ఐదుగురి జీవితాల్లో వెలుగునిచ్చిన మహిళ | one woman given organs to five persons | Sakshi
Sakshi News home page

ఐదుగురి జీవితాల్లో వెలుగునిచ్చిన మహిళ

Published Sat, Jul 30 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

మంజుల(ఫైల్)

మంజుల(ఫైల్)

పంజగుట్ట: రోడ్డు ప్రమాదానికి గురైన ఓ గృహిణి తాను మరణిస్తూ అవయవాలు దానం చేసి మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిది. నిమ్స్‌ జీవన్‌దాన్‌ ప్రతినిధులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన మంజుల (43) మంజుల ఈ నెల 27న నగరంలో ఉంటున్న తన సోదరుని ఇంటికి వచ్చింది.  మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మలక్‌పేట గంజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. 

తీవ్రంగా గాయపడ్డ మంజులను మలక్‌పేట యశోదా ఆసుపత్రికి తరలించగా శుక్రవారం బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. మంజుల భర్త యాదయ్య, కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన చేయడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో మంజులకు శస్త్రచికిత్స నిర్వహించి కిడ్నీలు, కాలేయం, కళ్లు తొలగించి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అవసరమైన వారికి అమర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement