
చెన్నై, టీ.నగర్: రవాణ సంస్థ డిపోల్లో నిలిపిన బస్సులను దీర్ఘకాలం నడపకుంటే ఇంజిన్లు దెబ్బతింటాయని, రూ. లక్షలు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మెకానిక్లు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీ, ఎక్స్ప్రెస్, నగర ఎంటీసీ బస్సులు, టౌన్ బస్సులు డిపోల్లో నిలిపి వేశారు. మెయింటినెన్స్ లేని పక్షంలో బస్సుల ఇంజిన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని తమిళనాడు మోటారు వాహన మెకానిక్ల సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కుమరవేల్ తెలిపారు.