ఆర్థిక సాయాన్ని అందజేస్తున్న ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ
గోదావరిఖని : గోదావరిఖని రిటైల్ పండ్ల వ్యాపారుల సంక్షేమ సంఘం సభ్యుడైన గోనెల వెంకటరాజం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులకు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెంకటరాజం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ సాగంటి శంకర్, సంఘం అధ్యక్షులు గాలి సతీష్యాదవ్, సబ్బు శ్రీధర్, డి.నారాయణ, అఫ్రోజ్, అయిలయ్య, సమ్మయ్య, జి.నారాయణ, మారుతి, చెరుకు బుచ్చిరెడ్డి, దీటి బాలరాజు, ఉల్లంగుల రమేశ్, అజీమ్ పాల్గొన్నారు.