తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వర్ణాభరణాలు సమర్పిస్తానని ఉద్యమ సమయంలో తిరుమలకు వచ్చిన సందర్భంగా కేసీఆర్ మొక్కుకున్నారు. తాజాగా ఆ మొక్కు తీర్చేందుకు మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న కేసీఆర్.. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, మంత్రులతో కలసి కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు.