వేరొకరితో సంబంధం అంటగట్టిన భర్తను ఓ భార్య అంతం చేసింది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఆమెకు బంధువుతో అక్రమ సంబంధం ఉందంటూ అశోక్ వేధించసాగాడు. ఈ క్రమంలో భర్తపై కోపం పెంచుకున్న భీమమ్మ మే 7వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న అశోక్ను టవల్తో గొంతుకు బిగించి చంపింది. మితిమీరి మద్యం తాగినందునే అతడు చనిపోయాడని అందరినీ నమ్మించింది. అయితే, మృతుని సోదరుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భీమమ్మను విచారించగా నేరం అంగీకరించింది. ఈ మేరకు నిందితురాలిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు.