
డిపార్టుమెంటు సచ్చి పోయిందా!
అయితే, కొందరు ఎంవీఐలు తగినన్ని వాహనాలు సమకూర్చలేదు. దీంతో మహిళలను తరలించడంలో మెప్మా అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని మెప్మా అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రవాణ అధికారులతో సమావేశం నిర్వహించి వాహనాలు సమకూర్చడంలో నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ఏం తమాషగా ఉందా...నిద్ర పోతున్నారా వీఐపీల కార్యక్రమాలకే వాహనాలు పంపలేరా... వాహనాలు స్వాదీనం చేసుకునే పవర్ లేదా అంటూ మండిపడ్డారు. సునీత, రఘునాథ్, శ్రీకాంత్, అతిగానా«థ్ అనే నలుగురు ఎంవీఐలకు రెండు ఇంక్రిమెంట్లను కట్ చేయడంతో పాటు చార్జి మెమోలు ఇచ్చారు. ఈ మేరకు ఫైల్ సర్క్యులేట్ చేయాలని డీటీసీని ఆదేశించారు. ఇక నుంచి ఆటోలు ఓవర్లోడ్తో వెళితే సంబంధిత ఎంవీఐలను సస్పెండ్ చేస్తానన్నారు. ఇందుకు డీటీసీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడీ రామాంజనేయులు పాల్గొన్నారు.