Published
Tue, Aug 2 2016 11:44 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ఫస్ట్ ర్యాంక్ బహుమతి అందుకుంటున్న హరిప్రియ
కవిటి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట సీఆర్క్లబ్ హాల్లో గత నెల 28 నుంచి 29 వరకు నిర్వహించిన స్టేట్ సీనియర్ క్యారమ్స్ ర్యాంకింగ్ టోర్నీలో జగతి గ్రామానికి చెందిన లమ్మత హరిప్రియ ఫస్ట్ ర్యాంక్ను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారిణులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఫస్ట్ ర్యాంక్ను సాధించినట్టు రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఉపాధ్యక్షుడు పూడి నేతాజీ చెప్పారు. అనంతరం జూలై 30, 31వ తేదీల్లో అదే సీఆర్ క్లబ్లో జరిగిన సౌత్జోన్ పోటీల్లో రెండో ర్యాంక్ సాధించినట్టు తెలిపారు. ఆమెకు రాష్ట్ర క్యారమ్స్ సంఘం గౌరవాధ్యక్షుడు శంకరరావు బహుమతిని అందించారు. హరిప్రియ సాధించిన విజయం పట్ల ఒలింపిక్ సంఘం రాష్ట్రఉపాధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఉపాధ్యక్షుడు పూడి నేతాజీ అభినందనలు తెలిపారు.