transport
-
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది
భిన్న జీవనం జెలజ కుటుంబం ఇంట్లో కంటే రోడ్డు మీదే ఎక్కువగా ఉంటుంది. జెలజ ట్రక్ డ్రైవర్. భర్తకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. తొలత గృహిణిగా ఉన్న జెలజ మెల్లగా డ్రైవింగ్ నేర్చుకుంది. లోడు దించేందుకు కుటుంబంతో బయలుదేరి కొత్త ప్రాంతాల వీడియో చేస్తుంది. ఆమె కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ తోలింది. కూతురు తల్లితోపాటు డ్రైవింగ్ నేర్చుకుంది. ‘పుతట్టు ట్రావెల్ వ్లోగ్’ పేరుతో ఈ కుటుంబ యానం లక్షల మంది ఫాలోయెర్స్ను సంపాదించింది. ఉదాహరణకు జెలజ జీవితం ఇలా ఉంటుంది. ఆమె కేరళలోని కొట్టాయం నుంచి ప్లైవుడ్ లోడ్ తీసుకుని పూణెలో డెలివరీ చేస్తుంది. కాని ఖాళీ ట్రక్కు వెనక్కు తెస్తే నష్టం. ‘ఉల్లిపాయల లోడు కశ్మీర్లో దింపుతారా’ అని పూణెలో అడుగుతారు. ‘దింపుతాను’ అని బయలుదేరుతుంది. కశ్మీర్ చేరుకుంటుంది. అక్కడ లోడ్ దొరకదు ఒక్కోసారి. ఢిల్లీ, హర్యాణ దాకా వచ్చే లోడ్ దొరుకుతుంది. ఏదో ఒక సరుకు కేరళకు దింపే బుకింగ్ వస్తుంది. ఆ లోడు తీసుకుని కేరళ చేరుకుంటుంది. ‘కేరళలో ప్రతి సంవత్సరం జారీ అవుతున్న డ్రైవింగ్ లైసెన్స్లలో 40 శాతం స్త్రీలవి. టూ వీలర్లు కార్లు సరే... బస్సులు కూడా కేరళలో నడుపుతున్నారు స్త్రీలు. కాని ట్రక్కు నడిపే స్త్రీలు చాలా అరుదు. అందుకే జెలజ ను చూసి అందరూ గౌరవిస్తారు’ అంటాడు రతీష్. అతడు జెలజ భర్త. ఆమె లాంగ్ డ్రైవ్కి బయలుదేరితే చాలాసార్లు తోడు ఉంటాడు. ఒక్కోసారి పెద్దకూతురు, భార్య డ్రైవ్ చేస్తుంటే వారికి తోడు వస్తాడు. అతను స్వయంగా డ్రైవరు. కాని తన కుటుంబ స్త్రీలు హైవేలను జయిస్తూ ఉంటే సంతోషపడతాడు. గృహిణి నుంచి డ్రైవర్గా రతీష్ 2003 వరకూ ఒక సాధారణ ట్రక్ డ్రైవర్. ఆ సంవత్సరం ఆరు లక్షలు లోన్ తీసుకుని ఒక భారత్ బెంజ్ ట్రక్ కొన్నాడు. కలిసొచ్చింది. తన సోదరుడితో కలిసి ఇప్పుడు 27 నేషనల్ పర్మిట్ ట్రక్కులతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. తరచూ లాంగ్ డ్రైవ్కి వెళ్లే రతీష్ని జెలజ ‘నేనూ నీతో రానా కొత్తప్రాంతాలు చూడాలని ఉంది’ అనడిగింది. ‘రావచ్చు. కాని నువ్వు ట్రక్కు నడపడం నేర్చుకుంటే’ అన్నాడు రతీష్. అప్పటికి జెలజ కేవలం గృహిణి. టూ వీలర్ నడపడం కూడా రాదు. ఆమె మొదట టూ వీలర్.. ఆ తర్వాత కారు నడిపి ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. భర్తను తోడు తీసుకుని స్వయంగా ట్రక్ నడుపుతూ లోడ్ డెలివరీ చేయడం ్ప్రారంభించింది. వీడియోలు చేస్తూ ‘మాది ఉమ్మడి కుటుంబం. నా మరిది, తోటికోడలు, అత్తగారు.. అందరం కలిసి ఉంటాం. అందుకే నా ఇద్దరు పిల్లలను వదిలి ట్రక్ తీసుకుని బయలుదేరుతాను’ అంటుంది జెలజ. ఆమె పెద్ద కూతురు కూడా ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. లోడ్లు దింపే పనిలో భాగంగా పర్యటనలు కూడా ఈ కుటుంబం ట్రక్కు ద్వారా ముగిస్తారు. ‘మేఘాలయా, కోల్కటా, పోర్బందర్... ఇలా ఎన్నో కొత్తప్రాంతాలు చూశాను’ అంటుంది జెలజ.. ఎక్కడకు వెళ్లినా అక్కడి విశేషాలు వీడియోలు చేస్తూ అక్కడి సంస్కృతి, అలవాట్లు తెలియచేస్తూ ఉంటుంది. రోడ్డు పక్కన ట్రక్కు ఆపి వంట చేసుకుని తోటి డ్రైవర్లతో కలిసి తినడం ఆ వీడియోలు కనపడుతుంది. ఒకసారి అత్తగారిని తీసుకుని ఆమె ట్రక్కులోనే లాంగ్ జర్నీ చేసింది. కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ నడిపి వార్తల్లోకి ఎక్కింది జెలజ . ‘వాష్రూమ్లు ఒక్కటే ఇబ్బంది. పెట్రోల్ బంకుల్లో ఉన్నవాటిని ఉపయోగిస్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో పోలీసులు పీక్కు తింటారు మామూళ్ల కోసం. మిగిలిన రాష్ట్రాలు పర్లేదు. ఇక దొంగల భయం ఉంటుంది. కాని హైవేల మీద తిరగ్గా తిరగ్గా ఆ భయం పోయింది’ అంటుంది జెలజ. -
టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ను జాతీయ స్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలు వరించాయి. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో ఈ అవార్డులు లభించాయి. నష్టాలను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో అంతర్గతంగా చేస్తున్న కొత్త ఆవిష్కరణలకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 2022–23కుగాను తెలంగాణ ఆర్టీసీని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. నాలుగు ఫస్ట్.. ఒకటి సెకండ్.. రోడ్డు భద్రత విభాగానికి సంబంధించి మఫిసిల్ కేటగిరీ (బస్సుల సంఖ్య 4,001–7,500 ఉన్న సంస్థల పరిధి)లో ఆర్టీసీ మొదటి స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ... రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమేయం తక్కువ ఉండేలా చూడటంలో టీఎస్ఆర్టీసీ తొలి నుంచీ టాపర్గా ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు కారణమైన నిష్పత్తి 0.05గా ఉంది. ఇంధన పొదుపులోనూ ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరుకు తిరిగే కిలోమీటర్ల (కేఎంపీఎల్) విషయంలో ఉత్తమంగా నిలిచింది. మఫిసిల్ కేటగిరీలో 5.35 కేఎంపీఎల్తో మొదటి స్థానం, పట్టణ ప్రాంతాల కేటగిరీలో 4.61 కేఎంపీఎల్తో రెండో స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరు డీజిల్కు దాదాపు 5.14 కి.మీ. మేర తిరుగుతున్నాయి. ఇక సిబ్బంది సంక్షేమం, ఉత్పాదకత కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేసింది. తీవ్ర గుండె సమస్యలున్న 250 మందిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తోంది. సిబ్బంది నైపుణ్యం పెరిగేలా సామూహిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి ఈ పురస్కారం లభించింది. డిజిటల్ కార్యక్రమాల అమలు విభాగంలోనూ సంస్థకు మొదటి స్థానం సాధించింది. ప్రయాణికులు, సిబ్బంది కోసం కొత్త యాప్లు, టికెట్ల రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు, బస్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్ తదితరాలకు ఈ పురస్కారం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ పురస్కారాలు లభించాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనగా ఉత్తమ పనితీరుతో టీఎస్ఆర్టీసీ దేశంలోని ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
కొలంబియా పల్లెల్లో రోజూ స్టంట్లే
-
బొమ్మ కోసం ఆర్డర్.. భారీ విగ్రహం డెలివరీ!
తల్లితండ్రులు తమ పిల్లలపై చూపే ప్రేమకు హద్దులంటూ ఉండవు. పిల్లల కోర్కెలు తీర్చేందుకు, వారి ఆశలు నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుమారునిపై తండ్రికి ఉన్న ప్రేమకు పరాకాష్ఠగా నిలిచింది ఈ ఉదాహరణ. నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఎలాగైనా తెచ్చివ్వాలని తండ్రి భావించాడు. ఈ బొమ్మ కోసం కొడుకు పట్టిన మంకుపట్టు ఆ తండ్రికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకపోగా, అదొక ఛాలెంజ్గా అనిపించింది. కుమారుడు కోరిన బొమ్మ అత్యంత భారీగా ఉండటంతో దానిని ఇంటికి తెచ్చేందుకు తండ్రి క్రేన్ను కూడా బుక్ చేయాల్సివచ్చింది. ‘మిర్రర్’ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్న్కు చెందిన ఆండ్రీ బిస్సన్ను అతని నాలుగేళ్ల కుమారుడు థియో.. తనకు డైనోసార్ బొమ్మకావాలని కోరాడు. ఆ పిల్లాడు ఆడుకునేందుకు అనువైన బొమ్మను అడిగినప్పటికీ అతని చెంతకు అత్యంత భారీ విగ్రహం చేరింది. కుమారుడు కోరిన విధంగా ఆండ్రీ బిస్సన్ ఆన్లైన్లో డైనోసార్ బొమ్మను ఆర్డర్ చేశాడు. అయితే అతను ఆర్డర్ చేసింది ఒక బొమ్మ కాదని బాగా ఎత్తుగా ఉన్న విగ్రహం అని అతనికి లేటుగా తెలిసింది. ఆండ్రీ బిస్సన్ ఈ విగ్రహాన్ని వెయ్యి యూరోలు అంటే మన కరెన్సీలో రూ. ఒక లక్షా 5 వేల మొత్తానికి కొనుగోలు చేశాడు. ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు క్రేన్ అవసరమయ్యింది. ఆన్లైన్లో అమ్యూజ్మెంట్ పార్క్ క్లియరెన్స్ సేల్లో ఆండ్రీ ఈ విగ్రహాన్ని కనుగోలు చేశాడు. ఈ ఉదంతం గురించి ఆండ్రీ బిస్సన్ మీడియాతో మాట్లాడుతూ ఈ బొమ్మ ఇది 3 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల వెడల్పు ఉంటుందని తాను అనుకున్నానని, అయితే, ఆ బొమ్మ ఐదు మీటర్ల ఎత్తు ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు. డెలివరీ కంపెనీ ఆండ్రీ బిస్సన్కు ఫోన్ చేసి, లారీలో విగ్రహం సరిపోదని, అది రెండు టన్నులు ఉండడంతో జేసీబీలో తీసుకొస్తున్నామని తెలిపారు. ఆ డైనోసార్ విగ్రహం చాలా బరువు ఉన్నందున అది ఆండ్రీ బిస్సన్ ఇంటికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. -
ఛత్తీస్గఢ్ నుంచి అయోధ్యకు.. సుగంధభరిత బియ్యం, భారీగా కూరగాయలు
ఛత్తీస్గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుగంధభరిత బియ్యాన్ని పంపనుంది. అలాగే ఈ ప్రాంతపు రైతులు తాము పండించిన కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. రాజధాని రాయ్పూర్లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి పాల్గొని, ఆలయ ప్రాంగణం నుంచి 300 మెట్రిక్ టన్నుల సుగంధభరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన 11 ట్రక్కులకు పచ్చజెండా చూపారు. ఇదిలావుండగా సీఎం విష్ణు దేవ్సాయి తన సోషల్ మీడియా ఖాతాలో ‘రాముని దర్శనం కోసం ఆతృతగా వేచిచూస్తున్నాం. జనవరి 22న అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. రాష్ట్రంలోని రైతులు వారి పొలాల్లో పండించిన 100 టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడు ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు. ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్న రాష్ట్రంలోని రైతులు అభినందనీయులు’ అని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్గఢ్ రైస్మిల్లర్లు అయోధ్యకు సుగంధభరిత బియ్యం పంపినందుకు సీఎం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! राम काज करिबे को आतुर... आगामी 22 जनवरी को अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र जी की मूर्ति की प्राण प्रतिष्ठा होने वाली है, जिस पर हर सनातनी को गर्व है। मेरे प्रदेश के अन्नदाताओं ने भी राम काज के लिए अपने खेतों से उगाई गई 100 टन सब्जियां राम मंदिर निर्माण कार्य… pic.twitter.com/fD3OvLiod0 — Vishnu Deo Sai (@vishnudsai) January 2, 2024 -
సరుకు రవాణాల్లో ఏపీ భేష్
సులభతర సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. లాజిస్టిక్ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర వాణిజ్య శాఖ కొనియాడింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్(లీడ్స్)–2023 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సాక్షి, అమరావతి: దేశంలో సులభతర రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి 2018 నుంచి సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలు తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు విధానాలు, ప్రాజెక్టులను నివేదికలో ఉదహరించింది. లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదా ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడాన్ని అభినందించింది. భూ కేటాయింపుల్లోనూ బెస్ట్ దేశంలో ఎక్కడా లేని విధంగా చౌక సరుకు రవాణా కోసం ఏపీలో భారీ ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారని లీడ్స్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్తో కలిసి విశాఖ, అనంతపురంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు పార్కులకు ప్రతిపాదనలను పంపినట్లు వివరించింది. వివిధ పారిశ్రామిక పార్కుల సమీపంలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, మచిలీపట్నం, విజయవాడ/గుంటూరు, కాకినాడల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇందుకోసం 2,500 ఎకరాలు కేటాయిస్తోందని.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో భూమిని కేటాయించలేదని నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ రంగంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వడాన్ని ప్రశంసించింది. స్మార్ట్పోర్ట్ కార్యక్రమం కింద పోర్టు ఆధారిత సేవలన్నీ పారదర్శకంగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది. ఏపీలో అభివృద్ధి కనిపిస్తోంది మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని, వీటిని వినియోగిస్తున్న వారు ప్రభుత్వ చర్యలను కొనియాడుతున్నారని ‘లీడ్స్’ నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం.. ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో విధానం ‘స్పందన’ తీసుకురావడం వంటి విధానాల వల్ల తీరప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతుల కల్పన అధికంగా ఉందని.. రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఏపీ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను నిరి్మస్తుండటంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుండటాన్ని ప్రశంసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించింది. -
బుకింగ్లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
స్కై బస్సు సర్వీస్ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?
భారతదేశంలో స్కై బస్సు రవాణా సౌకర్యంపై మరోమారు చర్చ మొదలైంది. దేశంలో స్కై బస్సు వ్యవస్థను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్లో స్కై బస్సు సర్వీస్ ప్రారంభమైతే పలునగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. స్కై బస్సు సర్వీసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్కై బస్సు అనేది మెట్రో మాదిరిగానే చౌకైన, పర్యావరణ అనుకూల పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ. ఇది ఎలివేటెడ్ ట్రాక్ను కలిగి ఉంటుంది. స్కై బస్సులు సుమారుగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఇవి విద్యుత్ శక్తితో నడుస్తాయి. వీటి నిర్వహణకు మెట్రో కంటే తక్కువ ఖర్చు అవుతుంది. స్కై బస్ అనేది విలోమ కాన్ఫిగరేషన్ వాహనం. దీని చక్రాలు, ట్రాక్లు ఒక మూసివున్న కాంక్రీట్ బాక్స్ మధ్య అమరి ఉంటాయి. ఈ వ్యవస్థలో పట్టాలు తప్పడం లాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 2003లో నూతన సంవత్సర కానుకగా గోవాకు స్కై బస్సు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.100 కోట్లతో ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్ట్ మపుసా నుండి పనాజీకి అనుసంధానించాలనుకున్నారు. దీని ప్రారంభ మార్గం 10.5 కి.మీ. అయితే 2016లో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ స్కై బస్ ప్రాజెక్ట్ను రద్దు చేసింది. ఆ సమయంలో అది లాభదాయకం కాదని, ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది? -
పీపుల్స్మేనిఫెస్టో
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 3,17,32,727 మంది. వీరిలో గ్రేటర్ను ఆనుకొని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఓటర్లు 1,04,90,621 మంది. అంటే దాదాపు మూడోవంతు మంది ఇక్కడే ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఎందరో ఉన్నారు. నగర ప్రజల మేనిఫెస్టోను అమలు చేయడమంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమలు చేసినట్లే. – సాక్షి, హైదరాబాద్ రవాణా.. అతిపెద్ద సమస్య నగరంలోని ప్రజలే కాక ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్నవారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రవాణా. జిల్లాల నుంచి నగర శివార్లలోకి రెండు గంటలలోపే చేరుకుంటున్నప్పటికీ, అక్కడి నుంచి నగరంలోని గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతోంది. ఇందుకు పరిష్కారంగా ఇస్నాపూర్ నుంచి షాద్నగర్ వరకు, యాదాద్రి నుంచి చౌటుప్పల్ వరకు.. నగరం నలువైపులా ఎటునుంచి ఎటు వెళ్లేందుకైనా మెట్రో రైలు కావాలంటున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ప్రజారవాణా పెరగాలి. ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు నిర్మించినా ట్రాఫిక్ ఇక్కట్లు తీరలేదు. ట్రాఫిక్ జామ్లు తప్పేలా లింక్రోడ్లు పెరగాలి. అన్ని రద్దీప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జీలుండాలి. వరద ముంపు తప్పాలి విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో వానొస్తే నాలాల్లో మరణాలు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి నాలాలన్నింటినీ ఆధునీకరించాలి. నాలాల మరణాలు తప్పేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రయాణ దూరాభారం తగ్గించేందుకు మూసీపై 14 వంతెనలు అందుబాటులోకి రావాలి. అపరిమిత ఇంటర్నెట్.. మొబైల్ లేనిదే చేయి విరిగినట్లుగా భావిస్తున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో అన్ని వేళలా ఉచిత ఇంటర్నెట్ ఉంటే ఎంతో మేలంటున్నారు. ప్రజలకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే సదుపాయం ఉన్నా, ఇంటర్నెట్కు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండరాదని, అందులోనూ అంతరాయాలు ఉండొద్దని బలంగా కోరుకుంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు, ఆయా ప్రాంతాల్లో రద్దీ తెలుసుకునేందుకు సింగిల్యాప్ లాంటిది కావాలని కోరుకుంటున్నవారెందరో ఉన్నారు. ఉద్యోగాలు.. సొంతిళ్లు.. ఆరోగ్య బీమా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు సొంతిళ్లు లేనివారికి నెలనెలా ఈఎంఐలతో గృహ సదుపాయం కల్పించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లేదా కనీసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని అలవెన్సులు, సకాలంలో ఉద్యోగాల భర్తీ, పేదలకు ఉచిత వైద్యంతోపాటు అవసరమైన పక్షంలో శస్త్రచికిత్సలకు ఉపకరించేలా ప్రభుత్వమే ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలంటున్నారు. 24 గంటలు స్వచ్ఛమైన నీరు కరెంటు కష్టాలు తీరినప్పటికీ నగరంలో నీటి ఇబ్బందులున్నాయి. నిర్ణీత వేళల్లో కాకుండా 24 గంటలు ఎప్పుడు నల్లా తిప్పినా తాగునీరొచ్చే సదుపాయం ఉండాలంటున్నారు ప్రజలు. -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్షాప్లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్షాప్ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్షాప్లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్షాప్లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
ఎక్స్ట్రూజన్పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్ల తయారీకి వీలుగా ఎక్స్ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్లకోసం ఎక్స్ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్ హోల్సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది. -
అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబును నమ్ముకున్న ఏ ఒక్కరూ సక్రమమైన దారిలో నడిచినట్టు చరిత్రలో లేదు. అమరావతిని బాహుబలి సినిమాలో మాదిరిగా రూపొందిస్తానంటూ సింగపూర్ బృందాన్ని విజయవాడలో దింపి.. ఠక్కుఠమార విద్యలన్నీ ప్రదర్శించిన బాబు డొల్లతనం ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడుతోంది. చంద్రబాబుతో కలిసి అమరావతిని ఏదో చేస్తామని చెప్పిన సింగపూర్ బృంద నాయకుడు ఈశ్వరన్ ఇప్పుడు కీలక నేరాల్లో చిక్కుకుని పదవికి దూరమయ్యారు. ఇక్కడి సిబిఐని మేనేజ్ చేసుకుని కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు.. ఇప్పుడు సింగపూర్ లో CBIకి సమానమై CPIB ని ఈశ్వరన్ కోసం ఏ రకంగా ప్రభావితం చేస్తాడో చూడాలి. బాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అసలు రూపం ఇది ఈశ్వరన్ సింగపూర్ దేశంలో రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీగా నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు తీవ్రత ఏంటీ? ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాలేంటీ? దేశానికి ఏ రకంగా నష్టం జరిగింది? అన్న వివరాలను అక్కడి దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఒక హైప్రొఫైల్ కేసు అని, అత్యంత కీలక అంశాలతో ముడిపడి ఉన్న విషయమని సింగపూర్ వర్గాల సమాచారం. అందుకే ఈశ్వరన్ ను విచారించేందుకు అక్కడి దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానిని అనుమతి అడగ్గానే ఆయన స్పందించారు. ఈశ్వరన్ ను అధికారికంగా విచారిస్తామంటూ డైరెక్టర్ డెనిస్ టాంగ్ ప్రధాని లీ అనుమతిని కోరారు. ఈ నేపధ్యంలో తాను జూలై 6న సీపీఐబీ డైరెక్టర్కి సమ్మతి తెలిపానని, ఆ తర్వాత అధికారిక విచారణ జూలై 11న ప్రారంభమైందని ప్రధాన మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఈశ్వరన్ను ఆదేశించినట్లు ప్రధాని లీ తెలిపారు. On 5 July, Director CPIB briefed me on a case and sought my concurrence to open a formal investigation. Minister S Iswaran is assisting with investigations and will take a leave of absence. SMS Chee Hong Tat will be Acting Minister for Transport. – LHL https://t.co/0ut4SRoTfG — leehsienloong (@leehsienloong) July 12, 2023 ఎవరీ ఈశ్వరన్ అమరావతి విషయంలో ఎన్నో కొత్త విషయాలను తెరమీదికి తెచ్చారు చంద్రబాబు. అందులో ముఖ్యమైంది రైతుల భూమిని సేకరించి అభివృద్ధి చేసి మళ్లీ ఇస్తానని. ఇందులో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. మే 17, 2017న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరిపి MOUలో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అమరావతి భూములను అభివృద్ధి చేసినందుకు సింగపూర్ ప్రభుత్వానికి 58% వాటా, ఏపీ ప్రభుత్వానికి 42% వాటా ఉంటుందని బాబు చెప్పారు. ఈ సింగపూర్ కన్సార్టియానికి మంత్రి ఈశ్వరన్ నేతృత్వం వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేముంది విడతల వారీగా సింగపూర్ బృందాలు విజయవాడ రావడం, ప్రతీ నెలా సమావేశాలు పెట్టడం.. అదిగో ఇదిగో అంటూ రకరకాల ఊహాచిత్రాలను విడుదల చేయడం జరిగింది. అయిదేళ్లలో చంద్రబాబు గానీ, ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియం గానీ చేసిందేమీ లేదు. "Director of the Corrupt Practices Investigation Bureau (CPIB) briefed me on a case CPIB had uncovered... This would involve interviewing Minister S Iswaran, among others... I have instructed Minister Iswaran to take leave of absence until these investi... https://t.co/KkMSp0rhB2 — The Independent Singapore (@IndependentSG) July 12, 2023 2019లో ఏం తేలింది? 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. అదే సమయంలో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి ఒప్పందం గురించి పరిశీలించగా.. అసలు ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియానికి సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. సింగపూర్ లోని కొన్ని సంస్థలు కలిసిందే కన్సార్టియం తప్ప చంద్రబాబు అప్పటివరకు చెప్పినట్టు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని తేలింది. (చదవండి : కన్సార్టియం పేరిట బాబు అక్రమాలు ఇవి) ‘పక్షపాతం లేకుండా దర్యాప్తు’ ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరన్ మీద ఆరోపణలు రావడంతో అక్కడి దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను వెలికితీయడానికి, సత్యాన్ని నిరూపించడానికి, చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి, దృఢ సంకల్పంతో ఈ కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొంది. CBIP చేపట్టే అన్ని కేసులను పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తుందని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడే పార్టీలపై చర్య తీసుకోవడానికి వెనుకాడదని ఆ ప్రకటనలో పేర్కొంది. మరో వైపు ఈశ్వరన్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా సీపీఐబీ విచారిస్తుందని ప్రధాన మంత్రి లీ సియన్ లూంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో బయటపెట్టిన ఒక కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐబీ డైరెక్టర్ తనకు సమాచారం అందించారని ప్రధాని లీ చెప్పారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఈశ్వరన్ రాజకీయ జీవితం.. మంత్రి ఈశ్వరన్ రాజకీయ జీవితం 1997లో వెస్ట్ కోస్ట్ GRCకి పార్లమెంటు సభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుండి ప్రారంభమయ్యింది. 26 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2006లో క్యాబినెట్లోకి ప్రవేశించకముందు అనేక ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీలలో సభ్యనిగా కొనసాగారు. సెప్టెంబర్ 2004 నుండి జూన్ 2006 వరకు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. మే 2021 నుండి రవాణా మంత్రిగా ఉన్నారు. మే 2018 నుండి వాణిజ్య సంబంధాల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఈశ్వరన్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలలో మంత్రి పదవులను కూడా నిర్వహించారు. మే 2011 నుండి సెప్టెంబర్ 2015 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రిగా కూడా ఉన్నారు. రాజకీయాలలో ప్రవేశించక ముందు ఈశ్వరన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు టెమాసెక్ హోల్డింగ్స్తో సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేశారు. ఈశ్వరన్ ను పక్కకు తప్పించడంతో ఆయన బాధ్యతలను సింగపూర్ సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ పర్యవేక్షిస్తారని ప్రధాని తెలిపారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఇది కూడా చదవండి: ‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్న చీరతో’.. -
గోవా టూ గోదావరి.. కేడీ లేడీల లిక్కర్ దందా
కైకలూరు: ఏలూరు జిల్లాలోకి గోవా మద్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కైకలూరు రైల్వేస్టేషన్లో బుధవారం ముగ్గురు మహిళల నుంచి 24 బ్యాగులలో ఏకంగా 2,949 మద్యం బాటిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.4,54,400 ఉంటుందని అంచనా. తెలంగాణ కాదు.. గోవా బెటర్ గతంలో తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకి తెచ్చేవారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణాకు చెక్పోస్టుల వద్ద అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు ట్రైన్ల ద్వారా గోవా నుంచి ఏపీ రవాణా చేస్తున్నారు. వామ్మో కిలాడీ లేడీస్ బాపట్ల జిల్లా చీరాల మండలం, ఓడరేవుల గ్రామం వైఎస్సార్కాలనీకి చెందిన మహిళలు ఈ మద్యం రవాణాలో కీలక పాత్ర పోషిస్తోన్నారు. గతంలో వీరిపై సారా విక్రయ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొందరు ముఠాలుగా ఏర్పడి ముంబయి మీదుగా గోవాకు రైలులో చేరుకుంటున్నారు. కొన్ని రైళ్లే కన్వినీయంట్ అక్కడ మద్యం కొనుగోలు చేసి తిరిగి ముంబయి–విశాఖ ఎల్టీటీ రైలు ద్వారా ఆంధ్రాకు వస్తున్నారు. ఇలా నెలలో ముఠాలు రెండు సార్లు వెళ్లి వస్తున్నారు. గోవాలో కొనుగోలు చేసిన మద్యం సీసాలను లగేజీ బ్యాగ్లలో ప్యాకింగ్ చేయడానికి ప్రత్యేక ముఠా గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. గస్తీ లేని స్టేషన్ల ఎంపిక గోవా నుంచి ముంబయి, విజయవాడ మీదుగా విశాఖపట్నం ఎల్టీటీ రైలు రాత్రి వేళలో ప్రయాణిస్తోంది. ఈ రైలును అక్రమ రవాణాకు ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల మాదిరిగా నలుగురు మహిళలు వేర్వేరు బోగీలలో మద్యం సీసాల లగేజీ బ్యాగులను సీటు అడుగుభాగంలో ఉంచుతున్నారు. లగేజీ మాటున లిక్కర్ ఉదయం విజయవాడ దాటిన తర్వాత రైల్వేస్టేషన్లలో పోలీసుల గస్తీ తగ్గుతుంది. విజయవాడ స్టేషన్ తర్వాత ఎల్టీటీ ట్రైన్ గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం వంటి స్టేషన్లలో ఆగుతోంది. వీరు కై కలూరు, ఆకివీడు స్టేషన్లలో లగేజీలు దించుతున్నారు. ఎక్స్ ప్రెస్ నుంచి ప్యాసింజర్ ఆ తర్వాత పాసింజర్ రైలులో ఎక్కించి రామవరప్పాడు స్టేషన్లో దిగి అక్కడ నుంచి వాహనాల ద్వారా అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ముఠాలో సభ్యులు ఆయా స్టేషన్ల వద్ద ముందుగానే ఉంటూ ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా మహిళలకు సమాచారాన్ని అందిస్తున్నారు. లాభం ఎంతంటే.? గోవాలో ఫుల్బాటిల్ ధర రూ.270 ఉంటే ఇక్కడ రూ.800 నుంచి రూ.1000, క్వార్టర్ బాటిల్ రూ.26 ఉంటే ఇక్కడ రూ.150 నుంచి రూ.200కి విక్రయిస్తున్నారు. రైలులో వీరు బ్యాగులను అక్కడక్కడ సీట్ల కింద ముందుగానే సర్ధుతున్నారు. దీంతో పోలీసులు ప్రయాణికుల బ్యాగులుగా భావించి తనిఖీ చేయడం లేదు. రైల్వే పోలీసుల నిఘా లేనిచోట ముందుగానే గమనించి ఆ స్టేషనలో అక్రమ మద్యాన్ని దించుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు అడ్డుకుంటాం స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో(సెబ్) సిబ్బంది మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేస్తుంది. పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. రైలు, బస్ స్టేషన్ల వద్ద ఎవరైన అనుమానంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో మరిన్ని తనిఖీలు చేపడతాం. – ఆకుల రఘు, పట్టణ సీఐ, కై కలూరు -
చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు..
చైనా లోకల్ ఉత్పత్తులను భారత్లో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. చాలామంది చైనా వస్తువులకు ఎటువంటి గ్యారెంటీ ఉండదంటూ హేళన చేస్తుంటారు. అయితే చైనా టెక్నాలజీ, అధునాతన ఉత్పత్తులు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంటాయి. టెక్నాలజీ పరంగా చైనా ఎంత వేగంగా దూసుకుపోతున్నదనే విషయాన్ని అవి తెలియజేస్తుంటాయి. అధునాతన రైళ్లు అనగానే ముందుగా చైనా, జపాన్ గుర్తుకువస్తాయి. ఈ దేశాల రైళ్ల వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చైనా రైల్వే టెక్నాలజీ మరో అద్భుతాన్ని చేసి చూపింది. తాజాగా చైనా19వ అంతస్థుల నివాసిత బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే ట్రాక్ను రూపొందించింది. ప్రజలు ఉండే ఈ భవనం ఇప్పుడు రైల్వే స్టేషన్గానూ మారిపోయింది. బిల్డింగ్ మధ్య నుంచి వెళ్లే రైలు చైనా రైల్వే సిస్టం అద్భుతమైనది. ప్రపంచంలో ట్రాక్ లేకుండా రైలు నడిపిన ఘనత కూడా చైనాకే దక్కింది. హైస్పీడ్ నెట్వర్క్ను మరింతగా విస్తరిస్తూ ప్రయాణికులకు చైనా మరింత ఉత్తమ సేవలు అందిస్తోంది. అందుకే కొందరు చైనా రైల్వే సేవలు ప్రపంచంలోనే అత్యుత్తమని అంటుంటారు. తాజాగా చైనా ఒక బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే ట్రాక్ నిర్మించింది. ఈ బిల్డింగ్ మధ్య నుంచి రోజూ రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. 19 అంతస్థుల ఈ బిల్డింగ్లోని 6వ, 8వ ఫ్లోర్లపై రైల్వే ట్రాక్ నిర్మించారు. భవనం మధ్య నుంచి ట్రాక్ నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. బిల్డింగ్లోని వారికి ఇబ్బంది కలుగకుండా.. చైనా ఈ రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నప్పుడు ఈ మార్గంలో 19 అంతస్థుల బిల్డింగ్ అడ్డుగా నిలిచింది. అయితే రైల్వేశాఖ బిల్డింగ్ యజమానులను సంప్రదించి బిల్డింగ్ మధ్యగా ట్రాక్ వేసేందుకు అనుమతి పొందింది. అనంతరం బిల్డింగ్ మధ్య నుంచి ట్రాక్ వేశారు. ఇది ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ భవనంలో ఉంటున్నవారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఈ ట్రాక్ రూపొందించారు. ఈ ట్రాక్ వలన భవనంలో నివాసం ఉంటున్నవారికి మరో ప్రయోజనం కూడా చేకూరింది. వారికంటూ ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ ఏర్పడింది. దీంతో వారు ఇంటి నుంచి బయటకు వచ్చి, నేరుగా రైలులోనే కూర్చుని తదుపరి స్టేషన్కు చేరుకుంటారు. ఇక రైలు నుంచి వచ్చే శబ్ధం బిల్డింగ్లోని వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు సైలెన్సింగ్ టెక్నిక్ వినియోగించారు. ఇది కూడా చదవండి: ఎన్నారై డాక్టర్ చేసిన తప్పేంటి? మెడికల్ లైసెన్స్ ఎందుకు లాక్కున్నారు? -
అది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్.. ఒక సీక్రెట్ ప్లాట్ఫారం కూడా!
భూమిపై నడిచే ప్రజారవాణా వ్యవస్థలలో రైలు అత్యంత చౌకైన ప్రయాణ సాధనమని చెప్పుకోవచ్చు. ఇది ప్రయాణాలకు ఎంతో సౌలభ్యకరమైనదని కూడా అంటారు. అయితే రైలులో ప్రయాణించేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాల్సివుంటుందనే సంగతి మనకు తెలిసిందే. స్టేషన్లలోని ప్లాట్ఫారాల వద్దకు వచ్చి రైళ్లు ఆగుతుంటాయి. అప్పుడు ప్రయాణికులు రైలులోకి ఎక్కుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫారం విషయానికొస్తే అది మన దేశంలోనే ఉంది. కర్నాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్ (Hubballi Railway Station)లోని ప్లాట్ఫారం నంబరు-8 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం. దీని పొడవు 1507 మీటర్లు. ఇక అతిపెద్ద రైల్వే స్టేషన్ విషయానికొస్తే హౌరా జంక్షన్ ముందు వరుసలో ఉంటుంది. ఈ స్టేషన్లో మొత్తం 26 ప్లాట్ఫారాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వేస్టేషన్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (Grand Central Terminal) రైల్వేస్టేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్. దీని నిర్మాణం 1903 నుంచి 1913 మధ్యకాలంలో జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ రైల్వేస్టేషన్లో మొత్తం 44 ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వేస్టేషన్లో రెండు అండర్గగ్రౌండ్ లెవెల్స్ ఉన్నాయి. దీనిలోని పైలెవెల్లో 41 ట్రాకులు, కింది లెవెల్లో 26 ట్రాకులు ఉన్నాయి. ఈ స్టేషన్ మొత్తం 48 ఎకరాల్లో నిర్మితమయ్యింది. ఈ స్టేషన్ మీదుగా ప్రతీరోజు మొత్తం 660 మెట్రో నార్త్ ట్రైన్స్ నడుస్తాయి. లక్షా 25వేల మందికి మించిన ప్రయాణికులు ప్రతీరోజూ ఈ రైళ్లలో ప్రయాణిస్తారు. ఈ రైల్వే టెర్మినల్లో ఒక సీక్రెట్ ప్లాట్ఫారం కూడా ఉంది.అది Waldorf Astoria హోటల్కు సరిగ్గా దిగువన ఉంది. నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్డ్ ఈ ప్లాట్ఫారం వినియోగించేవారని చెబుతారు. హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన దీనిని వినియోగించేవారట. ఈ సీక్రెట్ ప్లాట్ఫారం రెగ్యులర్ సర్వీసుల కోసం వినియోగించకపోవడం విశేషం. -
యూత్ పవర్ అంటే ఇదే, త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సమీప భవిష్యత్తు అంతా భారతదేశానిదే ‘ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది. దేశంలోని కార్మికులు, కర్షకులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు,’ అన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష ప్రగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు ధంఖడ్. ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. ‘ప్రస్తుత భారత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు 2030 నాటికి పెరుగుతుంది. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా సాధించాలంటే–తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలు,’ అని డాయిష్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. తన అంచనాకు కారణాలు వివరిస్తూ, ‘ప్రస్తుత దశాబ్దంలో భారత్ మంచి ప్రగతి సాధించడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి తోడవుతున్నాయి,’ అని ఈ సంస్థ వివరించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థ దూకుడు నగదు వాడకం స్థానంలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత పెరిగింది. ఫైనాన్షియలైజేషన్ (మార్కెట్లు వంటి ఫైనాన్షియల్ సంస్థల సైజు, ప్రభావం పెరగడం) వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. పరిశుభ్రమైన ఇంథన వినియోగం వల్ల కూడా వ్యవస్థలో సామర్ధ్యం పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. మరో ప్రోత్సాహకర అంశం ఏమంటే–ఇండియాలో పనిచేసే వయసున్న జనాభా సైజు విస్తరించడం. ప్రస్తుతం ఇలాంటి యువత సంఖ్య 2007లో చైనాలో ఉన్న స్థాయిలో ఇండియాలో ఉంది. భారత సమగ్ర జీడీపీ, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఇదే విధంగా చైనాను పోలి ఉన్నాయి. వచ్చే పదేళ్లలో దేశంలో పనిచేసే యువతరం సంఖ్యకు అదనంగా 9 కోట్ల 80 లక్షల మంది తోడవుతారు. ప్రపంచంలో పనిచేసే జనాభా సంఖ్యలో పెరుగుదల ఒక్క ఇండియాలోనే 22 శాతంగా ఉంటుందని కూడా ఈ జర్మన్ సంస్థ అంచనావేసింది. సంతృప్తికర కొనుగోలు శక్తి ఉండే భారత మధ్య తరగతి ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం 37 కోట్ల 10 లక్షల మంది మధ్య తరగతి (మిడిల్ క్లాస్) దేశంలో వస్తు వినిమయం పెరగడానికి దోహదం చేస్తోంది. వచ్చే దశాబ్దాల్లో కూడా వినియోగం పెరగడానికి భారత మధ్య తరగతి ప్రజానీకం కారణమౌతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. భారత అభివృద్ధికి మరో కీలకాంశం ఏమంటే జేఏఎం (జన్ ధన్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్) అనే మూడు ఆయుధాలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పక్కదారులు పట్టకుండా కాపాడుతున్నాయి. జేఏఎం ద్వారా నగదు బదిలీ వేగంగా, సునాయాసంగా జరుగుతున్న కారణంగా కోట్లాది మంది సామాన్య ప్రజానీకానికి మేలు చేకూరుతోంది. మౌలిక సందుపాయాల్లో అత్యంత ప్రధానమైన రహదారుల అభివృద్ధి, విస్తరణ మున్నెన్నడూ లేని విధంగా ముందుకుసాగుతున్నాయి. రహదారుల వ్యవస్థకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల ఇప్పుడు దేశంలో రోజుకు సగటున 36 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు. గడచిన పది సంవత్సరాల్లో ఇండియాలో మొత్తం 73,000 కిలోమీటర్ల పొడవు గల రహదారులు నిర్మించారు. ఇటీవల కాలంలో దేశంలో విద్చుచ్ఛక్తి సరఫరా, శుభ్రమైన వంట పద్ధతులు అమలు చేయడంలో సాధించిన ప్రగతి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి పురికొల్పుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు -
రవాణా మరింత సులభతరం.. మరిన్ని గ్రామీణ రోడ్లకు మహర్దశ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా మరింత సులభతరం అవనుంది. పాడుబడిపోయిన పాత రోడ్లను పునర్నిర్మించి, ఆధునికంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంజీఎస్వై కింద 2,684 కిలోమీటర్ల రోడ్లను ఆధునీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో 916.22 కిలోమీటర్ల పొడవున రహదారులను పునర్నిర్మించనుంది. పీఎంజీఎస్వై ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో రూ. 1066.10 కోట్లతో 115 పాడుబడిన పాత తారు రోడ్లను పునర్నిర్మించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఆ రోడ్లలో 74 పెద్ద పెద్ద బ్రిడ్జిలను కూడా నిర్మిస్తారు. వీటి మొత్తం నిడివి 6918.97 మీటర్లు (అంటే దాదాపు ఏడు కిలో మీటర్లు) ఉంటుంది. వీటిలో 22 బ్రిడ్జిలు ఒక్కొక్కటి 150 మీటర్ల పొడవుకన్నా ఎక్కువ నిడివి ఉంటాయని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఎంపవర్డ్ కమిటీ మీటింగ్లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1,069 కిలోమీటర్ల పొడవున 131 తారు రోడ్ల పునర్నిర్మాణానికి రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారు. వీటిలో 115 రోడ్ల పునర్నిర్మాణానికి ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటిలో 153.01 కిలోమీటర్ల మేర రోడ్లను 5.5 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్కు రూ.85.20 లక్షల ఖర్చుతో పునర్నిర్మిస్తారు. మిగిలిన రోడ్లను 3.75 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్కు 58.41 లక్షలతో పునర్నిర్మిస్తారు. పీఎంజీఎస్వై కింద ఈ రోడ్ల ఆధునీకరణకు అయ్యే ఖర్చులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ రోడ్లకు అంచనాలు ఇప్పటికే పూర్తయినందున, కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. పీఎంజీఎస్వై పథకంలోనే 2684 కి. మీటర్ల కొత్త రోడ్లు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 1.25 లక్షల కిలోమీటర్ల మేర పాత రోడ్ల పునర్నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ 2019లో పీఎంజీఎస్వై –3ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవున రోడ్ల ఆధునీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత నాలుగేళ్లలో అందులో 2,314 కిలోమీటర్ల రోడ్లకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటిలో 1804 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి తోడు పీఎంజీఎస్వై, ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ (నక్సల్స్, తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం) కింద గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి పలు రోడ్లను కేంద్రం మంజూరు చేసింది. వాటికి నిధులు కూడా విడుదల చేసింది. అయినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పనులు పూర్తి చేయలేదు. ఇలా పెండింగ్లో ఉన్న 880 కిలోమీటర్ల రహదారులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో పూర్తి చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మొత్తం 2,684 కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తయిన పనులకు బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. -
రైలెక్కట్లేదు.. విమానం దిగట్లేదు.. ప్రజల్లో వచ్చిన మార్పుకు కారణమిదే!
విమాన ప్రయాణికుల రద్దీపెరిగినంత వేగంగా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగటం లేదు. కోవిడ్–19 కారణంగా క్షీణించిన ప్రజా రవాణా నెమ్మదిగా పుంజుకుంటున్నా.. కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి ద్రవ్యోల్బణమే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ తర్వాత ప్రయాణాల రద్దీ పెరుగుదల ఆర్థిక వృద్ధికి ప్రత్యక్ష సూచికగా నిలుస్తుందని చెబుతున్నారు. కానీ.. కోవిడ్ ముందు సాగినన్ని ప్రయాణాలు ప్రస్తుతం కనిపించటం లేదని స్పష్టం చేస్తున్నారు. కనిపించని మునుపటి మార్క్.. కరోనాకు ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,674 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 5,858 మిలియన్ల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే ప్రయాణికుల బుకింగ్ 1,816 మిలియన్లు కంటే ఎక్కువ తగ్గింది. 2022–23తో పోలిస్తే.. 2019–20 కంటే 24 శాతం తక్కువ రద్దీని సూచిస్తోంది. సబర్బన్ ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల ఉండగా.. నాన్–సబర్బన్ ప్రాంతాల్లో 29 శాతం తగ్గుదల నమోదైంది. నేషనల్ ట్రాన్స్పోర్ట్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రైల్వే 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి మార్చి (2022–23) వరకు రూ.54,733 కోట్ల రాబడి వస్తే.. గత ఆర్థిక ఏడాదిలో ఇది రూ.31,634 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే రైలు ప్రయాణాల్లో వృద్ధి కనిపిస్తున్నా.. 2019–20 కాలం నాటి గణాంకాలతో పోలిస్తే మాత్రం తక్కువగానే ఉంది. ద్రవ్యోల్బణమే కారణం ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల కారణంగా ఆయా వర్గాల ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగకపోవడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. ఎగువ, ఉన్నత ఆదాయ వర్గాల వారిపై ద్రవ్యోల్బణం పెద్దగా ప్రభావం చూపని కారణంగా.. ఆ వర్గాల వారు విమానాల్లో యథావిధిగా ప్రయాణించగలుగుతున్నారని చెబుతున్నారు. విమానాలు ఎక్కేస్తున్నారు మరోవైపు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా వృద్ధి చెందుతూ కోవిడ్ ముందునాటి స్థితికి చేరింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) నివేదిక ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన సంస్థలు 1,360 లక్షల మంది ప్రయాణికులను తరలించాయి. ఇది 2021–22లో ప్రయాణించిన 852 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే 60 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అయితే, ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల రద్దీ 2020–21 ఆర్థిక సంవ్సతరంలో 1,415 లక్షల కంటే 4 శాతం తక్కువ. ఈ ఏడాది మార్చిలో 130 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 121 లక్షలు కాగా.. మార్చి నెలలో 8 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. 2022 మార్చిలో ఇది 106 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 22 శాతం వృద్ధిలో నడుస్తోంది. అదే 2019 మార్చిలో 116 లక్షలు ఉంటే ఇప్పటి మార్చి ప్రీకోవిడ్లో చూస్తే 12 శాతం పెరుగుదల కనిపిస్తోంది. సరుకు రవాణా పెరుగుతోంది దేశంలో అత్యధికంగా ఒక ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా చేసిన సంస్థగా రైల్వే రికార్డు సృష్టించింది. జాతీయ రవాణా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. 2022–23లో 1,512 మిలియన్ టన్నుల సరుకును రైల్వే రవాణా చేసింది. 2021–22లో 1,418 మిలియన్ టన్నులు తరలించింది. ఇక్కడ 2022–23లో రైల్వే మొత్తం ఆదాయం రూ.2.44 లక్షల కోట్లు కాగా.. 2021–22లో రూ.1.91 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో ఏకంగా 27.75 శాతం వృద్ధిని సూచిస్తోంది. – సాక్షి, అమరావతి -
భారత్ నుంచి బంగ్లాకు పైప్లైన్ ద్వారా డీజిల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్లైన్ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది. -
చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!
సాక్షి,పెనుకొండ: మండలంలోని శెట్టిపల్లికి చెందిన సిద్దయ్య టీడీపీ మండల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి, ఆయన అల్లుడు శశిభూషణ్కు నమ్మిన బంటు. పైకి రాజకీయ నేతగా కనిపించే సిద్దయ్య... చేసేదంతా అక్రమ దందానే. ఏళ్లుగా కర్ణాటక మద్యం అక్రమంగా జిల్లాకు తెచ్చి సొమ్ముచేసుకుంటున్నట్లు పచ్చ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్యే, అతని అల్లుడి పేర్లు చెప్పి మద్యం దందా జోరుగా సాగించాడు. అనంతపురంలో కాపురం..శెట్టిపల్లి నుంచి దందా.. అక్రమార్జనే పరమావధిగా పనిచేసిన సిద్దయ్య టీడీపీ హయాంలో అడ్డంగా సంపాదించాడు. అధికారులు ఎవరైనా దృష్టి సారిస్తే బీకే పేరు చెప్పి తప్పించుకునేవాడు. కానీ రాష్ర్టంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సిద్దయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పోలీసులకు భయపడి మకాం అనంతపురానికి మార్చాడు. అక్కడి నుంచే తన స్వగ్రామం శెట్టిపల్లిలో వ్యవహారాలు నడిపేవాడు. మూడేళ్లుగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తూ గ్రామీణుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. పగలంతా అనంతపురంలో ఖద్దరు దుస్తుల్లో కనిపించే సిద్దయ్య, రాత్రి కాగానే జిల్లా సరిహద్దులోని కర్ణాటకలోని మద్యం షాపుల్లో సరుకు కొని తన స్వగ్రామానికి తరలించేవాడు. అతను స్థానికంగా కనిపించపోవడంతో పోలీసులూ పెద్దగా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆధిపత్య పోరుతోనే... టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే సిద్దయ్య పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎవరినీ సంప్రదించకుండానే సిద్దయ్యను పార్టీ మండల కన్వీనర్గా ప్రకటించారు. దీంతో మండల కన్వీనర్ రేసులో ఉన్న నేతలంతా రగిలిపోయారు. కర్ణాటక మద్యం తెచ్చుకుని అమ్ముకునే సిద్దయ్యకు మండల కన్వీనర్ పోస్టు ఇవ్వడం ఏమిటని బీకేని కొందరు ప్రశ్నించారు. ఆయన పట్టించుకోకపోవడంతో పలువురు నేతలు టీడీపీకే చెందిన ఓ నాయకురాలి వర్గంలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలనూ ఎవరికి వారు నిర్వహిస్తూ ఆధిపత్య పోరు సాగించారు. పలు కార్యక్రమాల్లో సిద్దయ్యపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఉప్పందించిన ‘పచ్చ’ నేతలు.. సిద్దయ్య అక్రమ మద్యం దందా చేయడం...అలాంటి వ్యక్తికి బీకే సహకరిస్తూ మండల కన్వీనర్ పదవి ఇవ్వడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సిద్దయ్య కర్ణాటక మద్యం దందాపై పోలీసులకు పలుమార్లు ఉప్పందించినట్లు తెలుస్తోంది. అయితే మద్యం దందాలో ఆరితేరిపోయిన సిద్దయ్య... ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దయ్య తన అనుచరులతో కలిసి కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తీసుకువస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో బీకే వ్యతిరేక వర్గంలోని వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రి 12 గంటల ప్రాంతంలో మరవపల్లి సమీపంలో సిద్దయ్యతో పాటు అతని అనుచరులు పెనుకొండకు చెందిన దూదేకుల బాషా, ధర్మవరానికి చెందిన బిర్రు ప్రశాంత్కుమార్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కృష్ణారెడ్డిని పట్టుకున్నారు. మద్యం బాక్సులతో పాటు కారు, ద్విచక్ర వాహనం స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు కూడా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తమకు వచ్చిన పక్కా సమాచారంతోనే దాడి చేసినట్లు పేర్కొనడం విశేషం. కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలే టార్గెట్.. తన అనుచరులతో కలిసి కర్ణాటక అక్రమ మద్యం దందాను అత్యంత గుట్టుగా నిర్వహిస్తున్న సిద్దయ్య... కొత్తచెరువు–పుట్టపర్తి మండలాల్లోని పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మద్యాన్ని శెట్టిపల్లికి తీసుకువచ్చిన వెంటనే తన అనుచరులతో కలిసి గ్రామాల్లో... తమకు అనుకూలంగా ఉన్న మద్యం వ్యాపారులకు చేరవేసే వాడని తెలిసింది. తాను పెనుకొండ మండల టీడీపీ కన్వీనర్ కావడం వల్ల ఆ మండలంలో వ్యాపారం చేస్తే తెలిసిపోతుందని భావించే...పక్కన ఉన్న కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా అనంతపురం నుంచే ఫోన్ ద్వారా నడిపేవాడని తెలుస్తోంది. సంబరాల్లో మరో వర్గం.. మద్యం అక్రమ రవాణా చేస్తూ సిద్దయ్య పట్టుబడటంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు స్థానిక హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో సమావేశమై ఆనందోత్సాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోన్లలోనూ ‘సిద్దయ్య...దొరికిపోయాడు’ అని సంతోషంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ నాయకురాలికి ఫోన్లో తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. (చదవండి: సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్) -
ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్న జనం.. ఎందుకంటే!
ప్రజా రవాణా వ్యవస్థ పట్ల నగర వాసులకు ఆసక్తి సన్నగిల్లుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వేళాపాళలేకుండా రావడం, గంటలకొద్దీ వేచి చూడడం, ప్రయాణం ఆలస్యం కావడం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో నగర వాసులు ప్రజా రవాణాకు దూరమవుతున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 46 నగరాల్లో 2 లక్షల మంది పైగా తమ అభిప్రాయాలను సర్వేలో వ్యక్తపరిచారు. 15 వేల మంది పైగా బస్సు డైవర్లు, కండక్టర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. రద్దీ ఎక్కువ.. నమ్మకం లేదు విపరీతమైన రద్దీ కారణంగా బస్సులు ఎక్కడానికి భయపడుతున్నామని 68 శాతం మంది ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వెళితే సమయానికి గమ్యస్థానానికి చేరతామన్న నమ్మకం లేదని 64 శాతం మంది చెప్పారు. భద్రత పట్ల 36 శాతం మంది ఆందోళన వెలిబుచ్చారు. బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదని 27 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ చేయాలి ప్రజా రవాణా వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరగాలని జనం కోరుకుంటున్నారు. బస్సులు ఏయే మార్గాల్లో, ఏ సమయంలో వెళుతున్నాయి.. ఎక్కెడెక్కడ ఆగుతాయనే సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండాలని 57 శాతం మంది కోరుకున్నారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారిలో 54 శాతం మంది ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. సింగిల్ జర్నీ చేసే వారిలో 53 శాతం మంది నగదు చెల్లించేందుకే ఇష్టపడుతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లలో ఎక్కువ శాతం క్యాష్ పేమెంట్లకే ఆసక్తి చూపుతున్నారు. ట్రాఫిక్ జామ్లతో తంటా నగరాల్లో ట్రాఫిక్ జామ్లతో సతమతమవుతున్నామని 59 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు. ట్రాఫిక్ కారణంగానే సమయానుకూలంగా బస్సులు నడపలేకపోతున్నామని చెప్పారు. ఇక బస్సు సిబ్బందిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాదాపు 50 శాతం మంది రోగాల బారిన పడుతున్నారు. 34 శాతం మంది బస్సు డ్రైవర్లకు బీమా భద్రత లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లలో 45 శాతం మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అందని ద్రాక్షగానే ఉంది. ఒత్తిడి, ఆందోళన, కీళ్లు-ఒళ్లు నొప్పులు ఎక్కువగా వేధించే సమస్యలని వెల్లడించారు. సర్వే ఎందుకంటే.. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమంలో భాగంగా ‘ట్రాన్స్ఫోర్ట్ ఫర్ ఆల్ చాలెంజ్’ పేరుతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ సర్వే చేపట్టింది. 2021 అక్టోబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు సర్వే నిర్వహించింది. ప్రజా రవాణా వ్యవస్థలో సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడానికి ఇదంతా చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున సమాచారం సేకరించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. సర్వేలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రెండో దశలో ప్రయత్నాలు చేస్తామన్నారు. అంకుర సంస్థలు ఏమైనా పరిష్కారాలు ఉంటే స్టార్టప్ ఇండియా పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. (క్లిక్: కేపీహెచ్బీ టూ ఓఆర్ఆర్.. మెట్రో నియో పట్టాలెక్కేనా!) -
సరకు రవాణా ఖర్చులు తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ : వాటాదారులు మధ్య సహకారం, సమన్వయం, కమ్యునికేషన్లతో సరకు రవాణా ధరను 14 శాతం, 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్గడ్కరీ పిలుపునిచ్చారు. తద్వారా ఎగుమతుల్లో 50 శాతం పెరుగుదల సాధించొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో‘ క్లైమేట్ గోల్స్: టెక్నలాజికల్ రోడ్ మ్యాప్ టు నెట్ జీరో ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సమాజానికి ముఖ్యమైన మూలస్తంభాలని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు ఒక బృందంగా కలిపి పని చేస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరసం ఉందన్నారు. భారతదేశంలో యువ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ మానవశక్తితోపాటు తక్కువ కార్మిక వ్యయంతో దేశీయ మార్కెట్ ఉందన్నారు. బయో ఇథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ఆవశ్యకత వివరించారు. ఏటా 16 లక్షల కోట్ల శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి 27 గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలు రూపొందించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి గడ్కరీ వివరించారు. చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది! -
నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!
సాగర్ (మధ్యప్రదేశ్): కోట్లు విలువచేసే స్మార్ట్ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్ను నలుగురు దొంగలు లూటీ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా మహరాజ్పూర్ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. అయితే ఆ ఫోన్లన్నింటినీ 24 గంటల్లోపే పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మాత్రం పారిపోయారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన ఈ మొబైల్ ఫోన్లను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా హరియాణాలోని గురుగ్రామ్కు తీసుకెళ్తున్నారు. ట్రక్కును గురువారం రాత్రి నలుగురు దుండగులు అడ్డుకుని డ్రైవర్ను కిడ్నాప్ చేశారు. నరసింగాపూర్ వద్ద అతన్ని దింపేసి ఫోన్లను కంటైనర్ నుంచి తమ ట్రక్కులోకి మార్చుకుని పారిపోయారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలికి 400 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డగించడంతో ట్రక్కును వదిలేసి పారిపోయారు. మొత్తం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్ చెప్పారు. -
ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపు.. జాగ్రత్త సుమా!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు(నాటుబళ్లు)తో ప్రయాణం చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కె.నీలకంఠం హితవు పలికారు. ఈ మేరకు నాటుబళ్లతో రాత్రి పూట ప్రయాణం చేస్తున్న రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుబళ్లతో ఇసుక తరలించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బూర్జ, పెదంకలాం, లక్ష్మీపురం, చినభోగిలి, పెదభోగిలి, సీతానగరం, తామరఖండి అంటిపేట, వెంకటాపురం, నిడగల్లు, కాశీపేట, పణుకుపేట తదితర గ్రామాల్లో నాటుబళ్లు ఉన్న రైతులు సువర్ణముఖినదిలో రేవులనుంచి రాత్రిపూట ఇసుక తరలించి విక్రయాలు చేస్తున్నారన్నారు. రాత్రిపూట నాటుబళ్ల ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటుబళ్లు ఉన్న రైతులు బళ్లకు ‘రేడియం’ స్టిక్కర్లు విధిగా వాడాలని సూచించారు. రేడియం స్టిక్కర్లు అతికించడం వల్ల రాత్రిపూట ఎదురుగా రాక పోకలు చేస్తున్న భారీ వాహనాలకు నాటుబండి వస్తున్నట్లు తెలుస్తుంద న్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులున్న చోట భారీవాహనాల డ్రైవర్లు, నాటుబళ్లతో వెళ్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. -
దేశంలోనే తొలి 'ఎలక్ట్రిక్ హైవే'.. ఆ నగరాల మధ్య నిర్మాణం!
ఢిల్లీ: దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది భారత ప్రభుత్వం. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీబస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో నిర్వహంచిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.5 లక్షల సొరంగాలను నిర్మించినట్లు తెలిపారు. 'ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నాం. ట్రాలీబస్సుల మాదిరిగానే మీరు ట్రాలీట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం.' అని తెలిపారు. అయితే.. ఈ రహదారి గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ హైవే అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ హైవే అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాహనాలకు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవున ఓవర్హెడ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీబస్సులు, ట్రాలీట్రక్కులను ఉపయోగించటం ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు రవాణా సామర్థ్యం పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన. మరోవైపు.. పెట్రోల్, డీజిల్ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే.. అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, ఆర్టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే తమ లక్ష్యమన్నారు. వస్తు రవాణా వ్యయం చైనా, ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారత్లోనే అధికమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
ఇన్నోవాలో రెండు ఆవుల తరలింపు
కేతేపల్లి: ఇన్నోవా కారులో రెండు ఆవులను కుక్కి హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తుండగా గురువారం కేతేపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద గురువారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇన్నోవా కారులో రెండు ఆవులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి తెలిపారు. -
లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా ‘సహకార్’
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల రంగంలో దేశంలో ఓలా, ఉబర్ పెద్ద ఎత్తున చొచ్చుకుపోయాయి. ఇప్పుడు వీటికి పోటీగా మరో సంస్థ రాబోతోంది. లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా సహకార్ ట్యాక్సీ పేరుతో నేషనల్ టూరిజం, ట్రాన్స్పోర్ట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్ఎఫ్టీసీ) సేవలను పరిచయం చేయబోతోంది. కొరియర్ సేవల రంగంలోకి సైతం ప్రవేశించనున్నట్టు ఫెడరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ధరల కంటే చవకగా ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎన్ఎఫ్టీసీ చైర్మన్ వి.వి.పి.నాయర్ వెల్లడించారు. అధిక ప్రయోజనం డ్రైవర్లకు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించే సహకార్ ట్యాక్సీ ద్వారా కొన్నేళ్లలో 10 లక్షలకుపైగా మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్ఎఫ్టీసీ 2011 నుంచి సహకార రంగంలో సేవలు అందిస్తోంది. చదవండి: నితిన్ గడ్కారీ.. హైడ్రోజన్ ఫ్యూయల్పై భవీశ్ ఏమన్నాడో విన్నావా? -
ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తిపైనే ఆధారపడి ఉండదు: గోయల్
-
లక్కీ ‘పార్సిల్’: దక్షిణ మధ్య రైల్వే రికార్డు
సాక్షి, హైదరాబాద్: పార్సిళ్ల రవాణా విషయంలో చేసిన మార్పు రైల్వేకి కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో సాధారణ ప్రయాణికుల రైళ్లకు ఒకటి రెండు చొప్పున పార్సిల్ బోగీలను జత చేసేవారు. లగేజీ బుక్ చేసుకునేవారు వాటిల్లో తమ పార్సిళ్లను పంపేవారు. వ్యాపారులు బుక్ చేసిన ప్యాక్డ్ సరుకును వాటిల్లో గమ్యం చేర్చేవారు. దీనివల్ల సాలీనా రూ.80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. ఇటీవల కోవిడ్ సమయంలో ఇలాంటి సరుకు తరలింపునకు పూర్తి రైళ్లను కేటాయించారు. ఈ మార్పు వ్యాపారులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలలకే 2.56 లక్షల టన్నుల సరుకు తరలింపుతో ఏకంగా రూ.109.06 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఉత్సాహంగా మిగతా కాలానికి మరింత ఆదాయం వచ్చేలా రైల్వే అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈమేరకు తాజాగా లెక్కలు రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి రూ.108.35 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రికార్డుగా నిలిచింది. ఇప్పుడు దాన్ని కేవలం ఆరు నెలల కాలంలోనే బ్రేక్ చేయటం విశేషం. వేగంగా.. తక్కువ ఖర్చుతో.. కోవిడ్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ప్రయాణికుల రైళ్లు చాలాకాలం నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు సరుకు రవాణా రైళ్లపై అధికారులు దృష్టి సారించారు. సిమెంటు, బొగ్గు, స్టీల్ వంటి వాటి కోసం పూర్తిస్థాయి గూడ్సు రైళ్లను నడిపినట్టుగానే, ఇతర సరుకు కోసం పూర్తిస్థాయి పార్సిల్ రైళ్లను నడపాలని నిర్ణయించి వ్యాపారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. వేగంగా, తక్కువ ఖర్చుకే గమ్యస్థానం చేరుస్తామని హామీ ఇవ్వటంతో వ్యాపారులు ముందుకొచ్చారు. పండ్లు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, పాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేశారు. ఏప్రిల్ నుంచి సెపె్టంబరు 27 వరకు 343 కిసాన్ రైళ్లను నడిపి ఉల్లిపాయలు, మామిడి పళ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు 1,08,388 టన్నుల మేర సరఫరా చేశారు. దీనివల్ల రూ.49.43 కోట్ల ఆదాయం వచ్చింది. దేశ రాజధానికి దూద్ దురంతో రైళ్ల ద్వారా 3.78 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయటం ద్వారా రూ.8.91 కోట్ల ఆదాయం సమకూరింది. కోడిగుడ్లు, బేబీ డైపర్స్, ఎంఆర్ఎఫ్ టైర్లు ఇలా చాలా పార్సిళ్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసింది. పార్సిల్ రవాణా ద్వారా రికార్డుస్థాయి ఆదాయం పొందడంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని, భవిష్యత్తులో మరింత ఆదాయం కోసం కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా చెప్పారు. -
మూడు నెలల్లో సీఎం కేసీఆర్ ఇలాకాకు గూడ్స్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలతో గజ్వేల్కు ప్రయాణికుల రైలు నడపటంలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ, మరో మూడు నెలల్లో సరుకు రవాణా రైలు ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం అటు సిద్దిపేట మొదలు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గాన్నే వినియోగిస్తున్నారు. ఇప్పుడు తొలిసారి రైలు మార్గం అనుసంధానం కాబోతోంది. చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం గజ్వేల్ వరకు రైలు మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కానీ కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను నడపటం లేదు. ఈపాటికే ప్రయాణికుల రైలు సర్వీసు గజ్వేల్ వరకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కారణంతో మొదలు కాలేదు. అయితే వీలైనంత తొందరలో గూడ్సు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. గూడ్సు షెడ్డు నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి గూడ్సు రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. సమీపంలోని ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను లారీల ద్వారా గజ్వేల్ వరకు తరలిస్తే అక్కడి నుంచి గూడ్సు రైళ్లలో వాటిని తరలించొచ్చు. గజ్వేల్ రైల్వే స్టేషన్ను గురువారం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎం శరత్ చంద్రాయన్ తనిఖీ చేశారు. డిప్యూటీ సీఈ (కన్స్ట్రక్షన్) సదర్మ దేవరాయ, అధికారులులతో కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం: సముద్ర జలాల్లో తిరగాల్సిన పడవ లారీ ఎక్కింది. ఇదేంటా... అని అంతా ఆశ్చర్యంగా చూశారు. సీన్ కట్ చేస్తే ఓ పడవను లారీపై జాతీయ రహదారి మీదుగా బిహార్ నుంచి కోల్కతా తరలిస్తున్నారు. ఈ లారీ నాతవలస జాతీయ రహదారిపై గురువారం ప్రయాణం చేయడంతో అటుగా వెళ్లే వారంతా ఆసక్తిగా తిలకించారు. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి -
వారి దోపిడీకి.. తెల్ల బోవాల్సిందే..!!
పట్నంబజారు (గుంటూరు తూర్పు): ఆంధ్ర ప్రదేశ్లోని జిల్లాలోని ప్రైవేటు ట్రావెల్స్ వ్యాపారులు కొందరు యథేచ్చగా ట్రాన్స్పోర్ట్ దందా సాగిస్తున్నారు. వైట్బోర్డు మాటున ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొండుతున్నారు. ఎల్లో బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. సొంత అవసరాల పేరుతో వాహనాలను కొనుగోలు చేసి అద్దె ట్యాక్సీలు తిప్పుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లను నియమించుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చదవండి: దారుణం: చపాతీ కర్రతో అత్తను హత్యచేసిన కోడలు అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని రోడ్డు, పర్మిట్ పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైట్బోర్డు పెట్టుకుని కమర్షియల్ వాహనాలు సంచరిస్తున్నాయి. ఎల్లో బోర్డు వాహనాల కంటే ఇవే అధికంగా తిరుగుతున్నాయి. పలువురు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు వైట్బోర్డు ముసుగులో టాక్సీలు, క్యాబ్లను అద్దెకు తిప్పుతున్నారు. ప్రభుత్వాన్ని రూ. కోట్లలో పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. దందా ఇలా...! ట్రాన్స్పోర్టు వినియోగానికి కొనుగోలు చేసిన వాహనాలకు రవాణా శాఖ ఎల్లో బోర్డుతో (మాక్సీక్యాబ్) రిజిస్టేషన్ నంబరు జారీ చేస్తుంది. అదే సొంతంగా కొనుగోలు చేస్తే.. వైట్ నెంబర్ ప్లేటు కేటాయిస్తారు. ఇందులో ఎల్లో బోర్డు వాహనానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వైట్ బోర్డు వెహికల్ అయితే రిజిస్టేషన్ సమయంలో ఒకేసారి లైఫ్ట్యాక్స్ చెల్లిస్తే చాలు. ఈ నిబంధనను తమకు అనువుగా మలచుకున్న ట్రావెల్స్ వ్యాపారులు వైట్ బోర్డు కింద వాహనాలు తీసుకుని ట్యాక్సీలుగా అద్దెకు తిప్పుకుంటున్నారు. ప్రధానంగా 4–1 సీటింగ్ సామర్ధ్యంతో ఉన్న వైట్ బోర్డు వాహనాలు పెద్ద సంఖ్యలో ట్యాక్సీలుగా రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో 40 వేలకు పైగా వాహనాలు వైట్ నంబర్ ప్లేటుతో తిరుగుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 2958 మాక్సీ క్యాబ్లు ఉన్నాయి. ట్యాక్స్ ఎగవేతకే.. ప్రైవేటు ట్రావెల్స్ వారు త్రైమాసిక పన్నుతో పాటు రోడ్డు టాక్స్, చెక్పోస్టుల్లో పర్మిట్ చార్జీలను తప్పించుకునేందుకే తమ వాహనాలను వైట్బోర్డు ముసుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొండుతున్నారు. మామూలుగా టూరిస్టు బోర్డు (టీ–బోర్డు) ఎల్లో బోర్డు వాహనాలు ఏటా రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) పొందాల్సి ఉంటుంది. అదే వైట్బోర్డు వాహనాలైతే రిజిస్టేషన్ అయిన తరువాత 15 ఏళ్ల వరకు ఎఫ్సీ అవసరం ఉండదు. ట్రావెల్స్ యజమానుల దందా కారణంగా ఏటా సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందనే తెలుస్తోంది. మొక్కుబడిగా తనిఖీలు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టుల వద్ద తూ తూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో వైట్ బోర్డులు తగిలించుకున్న ట్యాక్సీలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. కొంత మంది అధికారులు ఎల్లో నంబర్ ప్లేటును సైతం వైట్ ప్లేటుగా మార్చుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇటీవల ఆర్డీవో, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇటువంటి వాస్తవాలు బయట పడ్డ కనీసం, అధికారుల్లో మాత్రం చలనం కరవైందనే చెప్పాలి. ఎల్లో ప్లేట్ మొదలు ఉదాహరణకు ఏపీ 39 తరువాత ‘టీ’తో మొదలయ్యే ప్రతి వాహనం ట్యాక్సీ ప్లేట్ అని స్పష్టం చేస్తోంది. అవి సైతం వైట్ ప్లేటుగా మార్చుకుని అధికారులే నేరుగా తిరుగుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ట్రావెల్స్తో మిలాఖత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రావెల్స్కు సంబంధించి వైట్ ప్లేట్ (ఓన్ప్లేట్) వాహనాలు తిరుగుతున్నాయని తెలిసినప్పటికీ అధికారులు మిన్నకుండి పోతున్నారనే విమర్శలు లేకపోలేదు. దీనికి సంబంధించి ఆయా డివిజన్ అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రావెల్స్ యజమానులతో పాటు, పలు బస్సుల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనేది సమాచారం. తనిఖీలు చేపడతాం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడతాం. పూర్తిస్థాయిలో ట్రావెల్స్పై దృష్టి సారించి, ప్రైవేట్ వాహనాలు ట్రావెలింగ్కు తిరగకుండా నిరోధిస్తాం. అయితే ప్రయాణికులు సైతం ఎల్లో ప్లేటు ఉన్న వాహనాలను మాత్రమే, ప్రయాణానికి వినియోగించాలని కోరుతున్నాం. దానివలన ప్రమాదవశాత్తూ.. ఏదైనా జరిగినా ఇన్సురెన్స్ వర్తిస్తుంది. వైట్ ప్లేటులో ఇన్సూరెన్స్ ప్రయాణికులకు వర్తించదు. అధికారులకు ఎటువంటి అవినీతికి పాల్పడినా.. సహించం. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. – ఇవ్వల మీరాప్రసాద్, డీటీసీ, గుంటూరు చదవండి: శీతాకాల అతిథులొచ్చేశాయ్! -
రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని ఔటర్ రింగ్రోడ్డు టోల్ప్లాజా వద్ద రూ.21 కోట్లు విలువచేసే 3,400 కిలోల గంజాయిని తరలిస్తున్న ట్రక్కును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకుని జప్తుచేశారు. 141 గన్నీ సంచుల్లో సరుకు నింపి, బయటకు కనిపించకుండా టార్పాలిన్ షీట్లతో కప్పేశారు. అనుమానం రాకుండా దానిపై నర్సరీ మొక్కలను లోడ్చేశారు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ నుంచి అందిన సమాచారంతో ఎన్సీబీ హైదరాబాద్, బెంగళూరు బృందాలు సంయుక్తంగా దాడిచేసి ట్రక్కును పట్టుకున్నాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ట్రక్కులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన డి.షిండే, ఎంఆర్ కాంబ్లే, ఎన్.జోగ్దండ్ను అరెస్టుచేశారు. గతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్లో 3,992 కిలోల గంజాయిని జప్తుచేసుకుని 16 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో లభించిన సమాచారం ఆధారంగా మరో మూడు స్మగ్లర్ల నెట్వర్క్లను ఎన్సీబీ ఛేదించింది. గత ఆపరేషన్ ద్వారా లభించిన సమాచారంతోనే తాజాగా మరోసారి పట్టుకున్నట్టు ఎన్సీబీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ఓ కీలక వ్యక్తి తాజాగా పట్టుబడిన ముఠా వెనక ఉన్నట్టు ఎన్సీబీ గుర్తించింది. ముంబై, పూణె, థానెతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డ్రగ్స్ సిండికేట్ల కోసం అతడు ఈ సరుకును తరలించేందుకు ఏర్పాట్లు చేశాడని తెలిపింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని సిండికేట్ల ద్వారా కళాశాలల విద్యార్థులు, పార్టీలు, వ్యక్తులకు సరఫరా చేస్తున్నారని పేర్కొంది. -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటల రవాణాపై ఆంక్షలు లేవని అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మామిడి పండ్ల కోసం 27 కిసాన్ రైళ్లను ఏర్పాటు చేశామని.. మామిడి ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదు వారాల నుంచి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మిర్చి, పసుపు, అరటి, ఆరెంజ్ పంటలకు మద్దతు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 25చోట్ల పండ్ల ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జులై 8న 2 వేల గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని పూనం మాలకొండయ్య వెల్లడించారు. చదవండి: గోదావరి జిల్లాల్లో సాగునీటి కష్టాలకు ఇక చెల్లుచీటీ! గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా -
కరోనా దెబ్బకు మారిన జీవితం
సాక్షి, తుర్కయంజాల్: కరోనా కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. బతుకు దెరువు కోసం కొత్త కొత్త పనులు చేస్తూ పూట గడుపుతున్నారు. నగరంలోని చంద్రాయణగుట్టకు చెందిన ఖాజా వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. కోవిడ్ కారణంగా గిరాకీలు లేక పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో అతడికి ఏ మాత్రం అనుభవం లేని తాటి ముంజలు అమ్మడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు మాల్, మర్రిగూడెం సమీపంలోని గ్రామాలకు వెళ్లి తాటి ముంజలు తీసుకొచ్చి తుర్కయంజాల్లో విక్రయిస్తున్నాడు. ప్రసుత్తం చేస్తున్న పని కొత్తది అయినప్పటికీ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడటంలో తప్పులేదని తెలిపాడు. (చదవండి: ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం.. ఇదేం పాడు పని) -
‘ఎవర్ గివెన్’ చెప్పే గుణపాఠం
చరిత్రలో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలకు మౌన సాక్షిగా వున్న సూయిజ్ కెనాల్ మరోసారి వార్తల్లో కెక్కింది. మంగళవారం వేకువజామున హఠాత్తుగా విరుచుకుపడిన ఇసుక తుపానులో సరుకులతో వెళ్తున్న భారీ నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుంది. గత రెండురోజులుగా ఆ నౌక అంగుళం కూడా అటూ ఇటూ కదులుతున్న జాడ లేదు. పర్యవసానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరువంటి మహా నగరాల్లో మనం తరచుగా చూసే నరకప్రాయమైన ట్రాఫిక్ జామ్లను తలదన్నే రీతిలో ఇప్పుడు సూయిజ్ కెనాల్ వుంది. ‘ఎవర్ గివెన్’ మొరాయించిన సమయానికి కెనాల్లో ప్రవేశించివున్న దాదాపు 200 నౌకలు చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రాన్నీ, మధ్యధరా సముద్రాన్ని అనుసంధానించి తూర్పు, పడమరలను ఏకం చేసి, ఖండాంతర వాణిజ్యంతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో వుండాలని కలగని 1859లో ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. వాస్తవానికి ఇది అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. ప్రాచీన ఈజిప్టు రాచరిక వ్యవస్థలు క్రీస్తుపూర్వమే దీన్ని కలగన్నాయి. నెపోలియన్ సైతం ఈ కెనాల్ నిర్మిస్తే బ్రిటన్ని దారికి తేవొచ్చని, దానిపై పైచేయి సాధించవచ్చని ఆలోచించాడు. కానీ చివరకు ఫ్రాన్స్ ఏలుబడిలోని ఈజిప్టుకే కాలం కలిసొచ్చింది. ఒక ఫ్రాన్స్ దౌత్యవేత్త చొరవతో ఏర్పాటైన కంపెనీ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన దాదాపు 194 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను నిర్మించింది. దీనివల్ల కలిగే లాభాన్ని గుర్తించి బ్రిటన్ ఇందులో 40 శాతం వాటాను పోరుపెట్టి సాధించుకుంది. ప్రపంచంలో ఇంకా పనామా కెనాల్, వోల్గా డాన్ కెనాల్, గ్రాండ్ కెనాల్ వంటివి వున్నాయి. కానీ సూయిజ్ ప్రధాన సముద్ర మార్గాలను అనుసంధానించే మెరుగైన కెనాల్. పర్యావరణవేత్తలు కావొచ్చు, నౌకాయాన రంగ నిపుణులు కావొచ్చు... రాకాసి నౌకా నిర్మాణం జోలికిపోవద్దని చాన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు ఎదురైతే భారీ నౌకలతో చేటు తప్పదని ప్రాణ నష్టంతోపాటు సముద్ర జలాలు కాలుష్యమయమై పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. కానీ పెద్ద మొత్తంలో సరుకు పంపిణీ చేయటానికి, భారీగా ఆదాయం రాబట్టడానికి భారీ నౌకలే మేలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే వారి హెచ్చ రికలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. ఇప్పుడు ‘ఎవర్ గివెన్’ అడ్డం తిరిగిన వైనం వారి హితవచనాలను మరోసారి గుర్తుకుతెస్తోంది. 2,20,000 టన్నుల సరుకును మోసుకుపోగల సామర్థ్యం దానికుంది. అయితే ఆ నౌక పూర్తిగా కుంగిపోయే స్థితి ఏర్పడకపోవటం ఒక రకంగా అదృష్టమే. ప్రపంచ వాణిజ్యం గత రెండున్నర దశాబ్దాల్లో వందల రెట్లు విస్తరించింది. ఒకప్పుడు ఆహారం, సరుకులు, చమురు, ఖనిజాలు వంటివే ప్రధానంగా రవాణా కాగా, ఇంటర్నెట్ అందు బాటులోకి రావటంతో విశ్వవ్యాప్త వస్తు సేవలు విపరీతంగా పెరిగాయి. విమానయానం ఎంత వేగంతో కూడినదైనా, విమానాల ద్వారా సరుకు రవాణా ఎంతగా విస్తరించినా వాణిజ్యంలో ఈనాటికీ 90 శాతం వాటా సముద్ర మార్గాలదే. ఇందులో సూయిజ్ కెనాల్ ద్వారా సాగే వాణిజ్యం దాదాపు 15 శాతం. పశ్చిమాసియా నుంచి యూరప్, అమెరికాలకు... రష్యా నుంచి ఆసియా దేశాలకు ముడి చమురు రవాణా సాగుతున్నదీ ఇటునుంచే. అందుకే ఈ దిగ్బంధం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా సరుకు పంపిణీలో అస్తవ్యస్థ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళన వుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాలను విడదీసే ఈ కెనాల్... యూరప్కు రాకపోకలు సాగించే నౌకలు దక్షిణ అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. అందువల్ల దాదాపు ఏడువేల కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. వారం రోజుల సమయాన్ని ఆదా చేస్తోంది. రోజూ సగటున 50 నౌకలకు వరకూ ప్రయాణించే సూయిజ్ కాల్వ ఈజిప్టు ఖజానాకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం ఏటా దాదాపు 1,500 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. సూయిజ్ కెనాల్ను మరింత విస్తరించటానికి ఆ దేశం ఇప్పటికే పనులు ప్రారంభించింది. అదంతా మరో రెండేళ్లలో పూర్తయితే ఈజిప్టు ఆదాయం మూడింతలు పెరుగుతుంది. అంతర్జాతీయ నావికా సంస్థ(ఐఎంఓ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం నౌకాయానం వల్ల ఏటా వాతావరణంలోకి వేయి మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. ఇది ప్రపంచ వార్షిక ఉద్గారాల్లో 3.1 శాతం. 2050నాటికి ఉద్గారాలను కనీసం 50 శాతం తగ్గించుకోవాలని ఐఎంఓ కోరుతోంది. భారీ నౌకల వల్ల పొంచివుండే ఇతరత్రా ప్రమాదాల సంగతలావుంచి వాటి ఇంధన సామర్థ్యం తక్కువని ఐఎంఓ చెబుతోంది. కనీసం కొత్త సాంకేతికతలను పెంచుకుని, మెరుగైన డిజైన్లతో నౌకల్ని నిర్మిస్తే, వాటి వేగాన్ని నియంత్రణలోవుంచితే కర్బన ఉద్గారాల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది దాని సూచన. నౌకల వేగాన్ని సగటున పదిశాతం తగ్గిస్తే కర్బన ఉద్గారాలను నియంత్రించటం వీలవుతుందని సూచిస్తోంది. నౌకల వేగంపై నిరంతరం నిఘా వుంచుతూ అవి ఎక్కడ సంచరిస్తున్నాయో, వాటి వేగం, దిశ ఎలావున్నాయో తెలుసుకునే సాంకే తికతలు అందుబాటులోకొచ్చాయి. వాటిని అమర్చుకోవటాన్ని తప్పనిసరి కూడా చేశారు. 150 ఏళ్లక్రితం అందుబాటులోకొచ్చి, ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించే సూయిజ్ కెనాల్లో చోటుచేసుకున్న తాజా ఉదంతం నౌకా యానంలో ఇమిడివుండే సమస్యలను మరోసారి అందరి దృష్టికీ తెచ్చింది. -
ఇక.. గార్డులేని రైలు
సాక్షి, విశాఖపట్నం: రైలు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించే వారిలో ముందు వరసలో ఉండే గార్డుల వ్యవస్థ త్వరలోనే కనుమరుగు కానుంది. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థ మరింత సురక్షిత రవాణాకు సాయపడనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే.. గార్డుల స్థానాన్ని భర్తీచేస్తోంది. ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వేలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం అయింది. త్వరలోనే వాల్తేరు డివిజన్లో ప్రయోగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యవస్థ సఫలీకృతమైతే గార్డులను ఇతర స్థానాల్లో భర్తీ చేయనున్నారు. రైలు పట్టాలపై సురక్షితంగా పరుగులు తీయాలంటే గార్డులు కచ్చితంగా అవసరం. సంప్రదాయంగా భారతీయ రైల్వేలో గార్డులే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వారి స్థానంలో సాంకేతికత అమలు కాబోతోంది. ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ (ఈవోటీటీ) అమలుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ఈస్ట్కోస్ట్ జోన్లో గతనెల ఈవోటీటీని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా.. గూడ్స్ ట్రైన్ గార్డు లేకుండా వందల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణం సాగించింది. రైలును భద్రంగా నడిపించే గార్డు నిర్వర్తించే ప్రతి బాధ్యతను ఈవోటీటీ విజయవంతంగా చేపడుతోంది. చివరి బోగీలో ఏర్పాటు రైలు చివరి బోగీలో ఈవోటీటీ పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. లోకోపైలట్కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సురక్షితంగా అందిస్తుంటుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) ద్వారా ఇది పనిచేస్తుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన పరికరం ద్వారా ఎప్పటికప్పడు సమాచారం పైలట్కు అందుతుంది. దీనికి ఆటోమేటిక్ స్విచ్ విధానం ఉంది. ట్రాక్ వ్యవస్థలో ఏవైనా మార్పులు కనిపించినా, ఏదైనా ప్రమాదం జరగకుండా ముందే.. దూసుకుపోతున్న రైలును ఆపేలా ఎయిర్ బ్రేక్ ఈవోటీటీ అదనపు సౌకర్యం. బ్రేక్ పవర్ ప్రెజర్ను లోకోపైలట్ నియంత్రించేలా ఎయిర్ బ్రేక్ ఉపయోగించి రైలు ఆపవచ్చు. గూడ్స్ రవాణాపై విశాఖ నుంచి పరిశీలన తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ అత్యాధునిక వ్యవస్థను త్వరలోనే జోన్లో భాగమైన వాల్తేరు డివిజన్లోనూ పరిశీలించనున్నారు. గూడ్స్ రవాణాపై విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఈవోటీటీ ప్రయోగాన్ని అమలు చేస్తామని డివిజన్ అధికారులు తెలిపారు. భద్రతకు భంగం కలగకుండా, రైల్వేపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించేలా ఈవోటీటీ పరికరం తయారు చేశారని చెప్పారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే గార్డుల అవసరం ఉండదని, గార్డులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అత్యాధునిక పరికరం లోకోపైలట్ స్థైర్యానికి కొత్త ఊపిరి పోస్తుందని పేర్కొన్నారు. -
కార్గో పార్శిల్ హోం డెలివరీని ప్రారంభించిన పువ్వాడ
సాక్షి, హైదరాబాద్: కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్ పువ్వాడ తెలిపారు. ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్టు భవన్లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు. పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్పల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. అక్యూపెన్సి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా పాండమిక్ని మర్చిపోయి బస్సులను ఆదిరిస్తున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు కూడా పూర్తిగా నడుస్తున్నాయని, కష్టకాలంలో రూ. 200 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ మొత్తం 1200 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చేయూతనిచ్చారని తెలిపారు. కార్గో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్శిల్లు మిస్ కావడం కానీ డ్యామేజ్ కావడం లాంటివి జరగీలేదన్నారు. ప్రస్తుతం కార్గోలో ఎజెంట్స్ కూడా పెరిగారని, మరిన్ని సేవల కోసమే హోం డెలివరీని ప్రారంభించిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అందిరికి ఇస్తున్నామని.. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి చెప్పారు. -
36 కిమీ..28 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సైబరాబాద్ పోలీసుల సహకారంతో మరోసారి ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శంషాబాద్లోని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ అయిన ఊపిరితిత్తుల్ని తరలిస్తున్న అంబులెన్స్ల కోసం ఈ పని చేశారు. ఫలితంగా ఈ 36.8 కిమీ దూరాన్ని అంబులెన్స్ కేవలం 28 నిమిషాల్లో అధిగమించాయి. ఇతర రాష్ట్రంలోని ఓ డోనర్ ఇచ్చిన ఊపిరితిత్తులతో కూడిన విమానం శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ లైవ్ ఆర్గాన్స్ బాక్సుల్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్లు అక్కడకు చేరుకున్నాయి. చదవండి: 11.5 కిమీ.. 9 నిమిషాలు అక్కడ నుంచి ఉదయం 11.11 గంటలకు బయలుదేరాయి. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్లకు ఎస్కార్ట్గా ముందు వెళ్ళింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో నిరాటంకంగా సాగి 11.39 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర ట్రాఫిక్ పోలీసులు మొత్తం 13 సార్లు లైవ్ ఆర్గాన్స్తో కూడిన అంబులెన్సుల కోసం గ్రీన్ఛానల్ ఇచ్చినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ తెలిపారు. -
పర్యాటక రంగం పరుగు!
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరోనా ప్రభావం పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలపై తీవ్రంగా ఉంది. ఇప్పటికీ హోటల్స్లో తినాలన్నా, వేరే ఊళ్లకి వెళ్లాలన్నా ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ఒక ఆర్థిక ప్యాకేజీని రూపొందించడానికి కసరత్తు చేస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఒక జాతీయ చానెల్కు వెల్లడించారు. ఈ ప్యాకేజీతో పర్యాటక రంగం పరుగులు పెట్టడమే కాకుండా పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అంతే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బలోపేతంపై కూడా కేంద్రం దృష్టి సారిస్తున్నట్టుగా అమితాబ్ కాంత్ వెల్లడించారు. అయితే ఈ ప్యాకేజీని ప్రకటించడానికి మరో రెండు మూడు నెలలు పడుతుందని ఆయన వివరించారు. ఈ పండుగ సీజన్లో వచ్చే ఆదాయ మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. పౌర విమానయానం, రైల్వేల నుంచి ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సెప్టెంబర్లో ప్రజల కొనుగోలు శక్తి సూచి 56.8 పాయింట్లకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మధ్య తరగతి ప్రజలు దసరా, దీపావళి సీజన్లో ఎంత ఖర్చు పెడతారో చూడాల్సి ఉందని అమితాబ్ కాంత్ చెప్పారు. -
ప్రమాదకరంగా పశ్చిమ బెంగాల్ రవాణా
కోల్కతా: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ దేశంలో ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రల్లో ప్రజా రవాణా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో బస్సులను శానిటైజ్ చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బస్సు మొదలైనప్పుడు తప్ప మరెక్కడ బస్సును శానీటైజ్ చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. పశ్చిమ మిడ్నపూర్లో జిల్లా మేజిస్టేట్ బస్సులను శానిటైజ్ చేయాలని ఆదేశించినప్పటికీ బస్సు యజమానులు ఖాతరు చేయడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో డ్రైవర్లకు, కండక్టర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. (చదవండి: కరోనా మృతులకు 10 లక్షలు.. ఉద్యోగం) దీంతో మిగిలిన వారు కూడా విధులకు రావడానికి సంకోచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో బస్సులు ఆగిపోయాయి. కరోనా పాజిటివ్ సోకిన ఒక కండక్టర్ 30 మంది ఇతర సిబ్బందితో కలిసి ఉండటం కలకలం రేపింది. ఈ విషయం గురించి ప్రైవేట్ బస్సు యజమానులు మాట్లాడుతూ.. బస్సుకు 20 మందినే అనుమతించడం వల్ల తమకు చాలా నష్టం వస్తుందని, ఇక శానిటైజర్లు వాడటం, బస్సులను శానిటైజ్ చేయించడం అంటే తమ వల్ల కాదని చెప్పారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ సిన్హా స్పందిస్తూ.. ‘బెంగాల్లో బస్సు సదుపాయాలను కల్పిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సిబ్బందికి ఇప్పటి వరకు సరైన మాస్క్లు, గ్లౌజ్లు కూడా ఇవ్వలేదు’ అని ఆయన ఆరోపించారు. (చదవండి: కరోనా కట్టడికే ఆన్లైన్ ప్రజావాణి) -
తమిళనాడు : రవాణాకు బ్రేక్..లాక్డౌన్ పొడిగింపు
చెన్నై : దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ర్టాల్లో తమిళనాడు ఒకటి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి దృష్ట్యా లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 15 వరకు అమల్లో ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు రవాణాను ఈనె 31 వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయించింది. అయితే ఆటోలు, క్యాబ్లకు మాత్రం అనుమతులిన్నట్లు పేర్కొంది. రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని, దీనిలో భాగంగానే ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా లాక్డౌన్ను పొడిగించినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు సహకరించకుంటే ఆ కష్టం అంతా వృధాగా పోతుందని కరోనా నివారణకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. (పంజాబ్లో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినం) -
ఆరేళ్లుగా విద్యుత్ సరఫరాకు నోచుకోని గ్రామం
కొండల కోనల మధ్య నాగరిక జీవనానికి..అభివృద్ధికి ఆమడ దూరంలో చీకటిలో మగ్గుతోంది టేకులపెంట గ్రామం. కొమరోలు మండలం చింతలపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న ఆ గ్రామానికి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్ల రాళ్లుతేలిన మట్టిబాటే శరణ్యం. ఆ ఊరి మొత్తం మీద అక్షరాలు నేర్చిన వారు ముగ్గురే. ఆ ఊరికి విద్యుత్ వెలుగులే లేవు..ఇక ఫోను, టీవీ సంగతి సరేసరి. దప్పికేస్తే నేల బావి..ప్రాణం మీదకొస్తే డోలీలే దిక్కు. ఆ గ్రామస్తుల స్థితిగతులపై సాక్షి కథనం గిద్దలూరు: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఫోన్, టీవీకి దూరంగా జీవిస్తున్న వారు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నెలకు ఓసారి కూడా వారు బస్సులు, ఆటోల ముఖం చూడరంటే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ అదే నిజం.! నాగరిక జీవనానికి దూరంగా ఉంటున్న ఆ గ్రామం పేరు టేకులపెంట. కొమరోలు మండలం చింతలపల్లెపంచాయతీ పరిధిలో ఉంటుందీ ఊరు. ఏదైనా పనిమీద గ్రామం నుంచి బయటకురావాలంటే ఏడు కి.మీ దూరం రాళ్లు, ముళ్లపొదల్లో క్రూర మృగాల మధ్య నడిచి వెళ్లాలి. సాయంత్రం ఆరు గంటలు దాటితే చిమ్మచీకటి. గ్రామానికి 2 కి.మీ దూరంలో ఉన్న నేలబావి నీటితోనే నేటికీ దప్పిక తీర్చుకుంటున్నారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లేదు. 60 మంది జనాభా నివసిస్తున్న గ్రామంలో చదువుకున్న వారు ముగ్గురే. సుస్తీ చేస్తే డోలీ కట్టుకుని ఏడు కి.మీ దూరం నడవాల్సిన దుస్థితి. సంక్షేమ పథకాలకు అర్హులైనా అవి అందించే మార్గం లేక అధికారులు తలపట్టుకుంటున్నారు. ‘మాకు రోడ్డు, కరెంటు, తాగునీటి బోరు ఏర్పాటు చేస్తే చాలు’ అంటున్నారే తప్ప గ్రామాన్ని ఖాళీ చేసిజనజీవన స్రవంతిలోకి వస్తామని చెప్పడం లేదు. టేకులపెంట వాసులకు ఏ అవసరమొచ్చినా, ఆపదొచ్చినా రాళ్లతో కూడిన దుర్భరమైన ఈ రహదారిలోనే ఏడు కిలోమీటర్ల దూరంప్రయాణించాలి.. కొండల మధ్య జీవనం చింతలపల్లె పంచాయతీ పరిధిలోని టేకులపెంట గ్రామం కొండల మధ్య ఉంది. వీరు ఐదు కి.మీ దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రానికి చేరుకోవాలంటే కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. దట్టమైన అడవులు, కొండల్లో చెట్లను తప్పించుకుంటూ నడవాలి. వీరు పంచాయతీ కేంద్రానికి వచ్చేది ఎన్నికల సమయంలోనే. రేషన్కార్డులు ఉన్నా సరుకులు తీసుకునేది తక్కువే. దట్టమైన అడవి మధ్య 40 కుటుంబాల వరకు ఉండేవి. అందరిదీ ఒకే సామాజిక వర్గం. కాలక్రమంలో ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం 14 కుటుంబాలకు చెందిన 60 మంది మాత్రమే నివసిస్తున్నారు. గ్రామానికి చుట్టూ రాతితో గోడ కట్టి అడవి జంతువులు రాకుండా చిన్న గేటు ఏర్పాటు చేసుకోవడం విశేషం. జబ్బు చేస్తే డోలీ కట్టాల్సిందే.. టేకులపెంటలో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీ కట్టుకుని ఏడు కిలోమీటర్ల దూరంలోని కోనపల్లి వరకు మోసుకెళ్లాల్సిన దీనావస్థ. అక్కడ నుంచి ఆటోలో సమీప వైద్యశాలకు వెళ్తారు. అనారోగ్యం నుంచి కోలుకుంటే చిన్నగా గ్రామానికి వెళ్తారు. లేదంటే బంధువుల వద్దకు వెళ్లి ఆరోగ్యం బాగయ్యాకే తిరిగి స్వగ్రామానికి వెళ్తారు. గర్భిణులు నెలలు నిండితే సాధారణ ప్రసవం చేస్తారు. లేదంటే డోలిలోనే వైద్యశాలకు తీసుకెళ్తారు. ఈ గ్రామంలో ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. సెల్ఫోన్ కొనుక్కున్నా చార్జింగ్ పెట్టేందుకు కరెంటు లేదు. మాట్లాడేందుకు సెల్ టవర్ సిగ్నల్ అందదు. కొండ నుంచి మైదాన ప్రాంతానికి రావాలని అధికారులు సూచించినా గ్రామస్తులు ఇష్టపడటం లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొండిగా భరిస్తున్నారు. గ్రామానికి రోడ్డు, తాగునీటి బోరు, విద్యుత్ సరఫరా తదితర వసతులు కల్పిస్తే ‘మా బతుకు మేము బతుకుతాం’ అని చెబుతున్నారు. టేకులపెంట గ్రామం వ్యూ సమస్యలతో సతమతం టేకులపెంట గ్రామం కొమరోలు మండలంలో ఉన్నప్పటికీ వీరికి ఏ అవసరం వచ్చినా బేస్తవారిపేట మండలంలోని కోనపల్లెకు వెళ్తారు. ఇందుకు ఏడు కిలోమీటర్లు నడవాలి. నడిచేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. మొనదేలిన రాళ్లపై కిందామీద పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలబావి(దిగుడుబావి) వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. ఆ నీటితోనే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో గతంలో మోటారు ఏర్పాటు చేసినా అది మరమ్మతులకు గురయ్యాక ఎవరూ పట్టించుకోలేదు. ఆరేళ్ల క్రితం వరకు విద్యుత్ సరఫరా ఉన్న ఈ గ్రామం.. ప్రస్తుతం చీకట్లో మగ్గుతోంది. ఆరేళ్ల క్రితం గాలివాన బీభత్సంతో స్తంభాలు నేలకొరిగి, తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సోలార్ ఎల్ఈడీ లైటు ఏర్పాటు చేసినా అది పనిచేయడం లేదు. మేకల పెంపకం, చిరుధాన్యాల సాగు అడవుల్లో ఉన్న వీరు వాణిజ్య పంటలు సాగుచేయరు. వర్షాధార పంటలుగా చిరుధాన్యాలైన కొర్రలు, సజ్జ, జొన్న, రాగులు, ఉలవలుపండిస్తున్నారు. వాటినే ఆహారంగా తింటున్నారు. దీంతో తమ శరీరం దృఢంగా ఉంటుందనిగ్రామస్తులు చెబుతున్నారు. అడవుల్లో గడ్డిఎక్కువగా లభ్యమవుతున్నందున మేకలు, గేదెలు పెంచుతున్నారు. అడవులకు ఎలాంటి హాని తలపెట్టకుండా జీవనం సాగిస్తున్నారు. ధాన్యం ఎక్కువగా పండితే మూటలు కట్టుకునిమోసుకుంటూ వెళ్లి విక్రయించుకుని బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుంటారు. తాగునీరు, కరెంటు, రోడ్డు ఏచ్చే ఇక్కడే బతుకుతామయ్యా మాకు ఏమొద్దయ్యా తాగేదానికి బోరు, కరెంటు లైను, ఊర్లోకి వచ్చేదానికి రోడ్డు ఏచ్చే ఎలాగోలా ఇక్కడే బతుకుతాం. దేవుని దయవలన వానలు పడుతున్నాయి. అంతో ఇంతో పంటలు పండుతాయి. అనారోగ్యం సేచ్చే రోడ్డు ఉంటే ఏదొక ఆటోను పిలుచుకొచ్చుకుని ఆసుపత్రికి పోతాం. అసలు మాకు జ్వరాలు కూడా రావు. ఆకు పసురుకే తగ్గిపోతాయి. ఈడనే మేము ఆరోగ్యంగా ఉండగలమనిపిస్తోంది. బోరు, కరెంటు, రోడ్డు వేసేలా చూడాలి. – వెంకటేశ్వర్లు, టేకులపెంట గ్రామస్తుడు -
ట్రాన్స్పోర్ట్ కేటుగాళ్లు
-
‘‘వైరస్ ప్రభావాన్ని ముందే ఊహించా’’
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల చమురు మార్కెట్ బ్లాక్ స్వాన్ లాంటి ప్రమాదాన్ని ఎదుర్కొబోతుందని ఫ్రెంచ్ చమురు వ్యాపారి పియరీ అండురాండ్ గతంలో హెచ్చరించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ యుద్ధాలు, అనూహ్య ఉగ్రవాద సంఘటనలను సాధారణంగా బ్లాక్ స్వాన్తో పోలుస్తారు. కరోనా కారణంగా చమురుకు డిమాండ్ లేనప్పుడు ధరలు సాధారణంగా తగ్గుతాయని అన్నారు. అయితే దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారమవుతుందని.. కానీ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆండురాండ్ క్యాపిటల్ అనే చమురు సంస్థను పియరీ అండురాండ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. చమురు డిమాండ్, సప్లయ్లో వ్యత్యాసం ఉన్నప్పుడు చమురు ధరలపై ప్రభావం పడుతుందని తెలిపారు. కోవిడ్ విశ్వరూపం చూపకముందే వైరస్ వ్యాప్తిని ప్రపంచ దేశాలు అరికట్టలేవని తానే ముందే గ్రహించినట్లు పేర్కొన్నారు. చమురు మార్కెట్ లాభాల భాట పట్టాలంటే దేశాలు విదిస్తున్న లాక్డౌన్లను ఎత్తేయాలని తెలిపారు. ముఖ్యంగా రవాణా, తయారీ రంగం వేగంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తేనే చమురుకు డిమాండ్ పెరిగి మార్కెట్లో జోష్ నెలకొంటుందని పియరీ అండురాండ్ అభిప్రాయపడ్డారు. -
గమ్యస్థానాలకు 75లక్షల మంది కార్మికులు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 4 కోట్ల మంది వలస కార్మికులు నివసిస్తున్నట్లు కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పునియా సాలిలా శ్రీవాస్తవ తెలిపారు. శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ అమలు నాటి నుంచి ఇప్పటి వరకు 75 లక్షల మంది వలస కార్మికులు బస్సులు, రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. వలస కార్మికులు మే 1నుంచి ఇప్పటి వరకు 2,600 శ్రామిక రైళ్లో తమ నివాసాలకు చేరుకున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. 35 లక్షల మంది కార్మికలు ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో ప్రయాణించగా, మిగతా 40 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు కార్మికులకు మెరుగైన ఆహార, నివాస సదుపాయాలు కల్పించాయన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు వేగవంతమైన చర్యలు చేపట్టాయని తెలిపారు. వలస కార్మికల కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు శ్రీవస్తవ తెలిపారు. చదవండి: వలస కార్మికులకు అండగా హైకోర్టులు -
3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు గత మూడు రోజులుగా పాసుల జారీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పాసులు జారీ చేయొద్దని స్పష్టం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. శనివారం నాటికి మహారాష్ట్రలో 29,100 మందికి కరోనా సోకగా, 1,068 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్లో 9,931 మందికి కరోనా సోకగా, 606 మంది మరణించారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర, మరణాల రేటులో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న వారికి పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. పొరుగునే ఉన్న ఏపీలో 2,307 మందికి కరోనా సోకగా, 48 మంది మృతి చెందారు. ఏపీలో కేసుల సంఖ్య, మరణాల రేటు తక్కువగా ఉన్నా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధుత్వాలు, విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఏపీ నుంచి రావాలనుకుంటున్న వారికి సైతం పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉండటం కూడా ఓ కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 80 వేల మంది రాక కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. స్వరాష్ట్రానికి తిరిగి రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు పాసులు జారీ చేసేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఇందులో 100 మంది అధికారులు 3 షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కంట్రోల్ రూం ద్వారా 17,500 పాసులు జారీచేయగా, 80 వేల మంది తెలంగాణకు తిరిగి వచ్చారు. ఒక్కో పాస్ ద్వారా ముగ్గురు, నలుగురు వ్యక్తులకు సైతం అనుమతిస్తున్నారు. కంట్రోల్ రూం నంబర్లు(040–23450624)లకు రోజూ 2 వేల కాల్స్ వస్తుండగా, రోజుకు సగటున 500–600 పాసులు జారీ చేస్తున్నారు. పాస్ కోసం కాల్ చేసిన వ్యక్తులు తెలంగాణవాసులేనా? ఎందుకు రావాలనుకుంటున్నారు? అన్న విషయాలను రుజువు చేసుకున్న తర్వాతే వాట్సాప్ ద్వారా పాసులు జారీ చేస్తున్నారు. స్వరాష్ట్రానికి తిరిగి వచ్చే వ్యక్తుల పేర్లు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్తో ఈ పాసులు జారీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రానికి తిరిగి వచ్చే వారిని రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ఆపి జ్వరం, జలుబు, ఇతర లక్షణాల కోసం స్క్రీనింగ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలుంటే వారిని తిప్పి పంపేస్తున్నారు. లక్షణాలు లేని వారి చేతులపై 14 రోజుల హోం క్వారంటైన్ ముద్ర వేసి ఇంటికి పంపుతున్నారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు మాత్రమే సచివాలయంలోని కాల్సెంటర్ పని చేస్తుండగా, తెలంగాణ నుంచి సొంత రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలనుకుంటున్న వారు సైతం అవగాహన లేక కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి వారికి స్థానిక పోలీసు స్టేషన్లలో పాసులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. -
వలస కూలీలను తరలించే బాధ్యత కేంద్రానిదే: తలసాని
బన్సీలాల్పేట్: వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బిహార్ వంటి సుదూర రాష్ట్రాలకు బస్సుల్లో వలస కూలీలను తరలించడం కూలీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. గురువారం సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లో అధికారులతో కలసి నూతన రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మార్గదర్శకాల పేరిట వలస కూలీల తరలింపు బాధ్యతను రాష్ట్రాలపై మోపీ చేతులు దులుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించి ప్రత్యేక రైళ్లలో ఉచితంగా వారిని స్వస్థలాలకు చేర్చాలన్నారు. వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చే విషయం లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు బాధ్యతారాహిత్యంగా, అసం బద్ధంగా, ఆచరణకు సాధ్యం కాని గాలిమాటల్లా ఉన్నాయన్నారు. ఓ ఆర్డర్ పాస్ చేశాం.. రాష్ట్రాలు అవి అమలు చేయాలని కేంద్రం కోరడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించి లాక్డౌన్పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రశ్నకు తలసాని బదులిచ్చారు. -
బస్సులు నడపకుంటే ఇంజిన్లు దెబ్బతింటాయి
చెన్నై, టీ.నగర్: రవాణ సంస్థ డిపోల్లో నిలిపిన బస్సులను దీర్ఘకాలం నడపకుంటే ఇంజిన్లు దెబ్బతింటాయని, రూ. లక్షలు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మెకానిక్లు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీ, ఎక్స్ప్రెస్, నగర ఎంటీసీ బస్సులు, టౌన్ బస్సులు డిపోల్లో నిలిపి వేశారు. మెయింటినెన్స్ లేని పక్షంలో బస్సుల ఇంజిన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని తమిళనాడు మోటారు వాహన మెకానిక్ల సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కుమరవేల్ తెలిపారు. -
లాక్డౌన్: నిత్యావసర సరుకుల రవాణాపై చర్యలు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశమంతట లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకుండా వాటిని అందుబాటులోకి తెచ్చే విషయంలో పర్యవేక్షణ కోసం కమాండ్ కట్రోల్ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్నా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల విషయంలో జిల్లాల్లో కూడా జేసీల అధ్వర్యంలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరుకుల రవాణ, అధిక ధరలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ నెంబర్ 1902కు డయల్ చేయాలని చెప్పారు. సరుకుల రవాణకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్ సిస్టమ్ను ప్రవేశపెట్టామని, పంటలను మార్కెట్టుకు తెచ్చే విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (రేషన్' ఫ్రీ') అంతేగాక నిత్యావసరాలకు సంబంధించి ప్రైవేటు రంగంలో పని చేసే ఉద్యోగులకు, సిబ్బందికి ఈ-పాస్ అందచేస్తున్నామని ఆయన తెలిపారు. సరుకులను ప్రజలకు అందజేసే విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఇందుకోసం రైతు బజార్లను వికేంద్రీకరించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 101 రైతు బజార్లు ఉంటే.. మరో 350 రైతు బజార్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేగాక 130 మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 753 మంది మాత్రమే డోర్ డెలివరీని వివియోగించుకుంటున్నారని, ఈ సంఖ్యను పెంచాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిరాణా షాపుల యజమానులు డోర్ డెలివరీకి సిద్దంగా ఉన్నారని, సప్లై చైన్ బ్రేక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు. ఉల్లి, అరటి వంటి పంటలకు మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా పొరుగు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. (కరోనా చికిత్సకు కొత్త పరికరం) -
తీరని కష్టాలెన్నో..!
ఒడిశా, మల్కన్గిరి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దాదాపు 7 దశాబ్దాలు దాటినా చాలా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. దీంతో అక్కడి గిరిజనులు తమ అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య సదుపాయాల కోసం కొన్ని మైళ్ల దూరం కొండలు, గుట్టలు, వాగులు, నదులు దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ప్రమాదాల రూపంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవే విషయాలు నేతలు, అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. వారిని ఎన్నికల సమయంలో ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలుగా స్వీకరించి, వారి అభివృద్ధి చర్యలను ఎవ్వరూ కాంక్షించడం లేదు. జిల్లాలోని చిత్రకొండ సమితిలో కటాఫ్ ఏరియాలోని నువాగుడ పంచాయతీలో ఉన్న పల్లీగుడ గ్రామానికి చెందిన డొంబునీ హంతాల్ అనే గర్భిణికి పురిటినొప్పులు సోమవారం ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె పడుతున్న బాధను తాళలేని కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చేందుకు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో తాము రాలేమని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పింది. గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్కా రహదారికి తీసుకురావాలని సూచించారు. దీంతో చేసేదీ ఏమీ లేకపోవడంతో బాధితురాలి భర్త విష్ణు గ్రామస్తులతో కలిసి, భార్యను మంచంపై ఉంచి పక్కా రహదారి ఉన్న చిత్రకొండకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గురుప్రియ వంతెన పూర్తయితే తమ ప్రాంతాలకు రహదారుల నిర్మాణాలు జరుగుతాయని అంతా అన్నారని, అయితే ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాలకు అంబులెన్స్లు వచ్చేలా పక్కా రహదారుల నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఏపీ: టెన్త్ పరీక్షలకు అడ్డంకులు లేకుండా చర్యలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి ఏపీలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, బుక్లెట్ల రవాణాకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో సీటింగ్ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని విద్యా శాఖ తెలిపింది. పరీక్షల సమయంలో ఎవరైనా విద్యార్థులు జలుబు, జర్వం, దగ్గుతో బాధపడుతుంటే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. (కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు) -
లగేరహో లక్సెంబర్గ్
యూరోపియన్ యూనియన్లోని లక్సెంబర్గ్ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మార్గానికి లగ్జెంబర్గ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బస్సులు, ట్రామ్లు, రైళ్లు ఈ మూడింటిలో ఏ రవాణామార్గాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో మీరు హాయిగా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసేయొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. యావత్ ప్రజారవాణా వ్యవస్థని నిజంగానే ప్రజలకు అంకితమిచ్చింది. ఒకరోజో, రెండ్రోజులో కాదుసుమండీ. లక్సెంబర్గ్లో ప్రజలందరికీ ఇక ప్రయాణం ప్రతిరోజూ ఉచితమే. యూరప్లోని అతిచిన్న దేశమైన లక్సెంబర్గ్ జనాభా కేవలం 6,14,000. జనాభా గత 20 ఏళ్లలో 40 శాతం పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. రద్దీని తగ్గించేందుకే.. ప్రపంచ ప్రజల ముందున్న ప్రధానమైన సవాళ్ళలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు అత్యంత కీలకమైనవి. పర్యావరణం, రద్దీ (ట్రాఫిక్ సమస్య) ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న సమస్యలు కూడా. ఇక లక్సెంబర్గ్ సంగతి సరేసరి. విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ప్రధాన రోడ్లన్నీ పాడైపోయాయి. బస్సులు పాతబడిపోయాయి. రైళ్ళ రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. దీనికి తోడు లక్సెంబర్గ్లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సగానికి సగం మంది అంటే 2 లక్షల మంది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీల నుంచి లక్సెంబర్గ్కి వచ్చేవారే. అక్కడ అధిక వేతనాలు ఉండడమే అందుకు కారణం. ఖర్చు మోపెడు దీనివల్ల టిక్కెట్ల ద్వారా నష్టపోయే మొత్తం 44 మిలియన్ డాలర్లు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేస్తారు. ఉచిత రవాణా మొత్తానికి అయ్యే ఖర్చు 50 కోట్ల యూరోలు. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు. ఫస్ట్క్లాస్ ప్రయాణికులే టిక్కెట్లు కొంటారు కనుక టిక్కెట్ల తనిఖీకి వెచ్చించాల్సిన సమయం తగ్గుతుంది. లక్సెంబర్గ్లో చాలా మంది కార్మికులకు సబ్సిడీతో కూడిన పాస్లు ఉంటాయి. టిక్కెట్టు కొనుక్కునేవారు తక్కువగానే ఉంటారు. ఇప్పుడు మిగిలిన వారికి కూడా ప్రయాణం ఉచితం కావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తిపై 600 యూరోలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి మరో కారణం ప్రజారవాణా వ్యవస్థని బలోపేతం చేయడం. రాబోయే ఐదేళ్లలో ప్రజారవాణాని ఉపయోగించే వారి సంఖ్య 20 శాతం పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర యూరోపియన్ దేశాలకంటే లక్సెంబర్గ్ ప్రజారవాణా వ్యవస్థపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఏడాదికి 600 యూరోలు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ లక్సెంబర్గ్లో కార్లు అధికం. వేతనాలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా కావడంతో కార్ల వాడకం ఎక్కువ. ఈ ట్రాఫిక్ను తగ్గించేందుకే ఈ ఉచిత బాట. లక్సెంబర్గ్ ప్రజలతో పాటే పర్యాటకులకు సైతం అక్కడ ప్రయాణం ఉచితమే. అయితే ఫస్ట్ క్లాస్లో ప్రయాణించే వారికి మాత్రం టిక్కెట్టు వడ్డింపులు భారీగానే ఉంటాయి. -
కువైట్ బాటలో ఖతర్
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఖతర్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తమ దేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ సహా 14 దేశాల నుంచి తమ దేశంలోకి రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో ఉపాధి కోసం ఖతర్ వెళ్లే తెలంగాణవాసు లు ఇప్పట్లో అక్కడకు వెళ్లే అవకాశం లేదు. పలువురు కార్మికులకు వీసాతో పా టు ముందస్తుగానే విమాన టిక్కెట్ కొనుకున్నా, తాజా పరిణామాలతో ఆ దేశం వెళ్లలేని పరిస్థితి.. విమాన సర్వీసుల ర ద్దుపై ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనుందని తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్ వల్ల తమ దేశ ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన కువైట్ ప్రభుత్వం కూడా ఎనిమిది దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా ఖతర్ ప్రభుత్వం కూడా రాకపోకలపై నిషే ధం విధించింది. ఈ నిర్ణయంతో భారత్, చైనా, బంగ్లాదేశ్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్ నుంచి ఖతర్కు రాకపోకలు నిలిచి పోయాయి. ఖతర్లో ఆదివారం వరకు 24 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ ప్రభావం ఉన్న ఈ 14 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. కాగా, ఖతర్లో ఉన్న తెలంగాణవాసులు ఒకవేళ తమ సొంత ఊళ్లకు వెళ్లాలంటే అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. ఖతర్లోని వివిధ నిర్మాణ కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలలో వేలాది మంది తెలంగాణ వాసులు ఉపాధి పొందుతున్నారు. రోజూ పలువురు అక్కడి నుంచి స్వదేశానికి రాకపో కలు సాగిస్తారు. తాజా పరిణామాలతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఇప్పట్లో రాలేం..: ఖతర్ నుంచి ఇప్పట్లో ఇండియాకు రాలేం. అలాగే మన దేశం నుంచి ఖతర్కు వచ్చే వారు కూడా కొన్ని రోజుల పాటు ఓపిక పట్టాల్సిందే. కరోనా విస్తరించకుండా ఉండడానికి ఖతర్ ప్రభుత్వం 14 దేశాల రాకపోకల పై నిషేధం విధించింది. కొత్తగా వీసాలు తీ సుకున్న వారు కూడా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. – అబ్బగోని శ్రీధర్ గౌడ్, ఖతర్ -
‘మౌలికం’ కీలకం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరుల జీవనాన్ని సులభతరం చేసేందుకు 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మౌలిక వసతుల రంగంలో ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తామని ప్రధాని గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. జాతీయ మౌలిక వసతుల పైప్లైన్ (ఎన్ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు. 2023కి ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, నిర్వహణ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. త్వరలోనే జాతీయ సరుకు రవాణా విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 2023 నాటికి ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయన్నారు. చెన్నై–బెంగళూరు ఎక్స్ప్రెస్ రహదారి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయని చెప్పారు. ‘రహదారుల నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది. 2015–16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018–19 నాటికి ఇది 29.7 కి.మీ.కి పెరిగింది’అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గృహ నిర్మాణం, చౌకగా పరిశుద్ధమైన ఇంధనం, ఆరోగ్యం, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, బస్ టెర్మినళ్లు, మెట్రో, రైల్వే రవాణా, గిడ్డంగులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ఉపాధి అవకాశాలు విస్తృతం: గడ్కారీ మౌలిక వసతుల రంగానికి ఈ బడ్జెట్ గట్టి ఊతం ఇచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్ పారిశ్రామిక అభివృద్ధికి జవసత్వాలు కల్పించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా 2 కోట్లకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. బడ్జెట్లో ‘మౌలిక’వరాలు... ► పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్ రైళ్లు. ► ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైళ్లపై చురుగ్గా పరిశీలన. ► ‘ఉడాన్’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి. ► ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్లో రూ.22,000 కోట్లు ► 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్ ► 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి. రైల్వే లైన్ల పక్కన సోలార్ ప్రాజెక్టులు రైల్వే నెట్వర్క్ కోసం సౌర విద్యుత్ను వినియోగించుకునేలా ట్రాక్ల పక్కన రైల్వేకు చెందిన భూమిలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో 150 ప్యాసింజర్ రైళ్ల ఏర్పాటు, 4 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 18,600 కోట్లు ఖర్చయ్యే 148 కి.మీల బెంగళూరు సబర్బన్ రవాణా ప్రాజెక్టును బడ్జెట్లో ప్రతిపాదించారు. మెట్రో తరహాలో టికెట్ రేట్లు ఉంటాయి. -
కశ్మీర్ : ఆపిల్ రైతులపై దాడులు; సంబంధాలే ముఖ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నిత్యం జరిగే ఉగ్రదాడులతో ప్రజలు భయంభయంగా బతుకున్నారు. ఇక రైతుల కష్టాలు సరేసరి. తాము పండించిన పంటను మార్కెట్కు తరలించి అమ్మకునేందుకు ఆపిల్ రైతులు, సరఫరాదారులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆపిల్ పంట ట్రాన్స్పోర్టు చేస్తున్న ఓ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు కాశ్మీరీయేతర ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. మరో రెండు ట్రక్కులను ఉగ్రవాదులు తగులబెట్టారు. అక్టోబర్ 14న రాజస్తాన్కు చెందిన ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. దీంతో కశ్మీర్కు వాహనాల్ని పంపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి రాష్ట్రాలకు ఆపిల్ పంటను రవాణా చేసే క్రమంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పరిపాలన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ఆపిల్ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. బయటి రాష్ట్రాల్లో అమ్ముకుంటే వచ్చేదానికన్నా ఎక్కువ ధర చెల్లించిమరీ కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే, ఈ విధానంపై రైతులు, వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంవత్సరాల నుంచి ఉన్న తమ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఎంఐఎస్ స్కీమ్పైగులాంనబీ అనే రైతు మాట్లాడుతూ.. ‘సంప్రదాయ మార్కెటింగ్ విధానంలోనే ఇటీవల 15 కిలోల ఆపిల్ పెట్టెను కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరఫరా చేశాను. దాదాపు రూ.700 నుంచి రూ. 800 వరకు లాభం వచ్చింది. కానీ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తే రూ.1000 వచ్చేవి. అయితే, నాకది ఇష్టం లేదు. బయటి రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులతో చాలా ఏళ్లుగా ఉన్న సంబంధాలే మాకు ముఖ్యం. డబ్బులు ప్రధానం కాదు. పంజాబ్ లేదా దక్షిణ భారతదేశంలోని వ్యాపారులతో కశ్మీర్ వ్యాపారుల సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మాకు ఇష్టం లేదు’అన్నాడు. -
గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి, హనుమాన్జంక్షన్: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలను నియమించామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం ఎ.సీతారామపురం సెంటర్లో వీరవల్లి పోలీసులు శనివారం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. రూ.20 లక్షలు విలువైన గంజాయి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు వీరవల్లి పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై పక్కా సమాచారం రావటంతో వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏపీ 16 యూ 8793 నంబర్ గల లారీలో 200 కేజీల బరువు కలిగిన 100 గంజాయి ప్యాకెట్లు తరలించటాన్ని గుర్తించారు. ఈ లారీతో పాటు డ్రైవర్ కూచిపూడి ఫ్రాన్సిస్, సహాయకుడు బండి నాగరాజులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విశాఖ జిల్లా జె.నాయుడుపాలెం గ్రామం నుంచి ఈ నెల 11వ తేదీన గంజాయి లోడుతో బయలుదేరినట్లు తెలిపారు. ఈ గంజాయి ప్యాకెట్లను గన్నవరం చేర్చేందుకు డ్రైవర్ ఫ్రాన్సిస్కు రూ.1.50 లక్షలు, సహాయకుడు బండి నాగరాజుకు రూ.50 వేలు ఇచ్చేట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణా ప్రధాన సూత్రధారులు, ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తున్నారనే వివరాలపై పోలీసులు వీరిద్దరిని తమదైన శైలిలో విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా ప్రధాన సూత్రధారుడిని పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను నియమించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, కాలేజి విద్యార్థులకు వీటిని సరఫరా చేయటంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే నూజివీడులో గంజాయి వ్యసనానికి గురైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశామని, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. కాలేజి విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాపై కూడా నిఘా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 200 కేజీల గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. వీటిని తరలిస్తున్న కూచిపూడి ఫ్రాన్సిస్, బండి నాగరాజులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గన్నవరం మండలం కట్టుబడిపాలెంకు చెందిన ఫ్రాన్సిస్కు విశాఖ జిల్లా రోలుకుంట మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన బండి నాగరాజుతో ఏర్పడిన పరిచయంతోనే గంజాయి అక్రమ తరలింపునకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ వివరించారు. రూ.20 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబును నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, హనుమాన్జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకట రమణ అభినందించారు. -
సరుకుల రవాణాకు ‘ఈ–పర్మిట్’
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి దిగుబడి ఏటా 35 లక్షల క్వింటాళ్లకు పైగా వస్తుంది. రైతులు పూర్తిగా విక్రయించినా మార్కెట్ దస్త్రాల్లో సగం కూడా నమోదు కావడం లేదు. మరి మిగతా సరుకులు ఎక్కడికి వెళ్తున్నాయి.. కొనుగోలుదారులు కట్టాల్సిన పన్నులను ఎవరు తన్నుకుపోతున్నారు.. సర్కారు ఖజానాకు ఏ మేరకు గండిపడుతోంది..? కొన్నేళ్లుగా అందరిలో వెల్లువెత్తుతున్న సందేహాలు ఇవి. ఆలస్యంగానైనా మేల్కొన్న రాష్ట్ర మార్కెటింగ్శాఖ అవినీతికి తెరదింపేందుకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, సరుకుల రవాణా, పన్నుల వసూళ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. ఇకపై లెక్కలు పక్కాగా చూపేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారీగా ప్రధాన పంటల దిగుబడులు.. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్, రబీ కలుపుకొని ఏటా 6.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో రెండు లక్షల హెక్టార్లు పత్తి, మూడు లక్షల హెక్టార్లు వరి, లక్ష హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తారు. 35 లక్షల నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి, 1.80 కోట్ల క్వింటాళ్ల వరి, 50 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఇరు సీజన్లలో క్రయవిక్రయాలు సాగుతాయి. వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ రంగ సంస్థలే అధికంగా సేకరిస్తుండగా, పత్తిని పూర్తిగా మిల్లర్లు, ట్రేడర్లు కొంటున్నారు. నిబంధనల ప్రకారం.. వ్యాపారులు సరుకుల కొనుగోళ్ల వివరాలను రోజూ మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, ఇతర అపరాల ఎగుమతికి కార్యదర్శి నుంచి రవాణా పర్మిట్ తీసుకోవాలి. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొనుగోలు చేసిన సరుకుల విలువలో ఒకశాతం పన్నుగా చెల్లించాలి. మార్కెట్ ఆదాయానికి భారీగా గండి.. కొందరు వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కొన్న సరుకులు, మార్కెట్కు చూపుతున్న లెక్కలకు పొంతన ఉండడం లేదు. ప్రధానంగా మిల్లుల్లో కొంటున్న సరుకులను పూర్తిస్థాయిలో చూపడంలేదు. అధికారులకు రోజూ ఇవ్వాల్సిన వివరాలను నెలకు ఒక్కసారి కూడా సమర్పించడం లేదు. అడిగే దిక్కులేక చాలామంది వ్యాపారులు తప్పుడు లెక్కలతో మార్కెట్ ఆదాయానికి గండికొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోపాయికారీ ఒప్పందాలతో మాన్యువల్ పర్మిట్లు తీసుకుంటూ సరుకులను రవాణా చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా పత్తి, ధాన్యం, మక్కలు ఖరీదు చేస్తున్న దళారులు ఆయా చెక్పోస్టుల్లో చేతివాటం ప్రదర్శిస్తూ సరుకులను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా ఏటా లక్షలాది క్వింటాళ్లు వక్రమార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాలిల్లుతోంది. ఇది బహిరంగమే అయినా అధికారుల్లో చలనం కరువైంది. నామమాత్రపు తనిఖీలతో అక్రమ వ్యాపారానికి అడ్డులేకుండా పోయింది. ఎట్టకేలకు మేల్కొన్న మార్కెటింగ్శాఖ.. ఏళ్లుగా సాగుతున్న అవినీతిని ఎట్టకేలకు మార్కెటింగ్శాఖ గుర్తించింది. కొనుగోళ్లలో పారదర్శకత, పూర్థిసాయిలో పన్నుల వసూళ్లకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సదరుశాఖ రూపొందించిన వెబ్సైట్లో తొలుత మిల్లర్లు, ట్రేడర్లు వారి సంస్థలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్ అధికారులు పరిశీలించాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. భద్రత కోసం పాస్వర్డ్ మార్చుకునే వీలుంది. వ్యాపారులు వెబ్సైట్లో లాగిన్ అయ్యాక సరుకుల కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. యార్డులో అయితే కమీషన్ ఏజెంట్ ద్వారా ఎన్ని క్వింటాళ్లు కొన్నారనేది చూపితే సరిపోతుంది. ఎందుకంటే రైతుల వివరాలను మార్కెట్ సిబ్బంది రికార్డుల్లో చేరుస్తారు. గ్రామాల్లో, మిల్లుల్లో నేరుగా కొంటే.. సరుకులు అమ్మిన రైతుల వివరాల(చిరునామా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్)ను వ్యాపారులు పూర్తిగా నమోదు చేయాలి. నెలవారీ కొనుగోళ్ల ప్రకారం ప్రతినెలా పదో తేదీ లోపు పూర్తిగా పన్ను(సరుకుల విలువలో ఒకశాతం) చెల్లించాలి. ఇవి పాటిస్తేనే బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, అపరాలు తదితర ఉత్పత్తుల రవాణాకు ఆన్లైన్లో ఈ–పర్మిట్ జారీచేస్తారు. ఈ విధానం గతనెల 26న ఉమ్మడి జిల్లాలో అమల్లోకి రాగా.. మిల్లర్లు, ట్రేడర్లు క్రమంగా వెబ్సైట్లో లాగిన్ అవుతున్నారు. రంగంలోకి విజిలెన్స్ బృందాలు.. ఇకపై వ్యాపారులు ఇష్టారాజ్యంగా పర్మిట్లు తీసుకునే వీల్లేదు. సరుకుల కొనుగోళ్ల మేరకే పర్మిట్లు ఇచ్చేలా వెబ్సైట్ రూపొందించారు. లెక్కల్లో చూపని వాటికి రవాణా అనుమతులు రాకుండా రూపకల్పన చేశారు. ఒకవేళ అక్రమ రవాణా చేస్తే చెక్పోస్టులో నిలిపివేస్తారు. చేతివాటంతో అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా దాన్నీ అడ్డుకునేందుకు మార్కెటింగ్శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రహదారులపై తనిఖీకి విజిలెన్స్ బృందాలను నియమించింది. ఈ–పర్మిట్ లేకుండా రవాణా చేస్తూ పట్టుబడితే వ్యాపారులు చెల్లించాల్సిన పన్ను కంటే 5 నుంచి 8 రెట్లు అధికంగా జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. దొంగ దందాతో సర్కారు ఖజానాకు తూట్లు పొడుస్తున్న దళారులపై కూడా విజిలెన్స్ ఉక్కుపాదం మోపనుంది. ఇకనుంచి అధికారులు గ్రామాల్లో నేరుగా జరిగే కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే దళారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
అజయ్ పిరమళ్ చేయి వేస్తే...
ముంబై: అజయ్ పిరమల్కు... పెట్టుబడులపై భారీ లాభాలు ఆర్జిస్తారనే పేరు ఉంది. దీనిని ఆయన మరోసారి నిజం చేశారు. ఆరేళ్ల క్రితం (2013లో) ఆయన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో 9.96 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ వాటాను రూ.653 కోట్ల లాభంతో రూ.2,305 కోట్లకు అమ్మేశారు. ఒక్కో షేర్ను ఎంత ధరకు అమ్మారన్న వివరాలు లభించనప్పటికీ, సగటు విక్రయ ధర రూ.1,000–1,015 రేంజ్లో ఉండొచ్చని సమాచారం. మొత్తం మీ ఈ డీల్లో ఆయనకు ఆరేళ్లలో 40 శాతం రాబడులు వచ్చినట్లయింది. అజయ్ పిరమళ్కు చెందిన పిరమళ్ ఎంటర్ప్రైజెస్కు ఇతర శ్రీరామ్ గ్రూప్ కంపెనీల్లో కూడా వాటాలున్నాయి. శ్రీరామ్ సిటీ యూనియన్లో 10 శాతం, శ్రీరామ్ క్యాపిటల్లో 20 శాతం చొప్పున ఆయనకు వాటాలున్నాయి. ఈ వాటాల కోసం ఆయన ఐదేళ్ల క్రితం రూ.4,600 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు వాటా విలువ రూ.9,000 కోట్లకు చేరింది. టెలికం దిగ్గజం వొడాఫోన్లో కూడా ఆయన భారీగానే ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలతో బైటపడ్డారు. గత పదేళ్లలో ఆయన పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాలో, కొనుగోళ్ల లావాదేవీలో జరిపారు. మెర్క్, ఎలిలిల్లీ, ఫైజర్, అబాట్, బయో–సింటెక్, బేయర్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. -
రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు
సాక్షి, జగిత్యాల: జిల్లాలో రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. సోమవారం రాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకువచ్చారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై ఆటో డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈవీఎంలను ఆటోలో తరలించడం గమనించిన కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవి డెమో ఈవీఎంలు అని ఆటో డ్రైవర్తో పాటు అక్కడున్న మరో వ్యక్తి చెబుతున్నారు. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
అనంతపురం జిల్లాలో దివాకర్ ట్రావెల్స్లో చీరల తరలింపు పట్టివేత
-
వసూళ్లపై పోలీస్ అధికారుల ఆరా..?
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 ఇంక్లైన్ వద్దగల కోల్ ట్రాన్స్పోర్టులో మళ్లీ వసూళ్ల దంద మొదలైంది. ఈవిషయంపై జిల్లా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందితో ఆరా తీయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వి శ్రీనివాస్రావు లారీ ఓనర్స్, ట్రాన్స్పోర్టర్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వసూళ్లను నిలిపివేయాలని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ముందస్తు జాగ్రత మేరకు ఏరియాలో కోల్ ట్రాన్స్పోర్టుకు అంతరాయం వాటిల్లకుండా ఉండేందుకు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు డివిజన్ ఉన్నతాధికారి ఈవసూళ్లపై సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. కోల్ట్రాన్స్పోర్టులో గతంలో ఒక వర్గం వారే వసూళ్లు చేస్తే, ఈసారి రెండు వర్గాల వారు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి యాజమాన్యం నుంచి వినియోగదారులు బొగ్గును ఆన్లైన్లో కొనుగోలు చేసి, ట్రాన్స్పోర్టర్ల ద్వారా రవాణా చేయించుకుంటుంటే... ఈ మధ్యలో ఈ వసూళ్ల దందా ఏంటని, దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను కోరినట్లు తెలిసింది. -
ఆటో.. అటో ఇటో..!
ఆర్మూర్టౌన్: నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆటోలతో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిబంధనల మేరకు ఆటోలు, ఇతర వాహనాలు నడిపేందుకు ఆర్టీవో కార్యాలయం నుంచి లైసెన్సులు పొందాలి. లైసెన్సులు లేకున్నా ఆటోలు నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మూర్ పట్టణం మున్సిపల్ పరిధిలో ఆటోల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పట్టణంతోపాటు నిజామాబాద్ నగరం, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్ పట్టణాలే కాకుండా అన్ని మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించింది. పట్టణాలకు చుట్టు పక్కల గ్రామాలకు బస్సులు వెళ్లలేకపోవడంతో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఆటోల మీద ఆధారపడి ప్రయాణం సాగిస్తున్నారు. అదే విధంగా పట్టణాల్లో ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ప్రజలు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా ముగ్గురు ప్రయాణికులతో ప్రయాణించాల్సిన ఆటోలో ఎనిమిది నుంచి పది మంది వరకు ఎక్కించుకుని వెళుతున్నారు. పెరుగుతున్న ప్రమాదాలు అనుభవం, లైసెన్సు లేకుండా ఆటోలు నడపటంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఆటోలు నడపాలి. అయితే ఇక్కడ మైనర్లు సైతం ఆటోలు నడుపుతున్నారు. ఫలితంగా పట్టణంలో తరుచూ ప్రమాదాలు జరగుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆటోలు డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆటోలో డ్రైవర్ల పక్కన కూర్చుని ప్రయాణించేందుకు అనుమతి లేదు. కాగా డ్రైవర్ సీట్లో డ్రైవర్తో పాటు ముగ్గురు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా ప్రయాణికుల కోసం ఆటో డ్రైవర్లు తమ ఆటోలను రోడ్డు మీదనే నిలుపుతున్నారు. దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఆటోవెనుక పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోతున్నాయి. బస్టాండ్ ప్రాంతంలో ఆటోడ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఆటోడ్రైవర్లపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మచ్చుకు కొన్ని సంఘటనలు.. ఫిబ్రవరి 7న పాత ఎంజే ఆస్పత్రి వద్ద బైక్ వెళ్తున్న మురిళి అనే వ్యక్తికి ఆటో ఢీకొట్టిన సంఘటనలో ఆయన చేయి విరిగింది. సుమారు రూ.80వేల వరకు ఆస్పత్రి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈనెల 4న గోల్బంగ్లా ప్రాంతంలో ఓ ఆటోడ్రైవర్ ఆటోను రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనుక ఉన్న ఓ బాలుడిని చూడక ఢీకొని పక్కన ఉన్న మురికి కాలువ పడిపోయాడు. ఈ సంఘటనలో బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగపోడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెలలో ఆలూర్ సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో 9మంది మహిళలకు గాయాలయ్యాయి. అటోల ఆగడాలను అరికట్టాలి.. పట్టణంలో ఆటోలు ఇష్టానుసారంగా వ్యహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణిలకు ఎక్కించుకొని వెళ్తున్నారు. మైనర్లు ఆటోలు నడిపించినట్లైతే వారి చర్యలు తీసుకునే విధంగా అ«ధికారులు చర్యలు తీసుకోవాలి. –రాజేందర్, ఆర్మూర్. లైసెన్సు లేకుంటే చర్యలు తీసుకోవాలి లైసెన్సు లేకుండా ఆటోలు నడిపిస్తున్న వారిపై సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలి. మితిమీరిన వేగంతో నడిస్తున్న ఆటోడ్రైవర్లకు అడ్డుకట్టా వేయాలి. మైనర్లు ఆటోలు నడిపిస్తే ఆ ఆటోలను సీజ్ చేయాలి. అధికారులు ప్రతిరోజు ఆటోల తీరుపై నిఘా ఉంచాలి. –మోహన్, ఆర్మూర్. -
వ్యవసాయ ఎగుమతుల పెంపుపై దృష్టి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం, అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రుణ సంబంధ సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఫైనాన్స్ వ్యవహారాల కార్యదర్శి ఈ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తారని పేర్కొన్నారు. ఎగుమతుల రంగానికి రుణాన్ని ప్రాధాన్యతాపరమైనదిగా పరిగణించాలని డిమాండ్ ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఏ విధంగానూ ఉల్లంఘించకుండా, ఇరాన్తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్–చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2018–19 ఏప్రిల్–అక్టోబర్ మధ్య భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ 48 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 43.11 బిలియన్ డాలర్లు. -
అశోక్ లేలాండ్కు భారీ ఆర్డర్లు
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్కు భారీ ఆర్డర్లు దక్కాయి. చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్వేస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్ల నుంచి ఆర్డర్లు లభించాయని అశోక్ లేలాండ్ తెలిపింది. ఈ సంస్థల నుంచి మొత్తం 2,580 బస్సులకు ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఎమ్డీ, వినోద్ కె దాసరి వివరించారు. ఈ బస్సులను మరో రెండు నెలల్లో డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, నవకల్పనలతో బస్సులను తయారు చేయడం వల్ల భారత బస్సు మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నామని వివరించారు. -
స్తంభించిన రవాణా, బ్యాంకింగ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన 48 గంటల సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా, బ్యాంకింగ్ రంగాలు స్తంభించాయి. సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమ్మెకు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ర్యాలీ, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్ టియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనలు మిన్నంటాయి. కార్మిక సంఘాల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేరళలో కార్మిక సంఘాలు రోడ్డెక్కడంతో ప్రజాజీవనం స్తంభించింది. ఒడిశాలోనూ రవాణా వ్యవస్థ స్తంభించింది. -
వాగులో రాత్రిళ్లు తోడేస్తున్నారు..
ఓ పక్క ఎన్నికల వేళ.. మరోపక్క అధికారులు విధుల్లో బిజీ. ఇంకేముంది ఇసుకాసురులకు ప్రతి రోజూ పండుగే అవుతోంది. ప్రస్తుత పరిస్థితులను క్యాష్ చేసుకుంటున్న ఇసుక అక్రమార్కులు పెద్దవాగు రాత్రివేళల్లో డంపింగ్ చేసి పగలు జంపింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకున్నా ఇసుక వ్యాపారులు తవ్వేస్తున్నారు. సాధారణ రోజుల్లోకంటే రెట్టింపు ధరలకు ఇసుకను అక్రమ వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. సాక్షి,వేల్పూర్: మండలంలోని రామన్నపేట్ గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్దవాగు నుంచి రాత్రిపూట ఇసుకను గ్రామం బయట గల అయ్యల గుట్ట వద్ద డంపు చేస్తున్నారు. చుట్టు పక్కల అవసరమైన వారికి పగటి పూట సరఫరా చేయడం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో, దొరికిన అవకాశాన్ని దళారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ అనుమతితో ఇసుక సరఫరాను అధికారులు నిలిపేశారు. ఇండ్లు నిర్మించేకునే వారికి ఇసుక లభించక విలవిలలాడుతున్నారు. దీంతో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో లభించే రేటుకు రెట్టింపు ధర పెరిగింది. దీనిని దళారులు గుర్తించి తమ వ్యాపారానికి పదును పెట్టారు. ఎక్కడ అవకాశం దొరికినా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రామన్నపేట్ గ్రామం పక్కన పెద్దవాగు ఉంటుంది. స్థానికి వీడీసీకి ట్రాక్టరుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తూ వ్యాపారులు రాత్రిపూట ట్రాక్టర్ల ద్వారా అయ్యల గుట్ట వద్ద ఇసుకను నిల్వ చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. అటువైపు ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఇతరులు అటువైపు వెళ్లే అవకాశం లేదు. ఇతర గ్రామాల వారుగాని, అధికారులుగాని చూడని ప్రాంతాన్ని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతితో నడిచే ఆసుక ఆగిపోవడంతో, దళారులు తమ వ్యాపారాన్ని ‘మూడు ట్రాక్టర్లు.. ఆరు టిప్పర్లు’గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ. 7 నుంచి 8 వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కూలీలతో ఇసుక నింపితే బయట తెలుస్తుందని దళారులు ఏకంగా జేసీబీలనే వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వాగులో ఒకటి, అయ్యల గుట్ట వద్ద మరో జేసీబీని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఇసుక అవసరమైన వారికి కొద్ది గంటల్లోనే చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక సరఫరాను నిషేధించడంతో అధికారులు అటువైపు దృష్టి పెట్టడం లేదు. దీనికి తోడు ఎన్నికల విధుల్లో చాలా బిజీగా ఉన్నారు. అధికారులకు ఉన్న బిజీ ఇసుక వ్యాపారుల పంట పండిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క వేల్పూర్ మండలంలోనే లేదు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉంది. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
శవాల తరలింపునకు దారేదీ..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదల మృతదేహాల తరలింపు ప్రక్రియ ప్రహనంగా మారింది. నిర్వహణ లోపం వల్ల వాహనాలు తరచుగా మెరాయిస్తుండటం, వివిధ సాంకేతిక లోపాలతో షెడ్డుకు చేరిన వాహనాలకు సకాలంలో రిపేర్లు చేయించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు ప్రైవేటు అంబులెన్స్లను ఆశ్రయిస్తున్నారు. మృతదేహాన్ని ఎలాగైనా సొంతూరికి తీసుకెళ్లాలనే బంధువుల ఆతృతను ప్రైవేటు అంబులెన్స్ యజమానులు ఆసరాగా చేసుకొని నిలువు దోపిడికి పాల్పడుతున్నారు. 32 వాహనాల్లో సగం షెడ్డులోనే.. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి చనిపోయిన వారి శవాలు, వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి మృతదేహాలు, వివిధ పనులపై నగరానికి వచ్చి ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయిన వారు, అనాధ శవాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా, గాంధీ శవాగారాలకు తరలిస్తుంటారు. వీటితో పాటు వివిధ జబ్బులతో బాధపడుతూ ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేక చనిపోయిన బాధితు లు ఉంటారు. ఇలా ఉస్మానియా మార్చురీకి రోజుకు సగటున 18 మృతదేహాలు వస్తుండగా, గాంధీ మార్చురీకి రోజుకు సగటున 25 మృతదేహాలు వస్తుంటా యి. శవపంచనామా తర్వాత ఫోరెన్సిక్ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగిస్తుంటారు. పేదల మృతదేహాల తరలింపు కోసం ప్ర భుత్వం 2016 నవంబర్లో 50 ‘హెర్సే’(పరమపద వాహనాలు)అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఉస్మానియా, గాంధీ, ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి, నిలోఫర్, నిమ్స్ ఆస్పత్రులకు 32 వాహనాలను కేటాయించింది. నిధుల కేటాయింపు లేమితో పాటు నిర్వహణ లోపం వల్ల వీటిలో ప్రస్తుతం పదిహేను వాహనాలు పని చేయడం లేదు. ఎప్పటికప్పుడు వీటికి రిపేర్లు నిర్వహించి బాధితులకు అందుబాటులో ఉంచాల్సిన యంత్రాంగం పట్టించుకో కపోవడంతో విధిలేని పరిస్థితు ల్లో సొంతూళ్లకు మృత దేహాలను తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్లను ఆశ్రయించాల్సి వస్తుంది. నిజానికి హెర్సే వాహనాలు అందుబాటులోకి వచ్చిన త ర్వాత ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రైవేటు అంబులెన్స్ను నిషేదించారు. కానీ ప్రస్తుతం వీటిలో చాలా వరకు రిపేర్ల పేరుతో షెడ్డులో చేరడంతో ప్రైవేటు వాహనాలు బారులు తీరుతున్నాయి. విధులకు దూరంగా ఆర్ఎంఓలు.. ఒక వైపు సగానికిపైగా వాహనాలు షెడ్డు దాటని పరిస్థితులో ఉంటే..మరో వైపు అందుబాటులో ఉన్నవాటికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఆస్పత్రిలో ఎవ రైనా బాధితుడు చనిపోతే..మృతదేహం తరలింపు కోసం పరమపద వాహనాలను సమకూర్చాల్సిన బాధ్యతను సంబంధిత ఆస్పత్రి ఆర్ఎంఓలకు అప్పగిం చింది. కానీ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆర్ఎంఓలు కాకుండా హెల్త్ ఇన్స్పెక్టర్లకు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. కీలకమైన ఎంఎల్సీ కేసుల వివరాలు నమోదు సహా పరమపద వాహనాల బుకింగ్ హెల్త్ ఇన్స్పెక్టర్లు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. సమయానికి వీరు ఆస్పత్రిలో అందుబా టులో లేక పోవడంతో బంధువులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి ఎదురు చూసినా వీరు రాకపోవడం, ఒక వేళ వచ్చి వాహనం సమకూర్చి నా..డిజిల్ ఖర్చుల పేరుతో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు సమ్మె‘పోటు’
కాళేశ్వరం: లారీల సమ్మెతో జయశంకర్ భూపాలపల్లిలో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. సిమెంటు, డీజిల్ నిల్వలు తరిగిపోతుండటం.. సమ్మె కారణంగా వచ్చే ముడిసరుకు నిలిచిపోవడంతో మరోమూడు రోజుల్లో ఇక్కడ పనులు నిలిచిపోయే అవకాశం ఉందని ఇంజనీర్లు, ఏజెన్సీల సంస్థల బాధ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తర్వాత ఎండలు, వర్షాలను మినహాయిస్తే లారీల సమ్మె కారణంగా తొలిసారిగా ఇబ్బందులు ఎదురుకానున్నాయని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. బ్యారేజీలు, పంపుహౌస్ల సమాహారమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువుపట్టు మేడిగడ్డ బ్యారేజీ. ఇక్కడ పనులు పూర్తయితే ప్రాణహిత నది నీటిని ఎత్తిపోతలు, గ్రావిటీ కెనాల్ల ద్వారా తెలంగాణ అంతటికీ పారించవచ్చు. ప్రాణహితలో నీటి ప్రవాహం కారణంగా ఇప్పటికే పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు బెడ్ లెవల్ వర్క్ పూర్తయి పిల్లర్ల దశలో నడుస్తున్నాయి. నిత్యం 3,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. దీని కోసం 2,000 టన్నుల సిమెంటు, 3,000 లీటర్ల డీజిల్ అవసరం అవుతున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చోట్ల పది రోజులకు సరిపడా మెటీరియల్ను సంబంధిత ఏజెన్సీలు నిల్వ ఉంచుకుంటున్నాయి. సమ్మెతో ఇప్పటికే ఏడు రోజుల పాటు రా మెటీరియల్ రాక ఆగిపో యింది. మరో మూడు రోజులకు సరిపడ మా త్రమే ఉంది. సమ్మె ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల తర్వాతæ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వరుస కష్టాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో 2018 జూలై నాటికి నీటిని కొంత మేరకైనా తరలించాలని ఏడాది కాలంగా పనులు వేగంగా చేపడుతున్నారు. వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పగటి వేళ పనులు నిలిపేసి రాత్రి వేళ కొనసాగించారు. దీంతో సుమారు ముప్పై రోజులపాటు పనులు మందగించాయి. ఆ తర్వాత వర్షాల కారణంగా జూలై 2 నుంచి 13 వరకు పని స్థలాల్లోకి నీరు చేరుకోవడంలో నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. మోటార్లు పెట్టి నీటిని తోడి మళ్లీ పనులు ఊపందుకున్న సమయంలో లారీల సమ్మెతో మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకేసారి అన్ని చోట్ల కీలకమైన మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్హౌస్, కన్నెపల్లి –అన్నారం గ్రావిటీ కెనాల్, అన్నారం బ్యారేజీ, అన్నారం పంప్హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పంప్హౌస్తోపాటు మేడారం సర్జ్పూల్ తదితర అన్ని పని ప్రదేశాల్లో డీజిల్, సిమెంటు స్టాకు పూర్తిగా అడుగంటడం ఇంజనీర్లు, నిర్మాణ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని చోట్ల జనరేటర్లు మొదలు లారీలు, టిప్పర్లు, క్రేన్లు, పొక్లెయినర్లు, హైడ్రాలిక్ యంత్రాలు, బ్లూమ్ ప్రెసర్ ఇలా అన్ని భారీ యంత్రాలకు డీజిల్ తప్పనిసరి కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మరోవైపు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె విరమించేది లేదని లారీ యూనియన్లు వెనక్కి తగ్గడం లేదు. ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సైతం సమ్మెలోకి దిగారు. దీంతో ప్రత్యామ్నయ మార్గాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. -
ప్రాణాలకు తెగించి...
విశాఖపట్నం, అరకులోయ: ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల లక్ష్మిపురం పంచాయతీ పరిధి లోని ముత్తగుమి రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో గిరిజనులు ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తున్నారు. ఎంతో కష్టపడి తమ వాహనా లను ఒడ్డుకు చేరుస్తున్నారు. రెండు రోజులుగా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్ష్మిపురం పంచాయతీతో సరిహద్దులో ఉన్న ఒడిశాలోని 80 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసర ప్రయాణానికి గిరిజనులంతా నరకయాతన పడుతున్నారు. గెడ్డలో నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. బైక్లు, ఆటోలను అతికష్టంపై గెడ్డను దాటిస్తున్నారు. గెడ్డ ఉధృతి తగ్గే వరకు గిరిజనులంతా మండల కేంద్రానికి చేరుకోవడానికి అవస్థలు తప్పేటట్టు లేవు. అనేక గ్రామాల గిరిజనులకు మండల కేం ద్రంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. -
కొత్త నోట్ల తరలింపు ఖర్చు రూ.29.41 కోట్లు
న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.2000ల నోట్లను తరలించటానికి ఏకంగా రూ. 29 కోట్లు ఖర్చు చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం డబ్బులు రవాణా చేయటానికి వీలుగా సైనిక విమానాలను ఉపయోగించటం వల్ల ఈ మొత్తం ఖర్చు అయినట్లు సమాచారం. నవంబర్ 8, 2016న 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో అత్యధిక భాగం సరఫరాలో ఉన్న డబ్బు చెల్లుబాటులో లేకుండా పోయింది. ఆర్బీఐ వీటి స్థానంలో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిని దేశం మొత్తం సరఫరా చేయటానికి సీ-17, సీ-130 సూపర్ హెర్క్యులీస్ వంటి సైనిక విమానాలను ఉపయోగించింది. దీంతో ఆ విమానాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ కొత్త 500, 2000 రూపాయల నోట్లు ముద్రించటానికి 2016-17 సంవత్సరానికి గానూ దాదాపు రూ. 7,965 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం మిగిలిన చిల్లర మొత్తాలను ముద్రించటానికి రూ. 3,421కోట్లు ఖర్చు చేసింది. ఉపసంహరణకు గురైన పాత నోట్లు 99శాతం బ్యాంకులకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. కొత్త నోట్ల రవాణా కోసం సైనిక విమానాలను కాకుండా మామూలు విమానాలను ఉపయోగించి ఉంటే బాగుండేదని రిటైర్డ్ ఆర్మీ కమాండర్ లోకేష్ బట్రా అభిప్రాయపడ్డారు. -
ఎరక్కపోయి... ఇరుక్కుపోయి!
ఇబ్రహీంపట్నం: రాజధాని అమరావతి నిర్మాణానికి జలమార్గం ద్వారా మెటీరియల్ రవాణా చేస్తున్న పంటు ఇబ్రహీంపట్నం ఫెర్రీ లాంచీ రేవు సమీపంలో నదిలో ఒడ్డుకు పట్టి ఇరుక్కుపోయిం ది. శుక్రవారం సాయంత్రం 6.30గంటల సమయంలో 15 లారీలు (600 టన్నులు) ఎక్కించుకుని ఫెర్రీ వైపు నుంచి లింగాయపాలెంకు బయలుదేరింది. బయలు దేరిన కొద్దిసేపటికే నదిలో ఏర్పాటు చేసుకున్న మార్గంలో పక్కకు రావటంతో ఒడ్డుకు పట్టి కదలకుండా నిలిచిపోయింది. ఈపరిణామాలతో పంటుపైన ఉన్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంటు ఒడు ్డకు పట్టి నిలిచిపోయిందనే విషయాన్ని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఒడ్డుకు పట్టిన పం టును పక్కకు జరిపే ప్రయత్నాలు సిబ్బంది చేపట్టారు. సంగమం ప్రాంతంలో వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పంటుకు ప్రమాదం ఏర్పడిందనే సమాచారం మండలంలో దావానంలా వ్యాపించింది. అయితే ఆలస్యంగా అసలు విషయాన్ని తెలుసుకుని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
రాకెట్ కబుర్లు తెస్తుంది..!
రవాణా వ్యవస్థ ప్రారంభమైనప్పుడే పోస్టల్ వ్యవస్థ చరిత్ర కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఉత్తరాలను ఒక చోటు నుంచి మరో చోటుకు ఎలా చేరవేసేవారంటే.. ఆ ఏముంది.. రైలులోనో.. బస్సులోనో.. అంటారు కదా.. మరీ దూరమైతే విమానాల ద్వారా కూడా చేరవేసేవారు. ఇప్పుడైతే వాటి అవసరమే లేకుండా పోయిందనుకోండి. మన తాతల తరం వారికి ఏ చిన్న సమాచారం చేరవేయాలన్నా.. ఈ ఉత్తరాలే అన్నింటికీ ఆధారం. అప్పట్లో ఒక్క ఉత్తరం చేరాల్సిన చోటుకు చేరాలంటే వారాలకు వారాల సమయం పట్టేది.. అయితే త్వరగా పంపాలంటే ఎలా.. అందుకోసం రాకెట్లను వాడేవారట. రాకెట్ ద్వారా పోస్ట్ ఎలా పంపిస్తారని ఆశ్చర్యపోకండి.. నిజంగా రాకెట్ ద్వారానే ఉత్తరాలు పంపేవారట. 1810లోనే ఆలోచన.. రాకెట్ ద్వారా పోస్టు పంపాలన్న ఆలోచనకు 1810లోనే బీజం పడింది. అప్పట్లో హెన్రిచ్ వోన్ క్లీస్ట్ అనే రచయిత రాకెట్ ద్వారా ఉత్తరాలు పంపే ఆలోచనను వ్యాసం రూపంలో ఓ పత్రికలో రాశారు. జర్మనీలోని బెర్లిన్ నుంచి బ్రెస్లూ (180 మైళ్లు)కు సగం దినంలో పంపొచ్చని ఆయన అంచనా వేశారు. అంటే గుర్రం ద్వారా పట్టే సమయంలో పదో వంతన్న మాట. ఆయన సిద్ధాంతాన్ని టోంగాలోని పాలినేసియన్ అనే చిన్న ద్వీపంలో బ్రిటిష్ పరిశోధకుడు సర్ విలియమ్ కంగ్రీవ్ ఆచరణలో పెట్టారు. అయితే అది సక్సెస్ అవలేదు. మరో వందేళ్ల వరకు దీని గురించి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 1927లో హెర్మన్ జులియస్ అనే జర్మన్ ఫిజిసిస్ట్ దీనిపై ప్రయోగాలు చేశారు. 1928లో యువ ఇంజనీరైన ఫ్రెడ్రిక్ స్క్మీడిల్ ఉత్తరాలను రాకెట్ ద్వారా పంపేందుకు ప్రయత్నించారు. చివరికి 1931లో చరిత్రలోనే తొలిసారిగా రాకెట్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి 102 ఉత్తరాలను ఒకేసారి పంపి చరిత్రలోకెక్కారు. కిందికి దింపేందుకు పారాచూట్లను వాడేవారు. భారత్లో తొలి రాకెట్ ఉత్తరం! ఆ తర్వాత వేరే దేశాల్లో కూడా ఈ ప్రయోగాలు జరిగాయి. 1934లో భారత్లో దీనిపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఎయిరోస్పేస్ ఇంజనీర్ స్టీఫెన్ స్మిత్ విజయవంతంగా ఈ రాకెట్ ద్వారా ఉత్తరాలను పంపారు. 1934 నుంచి 1944 మధ్య దాదాపు 270 సార్లు ప్రయోగించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు ఆహారం అందించేందుకు స్మిత్ ప్రపంచలోనే తొలిసారిగా రాకెట్ను ఉపయోగించారు. ఖర్చు చాలా ఎక్కువే.. అయితే రాకెట్ ద్వారా ఉత్తరాలు బట్వాడా చేయాలంటే అంత సులువేం కాదు.. ఇందుకోసం చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. ఈ ప్రయోగానికి అప్పట్లోనే 10 లక్షల డాలర్లు ఖర్చయ్యేదట. కానీ బట్వాడా చేయడం ద్వారా వచ్చే ఆదాయం కేవలం 240 డాలర్లు. -
‘ఆర్సీ’తో ఏమార్చి కోట్లు కొట్టేశారు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : సింగరేణి బొగ్గు రవాణాలో ఇదో కొత్త తరహా కుంభకోణం! బొగ్గు రవాణా చేసే లారీకి రవాణా శాఖ జారీ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ని మార్చేసి కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు. ఒరిజినల్ ఆర్సీలో పేర్కొన్న వాహనం బరువు (నెట్ వెయిట్)ను కలర్ జిరాక్స్లో మార్ఫింగ్ చేసి గుట్టుగా దందా సాగించారు. బొగ్గుతో లోడ్ చేసిన తర్వాత వచ్చే లారీ బరువు(టోర్)ను లెక్కలోకి తీసుకొని ప్రతి లోడ్లో రెండు నుంచి మూడు టన్నుల వరకు అధికంగా రవాణా చేస్తున్నట్లు సింగరేణి అధికారులను బురిడీ కొట్టించారు. ఇలా ‘కిలోమీటరు, టన్ను, ట్రిప్పుల’ప్రాతిపదికన ప్రతి బొగ్గు లారీకి చెల్లించే మొత్తాన్ని పెంచేసుకొని రోజుకు లక్షల్లో, నెలకు కోట్లల్లో జేబుల్లోకి వేసుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఓ క్లర్క్.. ఆర్సీలపై అనుమానంతో తీగ లాగగా ఈ స్కాం డొంక కదిలింది. రవాణా శాఖ యాప్ ద్వారా ఒరిజనల్ ఆర్సీని తనిఖీ చేయగా.. లారీల బరువును ఒకటి నుంచి మూడు టన్నుల వరకు తగ్గించి కలర్ జిరాక్స్ ఆర్సీలను తయారు చేసినట్లు తేలింది. శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల నుంచి తీసిన బొగ్గును సమీపంలోని కోల్ హాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లకు రవాణా చేసే ప్రక్రియలోనే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయంటే... సీహెచ్పీల నుంచి వేరే ప్రాంతాలకు రోజూ తరలివెళ్లే బొగ్గు రవాణాలో సింగరేణి ఎంత నష్టపోతుందో తేలాల్సి ఉంది. వాహనం బరువుకు ఆర్సీ ప్రామాణికమా? సాధారణంగా ఒక లారీలో రవాణా అయ్యే సరుకు బరువును కాంటా (వేయింగ్ మిషన్) ద్వారా తెలుసుకుంటారు. ఖాళీ లారీ బరువును ముందుగా తూకం వేసి, సరుకుతో నిండిన తర్వాత మరోసారి తూకం వేస్తే కచ్చితమైన బరువు ఎంతో తెలుస్తుంది. సాధారణంగా ఏ సరకు రవాణాకైనా ఇదే ప్రామాణికం. కానీ సింగరేణిలో బరువు తూచే విషయంలో వాహనం ఆర్సీని కూడా పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. ఆర్సీలో పేర్కొన్న వాహన నెట్ బరువు, గని వద్ద తూకం వేసిన వాహన బరువులో ఏది తక్కువగా నమోదైతే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధనను చేర్చారు. బొగ్గు రవాణా అనంతరం సీహెచ్పీ వద్ద వాహన బరువు (టేర్)ను లెక్కించి రవాణా అవుతున్న బొగ్గు గ్రాస్ వెయిట్ను కొలుస్తారు. దీని ప్రకారం ఎంత బొగ్గు రవాణా అయితే అన్ని టన్నులకు దూరం ఆధారంగా కాంట్రాక్టు సమయంలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించడం జరుగుతోంది. ఇలా ఎక్కడా లేని ఆర్సీ నిబంధనను బొగ్గు రవాణాలో పెట్టడం వల్ల కలర్ జిరాక్స్ ద్వారా మార్ఫింగ్కు అవకాశం కల్పించినట్లయింది. ఎలా బయటపడిందంటే? శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కార్యాలయంలోని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఓ క్లర్క్ ఇటీవల కాంట్రాక్టు సమయం పూర్తయిన బొగ్గు రవాణా లారీల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో లారీ నెట్ బరువుకు సంబంధించి దాఖలు చేసిన ఆర్సీలలో అక్షరాల్లో తేడా ఉండడం గమనించారు. ఓ ట్రాన్స్పోర్టు సమర్పించిన 10 ఆర్సీల్లో ఈ తేడా కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన ‘ఆర్టీఏ ఎం–వాలెట్’యాప్ ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గు రవాణా చేసే ఒరిజనల్ ఆర్సీలను పరిశీలించారు. 60 లారీలకుగాను 39 లారీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఆర్సీలలో లారీ నెట్వెయిట్ను టాంపరింగ్ చేసినట్లు తేలింది. సదరు ట్రాన్స్పోర్టుకు చెందిన పది లారీలలో మూడు టన్నుల తేడా రాగా, మరో లారీలో ఒక టన్ను తేడా చూపించారు. మరో లారీకి రెండు టన్నుల తేడాతో ఆర్సీ తయారు చేశారు. మిగతా 18 లారీలకు సంబంధించి కూడా ఒకటి నుంచి రెండు టన్నుల తేడాలతో ఆర్సీలలో నెట్వెయిట్ మార్చేశారు. దీంతో ఆ క్లర్క్ పై అధికారుల ద్వారా సింగరేణి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. రోజుకు లక్షల్లోనే ఎసరు బొగ్గు గని నుంచి సీహెచ్పీకి బొగ్గు రవాణా చేసినందుకు సగటున కిలోమీటరుకు రూ.10 చెల్లించేలా ఒప్పందం కుదిరిందనుకుంటే.. ఒక లారీ కనీసం పది కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. అంటే ఒక టన్నుకు రూ.100 చెల్లించాలి. రోజుకు ఎనిమిది ట్రిప్పుల మేర లారీ తిరిగితే టన్నుకు రూ.800 చొప్పున చెల్లించాలి. అంటే మూడు ట్రిప్పులకు అదనంగా చెల్లించినా ప్రతి లారీకి రూ.2,400 చొప్పున ముట్టజెప్పడమే. శ్రీరాంపూర్లో గుర్తించిన 39 లారీలకు ప్రతి ట్రిప్పుకు సుమారు 100 టన్నులకు పైగా ప్రతిరోజు అదనంగా చెల్లిస్తూ వచ్చారు. ఇక్కడే రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకు అదనంగా చెల్లిస్తున్నట్లు సమాచారం. మిగతా ఏరియాల్లో ఇంతేనా? ఏటా 64 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థలో 13 కోల్ హాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లతోపాటు పెద్ద సంఖ్యలో బొగ్గు డిస్పాచ్ పాయింట్లు ఉన్నాయి. సింగరేణిలోని 19 ఓపెన్కాస్ట్ గనులు, 29 భూగర్భ గనుల నుంచి వెలికితీసిన బొగ్గును డిస్పాచ్ పాయింట్ల వరకు లారీల్లో తీసుకెళ్తారు. అక్కడ్నుంచి రైలు మార్గంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతుంది. గనుల నుంచి సీహెచ్పీల వరకు బొగ్గు రవాణా చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా వేలాది లారీలను వినియోగిస్తున్నారు. ఈ లారీల నెట్వెయిట్ను మార్చేసే తంతు ఎప్పట్నుంచి నడుస్తుందో తెలియదు. అందుకే అతి తక్కువ బిడ్తో బడా కాంట్రాక్టర్లే సింగరేణిలో రవాణా కాంట్రాక్టులను పొందుతున్నారని అర్థమవుతోంది. సింగరేణి విజిలెన్స్ విభాగం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. -
దర్జాగా ఇసుక దందా
ఖానాపూర్ : జిల్లాలోని ఖానాపూర్, పెంబి మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాగులతోపాటు అటవీ ప్రాంతంలోని ఒర్రెల నుంచి కూడా ఇసుకను తరలించి సమీప గ్రామాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా జిల్లా కేంద్రంతోపాటు ఇతర మండలాలకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పట్టపగలే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రధాన రోడ్ల గుండా దినమంతా ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకున్న అధకారి లేడు. అంతేకాకుండా ఖానాపూర్, పెంబి మండలాల్లోని ఆయా వీడీసీల ఆధ్వర్యంలో ఇసుక తరలింపునకు అనధికారికంగా టెండర్లు నిర్వహిస్తున్నా.. ఆయా శాఖల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అనధికార టెండర్లు నిర్వహిస్తున్నా.. ఖానాపూర్, పెంబి మండలాల మధ్య గల రాజూరా శివారులోని పల్కేరు వాగుతోపాటు పెంబి మండలంలోని ఇటిక్యాల, పస్పుల పంచాయతీల పరిధిలోని కడెం వాగు, ఖానాపూర్ మండలంలోని సోమర్పేట్, బీర్నంది గ్రామాల సమీపంలోని బల్లివాగు, మండల కేంద్రం, బాదన్కూర్తి సమీపంలోని గోదావరి తీరం నుంచి ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఖానాపూర్ మండలంలోని రాజూరా, పెంబి మండలంలోని మందపల్లి గ్రామాల్లో వీడీసీలు అనధికార టెండర్లు నిర్వహించినట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో డంపులు.. అక్రమంగా తరలించిన ఇసుకను నేరుగా విక్రయించడంతోపాటు రాత్రివేళ వాగుల నుంచి తరలించిన ఇసుకను ఆయా గ్రామాల శివార్లలో.. వ్యవసాయ పొలాలు, పంటచేల వద్ద నిల్వ చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంట కుప్పలుగా పోస్తున్నారు. ఇక్కడి నిల్వల నుంచి ట్రాక్టర్ల ద్వారా మళ్లీ జిల్లాలోని ఇతర మండలాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఎస్పీ గుర్తించినా ఆగని దందా.. ఖానాపూర్ మండలం పాతఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెవాడలో 15రోజుల క్రితం ఎస్సీ శశిధర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో సుమారు రూ.3లక్షల విలువ చేసే అక్రమ ఇసుక డంపులు గుర్తించారు. అయినప్పటికీ డంపులను స్వాధీనం చేసుకోవడం, శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గతంలోనూ పలు గ్రామాల్లో అక్రమంగా ఇసుకను డంపు చేసినవారికి నోటీసులిచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. పడిపోతున్న భూగర్భ జలాలు.. జిల్లాలోని పలు వాగులు, అటవీ ప్రాంతాల్లోని ఒర్రెల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుతుండడంతో భూగర్భజల మట్టం తగ్గుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతున్నా ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు చర్యలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆయా మండలాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం అనుమతి లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో తరలించినా.. గ్రామాల్లో డంపు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, మైనింగ్ అ ధికారులకు జరిమానా నిమిత్తం పంపిస్తాం. అంతేకాకుండా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇటీవల ఎల్లాపూర్లో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో సుమారు రూ.3లక్షల ఇసుక డంపులను గు ర్తించి రెవెన్యూ అధికారులకు అప్పగించాం. – ప్రసాద్, ఎస్సై, ఖానాపూర్ -
మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. పునరావాసం అందనివారు పొరుగు రాష్ట్రాల నుంచి నల్లబెల్లం, పటిక దిగుమతి చేసుకుని సారా బట్టీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న టన్నుల కొద్దీ నల్లబెల్లం, పటిక నిల్వలు గుడుంబా మళ్లీ విజృంభిస్తోందన్న వాస్తవాన్ని బయటపె డుతున్నాయి. ఏపీ నుంచి రైళ్లలో, మహారాష్ట్ర నుంచి రోడ్డు మార్గంతో నల్లబెల్లం రాష్ట్రంలోకి వస్తోందని అధికారవర్గాలు గుర్తించాయి. గట్టి చర్యలు చేపట్టినా.. రాష్ట్రాన్ని గుడుంబా రహితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి చర్యలే తీసుకు న్నారు. నాటుసారా తయారీపై ఎక్సైజ్, పోలీ సు సిబ్బంది దాడులు చేశారు. చాలా మంది గుడుంబా తయారీదారులను పట్టుకుని కేసు లు పెట్టారు. నల్లబెల్లం సరఫరాను నియం త్రించారు. గుడుంబా జీవనాధారంగా బతికే కుటుంబాల వారికి పునరావాసంగా ప్రత్యా మ్నాయ ఉపాధి కోసం రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించే కార్యక్రమా న్నీ చేప ట్టారు. ఐదారు నెలల్లోనే గుడుంబా నియం త్రణలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో చాలా మందిని పునరావాస సాయం కోసం ఎంపిక చేయలేదు, ఎంపికైనవారిలో పలు వురికి సా యం అందకపోవడంతో మళ్లీ గుడుంబా తయారీవైపు మరలినట్టు తెలుస్తోంది. రైలు, రోడ్డు మార్గాల్లో నల్లబెల్లం.. పొరుగు రాష్ట్రాల్లో నిషేధం లేక పోవడంతో తక్కువ ధరకే నల్లబెల్లంపై అందుబాటులో ఉంది. ఏపీలోని గుంటూరు, నెల్లూరు, గోదా వరి జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం, వరం గల్, నల్లగొండ జిల్లాలకు అక్రమంగా రవాణా అవుతోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు రోడ్డు మార్గంలో నల్లబెల్లం వస్తోంది. ఏపీ నుంచి రైళ్లలో రోజూ 50 టన్నుల వరకు నల్ల బెల్లం అక్రమరవాణా అవుతున్నట్టు నిఘా వర్గాల అంచనా. ఇటీవలే మహారాష్ట్ర నుంచి 11 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పటికను తరలిస్తున్న వాహనాన్ని ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు(టి)–కౌటాల రహదారిపై ఎౖMð్సజ్ అధికారులు పట్టుకోవడం గమనార్హం. గుం టూరు జిల్లా బాపట్ల నుంచి పద్మావతి ఎక్స్ ప్రెస్లో తీసుకువస్తున్న 10 టన్నుల బెల్లాన్ని కేసముద్రం వద్ద రైల్లోనే పట్టుకున్నారు. యువకులు బృందాలుగా మారి.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వారు కొందరు బృందాలుగా ఏర్పడి నల్లబెల్లాన్ని తీసుకువస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బెల్లం కొంటు న్నారు. ఒక్కొక్కరు ఒక్కో క్వింటాల్ బెల్లాన్ని బస్తాల్లో తీసుకుని సాధారణ ప్రయాణీకుల్లా రైలు ఎక్కుతున్నారు. తమ గమ్యస్థానం సమీపించగానే రైల్లోంచి బెల్లం మూటలను కిందికి తోసేస్తున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉండే మరికొందరు.. ఆ బెల్లాన్ని ఆటోలు, ఇతర వాహనాల ద్వారా గ్రామాలకు తీసుకెళ్లి రెండింతల ధరకు విక్రయిస్తున్నారు.