Police Commemoration Day
-
పోలీస్ అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరపున నిర్వహించాం. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను’’ అంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవలసిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది. నేర నిరోధం, నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది’’ అని సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరపున నిర్వహించాం. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట… pic.twitter.com/rEuY4guin4 — YS Jagan Mohan Reddy (@ysjagan) October 21, 2023 -
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు చెక్కులు
-
పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పోలీస్ సంస్మరణ సభలో సీఎం వైఎస్ జగన్ స్పీచ్
-
పోలీసు సంస్మరణ దినోత్సవంలో ఏపీ డీజీపీ స్పీచ్
-
అమరవీరులకు నివాళులు అర్పించిన మంత్రి తానేటి వనిత
-
పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
-
విజయవాడలో నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
-
విజయవాడ : ఆయుధం.. అదరహో (ఫొటోలు)
-
Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్లైన్ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్ షా 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన...ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ‘చాలా దేశాల్లో ఇంటర్పోల్ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్పోల్ శాశ్వత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్పోల్తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైశ్వాల్ అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుముఖం దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హాట్స్పాట్లుగా పేరున్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అశాంతికి నెలవైన ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నేడు 70% వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్లోనూ భద్రతాపరంగా ఇదే రకమైన పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
మహిళల భద్రతకోసం సీఎం జగన్ ప్రత్యేక చర్యలు
-
పోలీసు అమరవీరులకు వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున సెల్యూట్ : సీఎం జగన్
-
మనందరి సైనికుడు పోలీస్: సీఎం జగన్
మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి ఫలాలు ఇవాళ గ్రామ గ్రామాన ఇంటింటికీ చేరుతున్నాయి. దీని వల్ల గతంలో మావోయిజం, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అందరి మనసులు గెల్చుకుని, అండగా నిలబడ్డాం. తద్వారా శాంతిని, భద్రతను పెంచుకోగలిగాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతిభద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలను సైతం లెక్కచేయని మనందరి సైనికుడే పోలీసు సోదరుడు. శాంతిభద్రతలను కాపాడటంలో భాగంగా తనువు చాలించిన ప్రాణ త్యాగధనులకు సెల్యూట్ చేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ పవిత్రమైన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పోలీసు అమర వీరుల స్థూపానికి నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధి నిర్వహణలో పోలీసులు అనుకోని సంఘటనలు ఎన్నింటినో ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారికి సమాజం, ప్రభుత్వం తరఫున మనమంతా అండగా ఉండాలని, ఉంటామని స్పష్టం చేశారు. కర్తవ్యాన్ని దైవంగా భావించి 1959 అక్టోబర్ 21న చైనా సైనికులతో సాహసోపేత పోరాటంలో ప్రాణాలర్పించిన కరణ్సింగ్ స్ఫూర్తితో పోలీసు అమరవీరుల సంస్మరణ దినానికి 63 ఏళ్ల క్రితం నాంది పలికారన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల్ని స్మరించుకుని, వారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అమర వీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున, ప్రభుత్వం తరఫున సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. సంవత్సర కాలంలో దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో దాదాపు 261 మంది పోలీసులు అమరులయ్యారని, ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారని చెప్పారు. వీరిలో ముగ్గురు పోలీసులు కోవిడ్ సమయంలో చనిపోయారని తెలిపారు. వీరందరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ పోలీసులకు సంబంధించి ఇంకా చేయాల్సినవి.. పెండింగ్లో ఉన్నాయని తెలుసు. వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలన్నది నా మనసులో మాట. ఈ మధ్య కాలంలో వీక్లీ ఆఫ్ అమలవుతోందా? అని డీజీపీని అడిగాను. సిబ్బంది కొరత వల్ల అనుకున్న స్థాయిలో దాన్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. వెంటనే 6,511 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేశాం. పోలీసు శాఖ కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వంగా, వారి బాగోగుల మీద శ్రద్ధ పెట్టే ప్రభుత్వంగా శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి, పని ఒత్తిడి తగ్గించడానికి భారీ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేశాం. ఈ స్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ జరగలేదు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 2,700 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. మన ప్రభుత్వం చేపట్టిన కొత్త పోస్టుల భర్తీలో భాగంగా చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐఆర్ బెటాలియన్ దళాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పోలీసు శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవ వేతనం కూడా మన హయాంలోనే పెంచాం. పోలీసు ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఇదే పోలీసు శాఖలో 16 వేల మంది చెల్లెమ్మలను మహిళా పోలీసులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే నియమించాం. పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రతి జిల్లాలో చేపట్టిన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో దాదాపు 1.33 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. దాదాపు 1.17 కోట్ల అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. ఆపదలో ఉన్నామని 23,039 మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్ ద్వారా సమాచారమిస్తే పోలీస్ అన్నదమ్ములు వెంటనే వెళ్లి వారికి తోడుగా నిలబడ్డారు. 2,323 కేసులు పెట్టారు. 1,237 రెస్క్యూ ఆపరేషన్లు చేసి ఆపద జరగకముందే అక్కచెల్లెమ్మలను రక్షించారు. ఇలాంటి పరిస్థితులను రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూస్తున్నాం. దిశ యాప్ ద్వారా పోలీసు సోదరుడు తనకు తోడుగా ఉన్నాడన్న భరోసా అక్కచెల్లెమ్మలకు కల్పించగలిగాం. మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాల భద్రతే లక్ష్యం శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు, పిల్లలు, అణగారిన సామాజిక వర్గాల భద్రత మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ విషయంలో రాజీ పడొద్దని పోలీసు సోదరులందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక దళిత మహిళ వనితమ్మ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఉన్న సుచరితమ్మ కూడా దళిత మహిళే. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, అణగారిన వర్గాలకు ఎంతగా తోడుగా నిలిచిందో.. భవిష్యత్తులోనూ నిలవబోతోందని చెప్పడం కోసమే ఈ విషయం చెబుతున్నా. పోలీసులకు వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఈ ఏడాది నుంచి పోలీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డును అందించనున్నాం. ఆపదలో ఉన్న వారికి, నేరం సంభవించక మునుపే నిమిషాల్లోనే అక్కడకి చేరుకుని రక్షించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి ఈ అవార్డు ఇవ్వబోతున్నాం. మూడేళ్లలో మెరుగుపడిన పోలీసుల పనితీరు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు గత మూడేళ్లలో మెరుగు పడింది. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.. మహిళలపై నేరాలకు సంబంధించి విచారణకు పట్టే సమయాన్ని గత ప్రభుత్వంలో కంటే గణనీయంగా తగ్గించగలిగాం. 2017లో 160 రోజులు పడితే.. 2018లో 164 రోజులు పట్టింది. మన ప్రభుత్వం వచ్చాక 2021లో అది 79 రోజులకు తగ్గింది. ఈ ఏడాదికి 42 రోజులకే తగ్గించగలిగాం. తద్వారా దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు ఇవాళ రాష్ట్రంలో కన్పిస్తోంది. దీంతో పాటు గొప్ప జవాబుదారీతనం కూడా కన్పిస్తోంది. మన పోలీసులు తీసుకొచ్చిన మార్పు ఇది. మనం తీసుకున్న అనేక చర్యలతో ప్రజల్లో చైతన్యం (అవేర్నెస్ క్రియేట్) పెంచగలించాం. టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చి.. నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాం. ఫిర్యాదుదారుడికి తోడుగా నిలుస్తున్నాం కాబట్టే ఫిర్యాదులు పెరిగి.. నేరాలు తగ్గుముఖం పట్టాయి. కష్ట సమయంలో గుర్తొచ్చే స్నేహితుడు పోలీస్ కష్ట సమయంలో మొదట గుర్తొచ్చే స్నేహితుడు పోలీస్. పోలీస్ సిబ్బంది పగలనక, రాత్రనక విధులు నిర్వర్తిస్తున్నారు. అటువంటి గొప్ప బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య తగ్గింది. ఆయా ప్రాంతాల్లో యువత ఎక్కువగా జనజీవన స్రవంతిలో కలిసి అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే.. అందులో పోలీసుల కృషి మరువలేనిది. ఏదైనా ప్రమాదం, ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలను అందించడంలోనూ పోలీసులు అంకిత భావంతో పని చేస్తున్నారు. – తానేటి వనిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం మరువలేనిది రాష్ట్రంలో పోలీసులు గురుతర బాధ్యతలను నిర్వర్తించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయసహకారాలు, ప్రోత్సాహం మరువలేనివి. మతతత్వం, ఉగ్రవాదం, అసాంఘిక కార్యక్రమాలు, చాందసవాదం వంటి అనేక సమస్యలతో పోలీసులు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసేలా సీఎం.. టెక్నాలజీని సమకూర్చారు. మన సైబర్ డేటా సెంటర్ను దేశం లోని అన్ని రాష్ట్రాలకు అనుసంధానిస్తూ పాస్వర్డ్ను అన్ని జిల్లాలకు అందజేశాం. తద్వారా ఎక్కడైనా ఆన్లైన్ మోసాలు జరిగితే నేరగాళ్లను సులువుగా గుర్తించడానికి వీలుంటుంది. సైబర్ కేసులను డీల్ చేయడానికి అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నాం. నాటుసారా నుంచి 80% గ్రామాలకు విముక్తి కల్పించాం. విశాఖ–ఒడిశా సరిహద్దుల్లో 7,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశాం. ప్రభుత్వ సహకారంతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. – రాజేంద్రనాథ్రెడ్డి, డీజీపీ ‘అమరులు వారు’ పుస్తకం ఆవిష్కరణ ‘అమరులు వారు‘ అనే పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్, ఆర్టీసీ వీసీ, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దేశంలోనే రాష్ట్ర పోలీస్ భేష్: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఘననివాళులు అర్పించారు. గురువారం గోషామహల్లో నిర్వహించిన ప్లాగ్ డే కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్రెడ్డితోపాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబ సభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న పటిష్టమైన పోలీసింగ్ వల్లనే మెరుగైన శాంతి భద్రతలున్నాయని, భద్రతలో పోలీస్ శాఖ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే మన రాష్ట్రంలో క్రైమ్ రేటు అతి తక్కువగా ఉందని వివరించారు. కరోనా కారణంగా విధినిర్వహణలో రాష్ట్రంలో మొత్తం 62 మంది పోలీసులు మరణించారని, వీరి కుటుంబాలకు అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి మహమూద్ ప్రాణత్యాగానికి వెనుకాడం... అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరన్న విషయాన్ని అమరులైన పోలీసులు సమాజానికి గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా శాంతి భద్రతలను కాపాడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8.25 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
సలాం... పోలీస్
-
వారి రక్షణే మా ప్రాధాన్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేరం చేసిన ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. సంఘ విద్రోహులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించొద్దని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశమంతా పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు. కోవిడ్ సమయంలో పోలీసులు అమూల్యమైన సేవలు అందించారు. రాష్ట్ర హోంమంత్రిగా మహిళను నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్స్టేషన్లను తీసుకొచ్చాం. దిశా బిల్లును కేంద్రాని కూడా పంపించాం. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తాం. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తాం. పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తాం’అని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి: పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళి) అంతకుముందు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ‘అనేక మంది పోలీసులు వీరమరణం పొందారు. పోలీసులందరికీ వారు ఆదర్శంగా నిలిచారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారు. కరోనాతో మృతిచెందిన పోలీసులకు సీఎం రూ.50లక్షలు ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్, హోంగార్డుల జీతాల పెంపులాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. దిశా లాంటి చట్టాలు తెచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాం. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. సవాళ్లు ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని డీజీపీ అన్నారు. వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పించామని తెలిపారు. పోలీస్ సేవా యాప్ కూడా తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు. -
తీవ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించవద్దు: సీఎం వైఎస్ జగన్
-
పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం జగన్
-
మెరుగైన సమాజానికి కృషి చేయండి
-
పోలీసు అమరవీరులకు సెల్యూట్: సీఎం జగన్
సాక్షి, విజయవాడ : పేదవారు సైతం వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగినపుడే పోలీసు వ్యవస్థ మీద గౌరవం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నా అని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించి... ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణకై చైనా సైన్యం దాడిలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన పోలీసు అధికారి కరణ్సింగ్ సహా పదిమంది సీఆర్పీఎఫ్ సిబ్బంది త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. అలాంటి అమరవీరులు అందరికీ ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నా అన్నారు. ఇక మెరుగైన పోలీసు వ్యవస్థ కోసం ప్రతీ పోలీసు సోదరసోదరీమణులు నిరంతరం కృషి చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటివారికైనా మినహాయింపు ఉండకూడదు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఎంతవారినైన చట్టం ముందు నిలబెట్టమని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశంలోనే చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఉండకూడదు. చట్టం అనేది అందరికి ఒకటే.. అది కొందరికి చుట్టం కాకూడదు. పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. తొలి రాష్ట్రం మనదే.. సీఎం జగన్ తన ప్రసంగం కొనసాగిస్తూ.. ‘పోలీసులు సెలవులు లేకుండా కష్టపడుతున్నారని నాకు తెలుసు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించాం. అలా చేసిన తొలి రాష్ట్రం మనదే. వారంలో ఒకరోజు పోలీసులు తమ కుటుంబంతో గడిపితే మానసికంగా బలంగా ఉంటారు. లంచగొండితనం, అవినీతి, రౌడీయిజంపై నిజాయితీగా మీరు యుద్ధం చేయాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డుల జీతాలను రూ. 18 వేల నుంచి రూ. 21 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. హోంగార్డులు మరణిస్తే రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన తొలి రాష్ట్రం కూడా మనదేనని గర్వంగా చెబుతున్నా. విధి నిర్వహణలో హోంగార్డులు మరణిస్తే రూ. 30 లక్షలు, పోలీసులు మరణిస్తే 40 లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజ్ సదుపాయాన్ని తీసుకొచ్చాం. రిటైర్డు సిబ్బందికి కూడా బీమా వర్తిస్తుంది. ఇందుకుగానూ కృషి చేసిన హోం మంత్రి, డీజీపీ సవాంగ్కు అభినందనలు’ అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం పోలీసులు కృషి చేయాలని.. అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కన్నీళ్లు వస్తున్నాయి: హోం మంత్రి సుచరిత పోలీసులు త్యాగానికి నిలువుటద్దం అని.. వారి త్యాగాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించే హోం మంత్రిగా తనకు సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగాలు కల్పించి పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బాలికలు, మహిళ సంరక్షణ కోసం మహిళ మిత్ర ఏర్పాటు చేశామని వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేను పబ్లిక్ సర్వెంట్ని: డీజీపీ సవాంగ్
అమరావతి : ‘పోలీసులపై రాజకీయ నాయకులు చేసే స్టేట్మెంట్లు పట్టించుకోనవసరం లేదు. నేను పబ్లిక్ సర్వెంట్ని, నన్ను కలవడానికి వచ్చిన వారిని తప్పకుండా కలుస్తాను. దురదృష్టవశాత్తు మీటింగ్ల వల్ల ఏదో ఒకరోజు కార్యాలయంలో అందుబాటులో లేకపోతే.. దానికే డీజీపీ అందుబాటులో ఉండరు అంటే ఎలా’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జపుకుంటున్నాం. అమరలైన పోలీసుల త్యాగాలు మరువలేనివి. గత వారం రోజులుగా పోలీసుల సేవలు తెలియపరిచేలా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించాం. 2511 పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన 1,81,315 మంది విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. రహదారి భద్రత, సిటిజన్ సెంటర్ సర్వీస్, డ్రోన్స్, టెక్నాలజీ పోలిసింగ్, డయల్ 100, క్లూస్ టీమ్స్, ఆయుదాల వంటి వాటి గురించి తెలియజేశాం. పోలీసుఅమరవిరుల స్మరణదినం సందర్బంగా 10,513 మంది పోలీసులు, ప్రజలు రక్తదానం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పోలీసులకు కల్పించిన వీక్లీ ఆఫ్ల వల్ల 62,000 కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. పోలీసుల వీక్లీ ఆఫ్లకు సంబంధించి ఒక యాప్ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. పోలీసు కుటుంబాల ఆరోగ్యం కోసం ఆరోగ్య భద్రత స్కీమ్ బాగా ఉపయోగపడుతోంది. పోలీసులు విధి నిర్వహణలో మరణిస్తే దాదాపు 40 లక్షల ఇన్స్యూరెన్స్ అందిస్తున్నాం. దేశంలోనే మొదటిసారి ఇంత పెద్ద మొత్తం ఏపీలోనే అందిస్తున్నాం. హోంగార్డ్స్కు రోజూవారీ వేతనం రూ.600 నుంచి రూ.710 వరుకు పెంచాం.1 5,000 మంది హోంగార్డులకు ప్రయోజనం చేకూర్చేలా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ప్రారంభించిన స్పందన కార్యక్రమం బాగుంది. స్పందనలో మహిళలే ఎక్కువ మంది ఫిర్యాదులు చేయగలుగుతున్నారు. ఇప్పటి వరకు 14 స్పందన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో 37,773 ఫిర్యాదులు వస్తే 31,119 ఫిర్యాదులను పరిష్కరించాం. ఈ సందర్భంగా జర్నలిస్టులపైన జరుగుతున్న దాడులను ప్రస్తావించగా.. యూనియన్ నేతలు కలిశారని, జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని' హెచ్చరించారు. -
ఓపెన్ హౌజ్ను ప్రారంభింంచిన మంత్రి కొడాలి నాని
సాక్షి, గుడివాడ: పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం గుడివాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌజ్ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలను గురించి ఓపెన్ హౌజ్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడమనేది మంచి కార్యక్రమమని ఆయన అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో పోలీసు శాఖపై ఉన్న అపోహలు తొలగి పోలీసుశాఖ మీద ప్రజలకు గౌరవం పెరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో గుడివాడ పోలీసులు.. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించటం సంతోషకరంగా ఉందన్నారు. వారోత్సవాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. పోలీసులు సమాజాన్ని కాపాడుతూ శాంతి భద్రతలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటారనీ, ఈ క్రమంలో సంఘ విద్రోహకక శక్తుల చేతుల్లో అనేక మంది పోలీసులు అమరులు అవుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరపుకొని అమరులైన పోలీసు సిబ్బందిని గుర్తు చేసుకోవడమే నిజమైన నివాళి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసుల సంక్షేమం కోసం తొలిసారిగా పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటించారని ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. -
మీ త్యాగం చెదరని జ్ఞాపకం
మహబూబ్నగర్ క్రైం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన అమరుల త్యాగం చెదరని జ్ఞాపకం లాంటిదని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు స్థూపం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఎస్పీ రెమా రాజేశ్వరి ఒదార్చారు. సంఘ విద్రోహక శక్తులతో పోరాడి ప్రాణాలు వదిలిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరుల కీర్తి.. పోరాట పటిమ తమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, గిరిబాబు, సీఐలు రామకృష్ణ, రాజేష్, కిషన్, రాజు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అమరులకు పూలమాలలతో వందనం సమర్పించారు. పోలీసుల సంక్షేమానికి కృషి సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడం పోలీస్ వృత్తిలో సహజమైన అంశంగా భావించి ప్రతి అధికారి ముందుకుసాగాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ప్రజల సంరక్షణ కోసం నిత్యం పోలీసింగ్ వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట పోలీస్ అధికారి ప్రాణాలు త్యాగం చేస్తున్నాడని, కాశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు శాంతి భద్రతలను రక్షించే క్రమంలో ఈ ఏడాది 414 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అందరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి అమరవీరులు చేసిన త్యాగమని కొనియాడారు. రెండు దశాబ్దాల కిందట నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో మావోయిస్టులు జరిపిన విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు. ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని, సమాజంలో శాంతియుత వాతావరణ నిర్మాణం కోసం పోలీసు బలగాలు, దేశ రక్షణ కోసం పొరాటం చేసే సైనికులు 39మంది చనిపోయారని గుర్తు చేశారు. పోలీసులు చేస్తున్న సేవలను, త్యాగాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. పోలీసులకు ప్రజల సహకారం ఉంటే శాంతిభద్రతల రక్షణ సులువవుతుందని, ఎక్కవ జనాభా ఉన్న ఈ సమాజంలో సుమారు లక్ష మందికి ఒక పోలీస్ అధికారి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నట్లు తెలిపారు. గౌరవప్రదంగా కవాతు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. సాయుధ బలగాలు సంప్రదాయ పూర్వకంగా వందనం సమర్పించగా ఎస్పీ రెమా రాజేశ్వరికి స్వీకరించారు. అనంతరం అమరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగానే అమరు పేరున రచించిన పుస్తకాన్ని పరేడ్ కమాండర్ వీరేష్ ఎస్పీకి అందజేయగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు చదివి వినిపించారు. పిల్లలతో ముచ్చటించిన ఎస్పీ కార్యక్రమం అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ రెమా రాజేశ్వరి తన చాంబర్లో ముచ్చటించారు. వారి సాదక బాదకాలను అడిగి తెలుసుకున్నారు. బరువెక్కిన హృదయాలతో వారి కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. వేదికపై పలువురు తమ మనోభావాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తండ్రితో కూతురు గడిపిన రోజులు.. కొడుకుతో తల్లి పంచుకున్న మధుర జ్ఞాపకాలు.. భార్య తన భర్తతో పెళ్లియిన నాటి నుంచి చివరకు పంచుకున్న తీపి గుర్తులు నెమరువేసుకుని భావోధ్వేగానికి లోనయ్యారు. పట్టణంలో శాంతి ర్యాలీ అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి జెండా ఊపి శాంతిర్యాలీ ప్రారంభించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ వన్టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశీనాయుడు విగ్రహం వరకు వెళ్లారు. నినాదాలు చేస్తూ విగ్రహానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ వెంకటేశ్వవర్లు, డీఎస్పీ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే అమరవీరుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్రావు, డీఎస్పీలు గిరిబాబు, ఇమ్మాన్యుయేల్, డీఎఫ్ఓ గంగారెడ్డి, సీఐలు డివిపి రాజు, రామకృష్ణ, రాజేష్, కిషన్, అమర్నాథ్రెడ్డి, ఎస్ఐలు భాస్కర్రెడ్డి, పీపీ బాలగంగాధర్రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, రాజయ్య, నాగభూషణం, సత్తయ్య, మన్మోహాన్ పాల్గొన్నారు. -
త్యాగాలు మరువలేనివి
గోదావరిఖని(రామగుండం): సమాజ సేవలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు మరువలేనివని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వుడ్ హెడ్క్వార్టర్స్లో ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరారు. ప్రజాసేవకులుగా పజల ధన, మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావాలన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం వంటి విచ్ఛినకర శక్తులు, నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడాల్సి రావడంతో పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాగా మారిందన్నారు. పోలీసుల తప్పులు ప్రచారం అవుతున్నంతగా వారి త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవడం లేదన్నారు. త్యాగాలు చేసే వారిని గుర్తించడం లేదన్నారు. ఈ ఏడాది దేశంలో విధి నిర్వహణలో 414 మంది వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని, వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను కాపాడమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. పోలీసులు చేస్తున్న అత్యున్నత త్యాగాలను సమాజం గుర్తించుకునే విధంగా ప్రముఖ దిన పత్రికలలో ప్రకటనలు బ్యానర్లు, కమిషరేట్లో, పోలీస్స్టేషన్లలో ఓపెన్హౌస్ కార్యక్రమాలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రజల కోసం అసువులు బాసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. నివాళ్లర్పించడానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సీపీ వివరాలు తెలుసుకున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈసందర్భంగా అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. అమరవీరులకు నివాళి.. ప్రజాసేవలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు సీపీ ఘన నివాళి అర్పించారు. స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళ్లర్పించారు. వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ టి.సుదర్శన్గౌడ్, మంచిర్యాల డీసీపీ ఎం.వేణుగోపాల్రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్కుమార్, లాఅండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీలు రక్షిత కె.మూర్తి, బాలుజాదవ్, హబీబ్ఖాన్, గౌస్బాబా, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్లు, ఏఆర్, సివిల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
నిజామాబాద్ : విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎన్ఐబీ ఏసీపీ రవీందర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారో త్సవాల సందర్భంగా శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయం సమావేశం హాల్లో అమర పోలీస్వీరుల కుటుంబా ల సభ్యులతో ఏసీపీ సమావేశమయ్యా రు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అందిన, అందాల్సిన సంక్షేమ సహాయ కార్యక్రమాలపై చర్చించారు. ఏసీపీ రవీందర్ అమరవీరులైన కుటుంబ సభ్యులను సమస్యలు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై సత్వర చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని వారి బాగోగులు పర్యవేక్షించాలని తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న, ఆఫీస్ సూపరింటెండెంట్ మక్సూద్ హైమద్, జనార్దన్, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. అండగా ఉంటాం.. డిచ్పల్లి: పోలీసు అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉం టా మని టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్, డిచ్పల్లి కమాండెంట్ ఎన్వీసాంబయ్య అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో అమరవీరుల కుటుంబాల సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వపరం గా ఆర్థికపరమైన అన్ని రకాల ప్రయోజనాలు అందజేశారు. డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామ శివారులో ఇంటి నిర్మా ణం కోసం ఒక్కొక్క కుటుంబానికి 300 గజాల స్థలం ఇచ్చారని తెలిపారు. అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామన్నారు. గతంలో తమ కుటుంబాలకు తక్కువ మొత్తంలో పరిహారం చెల్లించిం దని, రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేలా చూడాలని అమర కుటుంబాల సభ్యులు కోరారు. అలాగే డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అడిషనల్ కమాండెంట్ రాజీవ్కుమార్, అసిస్టెంట్ కమాండెంట్స్ ప్రసన్నకుమార్, దేవిదాస్రాథోడ్, రమణ, బీడబ్లు్యవో పాల్గొన్నారు. -
సీఎం యోగి కీలక నిర్ణయం
లక్నో: జాతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్నపుడు ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారులకు నష్టపరిహారాన్ని రెండింతలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. విధుల్లో ఉన్నపుడు ప్రాణాలు కోల్పోయే పోలీసు అధికారులకు నష్టపరిహారాన్ని రూ. 20 నుంచి 40 లక్షలకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పోలీసు శాఖకు సంబంధించిన అవార్డుల సంఖ్యను 200 నుంచి 950కి పెంచుతామని ఆయన హామీయిచ్చారు. రాష్ట్రంలో శాంత్రిభద్రతలను మెరుగుపరచాలని, అందుకు పోలీసు శాఖ మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. UP govt has decided to double ex-gratia amount for Police officials martyred on duty: CM Yogi Adityanath at Police Commemoration Day Parade pic.twitter.com/9ts50ztECe — ANI UP (@ANINewsUP) 21 October 2017 -
పోలీస్ అమరవీరులకు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు హోంమంత్రి రాజ్నాధ్ సింగ్ శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని పోలీస్ మెమోరియల్ గ్రౌండ్లోని స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలను దేశం మరిచిపోదని రాజ్నాథ్ పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్నాటక సహా ఇతర రాష్ట్రాల్లోనూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది. ఆయా ముఖ్యమంత్రులు పరేడ్లో పాల్గొన్ని అమర పోలీసులకు అంజలి ఘటించారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: కేసీఆర్ హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధులకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులు నెంబర్వన్ స్థానంలో ఉన్నారన్నారు. రూ.వెయ్యికోట్లతో పోలీస్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళా భద్రత కోసం షీ టీమ్స్, కల్తీని నివారించేందుకు స్పెషల్ టీంలతో తనిఖీలు చేపట్టనున్నట్లు నాయిని పేర్కొన్నారు. గోషామహల్ లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండ: చినరాజప్ప విజయవాడ: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మాట్లాడుతూ... సంఘ విద్రోహ శక్తులనుంచి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. అలాగే పోలీస్శాఖలో సాంకేతికత వినియోగించి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పోలీసులను కుటుంబ సభ్యుడిగా ప్రజలు భావించాలని, సమాజ క్షేమం కోసం పోలీసుల త్యాగం వెల కట్టలేనిదని చినరాజప్ప పేర్కొన్నారు. -
అమర వీరుల ఆశయాలను సాధిద్దాం
సంస్మరణ సభలో కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(క్రై మ్): శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు అజారామరమని కలెక్టర్ ఆర్ ముత్యారాజు కొనియాడారు. వారి ఆశయసాధనకు అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు కవాతు మైదానంలో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించాచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లోని జవాన్లు యుద్ధం వచ్చినప్పుడే పోరాటం చేస్తారన్నారు. పోలీసులు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం పోరాడుతూనే ఉంటారన్నారు. పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సామేనన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ, సమాజ సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎస్పీ విశాల్గున్నీ మాట్లాడుతూ దేశ, సమాజ రక్షణలో అసువులు బాసిన వారి పవిత్ర బలిదానం, త్యాగనిరతి అందరికి స్పూర్తిదాయకమన్నారు. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ సమాజంలో మెరుగైన శాంతిభద్రతలను ప్రజలకు అందించడమే అమరులకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 16 మంది విధి నిర్వహణలో మృతి చెందారనీ, వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ బీ శరత్బాబు ఈ ఏడాది విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా మృతిచెందిన అమరవీరుల పేర్లను చదివి వారికి నివాళులర్పించారు. అమర వీరులకు నివాళి పోలీసు గ్రౌండ్లోని అమర వీరుల స్థూపానికి కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్గున్నీ నివాళులర్పించారు. అలాగే ఏఎస్పీలు బీ శరత్బాబు, సూరిబాబు, క్రైం ఓఎస్డి విఠలేశ్వర్, డీఎస్పీలు ఎన్ కోటారెడ్డి, జీ వెంకటరాముడు, కే తిరుమలేశ్వర్రెడ్డి, నమ్మగడ్డ రామారావు, బాలసుందరం, శ్రీనివాసరావు, చెంచురెడ్డి, కే శ్రీనివాసరావు, ఏపీ పోలీసు అధికారుల సేవా సంఘం అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం స్థానిక ఉమేష్చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో కలెక్టర్, ఎస్పీలు సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. షరతులతో కూడిన కారుణ్య నియామకాలు ఇవ్వాలనీ, చనిపోయిన పోలీసు కుటుంబాలకు తహసీల్దార్ కార్యాలయంలో త్వరితగతిన సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, ఇళ్లస్థలాలను కేటాయించాలని పోలీసు అధికారుల సంఘ నాయకులు కలెక్టర్, ఎస్పీలను కోరారు. ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ఎస్పీ సైతం కలెక్టర్ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కారుణ్యనియామకాలు ఆలస్యమైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ బాధిత కుటుంబసభ్యులకు బెనిఫిట్స్కు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ, ఏఎస్పీ, పోలీసు అధికారులు, పోలీసు అసోసియేషన్ సభ్యులు భోజనం చేశారు. -
పోలీసు అమర వీరుల దినోత్సవంలో హోం మంత్రి
-
పోలీసుల సేవలు చిరస్మరణీయం: నాయిని
-
పోలీసుల సేవలు చిరస్మరణీయం: నాయిని
హైదరాబాద్ : పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని తెలంగాణ పోలీస్ శాఖ శుక్రవారం ఉదయం గోషా మహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ, పోలీస్ అధికారులు ...పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ శాఖ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ పోలీసుల సేవల చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు శాఖలో అనేక మార్పులు తెచ్చామన్నారు. ఎండనకా..వాన అనకా పనిచేసేది పోలీసులేనని అన్నారు. ఈ ఏడాది 470మంది పోలీసులు అమరులయ్యారన్నారు. పోలీసుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ ఏడాది విధినిర్వహణలో అమరులైన హోంగార్డులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ అనురాగ శర్మ తెలిపారు. -
వారి త్యాగాలను స్మరించుకోవాలి: చంద్రబాబు
విజయవాడ : పోలీసుల త్యాగ నిరతి వల్లే సమాజం సురక్షితంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఏపీ పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసులపై ఆయన ప్రశంసలు జల్లు కురిపించి, ఈ ఏడాది కూడా పోలీసు సంక్షేమ నిధికి రూ.15 కోట్లు కేటాస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల కోసం విజయవాడలో ఆస్పత్రి నిర్మాణం, విశ్రాంతి భవనం, విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు రూ.5లక్షల బీమా ఇస్తామని, వచ్చే ఏడాది మంగళగిరి 6వ బెటాలియన్లో శాశ్వత పోలీస్ సంస్మరణ వేదిక ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీసులు సమాజం కోసం వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెడుతున్నారన్నారు. సమాజం కోసం ప్రాణాలు అర్పిస్తున్న పోలీసులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంఘవిద్రోహ శక్తుల గుండెల్లో పోలీసులు నిద్రపోవాలని అన్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో పోలీసులు ముందంజలో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు అమరవీరులకు గవర్నర్ నివాళి
విజయవాడ : పోలీస్ అమరవీరులకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. విజయవాడలోని ఇందిరా స్టేడియంలో శుక్రవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ...ఏపీ పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రాణలు సైతం లెక్కచేయకుండా పోలీసులు కష్టపడుతున్నారన్నారు. కాగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. -
అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
–ఏఎస్పీ శరత్బాబు నెల్లూరు(క్రై మ్): పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్బాబు అన్నారు. స్థానిక ఉమేష్చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నెల్లూరు నగర పోలీసు అధికారులు, పీఎంపీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో అగర్వాల్ కంటివైద్యశాల, విజయకేర్హాస్పిటల్, మాధవ్స్ డయాబిటెక్ కేర్ సెంటర్ల సహకారంతో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సమాజంలో అంతర్గత శాంతిభద్రలను కాపాడడంలో ఒక్కోసారి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచుతూ అశువులు బాస్తున్నారన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయసాధనకు అందరం నడుంబిగిద్దామన్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ శివప్రతాప్రెడ్డి, పి.మాధవ్, పి.విజయకుమార్, జి ఎల్ అన్నపూర్ణలు మధుమేహం, కంటి, గుండె సంబంధిత వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీచేశారు. అడిషినల్ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ రమాదేవి, పీఎంపీ జిల్లా అధ్యక్షుఢు శాఖవరపు వేణుగోపాల్, నెల్లూరు నగర, ఏఆర్ డీఎస్పీలు జి. వెంకటరాముడు, చెంచురెడ్డి, రెండు, మూడు, నాలుగు, ఐదోనగర ఇన్స్పెక్టర్లు కె.రామకృష్ణారెడ్డి, జి. రామారావు, సీహెచ్ సీతారామయ్య, మంగారావు, ఏపీ పోలీసు అధికారుల సంఘం జిల్లా అద్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు పాల్గొన్నారు -
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీస్ సిబ్బంది త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా అదనపు ఎస్పీ శరత్బాబు పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంబించిన అనంతరం ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలను పోలీస్ సిబ్బంది స్మరించుకుంటూ వారి ఆశయసాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పోలీస్ అధికారుల సంఘ జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన మోటివేటర్ భాస్కర్నాయుడు, ట్రాఫిక్, మహిళా, ఏఆర్ డీఎస్పీలు నిమ్మగడ్డ రామారావు, శ్రీనివాసాచారి, చెంచురెడ్డి, ఎస్బీ, నగర ఇన్స్పెక్టర్లు మాణిక్యరావు, రామకృష్ణారెడ్డి, రామారావు, ఎస్బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ శ్రీనివాసరావు, ఆరెస్సైలు అంకమరావు, రమేష్ కృష్ణన్, రమణ, రాఘవ, నాలుగో, ఆరో నగర ఇన్స్పెక్టర్లు సీతారామయ్య, రామారావు, ఒకటో నగర ఎస్సై గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు కేసీఆర్ వరాల జల్లు
-
'త్యాగాలకు మారుపేరు పోలీసులు'
-
త్యాగాలకు మారుపేరు పోలీసులు: చంద్రబాబు
విజయవాడ : త్యాగాలకు మారుపేరు పోలీసులు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం విజయవాడలో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల నిధికి రూ.20కోట్లు ప్రకటించారు. దేశభద్రత కోసం పోలీసులు ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలీసుల సంక్షేమ బాద్యత ప్రభుత్వానిదేనని, అలాగే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని చంద్రబాబు నాయుడు అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల సంక్షేమ నిధికి రూ.15కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలో పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ రాముడు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పోలీసులకు కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్ : ప్రజల ఆశలకు అనుగుణంగా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని తెలంగాణ పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. బుధవారం గోషామహాల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పోలీసు అమరవీరులకు కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... పోలీస్ అమరవీరులకు సమాజం రుణపడి ఉంటుందని, శాంతిభద్రతలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. సమాజ రక్షణ కోసం పాటుపడుతున్న పోలీసుల త్యాగాలను సమాజంలో అందరూ గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులకు స్థానం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఈ సందర్భంగా పోలీసులపై వరాల జల్లు కురిపించారు. పోలీసులకు ప్రోత్సాహకాలు... ప్రమోషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎస్ఐ ఆ పై స్థాయి అధికారులకు విధులు నిర్వహిస్తున్న చోటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వారికి ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ఎస్ఐ ఆ పైస్థాయి అధికారులకు మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు కేటాయిస్తామన్నారు. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 35 శాతం అలవెన్స్ను ప్రకటించారు. అలాగే పోలీసుల యూనిఫామ్ వార్షిక అలవెన్స్ రూ. 3, 500 నుంచి రూ. 7,000 వరకు పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పోలీసు అమరవీరులు దేవుళ్లతో సమానం: కేసీఆర్
* పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి * విధి నిర్వహణలో మరణి ంచినవారికి నష్టపరిహారం పెంపు * ఎస్సైలకు రూ.45 లక్షలు, సీఐ ఆపై స్థాయి వారికి రూ.50 లక్షలు, ఐపీఎస్లకు రూ.కోటి పరిహారం * ఏటా 20 మంది ఉత్తమ పోలీసులకు రూ.5 లక్షల నగదు రివార్డు * పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన * అమరవీరులు దేవుళ్లతో సమానమంటూ ప్రశంసలు సాక్షి, హైదరాబాద్: పోలీసులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. బతికున్న వారి కోసం తమ బతుకులను త్యాగం చేసే వారు దేవుళ్లతో సమానమని, పోలీసు అమరవీరులు ఆ కోవకు చెందుతారంటూ ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో శాంతి నెల కొంటేనే అభివృద్ది సాధ్యమని, అందుకు పోలీసు శాఖకు ఎలాంటి సౌకర్యాలు కల్పించేందుకైనా సిద్ధమని స్పష్టంచేశారు. గోషామహల్ స్టేడియం లో మంగళవారం జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను సవ్యంగా ఉంచాలని పిలుపుని చ్చారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్న పోలీసులను.. ఖాకీలంటూ సినిమాల్లో, పత్రికలలో ఎగతాళి చేయడం సరికాదని కేసీఆర్ అన్నారు. ఏటా తెలంగాణ పోలీసు మెడల్స్ పోలీసుల జీత భత్యాలు పెంచే విషయంలో గత ప్రభుత్వాలు చులకనగా చూసేవని, కానీ తమ ప్రభుత్వం అందుకు వ్యతిరేకమన్నారు. నక్సలైట్లు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులతో పోరాడుతూ అసువులు బాసిన కానిస్టేబుళ్లు మొదలుకుని ఏఎస్సై స్థాయి వరకు వారికిచ్చే నష్ట పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఎస్సైలకు రూ.45 లక్షలు, సీఐ ఆపై స్థాయి అధికారులకు రూ.50 లక్షలుగా నిర్ణయించామని వెల్లడించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన ఐపీఎస్ అధికారులకు ఇప్పటివరకు అందచేసే నష్టపరిహారాన్ని రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆరో గ్య భద్రత కింద పోలీసులకు ఇదివరకు ఇస్తున్న లక్ష రూపాయలను రూ.5 లక్షలకు పెంచామని, రూ. 2.50 లక్షలు ఉన్న పరిధిని రూ.7 లక్షలకు పెంచినట్లు తెలిపారు. పోలీసులకు ఇచ్చే రోజు వారీ భత్యాన్ని రూ.90 నుంచి రూ.250కి పెంచుతున్నట్లు చెప్పారు. అమరులైన పోలీసులకు వారి పదవీ విరమణ వరకు పూర్తి జీతంతోపాటు సొంత ఇల్లును కూడా కట్టించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పోలీసులకు తెలంగాణ పోలీసు మెడల్స్ను ప్రతి ఏటా ప్రధానం చేసి, రూ.5 లక్షల నగదు రివార్డు అందచేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వారి త్యాగాల ఫలమే: నాయిని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడు తూ.. పోలీసుల త్యాగాల కారణంగానే శాంతి యుత వాతావరణంలో బతుకుతున్నామన్న సం గతిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. పోలీ సుల త్యాగాలను ప్రజలు గుర్తించాలని డీజీపీ అనురాగ్ శర్మ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలీసు శాఖ పటిష్టతకు సీఎం అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఎస్సై రాములు, కానిస్టేబుళ్లు బసు, ఈశ్వరయ్యలకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ‘అమరులు వీరు’ అనే అనుబంధ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సాయుధ పోలీసు బలగాలు నిర్వహించిన కవాతు, పోలీసు బ్యాండు అమరవీరులను శ్లాఘిస్తూ వినిపిం చిన వాయిద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోలీసు అమరవీరులను కీర్తిస్తూ చిన్నారులు పెయింటింగ్లు, క్యారికేచర్లు వేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ ఐపీఎస్ అధికారులు, నగర పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సీఎం ప్రసంగంలో మా ప్రస్తావనేదీ..? అమరవీరుల సంస్మరణ సందర్భంగా పోలీసులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తుంటే.. తమ గురించి మాట మాత్రమైనా ప్రస్తావించకపోవడంపై మహిళా హోంగార్డులు కన్నీరు పెట్టుకున్నారు. గోషామహల్లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ పరేడ్లో పోలీసులకు ఆర్థికంగా లబ్ధిచేకూర్చే ప్రకటనలతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. తమకూ సీఎం వరాలిస్తారని మహిళా హోంగార్డులు ఎదురుచూస్తూ ప్రసంగం ఆసాంతం ఆసక్తిగా విన్నారు. అలాం టిదేమీ లేకుండా కేసీఆర్ ప్రసంగాన్ని ముగించడంతో నిరాశకు గురయ్యారు. ఉచిత వైద్య పరీక్షలు.. విధి నిర్వహణలో పోలీసులు వివిధ వ్యాధుల బారినపడుతున్నారని, వ్యాధి లక్షణాలను ఆదిలోనే కనిపెట్టడానికి 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి పోలీసుకు ఆరునెలలకు ఒకసారి సంపూర్ణ వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని సీఎం తెలిపారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఎస్సై, ఆర్ఎస్ఐలకు గెజిటెడ్ హోదాకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్ర పోలీసు క్యాంటీన్లలో ఖరీదు చేసే వస్తువులపై వ్యాట్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలియచేశారు. మహిళలు అర్థరాత్రి స్వేచ్చగా తిరిగే వ్యవస్థ కోసం సింగపూర్లాంటి భద్రతా వ్యవస్థ ఇక్కడ కూడా ఏర్పాటు కావాల్సి ఉందని నొక్కి చెప్పారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఉన్నతాధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రతా సేవలు అందించే పోలీసులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంపై నివేదిక అందించాల్సిందిగా డీజీపీకి సూచించారు. దిల్సుఖ్నగర్ వంటి బాంబు పేలుళ్ల ఘటనలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఐటీ కంపెనీల వారిని పునరాలోచింప చేస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ పోలీసులు ప్రజాబంధువులుగా నిలవాలని కోరారు. -
అమరుడా.. జన పోలీసు వీరుడా
‘జనమంతా గాఢ నిద్రలో ఉంటే.. నువ్వు మాత్రం మేల్కొనే ఉన్నావు.ఎండనక.. వాననక.. రాత్రనక.. పగలనక.. పండగల్ని కూడా త్యాగం చేసి ప్రజల కోసమే పని చేశావు. వారి కోసమే ప్రాణమిచ్చావు. ఖాకీ బట్టను త్యాగానికి గుర్తుగా మలచావు. అమరుడా.. జన పోలీసు వీరుడా.. నీకివే మా జ్యోతలు’ అంటూ పోలీసులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఏలూరు (ఫైర్స్టేషన్ సెంటర్) : సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పిం చిన పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌం డ్స్లో మంగళవారం నిర్వహించిన పోలీస్ అమర వీరుల సంస్మరణ సభలో ఆమె మాట్లాడారు. ప్రజలు సురక్షితమైన జీవనం సాగించడానికి పోలీసులు అందిస్తున్న సేవలే కారణమన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, పోలీసు వ్యవస్థను పటిష్టపర్చడానికి చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ఎస్పీ కె.రఘురామ్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 642 మంది విధి నిర్వహణలో ప్రాణ కోల్పోయూరని వివరిం చారు. పోలీసు అమర వీరుల కుటుంబాలకు పోలీసు సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు. అనంతరం పోలీసులు కవాతు నిర్వహించి, అమర వీరులకు నివాళులర్పించారు. ముగ్గురు పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులకు మంత్రి, ఎస్పీ జ్ఞాపికలు అందించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలైన 18 మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సభానంతరం సురేష్ బహుగుణ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఫైర్స్టేషన్ సెంటర్లో పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు. ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజు వర్మ, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత, ఏఆర్ డీఎస్పీ కె.కోటేశ్వరరావు, ఎస్బీ సీఐలు విల్సన్బాబు, ఎం.సుబ్బారావు, డీసీఆర్బీ సీఐ కె.రజనీకుమార్, టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్, ఏఆర్ ఆర్ఐ శ్రీనివాస్, సీఐలు కిషోర్బాబు, నాగేంద్ర ప్రసాద్, ఫణీంద్ర పాల్గొన్నారు. -
మీ త్యాగాలు మరువం
విజయనగరం క్రైం: పోలీసుల ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తున్నారని, శాంతిభద్రతల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం లో మంగళవారం పోలీసు అమవీరుల దినోత్సవం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. 1959లో చైనాతో సరిహద్దులో జరిగిన పోరు లో మృతి చెందిన వారి గుర్తుగా ఏటా అమరువీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటామన్నా రు. పోలీసు విధులు చాలా కష్టతరమైనవని, మావోయిస్టు, తీవ్రవాదులు, అసాంఘిక శక్తులను నియంత్రించడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా కె.ఎస్.ఉమేష్చంద్రలాంటి అంకిత భావంతో పనిచేసే ఉన్నతాధికారులను సైతం పోలీసుశాఖ పోగొట్టుకుందని తెలిపారు. 2013-14లో 642 మంది, రాష్ట్రంలో ముగ్గు రు పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారన్నా రు. జిల్లా అదనపు ఎస్పీ ఎ.వి.రమణ మాట్లాడుతూ అమరులైన పోలీసులు భౌతికంగా మనకు దూరమైనా వారి త్యాగాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని తెలి పారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యతని అన్నారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్, అదనపు ఎస్పీ ఎ.వి.రమణ పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు ఉం చి నివాళులు అర్పిం చారు. అమరులైన చిరంజీవరావు, శ్రీరాములు, సూర్యనారాయణ, ఇస్మాయిల్, సత్యనారాయణ కు టుంబ సభ్యులను కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పి.టి.సి ఇన్చార్జి ప్రిన్సిపల్ వి.సత్తిరాజు, డి.టి.సి.డీఎస్పీ సి.హెచ్.వి.ప్రసాద్, విజ యనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, సి.ఐలు కె.రామారావు, ఎ.రవికుమార్, ఎస్బీ సి.ఐలు లీలారావు, కృష్ణారావు, ఆర్.ఐలు అప్పారావు, నాగేశ్వరరావు, రా మకృష్ణారావు, సీసీఎస్ సీఐలు వాసుదేవ్, పోలీసు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వి.ఆర్.సింహాచలం హాజరయ్యారు. -
అమరులైన పోలీసులకు భారీ ఎక్స్గ్రేషియా
హైదరాబాద్ : విధి నిర్వహాణలో అమరులైన పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా భారీగా పెంచుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... విధి నిర్వహాణలో కానిస్టేబుల్ ఆపై సిబ్బంది మరణిస్తే రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రూ. 30 లక్షలు నుంచి రూ. 45 లక్షలు డీఎస్పీ స్థాయి అధికారికి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షలు, అలాగే ఐపీఎస్ అధికారులకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కానిస్టేబుళ్లకు రోజువారి చెల్లిస్తున్ జీతం రూ. 90 నుంచి రూ. 250కి పెంచుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య భద్రత కింద ప్రస్తుతం ఉన్న రూ. లక్షను రూ. 5 లక్షలు పెంచుతున్నట్లు చెప్పారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండేది పోలీసులేని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులు దేవునితో సమానమన్నారు. పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికి అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సింగపూర్ తరహాలో పోలీసులు వ్యవస్థను పటిష్ట పరుస్తామన్నారు. సమాచార వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామని తెలిపారు. ప్రజలు ధన,మాన, ప్రాణలను సంరక్షించడంలో విజయం సాధించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, హోం మంత్రి నాయని నరసింహరెడ్డితోపాటు పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్లు
-
అమరులైన పోలీసులకు భారీ ఎక్స్గ్రేషియా
-
పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి
-
నాలుగో సింహం
-
జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్లు
విజయవాడ: ప్రజల ఆస్తులు, మహిళల రక్షణకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోమంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... పోలీసుల విధి నిర్వహాణలో విపరీతమైన పని భారం పడుతుందని... ఆ భారాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. దేశం కోసం పోరాడిన జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్ల అని అన్నారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో పెత్తనం చేయాలని పోలీసు వ్యవస్థను బ్రిటీష్ వారు తీసుకువచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. బ్రిటీష్ వారి ప్రవర్తన వల్ల ప్రజలకు ఇప్పటికీ పోలీసులపై నమ్మకం కలగని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంచేలా పని చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా పోలీసులకు సూచించారు. పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ జేవీ రాముడు మాట్లాడుతూ... రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో 152 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా గత పదేళ్ల కాలంలో 7 వేల మంది పోలీసులు మరణించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఎన్. చినరాజప్ప, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీలతోపాటు పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పోలీసు అమరులకు కేసీఆర్ నివాళులు
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నివాళులు అర్పించారు. పోలీసు అమరుల త్యాగానికి సార్థకత చేకూరాలని ఆయన అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటంలో పోలీసులదే ముఖ్యపాత్ర అని ఆయన చెప్పారు. మంగళవారం నాడు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు పలువురు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. -
పోలీసులకు కొత్త సవాళ్లు
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పోలీసులపై పని ఒత్తిడి, భారం పెరుగుతున్నాయుని, వరుస బందోబస్తులతో నిర్విరావుంగా విధులు నిర్వర్తించవలసి వస్తోందని ముఖ్యవుంత్రి ఎన్ కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమర వీరుల దినం సందర్భంగా సోమవారం జరిగిన పరేడ్లో ఆయన ప్రసంగించారు. గతంతో పోలిస్తే పోలీసుల విధి నిర్వహణ మరింత సంక్లిష్టమైందని, వారు కొత్త సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికులు శత్రువులను గుర్తించగలరని, పోలీసులు శత్రువును కనిపెట్టడం చాలా కష్టతరమని సీఎం చెప్పారు. సమాజాన్ని అస్థిరపరిచే శక్తులు ఇతర దేశాల నుంచి, రాష్ట్రాలనుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న తరుణంలో, పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పోలీసుల పనిభారం తగ్గిం చేందుకు గత మూడేళ్లలో 28 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మొత్తం పోలీసు ఉద్యోగాల్లో 25 శాతం ఉద్యోగాలను మూడేళ్లలోనే భర్తీ చేశావుని అన్నారు. పోలీ సు సిబ్బంది ఆరోగ్య భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం వురింత కృషి చేస్తుందన్నారు. పోలీసు ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని విధి నిర్వహణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడేవారే పోలీసులని రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ (డీజీపీ) బీ ప్రసాద రావు అన్నారు. ఈ ఏడాదిలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు జరిపిన దాడుల్లో దేశవ్యాప్తంగా 576 మంది పోలీసులు వురణించార ని అన్నారు. ఉద్యోగంలో చేరినపుడు చేసిన ప్రమాణం మేరకు, పదవీ విరమణ వరకూ క్రమశిక్షణతో పనిచేయూలని సిబ్బందికి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు క్వార్టర్ల మరమ్మతుల కోసం అదనపు నిధులివ్వాలని డీజీపీ వుుఖ్యవుంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలీసు అమరుల దినం సందర్భంగా సోవువారం పోలీసు స్మారక చిహ్నం వద్ద గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి, డీజీపీ ప్రసాదరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మ శాంతికోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
కాల్పుల ఉల్లంఘనపై కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాలి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్నిసోమవారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో పాటు పలువురు నేతలు, ఉన్నతాధికారులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఆర్పీఎఫ్, సశస్త్ర సీమ బల విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద షిండే తదితరులు నివాళి అర్పించారు. ఇక ఉత్తరప్రదేశ్లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాళి అర్పించారు.పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అఖిలేష్.... ఖాకీల సేవల వల్లే సమాజంలో శాంతిభద్రతలు నెలకొంటున్నాయని కొనియాడారు. పాకిస్తాన్ దళాలు ఎల్వోసీ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. కాల్పుల ఉల్లంఘనపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పాక్ మళ్లీ కవ్వింపులకు పాల్పడితే గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఇరు వైపుల నుంచి స్పందన ఉంటేనే చర్చలు సాధ్యం అవుతాయని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాగా పాక్ కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న జమ్మూకాశ్మీర్లో జాతీయ పోలీసు దినోత్సవాన్ని కాశ్మీర్ ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. రాజధానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఆయన నివాళి అర్పించారు.ఖాకీల సేవలను కొనియాడారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. -
సలామ్ పోలీస్
శాంతిభద్రతలను కాపాడడంలో వారికి వారే సాటి. ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా టక్కున వాలిపోతారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ... అనుక్షణం ప్రజల రక్షణ కోసం పాటుపడే మానవతామూర్తులు. అందరికీ కొండంత భరోసానిస్తూ ... మేమున్నామంటూ ధైర్యం చెప్పే ధీరులు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సలామ్ పోలీస్... చిరుతలాంటి వేగం డేగలాంటి కనులు క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే నైజం ఒక్క మాటలో చెప్పాంటే కనిపించని నాలుగో సింహమే పోలీస్. ఈ రోజు అక్టోబర్ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆరోజును పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణకు నేటితో సరిగ్గా 54 ఏళ్లు. సంఘ విద్రోహ కశక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల పోరులో ఈ ఒక్క ఏడాదే దేశంలో 579 మంది పోలీసులు అమరులయ్యారు. వీరిలో మనరాష్ట్రానికి చెందిన ఏపీఎస్పీ, ఆర్ఐ ప్రసాద్బాబు, గ్రేహాండ్స్లో డిప్యుటేషన్పై చత్తీస్ఘడ్లో జరిగిన మావోయిస్ట్ దాడిలో అసువులు బాసాడు. ఈనాటి మా ఆత్మార్పణం-రేపటి మీకోసం సమర్పణం అంటున్న పోలీసు అమరులకు సాక్షి హృదయపూర్వక నివాళులు అర్పిస్తోంది. సమాజంలో ఎటు చూసినా పోటీ, అందినకాడికి దక్కించుకోవాలనే తాపత్రయం.. ఆశ, దురాశ, మంచి-చెడుల మధ్య జీవనపోరాటం... ఇన్ని కోణాల మధ్య మేమున్నామనే భరోసాయే మనకు కొండంత అండ. అంతగా మన జీవితానికి బాసటగా నిలుస్తున్న ఆ మహనీయుడే పోలీసు. నిరంతరం సమాజాన్ని కాపాడుతూ, ప్రాణాలను ఫణంగా పెట్టిన పోలీసు వీరులెందరో. ఈ వీరుల త్యాగాలకు ప్రతిఫలం దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే సమాజం కోసం వారు చేసిన సేవలను గుర్తించి. వారి కుటుంబాలను ఆదుకునేందుకు, వారి సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు అంటున్నారు. దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న భారతసైన్యంతో సమానంగా ,శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలర్పిస్తున్నారని. వారి త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సిటీ కమీషనర్ అనురాగ్ శర్మ అన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద, అరాచక శక్తుల హింసాకాండకు బలైపోతున్నారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరమే 579మంది పోలీసులు అమరవీరులయ్యారు. ప్రజల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. పోలీసుల విధి నిర్వహణ ఒక పవిత్రమైన కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణలో దేశంలో, రాష్ట్రంలో ఎందరో పోలీసులు ప్రతి ఏడాది అసువులు బాస్తున్నారు. రాజ్యాంగ రక్షణ - ప్రజాస్వామ్య పరిరక్షణ - శాంతిస్థాపన ... ఈ మూడే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించే వారే నిజమైన పోలీసులు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా, క్లిష్టమైన సమస్యలనైనా ఎదుర్కోవడంలో ముందు నిలుస్తారు. ప్రజాశ్రేయస్సు కోసం మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో దూసుకెళతారు. ప్రజల రక్షణార్థం ప్రాణత్యాగానికైనా వెనకడుగు వేయకుండా, మొక్కవోని దీక్షతో సాగిపోతుంటారు. అందుకే పోలీసులంటే అందరికీ అంత గౌరవం, వారిపై అంతటి అపార నమ్మకం. ఉగ్రవాద,తీవ్రవాద, అసాంఘిక శక్తులను తుదముట్టించడంలో ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన పోలీసులు ఎందరో. వారి సేవలు చిరస్మరణీయం. వారి ధైర్యసాహసాలు అద్భుతం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాత్రనకా, పగలనకా ... పండగనక, పబ్బమనకా ... ఎనీ టైమ్ ఎనీ సెంటర్లో పౌరులకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు జవానుల త్యాగాలను స్మరించుకుని వారి జీవితాలే స్ఫూర్తిగా, ప్రేరణగా అందరం ప్రజాసేవకు పునరంకితం కావాలి. విధినిర్వహణలో మొక్కవోని దీక్షా తత్పరతను, వెన్నుచూపని సాహసాన్ని, అంకిత భావాన్ని చూపిన పోలీసుల సేవలను గుర్తుచేసుకుంటూ, వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించాల్సిన తరుణమిది. భారత పోలీసు వ్యవస్థకు 152 వసంతాలు నిండాయి. 1861లో స్వాతంత్ర్య సంగ్రామాన్ని అణచివేయడం కోసం సిపాయి తిరుగుబాటు తర్వాత ఆంగ్లేయులు పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతకుముందు సైనికులపైనే శాంతిభద్రతల బాధ్యత ఉండేది. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో పోలీసులు సమాజంలో కీలక భాగం. సమాజసేవ చేయడమే ఊపిరిగా సాగుతోంది. పోలీసులుగా పుట్టడం, సమాజానికి సేవ చేయడం ఎంతో గర్వంగా ఉందనే పోలీసులు ఎందరో. డ్యూటీలో భాగంగా ... ప్రాణాలపైకి వస్తే, వీరమరణం పొందుతున్నామన్న ఆత్మసంతృప్తే తప్ప చనిపోతున్నామన్న బాధ వారిలో కొంచెమైనా కనిపించదు. పోలీసులు మనందరికి మార్గదర్శకులు. వీరోచిత పోరాటం చేసి, అమరులైన పోలీసులకు ఇవే సాక్షి జోహార్లు. -
పోలీసు అమర వీరులకు నివాళులు
హైదరాబాద్ : పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డీజీపీ ప్రసాదరావు, పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, పలువురు ఉన్నత అధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. విధి నిర్వహణలో జాతి కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను ఈసందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'పోలీస్ అమరవీరుల'పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా కర్నూలు జిల్ఆ ఎమ్మిగనూరులో పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో అశువులు భాసిన వీరులకు నివాళులు అర్పించారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.ఇక అనంతపురంలో పోలీసులు కూడా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. జిల్లా ఎస్పీతో పాటు ఏఎస్సీ, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డులు రక్తదానం చేశారు. -
పోలీసు అమర వీరులకు నివాళులు