Published
Wed, Aug 17 2016 12:25 AM
| Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
ఆలయంలో బంగారు రంగు కూర్మము ప్రత్యక్షం
కనగల్ : మండలంలోని శేరిలింగోటం చెరువు కట్టపై ఉన్న శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలోకి మంగళవారం బంగారు రంగుతో ఉన్న తాబేలు వచ్చింది. పక్కనే చెరువు ఉన్నందున అందులోంచి తాబేలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కూర్మానికి స్థానికులు కుంకుమ చల్లి పూజలు చేశారు. విష్ణుమూర్తి దశావతారాల్లో కూర్మావతారం ఒకటైనందున ఆలయంలో తాబేలు ప్రత్యక్షం కావడంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోషమల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.