరుడికి ఖుష్చుదేవి ఫోన్ చేసి నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. మెడపై గాట్లు చూసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. -
కిలాడి లేడీ అరెస్ట్: రూ 8 కోట్లకు టోకరా
సాక్షి, పంజగుట్ట: ఓ వ్యక్తిని సుమారు రూ.8 కోట్ల మేర మోసం చేసిన కేసులో మహిళను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్భవన్ రోడ్డులోని సేథీ టవర్స్కు చెందిన పి.విజయ్ ఎన్.రాజు ఇన్వెస్టర్. 2013లో అతని వద్దకు కూకట్పల్లి, వసంత్నగర్కు చెందిన శ్రీనివాస రాజు, కేపీహెచ్బీకి చెందిన సామల పద్మజ, ఆమె భర్త సామల నర్సిరెడ్డి, సోదరి విజయలక్ష్మి, సురేష్బాబులు వచ్చారు. పద్మజ తమకు గోపనపల్లిలోని సర్వేనెంబర్ 124/2 నుండి 124/5 వరకు 6.20 ఎకరాల స్థలం ఉందని, ఆ స్థలంలో విల్లాల నిర్మాణం చేపడతామని చెప్పారు. సదరు స్థలంపై బ్యాంకులో రుణం ఉందని, ఆ రుణం మీరు తీరిస్తే మీకు రెండున్నర ఎకరాల స్థలం ఇస్తామని చెప్పారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు. దీంతో బ్యాంకుకు సుమారు రూ.5 కోట్లు చెల్లించడమే కాకుండా, రూ.3 కోట్లు వారివద్ద ఇన్వెస్ట్ చేశాడు. వారు బ్యాంకు నుంచి కాగితాలు తీసుకున్నారు. ఆ స్థలంలో విల్లాల నిర్మా ణం చేయకపోగా ఇస్తామన్న రెండున్నర ఎకరాలు కూడా ఇవ్వకుండా మోసం చేశా రు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పంజగు ట్ట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సామల పద్మజ మిగిలిన వారిపై కేసు నమోదు చేశారు. గోవాలో ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపి సామల పద్మజను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఐపీఎల్ బెట్టింగ్కు యువకుడు బలి
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఒక యువకుడి ప్రాణం తీసింది. వివరాలు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ యాదవ్ (19) పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీలో స్నేహితులతో కలిసి కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్లో పాల్గొంటున్న సోను కుమార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు.కాగా మంగళవారం ఉదయం స్నేహితులు బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లోని గ్రిల్ కు ఉరి బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చి..
సాక్షి,హైదరాబాద్ : కరోనాతో ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా రాకుండా ఉండేందుకు మందు తెచ్చానని తండ్రికి తాగించి, తాను కూడా తాగాడు. యువకుడు మృతి చెందగా అతని తండ్రి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. అదృష్టవశాత్తూ తల్లి పనిలో ఉండి తర్వాత తాగుతాననడంతో ఆమె బతికి బయటపడింది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ హిల్స్ కాలనీలోని గిరిశిఖర అపార్ట్మెంట్లో నివసించే అల్లంపాటి రామిరెడ్డి (61), ఎ.శ్రావణి రెడ్డిలు భార్యాభర్తలు. వీరికి ఎ.అనీష్ రెడ్డి (33) కొడుకు ఉన్నాడు. (చదవండి : తండ్రీ- ఇద్దరు కొడుకులు కరోనాతో మృతి..) అనీష్ రెడ్డి ఐటీ సంస్థల్లో క్యాంటీన్లు నిర్వహిస్తుంటాడు. ఆరు నెలలుగా కరోనా వల్ల ఐటీ సంస్థలన్నీ వర్క్ఫర్ హోం పెట్టాయి. దీంతో ఇతని క్యాంటీన్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. తీవ్ర మనస్థాపానికి గురైన అనీష్ రెడ్డి గత కొంత కాలంగా తీవ్రంగా మానసిక క్షోభలో ఉన్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చనిపోతే ఈ ఏజ్లో తల్లిదండ్రులు ఎలా బతుకుతారు అనుకున్నడో ఏమో అనీష్ రెడ్డి బుధవారం రాత్రి 11:10 ప్రాంతంలో గుర్తుతెలియని మందు ఇంటికి తీసుకువచ్చాడు. ఇది కరోనా రాకుండా ఉండే మందు అని నమ్మబలికాడు. మొదట తండ్రి రామిరెడ్డికి తాగించాడు. తల్లిని కూడా తాగమనగా తాను వంటచేస్తున్నాను తర్వాత తాగుతాను అని చెప్పడంతో అనీష్ రెడ్డి కూడా తాగాడు. పది నిమిషాల తర్వాత తల్లి వంటగది నుండి బయటకు రాగా ఇద్దరూ వాంతులు చేసుకుంటున్నారు. దీంతో కంగారు పడ్డ శ్రావణి రెడ్డి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఇద్దర్నీ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనీష్ రెడ్డి మృతి చెందగా, రామిరెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ప్రస్తుతం క్రిటికల్ కేర్లో చికిత్స పొందుతున్నాడు. -
ప్రాథమిక ఆధారాల తర్వాతే నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘పంజాగుట్ట అత్యాచార కేసు’లో దర్యాప్తు నకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ కేసు నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ కావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళా ఠాణా ఏసీపీ శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. ఈమె శనివారం బాధితురాలితో మాట్లా డారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడిస్తానంటూ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. తనపై 11 ఏళ్ళుగా 143 మంది అత్యాచారానికి ఒడిగట్టారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొం టున్న వారికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే వారిపై తదుపరి చర్యలు చేపట్టాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. మరోపక్క బాధితురాలితో ఫిర్యాదు చేయించిన గాడ్ పవర్ ఫౌండేషన్కు చెందిన రాజా శ్రీకర్ అలియాస్ డాలర్ భాయ్ వ్యవహారమూ ఈ కేసులో కీలకంగా మారింది. 4నెలల కిందట స్వచ్ఛంద సంస్థగా దీన్ని రిజిస్టర్ చేయించిన అతడు సోమాజిగూడ కేంద్రంగా నిర్వహి స్తున్నాడు. ఈ కేసు నమోదైన తర్వాత యువతి ఫిర్యాదులోని అంశాల ఆధారంగా జాబితాలోని నిందితులకు కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వారిని ఇతడు బెదిరించినట్లు కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో ఈ కేసులో డాలర్ భాయ్ పాత్రపై పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. బాధితు రాలు ఫిర్యాదు చేసేందుకు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసేందుకు సహకరి స్తున్నట్లు నటిస్తూ తన స్వలాభం చూసుకు న్నాడా? అనే కోణంలో పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. దీంతో డాలర్ భాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిం చారు. అక్కడ పోలీసులకు కొందరు యువతుల సర్టిఫికెట్లు, బయోడేటాలు లభించాయి. దీంతో ఇతడి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ సంస్థ కార్యాలయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సర్టిఫికెట్లు, బయోడేటాల్లోని వివరాల ఆధారంగా యువతుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీ లభించిన తర్వాత మాట్లాడితేనే డాలర్ భాయ్కి సంబంధిం చిన మరిన్ని కోణాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే కార్యాల యంలో కొన్ని ఆడియో, వీడియో టేపుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా బ్లాక్మెయిలింగ్కు సంబంధించినవే అని అనుమానిస్తున్నారు. కాగా, డాలర్ భాయ్పై అతని భార్య గతంలోనే సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యి చార్జిషీటు కూడా దాఖలైంది. ఇప్పుడు ఆ కేసు స్థితిగతుల్నీ అధికారులు ఆరా తీస్తున్నారు. -
పంజాగుట్ట సర్కిల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
వైఎస్సార్ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు
సాక్షి, పంజాగుట్ట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు దేశవ్యాప్తంగా పాలకులు అందరూ పాటిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్సార్ అని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 71వ జయంతిని పురస్కరించుకుని పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. (నాలో... నాతో.. వైఎస్సార్) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు, విద్యార్థులకు, మహిళలకు.. వైఎస్సార్ ఒక ల్యాండ్ మార్క్ను క్రియేట్ చేశారన్నారు. తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకు తాము విశేషంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కెవీపీ రామచంద్ర రావు, అంజన్ కుమార్ యాదవ్, వంశీచంద్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ పలువురు నేతలు పాల్గొన్నారు. (తాడిపత్రిపై రాజన్న ముద్ర..) -
పంజాగుట్టలో దోపిడి దొంగల హల్చల్