donate
-
ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు
మల్కాజిగిరి/ నాంపల్లి/ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): పౌర హక్కుల నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా(56)కు కుటుంబ సభ్యులు, అభిమానులు, పౌర హక్కుల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని మౌలాలి జవహర్నగర్లో ఉన్న నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు చేరుకుని సాయిబాబాకు నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ వరకు ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమ యాత్రలో భాగంగా ప్రొఫెసర్ సాయిబాబా (56) భౌతికకాయాన్ని అసెంబ్లీ ఎదుట గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు. అంబులెన్స్ నుంచి బాడీ ఫ్రీజర్ను కిందికి దింపి, స్తూపం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్తూపం వద్ద ఐదు నిమిషాల పాటు ఉంచి సంతాపం తెలియజేస్తామని పౌర హక్కుల నేతలు కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. అభిమానులు, పౌర హక్కుల నేతలు ‘కామ్రేడ్ సాయిబాబా అమర్రహే.. లాల్ సలాం.. ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.బాడీ ఫ్రీజర్ మూతను తెరిచి స్తూపానికి చూపించారు. అనంతరం తిరిగి ర్యాలీగా గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయాన్ని తరలించారు. సాయిబాబా చివరికోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు భౌతికకాయాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. కాగా, మౌలాలిలోని నివాసంలో సాయిబాబా భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సాయిబాబా మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పౌర హక్కుల నేతలు ఆరోపించారు. -
Sitaram Yechury: జీవితమే కాదు.. దేహమూ ప్రజాసేవకే అంకితం
ప్రముఖ రాజకీయ నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఏయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు.ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. మృతదేహాన్ని శుక్రవారం ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఏచూరి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇవ్వడం ఇదే తొలిసారికాదు.. గత కొన్నేళ్లుగా వామపక్ష నాయకులు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్కు 34 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా 2010లో ఆయన మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు.ఆయన పార్థివ దేహాన్ని కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి దానం చేశారు. ఇందుకు సంబంధించి 2006లోనే ఆయన హామీ ఇచ్చారు. మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2000 సంవత్సరంలో తన శరీరాన్ని దానం చేస్తానని ప్రమాణం చేశాడు. 2018లో అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు. -
క్రికెటర్పై పోటీ.. అభ్యర్థికి మహిళల చందాలు
కోల్కతా: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి గ్రామీణ మహిళలు చందాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన పదకొండు మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, 1999 నుండి బెర్హంపూర్ పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధిర్ రంజన్ చౌదరికి ఎన్నికల ప్రచారం కోసం రూ.11,000 విరాళంగా అందించారు. అభ్యర్థికి మహిళలు చందాలు ఇస్తున్న వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రణగ్రామ్ గ్రామానికి చెందిన మహిళలు వ్యవసాయ కూలి పనులు, మేకల పెంపకం, రోజువారీ కూలి పనుల ద్వారా సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పోగు చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థికి విరాళంగా అందించారు. దీంతో ఆ మహిళలకు అధిర్ రంజన్ చౌదరి భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. బెర్హంపూర్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ను పోటీకి దించింది. డాక్టర్ నిర్మల్ సాహా బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వీరితో అధిర్ రంజన్ చౌదరి తలపడుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తృణమూల్ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. బెర్హంపూర్, మల్దహా దక్షిణ్తో సహా కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనునన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. మొత్తం 543 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. 42 పార్లమెంటరీ సెగ్మెంట్లు ఉన్న పశ్చిమ బెంగాల్లో అన్ని దశల్లో పోలింగ్ జరుగుతుంది. #WATCH | Murshidabad, West Bengal: 11 women of Kandi town's Ranagram village handed over a total of Rs 11,000 to Congress' Behrampore Lok Sabha candidate Adhir Ranjan Chowdhury to help him in the Lok Sabha elections. The women collected the money from their household expenses,… pic.twitter.com/5QRnjldaUG — ANI (@ANI) April 7, 2024 -
బాబా మందిరానికి యాచకుడి విరాళం.. రూ. 9.54 లక్షలు అందజేత
సాక్షి, విజయవాడ: సాయిబాబా మందిర అభివృద్ధికి ఓ యాచకుడు శుక్రవారం లక్షరూపాయల విరాళం అందజేశారు. దీంతో ఇప్పటివరకూ ఆయన అందజేసిన విరాళం రూ.9.54 లక్షలకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, ముత్యాలంపాడులోని శ్రీ షిర్డీసాయి బాబా మందిరం వద్ద యాదిరెడ్డి అనే వృద్ధుడు యాచకుడిగా జీవనం సాగిస్తున్నారు. భక్తుల నుంచి సేకరించిన సొమ్ముతో లక్షరూపాయలు పోగుచేసి బాబా మందిర అభివృద్ధికి ఇచ్చేలా నిర్ణయించుకుని, ఆ డబ్బును మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ... బాబామందిరానికి యాదిరెడ్డి విరాళం ఇవ్వడం ఇది మొదటిసారికాదని, ఇప్పటివరకూ పలు దఫాలుగా రూ.8,54,691 అందజేశారని తెలిపారు. తాజాగా శుక్రవారం అందజేసిన రూ.లక్షతో కలిపి రూ.9,54,691 ఇచ్చినట్లయిందని చెప్పారు. ఈ రకంగా విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. దాత యాదిరెడ్డి మాట్లాడుతూ బాబా మందిరం వద్ద యాచించి సంపాదించిన డబ్బు బాబాకే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపై తాను సేకరించే ప్రతి పైసా దైవకార్యాలకే వినియోగిస్తానని తెలిపారు. మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు యాదిరెడ్డిని అభినందించారు. అనంతరం యాదిరెడ్డిని బాబావారి శేషవస్త్రంతో గౌతంరెడ్డి సత్కరించారు. చదవండి: బనియన్ల నిండా బంగారం, నగదు -
జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘జెరోధా’ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నిఖిల్ కామత్ (34) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంపదలో సగం సమాజానికి దానమిస్తున్నట్టు ప్రతిజ్ఞను తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే ‘ద గివింగ్ ప్లెడ్జ్’లో చేరి ప్రసిద్ధ పెట్టుబడిదారులు సరసన చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు తమ సంపదను దానం చేస్తామని ప్రకటించిన నాలుగో భారతీయుడు, భారతదేశపు అతి పిన్న వయస్కుడు నిఖిల్ కామత్ కావడం గమనార్హం. ఒక యువ పరోపకారిగా గివింగ్ ప్లెడ్జ్ (సంపద దానం చేస్తూ ప్రమాణం చేయడం) లో చేరడాన్ని గౌరవంగా భావిస్తూన్నానని, ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపించేందుకు తానీ నిర్ణయించుకున్నాను అని కామత్ వెల్లడించాడు. మరింత సమానత్వంతో కూడిన సమాజం అనే ఫౌండేషన్ లక్ష్యం తన ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. (తనిష్క్, రిలయన్స్కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) దేశీయంగా విప్రో అజీమ్ ప్రేమ్ జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి ఈ కార్యక్రమంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యుల ఆర్థిక వనరులలో ఎక్కువ భాగం లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా ఇస్తారు. అలాగే నితిన్ కామత్ నేతృత్వంలోని రెయిన్మాటర్ ఫౌండేషన్, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి వీటికనుగుణంగా జీవనోపాధికి మద్దతుగా పనిచేసే సంస్థలకు మద్దతు ఇస్తుంది. 90 శాతం మందికి చెందాల్సింది కేవలం 10 శాతం మందికే 2021లో ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశంలో 90 శాతం మందికి చెందాల్సినవి కేవలం 10 శాతం మంది చేతిలో ఉండకూడదు. జీవితంలో ముందుగానే ఇవ్వడం ప్రారంభించమని ప్రజలను ప్రోత్సహించాలనే ఫిలాంత్రపి ఫిలాసఫి అని చెప్పుకొచ్చారు. రోజుల్లో యువకులుగా డబ్బులు సంపాదించడం మొదలుపెడితే, అది రెండింతలు, పదింతలు అవుతుంది. మన లైఫ్ స్టయిల్గా పెద్దగామారదు. మరి సంపాదించిన సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. అలా కాకుండా మన చుట్టూ ఉన్న, అవసరమైన వారికి సహాయపడే విధంగా ఆ డబ్బును వినియోగిస్తే ఆ కిక్కే వేరని కామత్ అన్నారు. ఇదీ చదవండి: రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ఫోర్బ్స్ ప్రకారం, కామత్ 3.45 బిలియన్ల డాలర్ల (రూ. 28 వేల కోట్లు) సంపదలో 50 శాతాన్ని కట్టుబడివాతావరణ మార్పు, శక్తి, విద్య ,ఆరోగ్యం వంటి విషయాలకు విరాళమివ్వడానికి నిర్ణయించుకున్నా నంటూ తన ప్రతిజ్ఞ లేఖలో చెప్పారు. దీనికి అదనంగా, యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (YIPP), వ్యవస్థాపకులతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతం స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా అందజేస్తారు. జెరోధా సహ వ్యవస్థాపకులు సోదరులు నిఖిల్, నితిన్ కామత్ అనేక దాతృత్వ విరాళాలకు ప్రసిద్ధి చెందారు. కామత్ తన సోదరుడు నితిన్ కామత్తో కలిసి 2022లో రూ.100 కోట్ల వ్యక్తిగత సంపదను విరాళంగా ఇచ్చారు. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 ప్రకారం వీరి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సాయం 300 శాతం ఎక్కువ. దేశీయంగా తొమ్మిదో అతిపెద్ద ఫిలాంత్రపిస్టులుగా ఉన్నారు. 2010లో వారెన్ బఫెట్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ ‘ద గివింగ్ ప్లెడ్జ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గివింగ్ ప్లెడ్జ్పై 29 దేశాలకు చెందిన దాదాపు 241 మంది పరోపకారులు సంతకాలు చేశారు.(నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) -
తండ్రి కొడుకుల హత్య కేసు: మరణాంతరం నేత్ర దానం
ఉప్పల్: ఉప్పల్లో ఇటీవల దారుణ హత్యకు గురైన తండ్రీ కొడుకులు నర్సింహ శర్మ, శ్రీనివాస్ల నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పతికి దానం చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరసింహ శర్మ కుమారుడు, కూతుళ్లు పేర్కొన్నారు. (చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం) -
కలెక్టర్ సాబ్.. మీరు చేసిన పనికి హ్యాట్యాఫ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ధర్మవరం జెడ్పీ హైస్కూల్... ఎస్.కోట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన ఆ విద్యాలయం ఇప్పుడు ఆధునికీకరణకు అద్దం పడుతోంది. ధర్మవరం జెడ్పీ హైస్కూల్ స్టూడెంట్నని అక్కడి విద్యార్థులు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి రెండు కారణాలు... ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు. మరొకటి అక్కడి పూర్వ విద్యార్థి, పల్నాడు జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్ కృషి. విద్యాబుద్ధులు నేర్పడమే గాక తాను ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యానికి బీజం వేసిన పాఠశాలకు గురుదక్షిణ సమర్పించిన తీరు స్ఫూర్తిదాయకమైంది. సొంతంగా రూ.8.5 లక్షలు ఖర్చు చేసి డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు. ఏదో చేశామంటే చేశామని గాకుండా ఆధునికీకరణ, సౌకర్యాల కల్పన, పుస్తకాల బహూకరణ... ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. లోతేటి శివశంకర్ పదో తరగతి (1995–96 బ్యాచ్) వరకూ ధర్మవరం జెడ్పీ హైస్కూల్లో చదివారు. తర్వాత ఐఏఎస్ సాధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నా ఆ స్కూల్ను ఆయన మరచిపోలేకపోయారు. అత్యున్నత సర్వీసు సాధించడంలో తనను స్ఫూర్తి ప్రదాతగా భావిస్తున్న విద్యార్థులకు తన వంతు తోడ్పాటు అందించడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అప్పటికే తన పదో తరగతి బ్యాచ్ స్నేహితులతో కలిసి బాహుదా సేవాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ధర్మవరం గ్రామంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తిత్లీ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను రెండ్రోజుల్లోనే పునరుద్ధరించగలిగారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా గ్రామంలో వైద్య సేవలు అందేలా ఆ సంఘం విశేష కృషి చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో ధర్మవరం జెడ్పీ హైస్కూల్కు రూపురేఖలు మారాయి. మన బడి నాడు–నేడు కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. ఆర్నెల్ల క్రితం ఆ పాఠశాలను సందర్శించిన శివశంకర్... అక్కడి విద్యార్థుల విద్యా మనోవికాసానికి ఉపయోగపడేలా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తండ్రి పేరుతో రూ.8.5 లక్షల విరాళం.. డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి పాఠశాల ప్రాంగణంలోనే ఒక హాల్ను శివశంకర్ ఎంపిక చేశారు. తన తండ్రి లోతేటి సన్యాసప్పడు పేరుతో రూ.8.5 లక్షల విరాళంగా సమకూర్చారు. ఆ నిధులతో చక్కని మార్చుల్స్, సీలింగ్, గోడలకు పుట్టీ, పెయింటింగ్తో ఆహ్లాదంగా ఆ హాల్ను అభివృద్ధి చేశారు. ఏసీ సౌకర్యంతో పాటు స్టడీ టేబుళ్లు, కుషన్ కుర్చీలు సమకూర్చారు. రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక పుస్తకాలను సమకూర్చడంలో శివశంకర్ తన వంతు కృషి చేశారు. తాను చదువుకున్న, సేకరించిన పుస్తకాలను లైబ్రరీకి ఇచ్చేశారు. చలం మాస్టారి సహకారంతో వైజ్ఞానిక, సాహిత్య, పోటీ పరీక్షల పుస్తకాలన్నీ అందుబాటులోకి తెచ్చారు. అవన్నీ భద్రంగా ఉంచేందుకు ప్రత్యేక కప్బోర్డులను ఏర్పాటు చేశారు. అత్యధిక కాలం లైబ్రరీలో పుస్తక పఠనంలోనే గడిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ డిజిటల్ లైబ్రరీకి ఆయన పేరుతోనే నామకరణం చేశారు. అంతేకాదు పుస్తక పఠనం వైపు విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి పోటీ కూడా పెట్టారు. రానున్న దసరా సెలవుల్లో బాహుదా సేవాసంఘం సభ్యులు వారికి పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన తొలి 20 మంది విద్యార్థులను ఐదు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తానని శివశంకర్ హామీ ఇవ్వడం విశేషం. -
రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన డాక్టర్.. ఎందుకో తెలుసా?
ఇతరులకు సాయం చేయాలి అనిపించినా చేసే స్థోమత అందరికీ లేకపోవచ్చు. కొంతమంది ఆ సామర్థ్యం ఉన్నా సాయం చేసేందుకు మనసు ఒప్పదు. కానీ ఇందుకు భిన్నంగా కొందరు తమ స్థాయి గురించి ఆలోచించకుండా ప్రజాసేవే పరమావధి జీవిస్తుంటారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన అర్వింద్ గోయల్ అనే డాక్టర్ కూడా అచ్చం ఇలాంటి వాడే. ఏకంగా తన యావదాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు. అయితే ఆస్తి అనేగానే ఏదో 10, 20 లక్షలు, మహా అయితే కోటి రూపాయలు అనుకునేరు.. అక్షరాల 600 కోట్ల విలువైన ఆస్తిని పేదల సంక్షేమం,అభివృద్ధి కోసం యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశారు. దాదాపు 50 ఏళ్లుగా వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న అర్వింద్ గోయల్ కేవలం తన ఇంటిని మాత్రమే ఉంచుకొని మిగతా ఆస్తినంతా ఇచ్చేశారు. ఆస్తిని ఇచ్చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయం 25 ఏళ్ల క్రితమే తీసుకున్నట్లు తెలిపారు. కాగా రోనా లాక్డౌన్ సమయంలో వేల మందిని కష్టాల నుంచి ఆదుకున్నారు. మోరదాబాద్లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అన్ని రకాల వసతులను ఉచితంగా కల్పించారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం వంటి సదుపాయాలను అందించారు. చదవండి: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. గోయల్ 100కు పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీగా ఉన్నారు. తన సేవలకుగాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా నలుగురు రాష్ట్రపతుల చేతులమీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు. అరవింద్కు భార్య రేణు గోయల్తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే కుటుంబసభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. -
పడవేయకండి..దానం చేయండి.
న్యూజెర్సీ: ఎప్పుడూ సేవాపథంలో వినూత్నంగా ఆలోచించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. డోన్ట్ డిచ్ ఇట్, డోనేట్ ఇట్ (పడవేయకండి.. దానం చేయండి) అనే ఈ కార్యక్రమం ద్వారా ఇళ్లలో మైనర్ రిపేర్లు ఉండి వాడకుండా పడేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు( కంప్యూటర్లు, కీబోర్డులు, ఐపాడ్స్, మొబైల్ ఫోన్స్,లాప్టాప్స్,కెమెరా, స్పీకర్లు) సేకరిస్తుంది ఇలా సేకరించిన వాటిని నాట్స్ రిపేర్లు చేయించి శరణార్ధుల పిల్లలకు అందించాలని సంకల్పించింది. గతంలో మేరీ ల్యాండ్కు చెందిన పన్నెండేళ్ల మిడిల్ స్కూల్ విద్యార్ధిని మన తెలుగమ్మాయి శ్రావ్య అన్నపరెడ్డి ఈ కార్యక్రమాన్ని కోవిడ్ సమయంలో చేపట్టారు. అప్పట్లో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా శ్రావ్య సేవా పథాన్ని కొనియాడుతూ ఆమెను సత్కరించారు. ఇదే స్ఫూర్తిని తీసుకుని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడ చొరవతో అమెరికా అంతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. డోన్ట్ డిచ్ ఇట్.. డోనేట్ ఇట్ నినాదంతో ముఖ్యంగా విద్యార్ధులను ఇందులో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగనుంది. విద్యార్థి దశలోనే ఈ సమాజానికి నేనేం ఇవ్వగలను అనే బలమైన ఆకాంక్షను విద్యార్ధుల్లో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ఈ సందర్భంగా తెలిపారు. సేవాభావంతో పాటు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలవడతాయని.. సాటి మనిషికి సాయం చేయడంలో కచ్చితంగా తమ వంతు పాత్ర పోషించాలనే బాధ్యత వస్తుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజ్ అల్లాడ అన్నారు. నాట్స్ అమెరికాలో ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళుతుందని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ విజయశేఖర్ అన్నె తెలిపారు. నాట్స్ వాలంటీర్లు వారి పిల్లలంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ముందుకు రావాలని నాట్స్ నాయకులు పిలుపునిచ్చారు. తమకు అవసరం లేదనిపించి ఇంట్లో వాడకుండా ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా విద్యార్ధులు సేకరించి తమకు పంపాలని నాట్స్ పేర్కొంది. చదవండి: అనాథల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు -
పుస్తకాలు దానం చేయండి!
మే 5న ఆంధ్రప్రదేశ్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 23న విద్యాలయాలకి సెలవులు ఇస్తారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ మే 5 వరకు పాఠశాలలు జరగనున్నాయి. సాధారణంగా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే పాఠశాల చివరి పనిరోజు వారు ఆనందంలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు చించివేసి రహదార్లపై పడవేస్తుంటారు. ముఖ్యంగా ప్రయివేటు విద్యాలయాల్లో ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని వల్ల చెత్తాచెదారం పెరుగుతుంది. అసలే ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండి, దోమల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఒకే రోజు కాగితాలు చించివేయడం వల్ల, పారిశుద్ధ్య కార్మికులకి మరింత పనిభారం పెరుగుతుంది. నేల కాలుష్యం కూడా పెరుగుతుంది. సాధారణ ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. (క్లిక్: అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?) ఈ రోజు ఏ పోటీ పరీక్షల్లోనైనా ప్రాథమిక అంశాలను ఎక్కువగా అడుగుతున్నారు. చాలా మంది విద్యార్థులకు వీటిపై అవగాహన ఉండటం లేదు. ప్రాథమిక అంశాలు ఎక్కువగా కింది తరగతుల పుస్తకాలలోనే ఉంటాయి. పుస్తకాలను పారవేయకుండా వాటిని భద్రపరుచుకునేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. వీలుంటే వేసవిలో వారి చేత పుస్తక పఠనం చేయించవచ్చు. అలాగే పాఠ్య పుస్తకాలు కొనుక్కోలేని పేద విద్యార్థులకు పుస్తకాలను వితరణ చేయవచ్చు. ఈ చిన్ని సాయమే వారికి పెద్ద చేయూత అవుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెరుగుతుంది. – ఎం. రాంప్రదీప్, తిరువూరు -
ఈ సారు ఎంత మంచోడో.. కూడబెట్టిన 40 లక్షలు ఇచ్చేశాడు
ప్రపంచంలో బాధలను ఎవరూ తగ్గించలేరు, కానీ మనం చేయగలిగినంత మంచి చేయాలి.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యం లాంటి మాట ఇది. మాటే కాదు.. ఆయన మనసూ స్వచ్ఛమే. విజయ్ కుమార్ చాన్సోరియా.. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలోని ఖాందియాలో ప్రభుత్వ టీచర్గా పని చేశారు. 39 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఈ మధ్యే ఆయన సర్వీస్ నుంచి దిగిపోయారు. సోమవారం ఆయన ఉద్యోగ విరమణ సన్మానం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో పీఎఫ్, సేవింగ్స్ ద్వారా వచ్చిన 40 లక్షల రూపాయల్ని పేద విద్యార్థులకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారాయన. భార్యతో విజయ్ కుమార్ సార్ ఉపాధ్యాయుడిగా వేలాదిమందిని తీర్చిదిద్దినప్పటికీ అది నాకు సంతృప్తినివ్వలేదు. వారి కోసం ఇంకేదో చేయాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారాయన. రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నా. నాలాగే ఎంతో మంది ఇప్పటికీ కష్టపడుతున్నారు. చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు నాలాంటి కష్టం రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రకటించగానే.. అంతా చప్పట్లతో ఆయన్ని స్వాగతించారు. అంతమాత్రాన ఆయనకు భార్యాపిల్లలు లేరనుకోవడం పొరపాటే. అక్కడ చప్పట్లు కొట్టిన వాళ్లలో ఆయన భార్యా, కూతురూ ఉన్నారు కూడా. విజయ్ కుమార్ భార్య బాగానే చదువుకుంది. ఆయన కూతురికి ఆల్రెడీ పెళ్లైంది. ఇద్దరు కొడుకులూ ఉద్యోగాలు చేస్తూ మంచిగానే సెటిల్ అయ్యారు. వాళ్ల అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు విజయ్ కుమార్ చాన్సోరియా. చదవండి: కారడవిలో అడవి బిడ్డల భవిష్యత్తు కోసం 14కి.మీ. నడక! -
ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే
మెక్సికో సిటి: ప్రేమ అనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. తమ ప్రేమ చరిత్రలో నిలిచిపోయేందుకు.. కొందరు చారిత్రక కట్టడాలు నిర్మిస్తే.. మరికొందరు అదే ప్రేమను పొందడానికి యుద్ధాలుసైతం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుత సమాజంలో నిజమైన ప్రేమ దొరకడం అనేది ఒక మిథ్య మాదిరిగానే అనే ఉంటుంది. కొందరు యువతీ యువకులు పాశ్చాత్యధోరణులకు అలవాటుపడి.. తమకు బాయ్ఫ్రెండ్ లేదా గర్ల్ఫ్రెండ్ ఉండటం ఒక స్టెటస్ సింబల్గా భావిస్తున్నారు. మరికొందరు ఒక అడుగుముందుకు వేసి.. ఒకరికి తెలవకుండా మరి కొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. కొందరు పవిత్రమైన ప్రేమను తమ అవసరాలకోసం వాడుకుంటూ.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమముసుగులో విచ్చలవిడిగా తిరిగి.. ఆ తర్వాత ఏవో కారణాలతో విడిపోయి.. ప్రేమకున్న పరువును బజారుకిడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం వార్తల్లో చదువుతునే ఉన్నాం. ప్రేమను వాడుకోవడంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ అతీతులు కారు. కొన్నిచోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలను మోసం చేస్తే.. మరికొన్ని చోట్ల అమ్మాయిలు.. అబ్బాయిలను మోసం చేస్తున్నారు. కొందరు నిజమైన ప్రేమికులు తమ ప్రేమ కోసం.. తాము ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. బాజా కాలిఫోర్నియాకు చెందిన ఉజీల్ మార్టినేస్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. చాలా సంవత్సరాల పాటు వీరి ప్రేమ బాగానే కొనసాగింది. ఈ క్రమంలో ఉజీల్.. ప్రియురాలి తల్లి కిడ్నీసమస్యతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరిక్షీంచిన వైద్యులు వెంటనే కిడ్నీని మార్చాలన్నారు. ఆమె ప్రియురాలు ఎంతోగానో బాధపడింది. తన ప్రియురాలి బాధను చూడలేక.. ఉజీల్ తన కిడ్నిని దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో ఉజీల్కు శస్త్రచికిత్స చేసి అతని కిడ్నీని ప్రియురాలి తల్లికి అమరుస్తారు. ఒకనెల రోజులు గడచిపోయింది. ఉజీల్, ప్రియురాలి తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంతో కొలుకున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత ఉజీల్ ప్రియురాలు అతడినితో మాట్లాడటం మానేసింది. ఈ విధంగా ఒకనెల రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత.. తన ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన విషయం ఉజీల్కు తెలుస్తుంది. దీంతో ఉజీల్ తీవ్ర మానసిక వేదనకు గురౌతాడు. తన ప్రియురాలి చేతిలో మోసపోయాయని తెలుసుకుని కుంగిపోయాడు. కాగా, తన మానసిక క్షోభను టిక్టాక్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్గా మారింది. ‘తన ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ఇంతటి త్యాగం చేశాను.. ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు.’ ప్రస్తుతం తాము.. మాట్లాడుకోవట్లేదని.. అలాగని తనను.. వ్యతిరేకించడం కానీ, ద్వేషించడంగానీ చేయట్లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీలాంటి గొప్ప వ్యక్తితో ఉండే అర్హత ఆ అమ్మాయికి లేదు..’, ‘ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు..’, ‘నువ్వు ఏం బాధపడకంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!! -
శభాష్ ఎస్సై నాగరాజు.. ఆకలి తీర్చి.. ఆరాతీసి
సాక్షి, చిట్యాల (నల్లగొండ): మండల పరిధిలోని గుండ్రాంపల్లి గ్రామ శివారు జాతీయ రహదారిపై సోమవారం ఓ వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా సంచరిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిట్యాల ఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకుని ఆ మతిస్థితిమితం లేని వ్యక్తిని చేరదీశాడు. అతడిని వివరాలు అడగగా ఆంగ్లంలో మాట్లాడాడు. తన పేరు డాక్టర్ రాజా అని, ఐఐటీ, పీహెచ్డీ చేశానని, తమిళనాడు అని చెప్పాడు. అతడిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి దుస్తులు సమకూర్చి భోజనం పెట్టించి ఆకలి తీర్చాడు. అతడు చెబుతున్న వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తిని చేరదీసిన ఎస్ఐని పలువురు అభినందించారు. వృద్ధురాలిని ఇంటికి చేర్చి.. డిండి: నాంపల్లి మండలం సల్లోనికుంటకు చెందిన వృద్ధురాలు రాపోతు వెంకటమ్మ చిత్రియాలలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో దారితప్పి డిండికి చేరుకుంది. మతిస్థిమితం లేకుండా బంగారు ఆభరణాలతో డిండి గ్రామశివారులో తిరుగుతున్న సదరు వృద్ధురాలిని స్థానిక యువకుడు ఆవుట అంకాల్ గమనించి స్థానిక పోలీస్స్టేషన్లో అప్పజెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు వివారాలు సేకరించగా వృద్ధురాలు కూతురైన మండల పరిధిలోని వీరబోయనపల్లి గ్రామానికి చెందిన జంగా లక్ష్మమ్మగా గుర్తించారు. ఆమెను స్టేషన్కు పిలిపించి వెంకటమ్మను అప్పగించారు. కార్యక్రమంలో డిండి ట్రైనీ ఎస్ఐ.కళ్యాణ్ కుమార్, మహిళ సహాయకేంద్రం ఇన్చార్జ్ సైదమ్మ ఉన్నారు. చదవండి: Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం -
మానవత్వం చాటుకున్న ట్రాన్స్జెండర్ ఎస్ఐ
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రాణాపాయ స్థితిలో ఉన్న హెడ్ కానిస్టేబుల్కు ట్రాన్స్ జెండర్ ఎస్ఐ ప్రితికా యాసిని రక్తదానం చేశారు. ఈ సమాచారంతో ప్రితికాను కమిషనర్ శంకర్ జివ్వాల్ బుధవారం అభినందించారు. చెన్నై అన్నాసాలై పోలీసు స్టేషన్లో ఎస్ఐగా కె ప్రితికా యాసిని పనిచేస్తున్నారు. రాష్ట్రంలో తొలి ట్రాన్స్జెండర్ ఎస్ఐగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో స్టేషన్లో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ శంకర్ అనార్యోగంతో ఉండడంతో రెండు రోజుల క్రితం పరామర్శించారు. ఆయనకు అత్యవసరంగా మూడు యూనిట్ల రక్తం అవసరం కావడంతో మంగళవారం తానే ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. కమిషనర్ శంకర్ జివ్వాల్ ఎస్ఐను అభినందించారు. చదవండి: బంజారాహిల్స్ కారు యాక్సిడెంట్ కేసు: కొంత ‘కాంప్రమైజ్’?.. -
No Shave November: గడ్డాలు పెంచుతూ ఆకర్షణగా నిలుస్తున్న యువత
సాక్షి, కాజీపేట(వరంగల్): క్రాఫ్లో వివిధ రకాల స్టైల్స్.. ఆ మాదిరిగానే గడ్డంలోనూ తమకంటూ ఓ ప్రత్యేకత కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. తమ అందాన్ని గడ్డం రూపంలోనూ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు మక్కువ చూపుతూ ఇదో స్టైల్ అంటూ కొత్త ట్రెండ్కు తెరలేపుతోంది. ‘నో షేవ్.. పెంచెయ్ గడ్డం’ అంటూ నగర యువత గడ్డం పెంచడంతో కొత్తదనం చూపుతోంది. అయితే ఏడాదిలో ప్రతి నెలకో ప్రత్యేకత ఉండగా.. కేన్సర్ మహమ్మారిని సమాజం నుంచి పారదోలేందుకు.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు.. పేషెంట్లకు ఆర్థిక చేయూతనందించేందుకు నో షేవ్ నవంబర్ మాసంగా జరుపుకునేందుకు యువత ఉత్సాహం కనబరుస్తోంది. నవంబర్ నో షేవ్ మాసంగా.. గతంలో గడ్డం పెంచుకుంటే ఏంట్రా దేవదాసులా మారావు అనేవారు. కానీ.. ఇప్పుడు గడ్డం పెంచేసుకుందాం బాసూ అంటున్నారు. ప్రస్తుత యువతకు గడ్డం ఓ ట్రెండ్లా మారింది. తీరొక్క ఆకృతుల్లో.. ఇష్టమైన విధంగా మలచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నవంబర్ మాసాన్ని నో షేవ్ నవంబర్ పేరిట.. గడ్డంపై కత్తెర పడనివ్వకుండా.. గడ్డానికి వెచ్చించే ఖర్చును మాసం మొత్తంలో పొదుపు చేసి కేన్సర్ పేషెంట్లకు అందజేయడంతోపాటు గడ్డం పెంచడంలో తమ స్టైల్ను కనబరుస్తూ.. డబ్బును ఆదా చేసి పేషెంట్లకు అందిస్తూ తమ ఉదారతను చాటుతున్నారు. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు నగర యువకులు. ఇందుకోసం యువతను మరింతగా ప్రోత్సహించేందుకు ఆన్లైన్ నో షేవ్ నవంబర్ పేరిట స్వచ్ఛంద సంస్థ అందుబాటులో ఉండడం విశేషం. కాగా.. యువత ఫ్రెంచ్, అండర్ కట్ బియర్డ్, యాంకర్ బియర్డ్ వంటి వాటితోపాటు తమకు ఇష్టమైన హీరోల గడ్డాలను సరిపోలే విధంగా గడ్డాన్ని తీర్చిదిద్దుకునేందుకు నగరంలో ప్రత్యేకంగా మెన్స్ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి. గడ్డం ప్రవీణ్ అంటారు.. నాకు గడ్డం పెంచడం అంటే చాలా ఇష్టం. నన్ను మా ఆఫీసులో అందరూ గడ్డం ప్రవీణ్ అనే పిలుస్తారు. నవంబర్ మాసంలో గడ్డంపై పెట్టే డబ్బులను కేన్సర్ పేషెంట్లకు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదో మంచి సేవా కార్యక్రమంలా నేను భావిస్తున్నా. – సుందర ప్రవీణ్కుమార్, రైల్వే బుకింగ్ క్లర్క్ నా బియర్డ్ నా ఇష్టం నా బియర్డ్ నా ఇష్టం అంటాను నేను. మా ఇంట్లో వారు గడ్డం ఎందుకన్నా నాకు మాత్రం పెంచడం అంటే చాలా ఇష్టం. ప్రతి ఏడాది నవంబర్ మాసంలో నో షేవ్ నవంబర్ను పాటించి డబ్బులను ఆదా చేసి కేన్సర్ పేషెంట్లకు అందజేయడం బాధ్యతగా భావిస్తా. – ప్రియాంషు, ఎంటెక్, నిట్ వరంగల్ నో షేవ్ నవంబర్ను పాటిస్తాం.. నిట్ వరంగల్ ప్రతి అంశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నిట్లో నవంబర్ నెలను నో షేవ్ నవంబర్గా పాటిస్తున్నాం. నాతోటి మిత్రులతో కలిసి బియర్డ్ కటింగ్కు అయ్యే డబ్బులను కేన్సర్ పేషెంట్ల చికిత్సకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. – విదిష్రామ్, పీహెచ్డీ స్కాలర్, నిట్ -
ప్రవాసాంధ్రుల ఔదార్యం, కోవిడ్ కేర్ కిట్లు పంపిణీ
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కోవిడ్ సంబంధిత ఔషధాలు, మెడికల్ ఎక్విప్మెంట్ను విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ డోనేట్ చేసింది. కాలిఫోర్నియాలోని హన్ఫోర్డ్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారానికి పాటుపడుతోంది. కోవిడ్ సెకండ్ డ్రైవ్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు చోట్ల వెటా ఆధ్వర్యంలో మందులు, మెడికల్ ఎక్విప్మెంట్ అందచేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ ఫార్మసీల నుంచి విరాళాలు సేకరించి వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో పలు గ్రామాలకు రూ. 1. 50 లక్షల విలువైన యాంటీ బయాటిక్స్, సీ విటమిన్ ట్యాబెట్లు, సిరంజీలు డోనేట్ చేశారు. ఖమ్మం జిల్లా పల్లేరు గ్రామంలో ఐసోలేషన్ వార్డుకి ఫేస్ షీల్డ్స్, హెడ్ క్యాప్స్, ఆక్సిమీటర్లు, ఐఆర్ థర్మామీటర్లు అందించారు. ఇదే జిల్లాలో కూసుమంచి ఆరోగ్య కేంద్రానికి 7 పీపీఈ కిట్ గౌన్లలను అందించారు. సూర్యాపేట జిల్లాలోని పలు పాఠశాలలకు ఆక్సిమీటర్లు, ఇర్ థర్మామీటర్లను పంపిణీ చేయడంతో పాటు కృష్ణా జిల్లాలో 75 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిమీటర్లు మరియు డిజిటల్ థర్మామీటర్లను పంపిణీ చేశారు. దీంతో పాటు తిరుపతి రుయా ఆసుపత్రికి రూ. 1.5 లక్షల విలువైన పల్స్ ఆక్సిమీటర్లు, కాంటాక్ట్లెస్ థర్మామీటర్లు, ఇర్ థర్మామీటర్లు, ఫేస్ షీల్డ్స్, పీపీఈ కిట్లు, హెడ్ క్యాప్స్, రేణిగుంటలోని అభయ క్షేత్రం అనాథ ఆశ్రమానికి ఒక నెలకు సరిపడా సామాన్లు, ప్రాజెక్ట్ ఆశ్రయ్కి 15 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వెటా ద్వారా అందించారు. -
కరోనా ఎఫెక్ట్ : తన ఫ్యాన్స్ కోసం సూర్య ఏం చేశాడంటే...
చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర సంక్షబాన్ని మిగిల్చింది. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభిమానులకు సహాయం చేసేందుకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందుకు వచ్చారు. తరుచూ ఫ్యాన్స్ను కలిసే సూర్య వారి కష్టాలను చూసి చలించిపోయారు. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్ క్లబ్కు చెందిన 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5000 చోప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇక సూర్య తన అభిమానుల పట్ల చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూర్య మంచి మనసుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు. గత కొద్దిరోజలు క్రితమే కరోనాపై పోరాటానికి తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్కు తన తండ్రి, సోదరుడు కార్తీతో కలిసి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ఆకాశమే నీ హద్దురా సినిమాతో భారీ హిట్టు కొట్టిన ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 35 శాతం పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా కాకుండా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడీవాసల్’, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు కమిట్ అయ్యారు సూర్య. చదవండి : తాళి కట్టేముందు 'రిషి' అడిగిన ప్రశ్నకు ఇప్పటికీ ఏడిపిస్తుంటాను.. వైరల్: అభిమాని పెళ్లిలో సూర్య సందడి -
గతంలో మాదిరిగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాని దాతలు
-
సూపర్హీరో మరో ఔదార్యం, నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: ప్రాణాలకు తెగించి మరీ పట్టాలపై పడి పోయిన బాలుడిన కాపడిన రైల్వే పాయింట్మ్యాన్ మయూర్ షెల్కే తన ఔదార్యంతో మరోసారి రియల్ హీరోగా నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అతని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న తరువాత మయూర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు. ఆ బాలుడి చదువు, సంక్షేమం నిమిత్తం కొంత సొమ్మును దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతని పెద్దమనసుకు నెటిజనులు హ్యాట్యాఫ్ అంటున్నారు. మా మనసులను ఎన్నిసార్లు గెల్చుకుంటావ్ భయ్యా అంటూ షెల్కేకు ఫిదా అవుతున్నారు. (సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్) I'll give half of the amount, given to me as token of appreciation, for that child's welfare & education. I came to know that his family isn't financially strong. So I decided this: Mayur Shelkhe, pointsman who saved a child who fell on tracks at Vangani railway station on 17.04 pic.twitter.com/IWdacY0DFf — ANI (@ANI) April 22, 2021 pic.twitter.com/C62xQVXnCy — thejadooguy (@JadooShah) April 22, 2021 In these dark days for humanity, ray of hope 🙏 — Bharateeya (@AntiCaste_Hindu) April 22, 2021 -
తల్లి కాలేయం ఇచ్చినా.. తప్పని గుండె కోత
సాక్షి, మచిలీపట్నం: బిడ్డను బతికించుకోవాలనే తపనతో తన కాలేయాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన ఆ మాతృమూర్తికి గుండె కోత తప్పలేదు. పెళ్లైన పదిహేను ఏళ్ల తరువాత కలిగిన సంతానం కావడంతో ఎంతో అల్లారు ముద్దు చేసిన కుమారుడు ఇక లేడని తెలియడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తన కాలేయాన్ని అమర్చుకొని కొడుకు కళ్ల ముందుకొస్తాడని, అదే ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ తల్లికి కన్న పేగు ఇక లేదని చెప్పే సాహసాన్ని అక్కడి వైద్యులు సైతం చేయలేని హృదయ విదారకరమైన పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం నగరం నోబుల్ కాలనీకి చెందిన గ్రేసీ, స్టీఫెన్ దంపతుల పెద్ద కుమారుడు ఇమ్మానియేల్ జాకబ్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతనికి కాలేయ సంబంధిత వ్యాధి ఉందని ఇటీవల వరకు తెలియదు. కొన్ని రోజుల క్రితం నోటి నుంచి రక్తం పడటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఇమ్మానియేల్ జాకబ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కాలేయాన్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందని, లేకుంటే ప్రాణాలు దక్కవని చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఇమ్మానియేల్ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి స్టీఫెన్ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉన్నందున వారి పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మానవీయ కోణంలో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25 లక్షలు మంజూరు చేయించారు. కుమారుడికి తన కాలేయాన్ని ఇచ్చేందుకు తల్లి గ్రేసీ సిద్ధమైంది. (చదవండి: ఘోర ప్రమాదం: 23 మంది మృతి) ఆపరేషన్ చేస్తుండగా.. కాలేయ మార్పిడికి ఆసుపత్రి వైద్యులు అంతా సిద్ధం చేసి తల్లి గ్రేసీకి ఆపరేషన్ ద్వారా కాలేయం కొద్ది భాగాన్ని తొలగించారు. దానిని ఇమ్మానియేల్కు అమర్చేందుకు ఆపరేషన్ చేస్తున్న క్రమంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతిచెందాడు. తల్లి గ్రేసీని ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు. కుమారుడు ఇమ్మానియేల్ మృతి చెందిన విషయం ఇంకా ఆమెకు తెలియదు. 50 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం నుంచి బందరుకు వచ్చిన గ్రేసీ, స్టీఫెన్ దంపతులు అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. గిటార్ ప్లే చేయడంలో అందవేసిన చేయి అయిన ఇమ్మానియేల్ ఎవాంజెలికల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తన సంగీత ప్రతిభతో అందరి మనసును దోచుకునేవాడు. అటువంటి ఇమ్మానియేల్ ఇక లేడని తెలియడంతో నోబుల్ కాలనీలో విషాదం అలముకుంది. ఈ విషయాన్ని ఇమ్మీ స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని మచిలీపట్నానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. -
హాట్సాఫ్; రూ.300 కోట్ల భవనం దానం
బెంగళూరు: రూపాయి దానం చేయాలంటేనే వంద విధాలుగా ఆలోచించే రోజులు ఇవి. కానీ ఓ మహిళ మాత్రం దాన గుణానికి హద్దులు లేవని నిరూపించారు. ఏకంగా రూ.300 కోట్ల విలువైన తన ఆస్తిని దానం చేసింది. తనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచి చేసిన సహాయం ఎందరో నిరుపేదలకు ఇప్పుడు నీడలా మారబోతోంది. ఇంత మంచి మనసున్న ఆ అమ్మ పేరు మీరా నాయుడు. క్యాన్సర్తో బాధపడే బాలల సంక్షేమం కోసం 32 గదులున్న, రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తిని కేటాయించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో మెజిస్ట్రిక్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఉంది. ఒకప్పుడు లక్ష్మీ హోటల్గా పేరుగాంచిన ఆ భవనం నేడు బాలల ఆరోగ్య కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి ఎంతో మంది పోటీపడినా.. వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా దానం చేయడానికే ఆమె ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే క్యాన్సర్ బాధిత పిల్లల కోసం ఆ భవనాన్ని కేటాయించడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తున్న నగరంలోని శంకర్ ఆసుపత్రికి మీరా నాయుడు దానిని అప్పగించారు. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘భవనం ఉన్న ప్రదేశంలో నేను మరో బిల్డింగ్ కడితే ఇంకా డబ్బు వచ్చి చేరి నా సంపద పెరుగుతుంది. అంతేకానీ నాకు ఆత్మ సంతృప్తి ఉండదు. నా భర్త శ్రీనివాసులు నాయుడు ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ కట్టించాడు. దీన్ని పేదవారి కోసం దానం చేయడం వల్ల ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని' ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భవనాన్ని ఆమె శంకర్ ఆస్పత్రి నిర్వాహకులకు అప్పగించారు. ఇక్కడికి వచ్చే క్యాన్సర్ బాధితులకు వీరు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అలా వైద్యం పొందిన చిన్నారులకు ఇక్కడ వసతి కల్పించాలని ఆమె కోరారు. ఇది విన్నవారంతా మీరా నాయుడు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. Mrs. Meera Naidu, donates Rs.300 crore "Lakshmi hotel" near Majestic to Shankara Cancer hospital to use it as a free accommodation for the patients and their families from outside Bengaluru. A noble gesture indeed! #Bengaluru #Karnataka — DP SATISH (@dp_satish) December 31, 2019 -
మందిర నిర్మాణం: షియా బోర్డు భారీ విరాళం
లక్నో: అయోధ్య వివాదం ముగిసి పోయిన నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి సర్వం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి తామూ చేయూతనిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ముందుకొచ్చింది. మందిర నిర్మాణం కొరకు రూ.51000 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియా సెంట్రల్ బోర్డు చీఫ్ వసీం రిజ్వీ శుక్రవారం తెలిపారు. రామ మందిర నిర్మాణానికి తాము అనుకూలమని అన్నారు. కాగా వివాదాస్పద రామ మందిర- బాబ్రీ మసీదు భూమిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూమిని మందిర నిర్మాణానికి కేటాయించి, మసీదుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో దశాబ్దాలుగా హిందూ సంఘాలు చేస్తున్న మందిర నిర్మాణ ప్రయత్నానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. త్వరలోకే కేంద్ర ప్రభుత్వ అయోధ్య ట్రస్ట్నూ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే చర్యలు, సంప్రదింపులను ప్రారంభించింది. -
ఆలయ అభివృద్ధికి విరాళమిచ్చిన యాచకుడు
చీపురుపల్లి: వృత్తి యాచన.. దాతృత్వంలో మాత్రం ఉన్నతం. ప్రస్తుత సమాజంలో ఎంతో మంది వద్ద రూ.కోట్లు ఉండొచ్చు కానీ.. దాతృత్వంలో వారు నిరుపేదలే. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శివాలయం వద్ద ఉన్న చేబ్రోలు కామరాజు అనే యాచకుడు మాత్రం దాతృత్వంలో నంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. యాచన ద్వారా సంపాదించుకున్న ఒక్కో రూపాయినీ పొదుపు చేసి నీలకంఠేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అందజేస్తున్నాడు. భక్తులు ప్రదక్షిణ చేసుకునే సమయంలో ఎండ, వాన సమస్యలు ఎదురుకాకుండా షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు మంగళవారం రూ.60 వేలు అందజేశాడు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు దాదాపు రూ.3 లక్షల వరకు గుడికి సమర్పించుకున్నాడు. గతంలో ఆలయ పరిసరాల్లో షెల్టర్ల ఏర్పాటుకు రూ.1.2 లక్షలు, రూ.70 వేలు రెండు దఫాలుగా అందజేసాడు. 20 ఏళ్లుగా అక్కడే యాచన శ్రీకాకుళం జిల్లాలోని ఒప్పంగి గ్రామానికి చెందిన కామరాజు రెండు దశాబ్దాల క్రితమే చీపురుపల్లి వచ్చేశాడు. ఇక్కడి ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద రోజూ యాచన చేస్తాడు. ఆలయం ఎదురుగా ఉన్న చిన్న పూరిగుడిసెలో నివసిస్తాడు. అలా బిచ్చమెత్తుకుని సంపాదించిన మొత్తాన్ని శివాలయం అభివృద్ధికే వెచ్చిస్తానని చెబుతున్నాడు. -
కష్టాల్లో అన్నం పెట్టిన ఊరు.. వ్యాపారం చేసుకోలేను!
మనకెదురైన ఇబ్బంది మనలోని సామర్థ్యాన్ని బయటపెడితే ఎదుటి వాళ్లకు వచ్చిన కష్టం మనలోని మానవత్వాన్ని చూపెడుతుంది. ఈ నిజాన్ని ప్రకృతి వైపరీత్యాలెన్నో రుజువు చేశాయి. ఇప్పుడు కేరళ వరదలూ ఆ దృశ్యాలను చూపెడుతున్నాయి. వందేళ్ల కనివినీ ఎరుగని వరదలు కేరళను ముంచేస్తున్నాయి. దాదాపు 400 మందిని మింగేశాయి. ఇంకెంతోమంది జాడను గల్లంతు చేశాయి. ప్రకృతి చేస్తున్న ఆ బీభత్సాన్ని ఆపలేం. చేతుల్లో ఉన్నది.. సాయం చేయడమే. చేయందించి ఒడ్డుకు లాగడమే. ఆ పని రెస్క్యూ టీమ్ చేస్తోంది. జ్వరంతో ఒళ్లు కాలిపోతున్న పిల్లాడిని గుండెలకత్తుకొని... వరదపోటుకి కూలిపోతున్న బ్రిడ్జి మీద నుంచి పరిగెత్తి... ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడిన రెస్క్యూ ఆఫీసర్ కన్నయ్య కుమార్ సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే... ఇంకో పేరు వినిపిస్తోంది.. మనిషీ కనిపిస్తున్నాడు. ఆయన విష్ణు కఛ్వా. మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. వ్యాపార నిమిత్తం కేరళలోని కన్నూర్ జిల్లా, ఇరిట్టీలో ఉంటున్నాడు భార్య, ఇద్దరు పిల్లలతో. నెలలో రెండుసార్లు హరియాణాకు వెళ్లి అక్కడి నుంచి బ్లాంకెట్స్ తెచ్చి ఇరిట్టీ, చుట్టుపక్కల ఊళ్లలో ఇంటింటికీ తిరిగి వాటిని అమ్ముతుంటాడు. ఎప్పటిలాగే ఈసారీ వెళ్లాడు హర్యానా దుప్పట్లు తేవడానికి. వెళ్లేముందు అంతా బాగానే ఉంది. దుప్పట్ల బేరం అయ్యాక హరియాణాలో రైలు ఎక్కి ఇక్కడ దిగేదాకా తెలియదు అంతా మునిగిపోయిందని. హతాశుడయ్యాడు. ఇల్లు, పొలం, పుట్రా, గొడ్డు, గోదా ఉన్న కుటుంబాలన్నీ దిక్కులేని వాళ్లయ్యారని, ఎక్కడో రెస్క్యూ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారని తెలిసి విలవిల్లాడాడు. వానకు తడిసి.. చలితో వణికిపోతున్న ముసలివాళ్లు, పిల్లలు కళ్లల్లో మెదిలారు. తను చేయదగ్గదొక్కటే.. బ్యాగ్లో ఉన్న బ్లాంకెట్స్ను వాళ్లకు అందివ్వడమే. వెంటనే కన్నూరు కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి విషయం చెప్పాడు. అతని వివరాలు, జీవనాధారం అన్నీ తెలుసుకున్న కలెక్టర్.. ‘‘వీటిని పంచేస్తే నువ్వెలా బతుకుతావు.. వద్దు’’ అని సున్నితంగా వారించాడు. ‘‘నాకు అన్నం పెట్టిన ఊరు, ఉండడానికి చోటిచ్చిన నా మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల బాధలతో నేను వ్యాపారం చేసుకోలేను సర్.. నేను చేయగలిగింది ఇదొక్కటే.. దయచేసి ఈ దుప్పట్లను వాళ్లకు ఇచ్చేయండి’’ అన్నాడట నీళ్లు నిండిన కళ్లతో బ్యాగ్ను కలెక్టర్ చేతుల్లో పెడుతూ. ఆ మాటలకు కలెక్టర్తో పాటు అక్కడున్న ప్రభుత్వ సిబ్బంది కళ్లూ చెమ్మగిల్లాయి. విష్ణును తీసుకొని అప్పుడే తెరిచిన అడిచుకూట్టి స్కూల్ శిబిరానికి వెళ్లాడు కలెక్టర్. విష్ణు చేతుల మీదుగానే ఆ దుప్పట్లను ఇప్పించాడు. అంత వైపరీత్యానికి విష్ణుది ఉడుత సాయమే కావచ్చు.. కానీ అది చేయూతనివ్వడానికి ముందుకొచ్చే వాళ్లకు అది కొండంత స్ఫూర్తి! మదరసా నిలిచింది.. అంతా బాగా ఉన్నప్పుడు.. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నప్పుడు.. మనిషి, మనిషికీ మధ్య కులం, మతం, డబ్బు అన్నీ అడ్డుగోడలవుతాయి. వీటిని కూలగొట్టడానికేనేమో ప్రకృతి ఇలాంటిది సృష్టిస్తుంది అనిపిస్తోంది కోజికోడ్ జిల్లాలోని మదరసాను చూస్తుంటే. ఆ జిల్లాలోని హిందువులందరికీ ఆశ్రయమిస్తూ రక్షిస్తోంది ఈ మదరసానే! మనుషుల్లాగే ఉందాం.. అంతా బాగున్నప్పుడు కూడా! మానవత్వాన్ని నిద్రలేపడానికి వైపరీత్యాల అవసరం మనకొద్దు! కష్టానికి చలించడం మన నైజం. దాన్నెప్పుడూ జీవంతోనే ఉంచుదాం! -
కోటి విరాళమిచ్చిన ఏజీ
న్యూఢిల్లీ: కేరళలో సహాయ కార్యక్రమాల కోసం కేంద్ర అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోటి రూపాయలు విరాళమిచ్చారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపారు. వేణుగోపాల్ కొడుకు, సీనియర్ న్యాయవాది క్రిష్ణన్ కూడా మరో రూ.15 లక్షలను కేరళకు విరాళమిచ్చారు. న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ కేఎం జోసెఫ్లు చెప్పుకోదగ్గ డబ్బును విరాళంగా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులంతా కూడా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం ప్రకటించింది. -
పాత్రోచిత దానం
ఒక మహారాజు తన రాజ్యంలో పెద్ద ఎత్తున తోట కూర పండించి అందరికీ దానం చేస్తుంటాడు. పెద్దలు, పండితులకు స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ, ‘అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది?’ అని ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. దాంతో రాజు నిరాశ పడేవాడు. కొంతకాలం తర్వాత ఒక పండితుడు వచ్చాడు. అతనికీ తోటకూర కట్టను ఇస్తూ ఇదే ప్రశ్న వేశాడు. దానికాయన, ‘‘అంతకు ఇంతయితే, ఇంతకు ఇంతే!’’ అన్నాడు. రాజు నిరుత్సాహ పడ్డాడు. అదెలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికాయన చిర్నవ్వుతో ఇలా చెప్పేడు. ‘‘రాజా నీవు పూర్వ జన్మలో ఒక నిరుపేదవి. అదృష్టం కొద్దీ కొద్దిపాటి పెరడున్న ఒక పూరిల్లు ఉండేది. ఆ పెరటిలోనే తోటకూర పండించి, అందరికీ దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగానే ఈ జన్మలో మహారాజుగా పుట్టేవు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల, ఆ విషయాలన్నీ గుర్తున్నాయి. అప్పుడు కొద్దో గొప్పో తోటకూర దానం చేస్తే రాజునయి పుట్టేను కాబట్టి, ఇప్పుడు కూడా విరివిగా తోటకూర దానం చేస్తే ఇంతకంటే మంచిజన్మ లభిస్తుందన్నది నీ ఆలోచన. అంతేనా?’’ అని అడిగాడు. అందుకు రాజు నిజమేనని అంగీకరిస్తూ, ‘‘అప్పుడు తోటకూర దానం చేస్తే రాజుగా పుట్టేను కదా, మరి ఈ జన్మలో ఇంతంత తోటకూర దానం చేస్తే ఇంత కంటే మంచి జన్మ ఎందుకు రాదు?’’ అని అడిగాడు. అందుకు ఆ పండితుడు ‘‘రాజా! అప్పుడు నీవొక నిరుపేదవి అయినప్పటికీ, ఉన్నదానిలోనే ఇతరులకు సాయపడాలన్న సంకల్పంతో తోటకూర దానం చేసేవాడివి. ఫలితంగా ఈ జన్మలో మహారాజుగా çపుట్టావు. అయితే నీకు స్తోమత ఉండి కూడా ఇంతకంటె మంచి జన్మ కావాలన్న కోరికతో నీ స్థాయికి తగ్గట్టుగా ధనం, వెండి, బంగారం వంటివి దానం చేయకుండా, పిసినిగొట్టుతనంతో తోటకూర మాత్రమే దానం చేస్తున్నావు. దీని ఫలితంగా నీవు మరుజన్మలో యాయవారం చేసుకుని జీవించాల్సి వస్తుంది జాగ్రత్త’’ అన్నాడు. ఆ మాటలకు రాజు సిగ్గుపడి, ఆయన కాళ్ళు పట్టుకుని తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. అందుకు ఆ పండితుడు ‘‘రాజా! నీవు ఇకనుంచి నీ తాహతుకు తగిన దానం చెయ్యి. ప్రజల మంచి చెడ్డలను తెలుసుకుని అవసరంలో ఉన్న వారిని ఆదుకో. ఏది చేసినా నిండు మనస్సుతో చెయ్యి. నిరుపేదల ఆకలి తీర్చు. అన్నింటికీ మించి పేదలు, వికలాంగులు, వృద్ధులు ప్రజలు ఇతరుల మీద ఆధారపడి జీవించే బాధ లేకుండా స్వయంగా సంపాదించుకునే ఏర్పాటు చెయ్యి. మంచి జ్ఞానాన్నిచ్చే విద్యాదానం, నిరుపేదలు జబ్బుతో ఇబ్బంది పడకుండా వైద్యశాలలు కట్టించి ఉచిత వైద్య దానం చెయ్యి. అందరినీ ఆదరించు’’ అని చెప్పాడు.రాజు అప్పటినుంచి పనికి మాలిన దానాలు మానేసి, ప్రజల్ని పాలించడం పైనే దృష్టి పెట్టాడు. ఇందులోని నీతి ఏమిటంటే, ఎవరైనా సరే, తమ స్థోమతకు తగిన దానం చేయాలి. నిస్వార్థ బుద్ధితో చేసే దానం మాత్రమే భగవంతుడిని చేరుతుంది. స్థోమతకు మించిన దానాలు, అపాత్ర దానాల వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
సోమ్నాథ్ అంత్యక్రియలు అందుకే చేయడం లేదు
కోల్కతా: లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ(89) మృతితో అయన సన్నిహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గల చటర్జీకీ అధికార లాంఛానాలతో వీడ్కోలు పలకాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కమ్యూనిజం భావజలం గల ఈ సీనియర్ నేత.. తన మరణాంతరం భౌతికకాయాన్ని పరిశోధనలకు ఉపయోగపడేవిధంగా ఏదైనా మెడికల్ కాలేజీకి విరాళంగా ఇవ్వాలని 2002లోనే కోరారు. దీంతో ఆయన కోరుకున్న విధంగా పార్థీవదేహాన్ని స్థానిక ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మెడికల్ కాలేజీకి తరలించే ముందు లీగల్ లాయర్ అయిన ఈ కమ్యూనిస్టు నేతకు కోల్కతా హైకోర్టుతో ఎంతో అనుబంధం ఉంది.. దీంతో అయన పార్థీవదేహాన్ని గౌరవార్థం హైకోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి కోల్కతా అసెంబ్లీలో కాసేపు ఉంచి.. పోలీసుల వందన అనంతరం మెడికల్ కాలేజీకి తరలిస్తారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమ్నాథ్ చటర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
సంపన్న ఎంపీలకు వేతనం ఎందుకు..?
లక్నో : రాజకీయ నాయకులంటే మాటలకే పరిమితం కాదని ఆచరణలో చూపారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. గత తొమ్మిదేళ్లుగా సుల్తాన్పూర్ ఎంపీ వరుణ్ గాంధీ తన వేతనాన్ని విరాళంగా ఇచ్చేస్తూ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. గతంలో ఆయన సుల్తాన్పూర్లో ఓ రైతుకు రూ 2.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. కర్ణావటి యూనివర్సిటీలో ఇటీవల విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించిన వరుణ్ గాంధీ సంపన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతాలను వదులుకోవాలని తాను చేసిన విజ్ఞప్తిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ 25 కోట్లు మించి ఆస్తులను ప్రకటించిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికి తాను లేఖలు రాశానని, చట్ట సభ సభ్యుడిగా మీకు వచ్చే వేతనాలను మీరు ఎందుకు వదిలివేయకూడదని తాను కోరానని ఆయన చెప్పుకొచ్చారు. మనం ఇలా చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ 480 కోట్లు మిగులుతాయని ఇది పెద్ద మొత్తమేనని వారికి వివరించానన్నారు. తన లేఖకు బదులుగా ఏ ఒక్కరి నుంచి ప్రత్యుత్తరం రాలేదని చెప్పారు. తాను ఈ ప్రతిపాదనను తేవడంపై కొందరు ఎంపీలు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. -
నా అవార్డు నగరానికి సాయపడాలి: అర్జున్రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ బ్రాండ్ అమాంతం పెరిగిపోయింది. యూత్లో విజయ్కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. శనివారం రాత్రి జరిగిన 65వ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డుల కార్యక్రమంలో అర్జున్ రెడ్డి చిత్రానికి విజయ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డుపై విజయ్ ట్విటర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు(సీఎంఆర్ఎఫ్) ఇవ్వనున్నట్టు విజయ్ ట్వీట్ చేశారు. విజయ్ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. విజయ్ ట్వీట్ల సారాంశం : ‘నేను ఈ అవార్డు గెలిచాను. నేను ఏదైతే చేయాలో అది చేసినప్పుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పుడు, ఇండస్ట్రీ నుంచి గౌరవంతో పాటు డబ్బులు పొందినప్పుడు గెలిచినట్టు అనిపించింది. అమ్మ నాన్నకు సొంతిల్లు కొనిచ్చినప్పుడు, అందరు నాపై ప్రేమ కురిపించినప్పుడు గెలిచినట్టు అనిపించింది. నాకు ఈ అవార్డు ఒక బోనస్ లాంటింది. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తే సీఎంఆర్ఎఫ్కు సోమవారం వెళ్లి ఇచ్చేస్తా.. నా ఇంట్లో ఉండటం కంటే నేను పుట్టిన నగరానికి ఇది ఉపయోగపడటం కావాలి. రోజు ట్విటర్లో చూస్తుంటా కేటీఆర్ అన్న సాయం అడిగిన ఎంతో మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం చేస్తూ ఉంటారు. నా అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బులు వారు వాడుకోవచ్చు. దీంతో నా తొలి అవార్డుకు గుర్తింపు దక్కుతుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ నాకు అనిపించింది కమిట్ అయ్యా. దీన్ని సాకారం చేయడానికి కృషి చేస్తాను’ అని విజయ్ పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విటర్లో స్పందించారు. ‘విజయ్ నువ్వు ఫిలింపేర్ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు. సీఎంఆర్ఎఫ్కు సాయం చేయడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందం కల్గించింది’అని ట్వీట్ చేశారు. -
మరోసారి మంచి మనసు చాటుకున్న రషీద్
సాక్షి, హైదరాబాద్ : రషీద్ ఖాన్ ఈ పేరు ఇప్పుడు ఐపీఎల్ ట్రెండింగ్లో మారుమోగుతోంది. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆల్రౌండర్ ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్కు విజయాన్ని అందించాడు. అద్భుత ఆటతీరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో 100శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వచ్చిన 5లక్షల మొత్తాన్ని, గతవారం అఫ్గనిస్తాన్ జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. గతవారం జలాలాబాద్లో స్థానిక క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఇందులో ఆరుగురు పౌరులు మరణించగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై గెలిచిన అనంతరం వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడు, అతడి కుమారుడికి రషీద్ అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రికెటర్ రషీద్.. పెద్ద మనసు ఇక్కడ చదవండి. -
మరణం లేని మారాజు
ఆరిలోవ/తగరపువలస : మంచి మనసున్న వారు భౌతికంగా దూరమైనా వారి జ్ఞాపకాలు ఈ భూమిపై పదిలంగానే ఉంటాయి. మరణం లేని మారాజులా వెలుగొందుతూనే ఉంటారు. ఆ కోవకే చెందుతారు బోర కనకరాజు. తను చనిపోతూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. విషాదకరమైనప్పటికీ స్ఫూర్తి రగిలించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి మండలం తాటితూరు పంచాయతీ బీసీ కాలనీకి చెందిన బోర కనకరాజు(31) మూడేళ్లు దుబాయ్లో వెల్డర్గా పనిచేశారు. అనంతరం మూడేళ్ల క్రితం స్వస్థలం వచ్చి వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో పనిచేస్తుండగా కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో తోటి కార్మికులు పినాకిల్ ఆస్పత్రిలో చేర్చగా అయిదు రోజుల పాటు చికిత్స పొందిన కనకరాజు బుధవారం బ్రెయిన్డెడ్కు గురయ్యారు. దీంతో అతని అవయవాలను జీవన్ధార ఫౌండేషన్ ద్వారా ఇతరులకు అమర్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. కిడ్నీలలో ఒకటి కేర్ ఆస్పత్రికి, మరొకటి పినాకిల్ ఆస్పత్రికి, కాలేయం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన కళ్లు, ఊపిరితిత్తులు, గుండె పాడవడంతో ఇతరులకు పనికిరాకుండా పోయాయి. తాటితూరులో విషాదం కనకరాజు మృతిలో స్వగ్రామం తాటితూరులో విషాదం నెలకొంది. కనకరాజు అవయవాలు వేరొకరికి మార్చే ప్రక్రియలో భాగంగా అతని శరీరం నుంచి తీసివేసిన తరువాత భౌతికకాయాన్ని స్వగ్రామమైన తాటితూరు తరలించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆస్పత్రిలోనే ఉంచారు. ఇంటి పక్కనే ఉన్న బంధువుల ఇంట గురువారం వివాహం జరుగుతుండడంతో ఆ వివాహాన్ని ఆపలేక... మృతదేహాన్ని తరలించలేక శుక్రవారం వరకు వాయిదా వేసుకున్నారు. మరోవైపు గ్రామంలో గ్రామదేవతల పండుగలు కూడా జరుగుతుండడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతునికి భార్య అనురాధ, ఏడాదిన్నర కుమారుడు వంశీ, తల్లిదండ్రులు మంగరాజు, కొండమ్మ, అక్క, తమ్ముడు ఉన్నారు. -
విమర్శలతో జీతమంతా ఇచ్చేసిన సచిన్
న్యూఢిల్లీ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపీగా తాను అందుకున్న పూర్తి జీతాన్ని, అలవెన్స్లను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కు అందజేశారు. ఇటీవలె సచిన్ రాజ్యసభ ఎంపీ పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా సచిన్ ఎంపీగా అలవెన్స్లతో కలిపి సుమారు రూ. 90 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని పీఎం రీలీఫ్ ఫండ్కు అందజేసినట్లు పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభ హాజరు విషయంలో నటి రేఖతో పాటు సచిన్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచిన్ తన జీతాన్ని పీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. సచిన్ ఆఫీస్ పేర్కొన్న వివరాల ప్రకారం తన రూ.30 కోట్ల ఎంపీ ల్యాడ్స్ను దేశ వ్యాప్తంగా 185 ప్రాజెక్టులకు ఉపయోగించారు. సుమారు రూ.7.5 కోట్లు విద్యా సంబంధిత అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఇక సచిన్ ఆదర్శ్ గ్రామ యోజన కింద రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్లో ఓ గ్రామం ఉండగా మరొకటి మహారాష్ట్రలో ఉంది. -
ఆ డబ్బు నేను ఉంచుకోను!!
‘ఎ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ అనే సినిమాలో రెబెక్కా హాల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఉడీ అలెన్ ఈ సినిమాకు దర్శకుడు. సెప్టెంబర్లో మొదలైన ఈ సినిమా షూట్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ టైమ్లో ‘‘ఈ సినిమాకు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా. ఈ సినిమాకు నాకొచ్చిన రెమ్యునరేషన్లో ఒక్క డాలర్ కూడా నేను ఉంచుకోను’’ అని చెప్పేసి ౖ‘టెమ్ ఈజ్ అప్’ అనే సంస్థకు ఆ డబ్బు డొనేట్ చేసింది రెబెక్కా. రెబెక్కా మాత్రమే కాదు, ఈ సినిమాకు పనిచేసిన స్టార్స్ అంతా జీవితంలో మళ్లీ ఉడీ అలెన్తో పనిచేయమని చెప్పేసి తమ రెమ్యునరేషన్ను టైమ్ ఈజ్ అప్ అనే సంస్థకు డొనేట్ చేశారు. అన్నీ బాగుంటే ‘ఎ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ 2018లో వచ్చే క్రేజీ సినిమాల్లో ఒకటి కావాలి. కానీ అలా కావడం లేదు. కారణం ఉడీ అలెన్. నిజానికి ఉడీ అలెన్ సినిమాలంటే ఆయన వల్లే క్రేజ్ తెచ్చుకుంటాయి. అలాంటిది ఇప్పుడు ఆయన పేరే ఇందుకు నెగటివ్గా మారింది. కారణం అలెన్ కూతురే ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పడం. ఇప్పుడీ ఆరోపణల వల్లే గ్రేటెస్ట్ ఫిల్మ్మేకర్స్లో ఒకరనిపించుకున్న అలెన్ ఒక్కసారే ఇలాంటి స్థాయికి వచ్చి పడిపోయాడు. ఇదే సినిమాకు పనిచేసిన తిమోతి, సెలెనా గొమేజ్ కూడా అలెన్తో మళ్లీ పనిచేయమని చెప్పేశారు. మొత్తం మీద ఇప్పుడు ఈ సినిమా విడుదల వరకూ వెళుతుందా? అన్న ప్రశ్న కూడా వినబడుతోంది. -
మనస్ఫూర్తి మామూళ్లు
దసరా వస్తోందంటే దడ మొదలవుతుంది కొందరికి. ఎందుకంటే దసరా సందర్భంగా చిరుద్యోగి దగ్గర నుంచి కాస్త పైస్థాయి వారి వరకూ మామూళ్లు అడగని వారుండరు. ఆఫీస్ బాయ్స్, పోస్ట్మ్యాన్ లాంటివాళ్లు కాగితం, కలం పట్టుకుని వచ్చి మర్యాదగా మామూలు అడిగితే, కొందరు మాత్రం తమకు కావలసిన మొత్తం సమకూరాలంటే ఎంత ఎవరెవరు ఎంతెంత ఇస్తే సరిపోతుందో అంచనా వేసుకుని కాస్త గట్టిగానే వసూలు చేస్తారు. ఇలా మామూళ్లు అడగటం ఇప్పుడు మామూలు అయిపోయింది కానీ, నిజానికి ఇది ఒక మంచి సంప్రదాయం ఒకప్పటిరోజుల్లో. కేవలం ఉపాధ్యాయవృత్తిలో అంటే అప్పటిలో బతకలేక బడిపంతుళ్లే ఇలా ఇంటింటికీ తిరిగి తమదైన శైలిలో మామూళ్లు అడిగేవారు. అప్పటి రోజుల్లోకెళ్తి చూస్తే... దసరా పండుగకు చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లంబులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో ‘బుక్కా’ రంగు వేసి ఒకళ్లమీద ఒకరు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిటా ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైన ఆచారమిది. ఒక వ్యక్తి స్వీయ అభివృద్ధి గాని కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానంతోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ రోజుల్లో గ్రామంలోని పెద్దలు గ్రామంలోని బడి పదికాలాలపాటు పదిలంగా ఉండడానికి తమకు తోచిన సాయం చేసేవారు. ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్థలాలను బడి పెట్టడానికి నిస్వార్థంగా దానం ఇచ్చేవారు ఎందరో మహానుభావులు. వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞానమూర్తులు బతకడానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు. దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్థులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో ప్రదర్శన చేసేవారు. పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను తమను పోషిస్తున్న దాన మహరాజుల ఎదుట ప్రదర్శించి వారు అడిగే వాటికి నేర్పుతో సమాధానం చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు. ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు. దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశీస్సులు అందిస్తే ముగ్దులైన ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని మనస్పూర్తిగా దసరా కానుకలు అందించేవారు. అంతేకానీ, దౌర్జన్యంగా మామూళ్లు అడిగితే, మనసులో తిట్టుకుంటూ భయం భయంగా ఇస్తే అవి మామూళ్లు కావు... దసరా వసూళ్లవుతాయి -
కర్ణుడి దానగుణం... నిరుపమానం!
ఆత్మీయం కర్ణుడికి దానకర్ణుడని గదా పేరు. ఒకనాడు శ్రీకృష్ణుడు తెలతెలవారుతుండగనే కర్ణుని భవనానికి వెళ్లాడట. అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది. కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాగున్నది నాకిస్తావా? అని అడిగాడు. వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె యిచ్చాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో ఇస్తున్నావు? కుడిచేత్తో ఈయరాదా? అన్నాడు. అందుకు కర్ణుడు కృష్ణా! ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి చంచలమైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరుక్షణంలో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతి నుంచి ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు. అందుకనే ధర్మకార్యాన్ని ఆ క్షణమే చెయ్యాలనే హితోక్తిననుసరించి ఇలా చేశాను. అన్నాడు. దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నతమైనదో అర్థమవుతుంది. దానం విషయంలో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగగానే ఆదరణ భగవదర్పణబుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి. దానం చేసి నేను చేశానని డప్పు కొట్టుకోకూడదు. ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు. మనము కర్ణుడిలాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి. -
దుమ్మురేపుతున్న అమెజాన్ సీఈవో ట్వీట్
లాస్ఏంజిల్స్: తరచూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటే అమెజాన్ బాస్ తాజా ట్విట్తో దుమ్ము రేపుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బీజోస్ తనకు ఐడియాలు కావాలంటూ ట్వీట్ చేశారు. తన సంపాదనను దానం చేయాలనుకుంటున్నాననీ దీనికి సలహాలివ్వాంటూ ఫాలోయర్స్ను ఆహ్వానించారు. కోట్లాది రూపాయాలను విరాళం ఇవ్వాలనుకుంటున్నానని ప్రకటించారు. తాను ఇవ్వబోయే విరాళాన్ని ఖర్చు చేసేందుకు ఐడియాలు కావాలంటూ ఆ ట్వీట్లో కోరారు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే వేల రీట్వీట్లు, 10 వేల లైకులతో ట్విట్టర్ లో సంచలనంగా మారింది. సుమారు 15 వేల రిప్లయ్ల జోరు నడుస్తోంది. బ్లూఓరిజన్, వాషింగ్టన్పోస్ట్, అమెజాన్ సమాజంలో కోసం భారీ విరాళాలిస్తున్నప్పటికీ..తన ఆస్తుల్లో ఎక్కువ శాతం దానం చేయాలనుకుంటున్న జెఫ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన సొమ్ములో ఎక్కువ శాతం దానాలకే వినియోగిస్తానని.. కానీ ఇంకా చేయాలని కోరికగా ఉందన్నారు. అత్యవసరమైన, శాశ్వత ప్రభావాన్ని కలిగించేలా ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నానని దీనికి ఐడియాలు కావాలని చెప్పారు. ఒకవేళ ఇలా ప్రకటించడం తప్పనిపిస్తే.. ఆ విషయాన్ని కూడా నిర్మొహమాటంగా తనకు తెలియజేయాలని కోరారు. కాగా జెఫ్ బేజోస్ మొత్తం ఆస్తివిలువ సుమారు 76 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ బెజోస్ కుటుంబం ఇటీవల భారీ విరాళాన్ని అందించింది. వీరినుంచి 35 మిలియన్ డాలర్లను అందుకున్నట్లు రీసెర్చ సెంటర్ గత నెలలో ప్రకటించింది. 41 సంవత్సరాల తమ సేవల్లో ఇదే అతిపెద్ద సింగిల్ విరాళమని ప్రకటించడం విశేషం. Request for ideas… pic.twitter.com/j6D68mhseL — Jeff Bezos (@JeffBezos) June 15, 2017 -
దానం... ఫలం
దానాలకు వైశాఖమాసం ఎంతో ప్రాశస్త్యమైనదని పురాణోక్తి. సర్వతీర్థాలలోనూ స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్ని దానాల వల్ల వచ్చే పుణ్యఫలం ఒక జలదానం చేస్తే వస్తుందట. వేసవి కాలంలో వచ్చే వైశాఖమాసంలో ఎండనబడి వెళ్లే బాటసారులకోసం, ఒక కుండలో నీళ్లు నింపి అడిగిన వారికి నీరందించటమే జలదానం. ఇలా ఈ మాసంలో జలదానం చేసినవారు విష్ణుసాయుజ్యం పొందుతారని, వారి ఆప్తులు పుణ్యలోకాలను చేరుకుంటారనీ ప్రతీతి. అన్నదానం చేసిన వ్యక్తికి సర్వధర్మాలను ఆచరించిన ఫలితం లభిస్తుంది. వారిని సకలదేవతలూ దీవిస్తారు. ఎండ వేడిమితో బాధపడే వారికి తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్లయితే, పూర్ణ ఆయుర్దాయం పొంది తుదకు మోక్షాన్ని పొందుతారని పురాణోక్తి. ఎండావానలకు పనికివచ్చే ఛత్రం అంటే గొడుగుని దానం చేసినవారికి ఆధిభౌతిక, ఆధి దైవిక దోషాలు, దుఃఖాలు నివారణ అవుతాయి. సుఖనిద్రకు అవసరమైన మంచం, పరుపు, దిండు దానంగా ఇవ్వటం వలన విష్ణుమూర్తి కృపకు పాత్రుడు కాగలడని, ప్రతి జన్మలోనూ ధర్మపరాయణుడిగా సుఖజీవనాన్ని కొనసాగించగలడని పురాణకథనం. మజ్జిగ దానం చేయటం వల్ల మరుసటి జన్మలో విద్యావంతులు, ధనవంతులు అవుతారని పురాణోక్తి.బియ్యాన్ని దానం చేసిన వారికి పూర్ణాయుర్దాయం లభిస్తుందట. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దానం చేస్తే అశ్వమేథ యాగం చేసిన పుణ్యం, విష్ణుసాయుజ్యం లభిస్తాయట. వేసవికాలంలో విరివిగా వచ్చే మామిడిపళ్లను దానంగా ఇచ్చిన వారి పితృదేవతలు ప్రీతిచెందుతారు. దాత, అతని పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పానకం నిండిన కుండని దానంగా ఇవ్వడం వలన నూరుసార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితరులు తరిస్తారు. అలాగే దోసపండు, బెల్లం, చెరకుగడలు దానం చేసినవారి సమస్త పాపాలు తొలగిపోతాయి. చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు ఇంకా నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది. పైన చెప్పినవే కాదు... అవకాశం ఉన్న ఏ వస్తువులను దానం చేసినా మంచిదే. -
సత్యదేవునికి రూ.5 లక్షల విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఆయన ముగ్గురు సోదరులు వారి తల్లి ఈశ్వరమ్మ పేరుమీద గురువారం రూ.ఐదు లక్షల విరాళాన్ని దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావుకు కుటుంబ సభ్యుల ద్వారా అందజేశారు. ఈ మొత్తంలో రూ.లక్ష బొత్స తల్లి పేరు మీద బ్యాంక్లో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో ఏటా కార్తీకపౌర్ణమి నాడు అన్నదానం చేయాలని కోరారు. అలాగే రూ.లక్ష బొత్స సత్యనారాయణ పేరున డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో ఏటా జూలై తొమ్మిదిన అన్నదానం చేయాలని కోరారు. బొత్స సోదరుడు అప్పలనర్సయ్య పేరు మీద డిపాజిట్ చేసిన రూ.లక్షపై వచ్చే వడ్డీతో ఏప్రిల్ 26, మరో సోదరుడు సతీష్ పేరున వేసిన రూ.లక్షకు వచ్చే వడ్డీతో సెప్టెంబర్ 19న, ఇంకో సోదరుడు ఆదినారాయణ పేరున ఉన్న రూ.లక్షపై వచ్చే వడ్డీతో ఏటా నవంబర్ 29న అన్నదానం చేయాలని అధికారులను కోరినట్టు అధికారులు తెలిపారు. -
టీటీడీకి అశోక్ లెలాండ్ విరాళం
-
సహృదయులైన ట్రంప్.. జీతం చారిటీకి
వాషింగ్టన్ : కఠినమైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా సునామి సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహృదయులయ్యారు. తన వార్షిక వేతనాన్నంతటిన్నీ చారిటీకి డొనేట్ చేయబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన వార్షిక అధ్యక్ష జీతం 400,000 డాలర్ల(రూ.2,64,82,000)ను ఈ ఏడాది చివర్లో చారిటీకి విరాళంగా ఇవ్వబోతున్నట్టు అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. సోమవారం ఈ విషయాన్ని స్పైసర్ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో తన వేతనాన్నంతటిన్నీ చారిటీకి ఇవ్వాలనేది అధ్యక్షుడి ఉద్దేశ్యమని స్పైసర్ తెలిపారు. అమెరికన్ ప్రజలకు కూడా ఆయన వాగ్దానం చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు వైట్ హౌస్ నుంచి వెలువడిన ప్రకటనలలో ఇదే అనూహ్య ప్రకటనని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ ట్రంప్ తాను వేతనం తీసుకోబోనని పలుమార్లు తెలిపారు. కేవలం ఒక్క డాలర్ ను మాత్రమే వేతనంగా తీసుకోబోతున్నట్టు తెలిపారు. అంతకముందు కూడా హెర్బర్ట్ హూవేర్, జాన్ ఎఫ్ కెన్నడీలు కూడా తమ ప్రెసిడెన్షియల్ శాలరీలను చారిటీకి డొనేట్ చేశారు. -
కొడుకు కోసం ఓ అమ్మ ఆర్తనాదం
-
వెంకన్న సన్నిధిలో కేసీఆర్
-
మొక్కుతీర్చుకున్న కేసీఆర్
-
మొక్కుతీర్చుకున్న కేసీఆర్
తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుటుంబసభ్యులు, స్పీకర్, మంత్రులతో సహా బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత, అల్లుడు అనీల్, మనువళ్లతో కలసి ఆయన మహాద్వారం గుండా ఆలయం లోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఆలయ కార్యనిర్వాహణాధికారి దొండపాటి సాంబశివరావు, ఆలయ అర్చకులు తెలంగాణ ముఖ్యమంత్రికి దగ్గరుండి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీస్సులు ఇవ్వడంతోపాటు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రూ.5 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణాభరణాలను కేసీఆర్ కానుకగా సమర్పించారు. ఇందులో రూ.3.70 కోట్లతో 14.200 కిలోల స్వర్ణసాలగ్రామ హారం , రూ.1.21 కోట్లతో 4.650 కిలోలతో ఐదు పేటల స్వర్ణకంఠాభరణం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వర్ణాభరణాలు తిరుమల వేంకటేశ్వరస్వామికి కానుకగా సమర్పించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన మొక్కు చెల్లించుకున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు తిరుమలకు సీఎం కేసిఆర్
-
స్పందించిన హృదయం
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రూ.లక్ష సాయం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 11 నెలల నితీష్కి లివర్ ఫ్లాంటేష¯ŒS సర్జరీకి సొమ్ము అవసరమని ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న దాత స్పందించారు. రాజమహేంద్రవరానికి చెందిన జనసేవా సంస్థ వ్యవస్థాపకురాలు గంటా స్వరూపదేవి ఎ¯ŒSఆర్ఐ జనసేన (డల్లాస్) సభ్యులు చిట్టిముత్యాలు, స్వామి అనిశెట్టి, కానా గ్రూపు సభ్యులందరికీ నితీష్ ఆరోగ్య పరిస్థితిని వివరించింది. స్పందించిన వారు రూ.లక్ష చెక్కును ఘంటా స్వరూపదేవికి పంపింపగా సోమవారం ఆమె నివాసంలో నితీష్ తల్లి దుర్గాప్రశాంతికి అందజేశారు. -
25 అంబులెన్సులు దానం
ముంబై: మహారాష్ట్రలో వైద్య సేవల నిమిత్తం మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ తనపెద్ద మనసును చాటుకున్నారు. మహారాష్ట్ర మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను అందించడానికి గాను షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కు 25 అంబులెన్సులను దానంగా ఇవ్వనున్నారు. తన వ్యక్తిగత హోదాలో ఈ సహాయం చేస్తున్నట్టు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. కాగా ట్రస్ట్ ఇటీవల రాష్ట్రంలో సాయి అంబులెన్స్ సేవలను మొదలు పెట్టింది. ఈమేరకురాష్ట్రంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలకు 500 అంబులెన్సులు అందించింది. మారుమూల ప్రాంతాల్లో తక్షణం వైద్య సేవలు అందించడానికి వీలుగా వివిధ సంస్థల నుంచిసిఎస్ఆర్ నిధుల ద్వారా ఒక 'సాయి అంబులెన్స్ పథకం' ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
బిల్ గేట్స్ సంచలన నిర్ణయం
-
ఆయన తలచుకుంటే.. ఇవన్నీ చేయగలరు
బిల్గేట్స్.. ప్రపంచంలోనే అత ్యధిక ధనవంతుడు. ఆయన పుట్టిన రోజు నాడు ప్రపంచంలోని ఒక్కొక్కరికీ రూ. 650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా, విలాసవంతమైన జీవితం గడపగలరట! ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ 80 బిలియన్ డాలర్స్ అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 5,34,600 కోట్లకు పైమాటే. సెకనుకు ఆయన ఆర్జించే సంపాదన రూ. 10 వేల రూపాయలు. అయితే బిల్గేట్స్ తన ఆస్తులతో భారతీయులకు ఏమేం చేయగలరని పలు అంచనాలు వెలువడుతున్నాయి. బిల్గేట్స్ తన ఆస్తులతో బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ. 18-22 లక్షల వరకు ఉంటుంది. 30 లక్షల ఫ్లాట్స్ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగలరట. 0-9 ఏళ్ల మధ్య పిల్లలకు 10 నెలల వరకు క్యాండీస్ను నిరంతరాయంగా తినగలిగేటట్టు చేయగలరట. భారత జనాభా మొత్తానికి ఆహారం, టీ స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట. చండీగఢ్లో నివసించే 10.5 లక్షల ప్రజలకు ఒక్కొక్కరికీ రూ. 6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని గిఫ్ట్గా ఆయన ఇవ్వగలరట. మైక్రోసాఫ్ట్ స్థాపనతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగిన బిల్గేట్స్.. ఇప్పటికే ఎన్నో దానధర్మాలు చేస్తున్నారు. బిల్గేట్స్ తన భార్యతో కలసి ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడో ప్రపంచ దేశాల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి ఉచిత విద్య వంటి వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
శ్రీవారికి పరదాలు సమర్పించిన టైలర్
-
మరణిస్తూ ఆరుగురి జీవితాల్లో వెలుగు
పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ బీటెక్ విద్యార్థి తాను మరణిస్తూ తన అవయవాలు దానం చేసి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. నిమ్స్ జీవన్ దాన్ ప్రతినిధుల కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన విజయ్కుమార్ (20) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 11న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్రగాయాలైన విజయ్కుమార్ను వెంటనే రాయచూర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి 12న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్సపొందుతున్న విజయ్కుమార్ 14న బ్రెయిన్డెడ్ అయినట్టు వైద్యులు నిర్థారించారు. మృతుడి తండ్రి బసవరాజుకు జీవన్ దాన్ ప్రతినిధులు అవయవదానం ఆవశ్యకత వివరించారు. ఆయన ఒప్పుకోవడంతో విజయ్కుమార్ శరీరం నుంచి 2 కిడ్నీలు, 2 కళ్లు, కాలేయం సేకరించి అవసరమైన వారికి అమర్చారు. -
కాలిఫోర్నియా వర్సిటీకి భారీ విరాళం
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారత సంతతికి చెందిన దంపతులు హర్కీరత్, దీపా ధిల్లాన్ లక్ష డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. యూనివర్సిటీలో సిక్కు, పంజాబీ సంస్కృతులను అధ్యయనం చేస్తున్న విద్యార్థుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని యూనివర్సిటీని కోరారు. సిక్కు, పంజాబీ సంస్కృతిపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమెరికాలో సిక్కు సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నవారికి కూడా తాము ప్రోత్సాహకం కల్పిస్తామన్నారు. అంతేకాక హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్సైన్స్ తదితర అంశాల్లో రీసెర్చ్లు చేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవార్డులు కూడా ప్రకటిస్తామన్నారు. -
ఆలయ స్థలం కొనుగోలుకు రూ.లక్ష విరాళం
ధర్మపురి : ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహాస్వామి ఆలయం వెనుక స్థలం కొనుగోలు చేయడానికి ఎల్లాల శ్రీనాథ్రెడ్డి, కవిత దంపతులు రూ.లక్ష విరాళం ప్రకటించారు. పట్టణానికి చెందిన రిటైర్డు సివిల్ సర్జన్ ఎల్లాల రాజరెడ్డి, రమాదేవి కుమారుడు ఎల్లాల శ్రీనాథ్రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. నృసింహుని ఆలయం వెనుకభాగంలోని ఖాళీ స్థలాన్ని కొనుగోలుకు ఆలయ అధికారులు నిర్ణయించగా.. శ్రీనాథ్రెడ్డి దంపతులు మాజీ జెడ్పీటీసీ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి ద్వారా రూ.లక్షను ఆలయ వో సుప్రియకు అందించారు. -
అవయవదానంపై అపోహలు వద్దు..
ప్రముఖ మార్పిడి ఆపరేషన్ నిపుణుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గుంటూరు మెడికల్ : వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాడీ అండ్ ఆర్గాన్ డోనార్స్ అసోసియేషన్ గుంటూరు యూనిట్, గుంటూరు జీజీహెచ్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు జరిగింది. తొలుత గుంటూరు వైద్య కళాశాల నుంచి జీజీహెచ్ వరకు అవయవదానంపై అవగాహన ర్యాలీ జరిగింది. అనంతరం ఆస్పత్రిలోని శుశ్రుతా హాలులో జరిగిన సదస్సులో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గుండె మార్పిడి ఆపరేషన్ నిపుణుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను ఘనంగా సన్మానించారు. అనంతరం గోఖలే మాట్లాడుతూ ప్రజల్లో నేటికీ అవయవదానంపై చాలా అపోహలు ఉన్నాయని, వాటిని విడనాడి అవయవదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అవయవదానంతో మరణానికి చేరువలో ఉన్న చాలా మందిని రక్షించవచ్చన్నారు. గుంటూరు వైద్య కళాశాల వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ మెండా ఫర్నికుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రమణ యశస్వి, లంకపల్లి శ్రీనివాస్, టి.శ్రీనివాస్, కొండా శివరామిరెడ్డి, మంగాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రూ.10 లక్షల విరాళం
గుంతకల్లు రూరల్ : నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానానికి బెంగుళూరు కుచెందిన తిలక్ కుమార్ అనే వ్యాపారి రూ.10 లక్షల విరాళం అందజేశారు. కుటుంబ సమేతంగా ఆదివారం ఆలయానికి విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధ్వర్యంలో దాదాపు రూ.2.5 కోట్లతో వెండి రథం నిర్మాణానికి ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తిలక్ కుమార్ తన వంతు విరాళంగా రూ.10 లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. -
ఐదుగురి జీవితాల్లో వెలుగునిచ్చిన మహిళ
పంజగుట్ట: రోడ్డు ప్రమాదానికి గురైన ఓ గృహిణి తాను మరణిస్తూ అవయవాలు దానం చేసి మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిది. నిమ్స్ జీవన్దాన్ ప్రతినిధులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన మంజుల (43) మంజుల ఈ నెల 27న నగరంలో ఉంటున్న తన సోదరుని ఇంటికి వచ్చింది. మలక్పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మలక్పేట గంజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మంజులను మలక్పేట యశోదా ఆసుపత్రికి తరలించగా శుక్రవారం బ్రెయిన్డెడ్ అయినట్లు నిర్ధారించారు. మంజుల భర్త యాదయ్య, కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన చేయడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో మంజులకు శస్త్రచికిత్స నిర్వహించి కిడ్నీలు, కాలేయం, కళ్లు తొలగించి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అవసరమైన వారికి అమర్చారు. -
అల్లివలసకు తాగునీటి మోటారు అందించిన జెడ్పీటీసీ
రణస్థలం: గ్రామాలకు కనీసం తాగునీరు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్, జెడ్పీటీసీ సభ్యులు గొర్లె రాజగోపాల్లు తెలిపారు. అల్లివలస గ్రామంలో తాగునీటి సమస్యపై ఈ నెల 17న సాక్షిలో ‘గొంతెండుతోంది’ అన్న శీర్షికన కథనం వెలువడింది. దీనికి స్పందించిన జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్ మంగళవారం అల్లివలసకు తన సొంత డబ్బుతో తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో బాధ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కిరణ్, రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశంలో ప్రస్తావించినా లాభం లేకపోయిందని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకున్నా వైఎస్ఆర్ సీపీ ప్రజలకు అండగా ఉంటోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్, వి.ఎల్లయ్య, సోరాడ కోర్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
'హరితహారం'కు నెల వేతనం విరాళంగా ఇచ్చిన కేటీఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో హరిత హారానికి రూ. 10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం మున్సిపాలిటీల్లో హరితహారం అమలుపై కేటీఆర్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఉన్నతాధికారులలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. హరితహారం కార్యక్రమానికి నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. -
విరాట్ కోహ్లి దాతృత్వం!
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అధ్భుత ఫామ్ తో దూసుకుపోతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ తన లోని మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇటీవల పుణెలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డాక్టర్ అపర్ణా దేశ్ ముఖ్ వృద్దాశ్రమాన్ని సందర్శించిన విరాట్ తన మ్యాచ్ ఒక రోజు సంపాదనలో 50 శాతం విరాళంగా ఇచ్చాడనీ, అంతే కాకుండా విరాట్ కోహ్లి ఫౌండేషన్ ద్వారా ఈ యేడాది చివరికల్లా అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ కూడా ఇచ్చాడని ఒక పత్రిక పేర్కొంది. నిరుపేద విద్యార్థులకు చేయూతనందించడం కోసం శుక్రవారం స్లైలు ఫౌండేషన్ నిర్వహించిన చారిటీ కార్యక్రమానికి విరాట్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇలా విరాట్ సమాజంలోని సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ తన వంతు సహాయం చేస్తుండడం అభినందనీయం. -
తల్లి కళ్లు దానమిచ్చిన జడ్జి
సాక్షి, హైదరాబాద్: అంధుల కోసం కఠినమైన చట్టాలను బ్రెయిలీ(తెలుగు) లిపిలోకి అనువదించడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ న్యాయసేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎ.వెంకటేశ్వర్రెడ్డి...తన మాతృమూర్తి కళ్లను దానం చేశారు. ఆయన తల్లి అనసూయమ్మ(82) ఇటీవల మహబూబ్నగర్లో మృతి చెందారు. మరణానంతరం కళ్లను దానం చేయడానికి బతికుండగా ఆమె అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో...కళ్లను తీసుకెళ్లాల్సిందిగా ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య సంస్థకు సమాచారం ఇవ్వడంతో వారు కళ్లను తీసుకెళ్లారు. -
మోదీ సూట్ యజమాని దాతృత్వం
ఆగ్రా: సూరత్ వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్ లైన్ యజమాని లాల్జీభాయ్ పటేల్ పేరు వినే ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూట్ను వేలం వేయగా లాల్జీ భాయ్ 4 కోట్ల 31 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సూట్పై 'నరేంద్ర దామోదర్దాస్ మోదీ' పేరు కనిపించేలా తయారు చేయడం దీని ప్రత్యేకత. కుబేరుడైన లాల్జీభాయ్ పటేల్ సాయం చేయడంలోనూ ఆయనది పెద్ద మనసు. దేశ వ్యాప్తంగా పేద అమ్మాయిలకు వివాహాలు చేయడం కోసం 200 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 10 వేలమంది బాలికల తల్లిదండ్రులను ఎంపిక చేసి, అమ్మాయిల వివాహాల కోసం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు లాల్జీభాయ్ చెప్పారు. వచ్చే మార్చి 13న సూరత్లో ఈ పథకం ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాధ్వి రీతంబరను స్ఫూర్తిగా తీసుకుని పేద పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమం 'బేటీ బచావో, బేటీ పదావో'లో భాగంగా తన వంతు సాయం చేస్తున్నట్టు తెలిపారు. లాల్జీభాయ్ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎంతోమందికి సాయపడ్డారు. గతేడాది పేద ఆడపిల్లల కోసం ఓ పథకం ప్రవేశపెట్టారు. గుజరాత్లో పటేదార్ సామాజిక వర్గంలో జన్మించిన 5 వేల మంది బాలికలకు ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల విలువైన బాండ్లు కానుకగా ఇచ్చారు. ఈ బాలికలు 21 ఏళ్ల వయసుకు వచ్చాక 2 లక్షల రూపాయలు తీసుకుంటారు. -
బాధితులకు 'బుడత 'సాయం
చెన్నై: ప్రకృతి విలయం నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న చెన్నైవాసులకు కొంతమంది విద్యార్థులు అందించిన బుడత సాయం అందరినీ ఆకట్టుకుంటోంది. దేశం నలుమూలల నుంచి సాయం అందుతున్న భారీ సహాయం ఒక ఎత్తయితే, పెద్ద మనసుతో వీరు అందించిన సాయం మరో ఎత్తు. ఇంతకీ బాధితులకు వారు పంచిపెట్టిన వస్తువులు ఏంటో తెలుసా.. 80 టవల్స్, 2,800 రూపాయలు. అయితేనేం ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు చూపించిన ఔదార్యం ప్రశంసలందుకుంటోంది. తొమ్మిది, పదేళ్ల వయసున్న వీరంతా 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం. -
వారికోసం సల్లూభాయ్!
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు, హీరో సల్మాన్ ఖాన్ రైతులను ఆదుకునేందుకు పెద్ద మనసు చేసుకున్నారట. రికార్డు వసూళ్లతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న బజరంగీ భాయిజాన్ సినిమా లాభాల్లో కొంత భాగాన్ని ఆయన అన్నదాతలకు పంచనున్నారట. రీల్ లైఫ్లో పాప కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన హీరో ఇపుడు రియల్ లైఫ్ లో రైతన్నను ఆదుకోవడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకురాలు షైనా ఈ విషయాలను వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలను ఆదుకునేందుకు సల్మాన్ఖాన్, నిర్మాత రాక్లైన్ వెంకటేష్ ముందుకు వచ్చారని ఆమె తెలిపారు. అపార నష్టాలతో మనస్తాపానికై గురై రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటున్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ చొరవ చూపడం మంచి పరిణామమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోతున్న రైతులకు ఆపన్నహస్తం ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ లాభాల్లో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయాన్ని సల్లుభాయ్ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా విడుదలైన అయిదు రోజుల్లోనే బజరంగి భాయిజాన్ సుమారు రూ. 150 కోట్లకు పైగా బిజినెస్ సాధించింది. జూలై 17న ప్రేక్షకుల ముందుకొచ్చి ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రాక్లైన్ వెంకటేష్ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కరీనా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తున్న ఈ చిత్రం వారాంతానికి రూ.200 కోట్ల వసూళ్లను దాటొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. -
దుబారా వేడుకలు వద్దనీ.. సేవే ముద్దని..!
-
హుదూద్ బాధితులకు కువాయిత్ వైఎస్సార్సీపీ విరాళం రూ. 4.7 లక్షలు
హైదరాబాద్ : హుద్హుద్ తుపాను బాధితుల సహాయార్థం కువాయిత్లోని వైఎస్సార్సీపీ (గల్ఫ్) విభాగం తరపున రు.4.7 లక్షల రూపాయల విరాళాన్ని వైఎస్సార్ ఫౌండేషన్కు ఇచ్చారు. శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గల్ఫ్ విభాగం కోఆర్డినేటర్ బిహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో పలువురు కువాయిత్ ప్రవాసులు కలుసుకుని ఈ మేరకు ఒక చెక్కును అంద జేశారు. కువాయిత్లోని తెలుగువారు, సాటి తెలుగువారి భాధల్లో పాలుపంచుకునేందుకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారని ఇలియాస్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రవాసుల వితరణకు జగన్ అభినందించారు. జగన్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, కడప ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్బాష, మేయర్ కె.సురేష్బాబు, కువాయిత్ ప్రవాసులు జి.ఎస్.బాబురాయుడు, ఎస్.గయాజ్బాష, ఎస్.నాసర్, బాబు పాల్గొన్నారు. దాతలు షేక్ హుస్సేన్, వై.లలితరాజ్, ఎం.వెంకటసుబ్బారెడ్డి (దాసరి సంక్షేమ సంఘం), ఫ్లవర్స్ షాప్ కె.షఫీ, పహాహెల్ ముక్తబ్, వైఎస్సార్సీపీ కువాయిత్ కమిటీ సభ్యులు విరాళాల సేకరణకు సహాయసహాకారాలు అందజేశారని ఇలియాస్ కృతజ్ఞతలు తెలిపారు. -
చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం అందజేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కార్యాలయంలో సమంత కలిశారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు సమంత 10 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. సీఎం వ్యక్తిగత ప్రవేశమార్గం ద్వారా వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది సమంతను అనుమతించడం విశేషం. పలువురు టాలీవుడ్ నటులు తుపాను బాధితులకు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ముదురుతున్న ఎర్రబుగ్గ వివాదం
సాక్షి, ముంబై: స్నేహల్ ఆంబేకర్ ముంబై మేయర్గా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులైనా కాలేదు కానీ వివాదాలు మాత్రం ఆమెను ముసురుకుంటున్నాయి. తన కారుపై ఎర్ర బుగ్గ (బీకన్) తొలగించకుండా అలాగే ఉంచాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. మేయర్ వాహనానికి ఎర్రబుగ్గ అమర్చడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కోర్టును ఆశ్రయిస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. దీంతో స్నేహల్ కొత్త వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు మినహా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవుల్లో ఉన్న వారు ఎర్రబుగ్గ వాహనాలను వినియోగించకూడదు. ఇది మేయర్ కూడా వర్తిస్తుంది. అంబేకర్ మాత్రం తన వాహనంపై కచ్చితంగా ఎర్రబుగ్గ ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో ఈ వివాదం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించడమంటే న్యాయస్థానాన్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఒకవేళ ఆమె తన వాహనంపై ఎర్రబుగ్గ అమర్చుకుంటే, తప్పకుండా కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని విపక్ష నాయకులు హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేయర్లంతా తమ వాహనాలపై ఎర్రబుగ్గ తొలగించుకోవాల్సిందేనని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు మేయర్గా పనిచేసిన సునీల్ ప్రభు మాత్రం ఎర్రబుగ్గను యథావిధిగా కొనసాగించారు. కొత్త మేయర్ స్నేహల్ ఆంబేకర్ కూడా దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీవీఐపీలు మాత్రమే ఎర్రబుగ్గలను వాహనాలకు అమర్చుకోవాలి. అంతగా అవసరమనుకుంటే అంబేకర్ పసుపు రంగు బుగ్గ అమర్చుకోవాలి. వీఐపీలకు కేటాయించిన ఎర్రబుగ్గను మేయర్ అమర్చుకోవడం సరికాదు’ అని దేవేంద్ర స్పష్టం చేశారు. దీనిపై స్నేహల్ ఆంబేకర్ వివరణ ఇస్తూ కారుపై ఎర్రబుగ్గ అమర్చుకోవడంపై తనకు పెద్దగా ఆసక్తి లేదన్నారు. ఇతరుల మాదిరిగా తను గొప్పలకు పోవడం లేదని చెప్పారు. ‘దేశ, విదేశాల నుంచి ముంైబె కి వచ్చే వీఐపీలకు స్వాగతం పలకాల్సిన బాధ్యత మేయర్ది. ఇలాంటి సందర్భాల్లో వాహనంపై ఎర్రబుగ్గ ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది. దీనిపై సీనియర్ నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాను’ అని ఆమె స్పష్టం చేశారు. అంబేకర్ మేయర్గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిరోజు బాధ్యతలేంటో అడిగి తెలుసుకోకుండా తన చాంబర్ అలంకరణపై దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. తన క్యాబిన్ను ఎలా అలంకరించాలో కిందిస్థాయి అధికారులకు సూచనలిస్తూ ఆమె చాలా సేపు గడిపారు. ఉద్యోగులతో పరిచయాలు అయ్యాక, కొన్ని పత్రాలపై సంతకాలుచేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు ఆదరాబాదరగా వెళ్లిపోయారు. -
NRI వైద్యుడు ప్రేమ్సాగర్ లక్ష డాలర్ల విరాళం