పోలీసు అమరవీరులకు గవర్నర్ నివాళి | Governor Narasimhan pays tribute to martyrs on Police Commemoration Day | Sakshi
Sakshi News home page

పోలీసు అమరవీరులకు గవర్నర్ నివాళి

Published Fri, Oct 21 2016 8:27 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

పోలీసు అమరవీరులకు గవర్నర్ నివాళి - Sakshi

పోలీసు అమరవీరులకు గవర్నర్ నివాళి

విజయవాడ : పోలీస్ అమరవీరులకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. విజయవాడలోని ఇందిరా స్టేడియంలో శుక్రవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు ...ఏపీ పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రాణలు సైతం లెక్కచేయకుండా పోలీసులు కష్టపడుతున్నారన్నారు. కాగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement