lockdown
-
ఈ నెలలోనే లాక్డౌన్!
ఈ నెలలోనే లాక్డౌన్ అంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే... ఆమె చెబుతున్నది ‘లాక్డౌన్’ సినిమా గురించి. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాక్డౌన్’. ఏఆర్ జీవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్.కాగా ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించినట్లుగా తెలుస్తోంది. లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాలు పడుతున్న ఓ యువతి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. లాక్డౌన్ కష్టాలతోపాటు కరోనా వైరస్ గురించిన అంశాలను ఈ సినిమాలో కాస్త సీరియస్గానే చూపిస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్స్టన్, ఇందుమతి, రాజ్కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కెమెరా: వీజే సాబు జోసెఫ్. -
అనుపమ 'లాక్డౌన్' టీజర్ విడుదల
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్పై హాట్గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్ను తెరపై చూపించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల బాటలో అనుపమ దూసుకురానుంది. ఈ క్రమంలో లాక్డౌన్,పరదా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్డౌన్ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. అయితే, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో సరికొత్తగా ఉండే స్క్రీన్ప్లేతో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం విడుదలైన లాక్డౌన్ టీజర్ నిమిషంలోపే ఉన్నప్పటికీ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. తెలుగులో పరదా అనే చిత్రంతో పాటు తమిళంలో 'బైసన్ కాలమాదన్' అనే తమిళ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. -
కోటి మీటర్ల మేర పేరుకుపోయిన వస్త్ర నిల్వలు
-
పలుకే బంగారమాయెనా!!..కోవిడ్ తర్వాతే అధికం..
వయసు పలికే పదాలు మొదటి సంవత్సరం దాదాపు 10 పదాలు రెండో సంవత్సరం 50 నుంచి 60 పదాలు మూడో సంవత్సరం కనీసం 150 పదాలు.. ఆ పైన కెనడాకు చెందిన ఓ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. 6 నెలల నుంచి రెండేళ్లలోపున్న 900 మంది చిన్నారులను పరీక్షించింది. 20 శాతం మంది చిన్నారులు ప్రతిరోజూ సగటున 28 నిమిషాల సేపు స్మార్ట్ఫోన్లను చూస్తున్నట్లు తేలింది. 30 నిమిషాల డిజిటల్ స్క్రీనింగ్ వల్ల చిన్నారులకు ‘స్పీచ్ డిలే’ రిస్క్ 49 శాతం పెరుగుతుందని వెల్లడయ్యింది. ఏం చేయాలి? ముందుగా చిన్నారుల చెంతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు దరిచేరకుండా చూసుకోవాలి.పిల్లలకు అసలు స్మార్ట్ఫోన్లు ఇవ్వవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వారి నవ్వులకు, అరుపులకు ప్రతిస్పందించాలి. చిన్నారులను ముఖానికి దగ్గరగా తీసుకొని మాటలో, పాటలో, కథలో చెబుతూ..మీకు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలు తాగించేటప్పుడు, ఆహారం తినిపించేటప్పుడు.. చేసే పని గురించి వారికి వివరిస్తూ ఉండాలి. ఎలాంటి శబ్ధాలు చేస్తుంటాయి? తదితరాలన్నీ అడుగుతూ, అనుకరిస్తుండాలి. పిల్లలు ఏ వస్తువు చూస్తుంటే.. దాని గురించి వివరిస్తుండాలి. తద్వారా పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ.. క్రమంగా మాట్లాడుతారు. విజయవాడకు చెందిన రాజేశ్, ఉష దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని బుజ్జగించేందుకు..పుట్టిన ఏడాది గడిచేసరికల్లా స్మార్ట్ఫోన్లో వీడియోలు చూపించడం మొదలుపెట్టారు. ఏడుపు ఆపాలన్నా.. భోజనం చేయాలన్నా.. ఫోన్లోని వీడియోలు చూడాల్సిందే. ఇలా.. ఆ చిన్నారి క్రమంగా స్మార్ట్ఫోన్కు బానిస అవ్వగా.. ఆ తల్లిదండ్రులు నాలుగేళ్లయినా ‘అమ్మా, నాన్న’ అనే పిలుపులకు నోచుకోలేక పోయారు. చివరకు స్పీచ్ థెరపిస్ట్లను ఆశ్రయించి.. పిల్లలకు చికిత్స అందించాల్సి వచి్చంది. – గుండ్ర వెంకటేశ్, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒకప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే.. వారిని లాలించేందుకు తల్లిదండ్రులు జోలపాటలు పాడేవాళ్లు. ఎత్తుకొని ఆరుబయట తిప్పుతూ చందమామను చూపించి కబుర్లు చెప్పేవాళ్లు. అమ్మ, నాన్న.. అనే పదాలను చిన్నారుల నోటి వెంట పలికించడానికి ప్రయత్నించేవాళ్లు. వారు ఆ పదాలను పలకగానే విని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు సిరులొలికించే ‘చిన్ని’ నవ్వులు.. చిన్నబోతున్నాయి. చీకటి ఎరుగని ‘బాబు’ కన్నులు.. క్రమంగా మసకబారిపోతున్నాయి. చిట్టిపొట్టి పలుకుల మాటలు మాయమైపోతున్నాయి. మొత్తంగా స్మార్ట్ఫోన్లలో చిక్కుకొని ‘బాల్యం’ విలవిల్లాడిపోతోంది. చిన్నారుల నోటి వెంట వచ్చే ‘అమ్మ, నాన్న..’ అనే పిలుపులతో కొందరు తల్లిదండ్రులు పులకించిపోతుంటే.. మరికొందరు తల్లిదండ్రులు ఆ ‘పలుకుల’ కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. పునాది పటిష్టంగా ఉంటేనే.. ప్రతి ఒక్కరి జీవితంలో ‘మాట్లాడటం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్నారులు ఎదుగుతున్నకొద్దీ మెల్లగా మాటలు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎలా మాట్లాడిస్తే అలా అనుకరిస్తూ ముద్దుముద్దుగా ఆ పదాలను పలుకుతుంటారు. ముఖ్యంగా చిన్నారి పుట్టిన మొదటి రెండేళ్లు లాంగ్వేజ్ డెవలప్మెంట్కు చాలా కీలకం. అప్పుడు సరైన పునాది పడితేనే.. మూడో ఏడాదికల్లా మంచిగా మాట్లాడగలుగుతారు. ‘స్మార్ట్’గా చిక్కుకుపోయారు.. సాధారణంగా చిన్నారులు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. మొదటి రెండేళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. వారు తమ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతూ ఉంటే.. వారి పెదాల కదలికను చూస్తూ అనుకరిస్తుంటారు. కానీ చుట్టుపక్కల అలాంటి వాతావరణం లేకపోతే వారిలో బుద్ధి వికాసం లోపిస్తుంది. కొందరు తల్లిదండ్రులు వారి పనుల ఒత్తిడి వల్ల తమకు తెలియకుండానే పిల్లలకు సెల్ఫోన్లను అలవాటు చేస్తున్నారు. పిల్లల ఏడుపును ఆపించడానికో, భోజనం తినిపించడానికో, నిద్రపుచ్చేందుకో ఫోన్లలో ఆ సమయానికి ఏది దొరికితే ఆ వీడియో చూపిస్తున్నారు. క్రమంగా అది అలవాటుగా మారి.. పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతున్నారు. వాటిలోనే లీనమైపోయి.. తల్లిదండ్రుల పిలుపులకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు. తమ భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయలేకపోతున్నారు. మరికొందరైతే గతంలో తాము నేర్చుకున్న పదాలను కూడా మర్చిపోయారు. ఫోన్లలో చూపించే కార్టూన్లు, గేమ్స్ వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులోని శబ్ధాలు, మాటలను వింటారు. కానీ.. వాటికి, నిజజీవితానికి చాలా తేడా ఉండటంతో ఆ శబ్ధాలు, మాటలను అనుకరించలేకపోతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల మాటలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాతే అధికం చిన్నారుల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య కోవిడ్ తర్వాత అధికమైందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగిందని పేర్కొంటున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో అనుబంధాలు పెరగాలి. కానీ, ఆ సమయంలో చుట్టుపక్కలవారికి, బంధువులకు దూరంగా ఉండటం వల్ల అందరూ స్మార్ట్ఫోన్లకు అంకితమైపోయారు. చిన్నారులను లాలించడానికి కూడా ఫోన్లను ఉపయోగించారు. దీనివల్ల 9 నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న కొందరు చిన్నారులు తమ కీలక సమయాన్ని కోల్పోయారు. వేరే పిల్లలతో కలవకపోవడం, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్కు ముందు వారానికి ఐదు కేసులు వస్తే.. కోవిడ్ తర్వాత 20 వరకు కేసులు వస్తున్నాయని పిల్లల వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం చిన్నారులు ఫోన్కు అడిక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నారుల వద్ద ఫోన్ పెట్టేసి.. ఒంటరిగా వదిలేయవద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా సెల్ఫోన్ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు పిల్లలతో గడుపుతూ.. వారి వైపే చూస్తూ కబుర్లు చెప్పాలి. పిల్లలను ఆలోచింపజేసేలా కుటుంబసభ్యులు, వస్తువులు, జంతువుల గురించి వర్ణిస్తూ మాట్లాడాలి. తద్వారా పిల్లలు సులభంగా మాటలు నేర్చుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఇండ్ల విశాల్రెడ్డి, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ -
వచ్చేవారంలోగా రిఫండ్స్ జరగాలి
న్యూఢిల్లీ: కోవిడ్ లాక్డౌన్ సమయంలో బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు, సర్వీసుల రద్దుకు సంబంధించిన రిఫండ్లను వచ్చే వారంలోగా (నవంబర్ 3 వారం లోపు) రిఫండ్ చేయాలని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 నుండి వివిధ దశాల్లో దేశంలో లాక్డౌన్ అమలయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు విమాన సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే అప్పటి ముందస్తు బుకింగ్ల విషయంలో కొందరికి రిఫండ్స్ జరగలేదు. కొన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈ అంశంపై ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్లతో వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక సమావేశం జరిగింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నవంబర్ మూడవవారంలోపు రిఫండ్స్ జరగాలని అగ్రిగేటర్లకు స్పష్టం చేసినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రకటన ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అంబుడ్స్మన్ను ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ–వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసే విషయంలో విధివిధానాలు ఖరారుకు చేయాలని సమావేశం భావించింది. వినియోగదారుల ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్తో జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ను ఏకీకృతం చేయడం చర్చల్లో చోటుచేసుకున్న మరొక ప్రతిపాదన. -
లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్కు ఆదేశాలు?
పండుగల సీజన్లో ఢిల్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరుకుంది. ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ సూచీ(ఏక్యూఐ) 200 నుండి 300 మధ్య ఉంటుంది. రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత దిగజారుతోంది. దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ పండుగ తరువాత పరిస్థితి మరింత దిగజారనుంది. మొన్న ఆదివారం ఉదయం ఢిల్లీ ఏక్యూఐ 266గా ఉంది. శనివారం ఈ సంఖ్య 173గా ఉంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మధ్యాహ్నానికి 330కి చేరుకుంటోంది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ వాతావరణం మరింత దిగజారుతుండటంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన వ్యక్తం చేసింది. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కింగ్ ఫీజులు పెంచాలని, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగితే, నూతన ఆంక్షలు విధించే అవకాశముందని సమాచారం. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం స్టేజ్-3కి చేరుకుంటే, బీఎస్-III, బీఎస్-IV వాహనాలను నిషేధించవచ్చు. అత్యవసర సేవల వాహనాలపై కూడా పరిమితులు విధించే అవకాశముంది. రైల్వేలు, జాతీయ భద్రతా ప్రాజెక్టులు, ఆసుపత్రులు, మెట్రో, హైవేలు, రోడ్లు మినహా ఇతర ప్రాజెక్టులను అధికారులు నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలుష్య పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటే హైవేలు, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, పైప్లైన్ల పనులు కూడా నిలిచిపోనున్నాయి. విద్యాసంస్థలను కూడా మూసివేసే అవకాశాలున్నాయి. వాహనాలకు సంబంధించి బేసి-సరి ఫార్ములా తిరిగి అమలు చేసే అవకాశముంది. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేసేవిధంగా అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే కొన్ని సంస్థలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? -
కోవిడ్ తర్వాత పెట్టుబడులు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్ తర్వాత ఏటా పెరుగుతున్న ఒప్పందాలు, వాస్తవ రూపంలోకి వచ్చిన పెట్టుబడులే దీనికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్ ప్యాకేజీతో పరిశ్రమలను ఆదుకోవడంతో ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఎంచుకుంటున్నారు. 2021 తర్వాత నుంచి రాష్ట్రం ఆకర్షిస్తున్న పెట్టుబడుల విలువ భారీగా పెరుగుతోంది. 2021లో రూ.9,373 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 47 ఒప్పందాలు కుదరగా 2022లో 54 యూనిట్ల ద్వారా రూ.16,137 కోట్ల విలువైన ఒప్పందాలు జరగడం గమనార్హం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 18 యూనిట్ల ద్వారా రూ.7,187 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. అంటే గత 27 నెలల్లో కొత్తగా 119 యూనిట్లను ఆకర్షించడం ద్వారా రూ.32,697 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మార్చిలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 387 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా గరిష్టంగా ఆరు నెలల్లోనే పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రానున్న త్రైమాసికాల్లో ఈ ఒప్పందాల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉత్పత్తి ప్రారంభించడంలోనూ అదే జోరు కేవలం కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను అమలు చేస్తోంది. ‘వైఎస్ఆర్ వన్’ ద్వారా ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభించే వరకు అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ వ్యవస్థను తెచ్చింది. దీంతో గతేడాది పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2021లో రూ.10,350 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 47 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు డీపీఐఐటీ తెలిపింది. 2022లో రూ.45,217 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో రూ.4,919 కోట్ల విలువైన 13 యూనిట్లు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. అంటే గత 27 నెలల వ్యవధిలో మొత్తం 106 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.60,486 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 కాలంలో సగటున ఏటా రూ.11,994 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇప్పుడు నాలుగేళ్లుగా ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం గమనార్హం. ఈ ఏడాది ముగిసేనాటికి సగటు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. -
G-20 ఎఫెక్ట్..సెంట్రల్ ఢిల్లీ లాక్ డౌన్..
-
'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
జీవీ, 8 తోట్టాగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ వెట్రి హీరోగా.. పూచ్చాండి చిత్రం ఫేమ్ హంశినీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లాక్డౌన్ నైట్స్. ఈ చిత్రానికి ఎస్ ఎస్.స్టాన్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాత వినోద్ శబరీస్ తాజాగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం లాక్డౌన్ నైట్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర టైటిల్ పోస్టర్ను సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా.. ఇటీవల కన్నడలో కిశోర్, పూజా గాంధీ జంటగా సంహారిణి అనే భారీ చిత్రాన్ని వినోద్ శబరీస్ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: 'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!) ఎస్ ఎస్.స్టాన్లీ ఇంతకు ముందు ఏప్రిల్ మాదత్తిల్, పుదుకోట్టైయిలిరుందు సరవణన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు గంగై అమరన్, మదియళగన్, లోగన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాలై సహదేవన్ ఛాయాగ్రహణం, జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్ను పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
ఊహించని షాక్.. నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ, వణుకుతున్న ఐటీ ఉద్యోగులు!
మూన్ లైటింగ్.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. కరోనా లాక్డౌన్ టైంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్లు చేస్తూ అధిక అదాయాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఈ బండారం బయటపడడంతో ఐటీ రంగాన్ని ఈ అంశం కుదిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా మూన్లైటింగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సారి ఐటీ శాఖ దీనిపై ఫోకస్ పెట్టింది. అసలు ఏం జరుగుతోందంటే.. ఎకనామిక్ టైమ్స్లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగుల్లో కొందరు మూన్లైటింగ్ ద్వారా అధికంగా సంపాదించిన.. తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించలేదు. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. మూన్లైటింగ్ ద్వారా సంపాదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ సెక్టార్, అకౌంటింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ వున్నారని పేర్కొంది. వీరిలో విదేశాల నుంచి నగదు బదిలీ అయిన వారు చాలా మంది ఉన్నారు, అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు, వారు తమ సాధారణ జీతంపై మాత్రమే పన్ను చెల్లించారు. ఈ క్రమంలో మూన్ లైటింగ్ సంపాదనపై పన్ను చెల్లించని దాదాపు మందికి పైగా ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విశేషమేమిటంటే.. మూన్ లైటింగ్ ద్వారా సంపాదిస్తున్న చాలా మంది ఉద్యోగుల సమాచారాన్ని వారు పనిచేస్తున్న కంపెనీలే ఆదాయపు పన్ను శాఖకు అందజేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ లావాదేవీలను ట్రాక్ చేయడం ద్వారా ఐటీ శాఖ అలాంటి వారిని తేలిగ్గా గుర్తించింది. కరోనా కాలంలో మూన్లైటింగ్ చేసే వారి సంఖ్య పెరిగిన సంగతి తెలిసింది. మరో వైపు ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. చదవండి: Business Idea: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు! -
ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే
లండన్: బ్రిస్టల్ లోని ఓ ప్రఖ్యాత పబ్లో ప్రతేకమైన ఆదివారం స్పెషల్ డిష్ తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే. ఈరోజు బుక్ చేసుకుని నాలుగేళ్లపాటు ఎదురు చూస్తే చాలు ఆ వంటకం రుచి చూసే భాగ్యం కలుగుతుంది. సాధారణంగా ఓ హోటల్లో తినడానికి ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తరవాత నిముషాల వ్యవధిలో ఆ ఐటెం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆర్డర్ ఇచ్చిన ఐటెం కోసం గంటల తరబడి ఎదురు చూడటమన్నది చాలా అరుదుగా చూస్తుంటాం. మరికొన్ని ప్రముఖ హోటళ్లలో మాత్రం ఆదివారం ప్రైమ్ టైమ్ ఫుడ్ బుకింగ్ కావాలంటే ఒకట్రెండు రోజుల ముందు టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక ఫుడ్ ఐటెం కోసం నాలుగేళ్లు ఎదురు చూడటమంటే నిజంగా విడ్డూరమే. అలాంటి విడ్డూరమే బ్రిస్టల్ లోని ది బ్యాంక్ టావెర్న్ పబ్. ఈ పబ్లో ఆర్డర్ చేయాలంటే ఓపిక ఉండాలి. అందులోనూ ఆ హోటల్ ప్రత్యేకం తినాలంటే బుకింగ్ టైమ్ నాలుగేళ్లు పడుతుంది. అంత పొడవాటి వెయిటింగ్ లిస్టు ఉన్న హోటల్ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఆ హోటల్లో సండే స్పెషల్ రోస్ట్ బుక్ చేసుకుంటే మన టైమ్ వచ్చేసరికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. అన్నేళ్ల పాటు ఆగాలంటే నిజంగానే ఓపికపట్టడంలో పీ.హెచ్.డి చేనుండాలి. అందులోనూ భోజనప్రియులు అంత కలం ఆగడమంటే చాలా గొప్ప విషయం. ది బ్యాంక్ టావెర్న్ హోటల్ వడ్డించే సండే రోస్టులో రుచికరమైన ప్రత్యేక వంటకాల ఉఉంటాయి. నోరూరించే ఈ వంటకానికి 2018లో బ్రిస్టల్ గుడ్ఫుడ్ అవార్డుల్లో ఉత్తమ సండే లంచ్ అవార్డుతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అయితే కరోనా సమయానికి ముందు ఈ హోటల్లో ఆర్డర్లన్నీ సమయానికే డెలివరీ ఇచ్చేవారు. కానీ లాక్డౌన్ సమయంలో పబ్ మూసివేసి ఉండటంతో ఆ సమయంలో వచ్చిన ఆర్డర్లన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్న పబ్వారు ప్రస్తుతానికి నాలుగేళ్లు వెనుకబడ్డారు. దీంతో ఈ హోటల్లో ఇప్పుడు సండే రోస్ట్ ఆర్డర్ చేసేవారు నాలుగేళ్లు వేయిట్ చేయక తప్పదు. అందుకే ఈ రెస్టారెంట్ వారు ప్రస్తుతానికైతే బుకింగ్ లను పూర్తిగా నిలిపివేశారు. ఇది కూడా చదవండి: వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడి ప్రచారం.. -
మూడేళ్ల బంధం.. ముగ్గురి హత్యలతో విషాదాంతమైన లాక్డౌన్ ప్రేమ..
కరోనా లాక్డౌన్లో చిగురించిన ప్రేమను పెళ్లితో భద్రపరుచుకున్నారు. కానీ వారి సంబరం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. మూడేళ్ల ప్రేమ బంధం.. ముగ్గురి హత్యలతో షాదాంతంగా ముగిసింది. ట్రిపుల్ మర్డర్ అనంతరం నిందితుడు తొమ్మిది నెలల శిశువును చంకలో ఎత్తుకొని పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన మెకానికల్ ఇంజనీర్ అయిన నజీబుర్ రెహ్మాన్(25), 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్లు 2020లో ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. కొన్ని రోజుల్లోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో అదే సంవత్సరం అక్టోబర్లో ఇద్దరూ కోల్కతాకు పారిపోయారు. తరువాత సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆమె అప్పటికే కోల్కతా కోర్టులో నజీబుర్ను వివాహం చేసుకున్న విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాతి ఏడాది సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ సొంత కుమార్తెపైనే దొంగతనం కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ రావడంతో తిరిగి ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. చదవండి: హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు జనవరి 2022లో సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ ఇంట్లో నుంచి పరారయ్యారు. అయిదు నెలలపాటు ఇద్దరూ చెన్నైలో నివాసం ఉన్నారు. తరువాత ఆ జంట ఆగస్టులో గోలాఘాట్కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతిగా ఉంది. వీరిద్దరూ నజీబుర్ ఇంటిలో జీవించడం ప్రారంభించారు. గత నవంబర్లో ఈ జంటకు ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు నెలల తర్వాత సంఘమిత్ర తన కొడుకుతో ఈ ఏడాది మార్చిలో తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. నజీబుర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నజీబుర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 28 రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, నజీబుర్ తన కొడుకును కలిసేందుకు ప్రయత్నించగా.. సంఘమిత్ర కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. అనంతరంఏప్రిల్ 29న సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్పై దాడి చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన తొమ్మిది నెలల కొడుకును చేతిలో ఎత్తుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులపై హత్యా తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్ జీపీ సింగ్ తెలిపారు. ఈ దారుణ హత్యపై రాష్ట్ర సీఐడీ బృందం విచారణ చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
కూతురు అబార్షన్కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇంటికే పరిమితం చేసినా లాక్ డౌన్ సమయంలో అమెరికాకు చెందిన ఒక యువతి చట్ట విరుద్ధమైన పనికి పాల్పడింది. సంతానం వద్దనుకున్న కారణంగా ఓ యువతి అబార్షన్ చేసి కడుపులోని బిడ్డని కడతేర్చింది. నెబ్రాస్కాలో 20 నెలల గర్భస్థ శిశువును చంపడం నేరం కాగా ఆమె 28 వారాలు నిండిన తర్వాత ఈ ఘోరానికి పాల్పడింది. దీంతో ఈ నేరం కింద అరెస్టైన ఆ యువతికి కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు అదనంగా మరో రెండేళ్ల ప్రొబేషన్ కూడా విధించింది. . వివరాల్లోకి వెళితే.. నెబ్రాస్కాకు చెందిన సెలెస్టె బర్గస్(19) లాక్ డౌన్ సమయంలో కడుపులోని 28 నెలల పిండాన్ని చంపుకుంది. అందుకు ఆమె తల్లి జెస్సికా బర్గస్(42) సహకరించింది. కానీ నెబ్రాస్కా దేశ చట్టం ప్రకారం 20 నెలల పిండాన్ని అబార్షన్ చేస్తే అది చట్టరీత్యా నేరం. అయితే ఆ యువతి గర్భాన్ని తొలగించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. చివరకు తన తల్లి సాయంతో అబార్షన్కు పాల్పడి కటకటాల పాలయ్యింది. తన కూతురు గర్భాన్ని తొలగించడానికి సాయం చేసిన ఆ తల్లిపైన కూడా కేసు నమోదు చేశారు నెబ్రాస్కా పోలీసులు. నిజాన్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కూతురిపైనా.. సాక్ష్యాధారాలు లేకుండా చేసినందుకు తల్లిపైనా అభియోగాలు మోపారు నెబ్రాస్కా పోలీసులు. ఇద్దరికీ శిక్ష ఖరారు కాగా సెప్టెంబరు నుండి అమల్లోకి వస్తుంది. మొదట పోలీసు విచారణలో డెలివరీ అయ్యిందని, కానీ మృత శిశువు జన్మించిందని అబద్ధం చెప్పింది ఆ యువతి. తీరా ఆమె ఫేస్బుక్ మెసేజులు పరిశిలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్లో గర్బనిరోధక మాత్రలు గురించి, పిండాన్ని మాయ చేసే ఉపాయం గురించి తన తల్లితో చేసిన చాటింగ్ను పోలీసులు కనుగొనడంతో ఈ విషయం బయటపడింది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
పీ ఫర్ పాడ్కాస్ట్.. బీ ఫర్ భార్గవి
లాక్డౌన్ లైఫ్స్టైల్లో మెరిసిన ఒక ట్రెండ్.... పాడ్కాస్ట్. ‘పాడ్కాస్ట్’ పాపులారిటీ గురించి వినడమేగానీ దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి, సక్సెస్ఫుల్ పాడ్కాస్టర్గా రాణించాలనుకునే వారికి సాధికారికమైన సమాచారం కరువైంది. ఈ లోటును పూరించడానికి మంచి పుస్తకాన్ని తీసుకువచ్చి ఔత్సాహికులకు మేలు చేసింది భార్గవి.. లీడింగ్ హెచ్ఆర్ కన్సల్టింగ్ కంపెనీ ‘ఎక్సెల్ కార్పోరేషన్’కు సీయీవోగా ఉన్న బెంగళూరుకు చెందిన భార్గవి స్వామి మన దేశంలోని లీడింగ్ పాడ్కాస్టర్లలో ఒకరు. కంటెంట్ ప్రొడ్యూసర్గా కూడా తన సత్తా చాటుతుంది. మన దేశంలో పాడ్కాస్ట్పై వచ్చిన తొలిపుస్తకం ‘పీ ఫర్ పాడ్కాస్ట్’ రచయిత్రిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన అనుభవాలను క్రోడీకరించి ఫస్ట్–పర్సన్లో రాసిన ఈ పుస్తకం పాడ్కాస్ట్ గురించి ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలనుకునేవారికి దిక్సూచిలా నిలిచింది. ‘ఆర్ట్ ఆఫ్ పాడ్కాస్టింగ్’ను అక్షరాల్లోకి తెచ్చింది. బిజినెస్ పాడ్కాస్ట్ షో ‘పీపుల్ హూ మ్యాటర్’తో సక్సెస్ఫుల్ పాడ్కాస్టర్గా పేరు తెచ్చుకుంది భార్గవి. పాడ్కాస్టర్గా ప్రయాణం మొదలుపెట్టే ముందు దాని లోతుపాతులు ఏమిటో తెలుసుకోవడానికి చిన్నపాటి రీసెర్చ్ లాంటిది చేసింది. అయితే పాడ్కాస్టర్గా తొలి అడుగులు వేయడానికి అవసరమైన సమాచారం దొరకడం గగనం అయింది. ‘జీరో ఇన్ఫర్మేషన్’ అనేది వెక్కిరిస్తున్నా తన పరిశోధనలో ఎక్కడా తగ్గింది లేదు. మాస్కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన భార్గవి తనదైన పద్ధతిలో పరిశోధన చేస్తూ సమాచారాన్ని సంపాదించింది. ‘తెలుసుకోవడానికి ఇన్ని విషయాలు ఉన్నాయా!’ అనిపించింది. తాను సక్సెస్ఫుల్ పాడ్కాస్టర్గా రాణించడానికి అవి మంచి మార్గాన్ని చూపాయి. తన సక్సెస్తోనే ఆగిపోకుండా పాడ్కాస్టింగ్లో సక్సెస్ కావాలనుకునేవారి కోసం ‘పీ ఫర్ పాడ్కాస్టింగ్’ అనే పుస్తకం రాసింది. వెబ్సీరీస్ల కోసం స్క్రిప్ట్ రాసినప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్లోనే ఓకే అయిపోయేది. ‘పీ ఫర్ పాడ్కాస్టింగ్’ విషయంలో మాత్రం పలుసార్లు పుస్తకాన్ని తిరగరాసింది. ఏదో ఒక విషయాన్ని కొత్తగా చేరుస్తూ వచ్చింది. ఈ పుస్తకానికి భార్గవి తల్లి ఎడిటర్లా వ్యవహరించింది. సూచనలు ఇచ్చింది. తల్లితో కలిసి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయడం భార్గవికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ‘పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల రచనల ద్వారా ఒక విషయాన్ని సులభంగా కమ్యూనికేట్ చేయగలిగే విద్య పట్టుబడింది. నాలోని భావాలను ఆవిష్కరించడానికి రచనలను ఒక మాధ్యమంలా చేసుకుంటాను. అయితే పీ ఫర్ పాడ్కాస్ట్ అనేది నాలోని భావాల ఆవిష్కరణకు మాత్రమే పరిమితమైపోలేదు. ఎంతోమందికి దారి చూపించింది’ అంటుంది భార్గవి. అరవింద్ అడిగ, కిరణ్ దేశాయ్, అశ్విని సంఘీ.. మొదలైన వారి రచనలపై ఆసక్తి చూపించే భార్గవి కార్పొరేట్ దిగ్గజాల ఆలోచనలను, లీడర్షిప్, కోచింగ్లకు సంబంధించి పుస్తకాలను ఇష్టపడుతుంది. సంతోషం వెనక ఉండే శాస్త్రీయతను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. ‘పాడ్కాస్టర్గా నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరింతగా ప్రయత్నిస్తున్నాను’ అంటున్న భార్గవి స్వామి వెబ్సీరీస్ కోసం స్క్రిప్ట్లు రాయడానికి, ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గురించి ఫిక్షన్ బుక్ రాయడానికి సన్నాహాలు చేస్తోంది. సక్సెస్ మంత్ర లాక్డౌన్ లైఫ్స్టైల్ వల్ల రీడింగ్, రైటింగ్ అనేవి మనకు బాగా చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పాడ్కాస్ట్ సెగ్మెంట్ దూసుకుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాడ్కాస్టర్గా ప్రయాణం మొదలుపెట్టాను. ‘పాడ్కాస్టర్గా సక్సెస్ కావాలి’ అనుకోగానే సరిపోదు. అందుకు తగిన కసరత్తులు చేయాలి. మనదైన ప్రత్యేకత కోసం ప్రయత్నించాలి. స్కూల్రోజుల్లో నేను చదువుల్లో ముందు ఉండడంతో పాటు పాటలు పాడేదాన్ని. నృత్యాలు చేసేదాన్ని. ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. అయితే ఇవేమీ స్కూలు దగ్గరే ఆగిపోలేదు. సృజనాత్మక విషయాలలో నాకు నిరంతరం తోడుగా నిలుస్తున్నాయి. ‘మీ సక్సెస్ మంత్ర ఏమిటి?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సక్సెస్కు షార్ట్కట్లు ఉండవు. మనల్ని సక్సెస్ఫుల్గా మార్చడానికి గాడ్ఫాదర్లు ఉండరు. వృత్తిపై మనం చూపే ఆసక్తి, పడే కష్టం, మన పరిచయాలు విజయపథంలో దూసుకుపోవడానికి కారణం అవుతాయి. సక్సెస్ కోసం ఒకరిని అనుసరించాలనే రూల్ ఏమీలేదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో కనుక్కుంటే చాలు. – భార్గవి స్వామి, స్టార్ పాడ్కాస్టర్, ఎంటర్ప్రెన్యూర్ (చదవండి: పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది ) -
లాక్డౌన్కు మూడేళ్లు.. మళ్లీ ఇప్పుడు ఫ్లూ అలజడి
జనగామ: కరోనా మహమ్మారి సృష్టించిన విల యం స్వయంగా అనుభవించిన వారు ఎప్పటికీ మరచి పోలేరు. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న కోవిడ్–19 వైరస్.. ఇంటి గడప దాటాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా చేసింది. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా.. మరుసటి రోజు 23వ తేదీ నుంచి కంటిన్యూ లాక్డౌన్ అమలు చేసింది. లాక్డౌన్ విధించి నేటి(గురువారం)కి మూడేళ్లు పూర్తవుతుంది. జిల్లాలో 4,47, 823 మంది జనాభా ఉంది. 2,48,795 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 15,022 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో అధికార, అనధికారికంగా సుమారు 300 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నివారణ వ్యాక్సిన్ మొదటి డోస్ 4,68,283, రెండో డోస్ 4,78,817, బూస్టర్ డోస్ 2,48,826 మందికి ఇచ్చారు. మొదటి టీకా 2021 జనవరి 12వ తేదీన ఉద్యోగులకు వేశారు. ప్రాణాలను పణంగా పెట్టి.. కరోనా లాక్డౌన్.. ఆ తర్వాత వైద్య, శానిటేషన్, పోలీసు, పత్రికా రంగం, రెవెన్యూ శాఖలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, పలు వర్గాల వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి, కుటుంబ పోషణ భారంగా మారిన పేదకుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి కాలినడకన జిల్లా కేంద్రానికి వచ్చే వలస కార్మికులకు కడుపునిండా భోజనం అందించి చేతి ఖర్చుల కు సైతం డబ్బులు ఇచ్చారు. ఆయా శాఖల ఉద్యోగులకు కోవిడ్తో ప్రాణం మీదకు వచ్చినా.. సహచరులు మాత్రం మొక్కవోని ధైర్యంతో సేవలందించా రు. నాటి సంఘటనలు గుర్తుకు చేసుకుంటున్న వేళ.. మళ్లీ ఫ్లూ భయం వెంటాడుతోంది. -
చైనాను వణికిస్తున్న ఇన్ఫ్లూయెంజా.. కరోనా తరహా లాక్డౌన్లు..
బీజింగ్: ఇన్ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కారణంగా చైనా హడలెత్తిపోతోంది. దీంతో నివారణ చర్యగా జియాన్ నగరంలో కరోనా లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. గత వారంతో పోల్చితే పాజిటివిటీ రేటు 25.1 శాతం నుంచి 41.6 శాతానికి పెరిగినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి పడిపోయింది. ఇన్ఫ్లూయెంజా వ్యాప్తిని నియంత్రించేందుకు కరోనాకు తీసుకున్న చర్యలే తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్కూళ్లు, వ్యాపార కార్యకాలాపాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. జియాన్ నగరంలో దాదాపు 1.3 కోట్ల మంది నివసిస్తున్నారు. అధికారుల లాక్డౌన్ నిర్ణయాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. లాక్డౌన్ విధించడం కంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఉత్తమమని జియాంగ్ నగరవాసులు చెబుతున్నారు. వ్యాపార కార్యకలాపాలు నిలిపివేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. చదవండి: లైవ్ మ్యూజిక్ షోలో పాడుతూ కుప్పకూలిన సింగర్.. 27 ఏళ్లకే.. -
మిత్రమా... ప్రతి మీమ్కు ఒక లెక్క ఉంది!
కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఊపందుకున్న ‘మీమ్స్’ ట్రెండ్ ఇప్పుడు ‘మోర్ దేన్ ఏ ట్రెండ్’గా మారింది.పాకెట్ మనీ సంపాదించుకోవడానికి యూత్కు మార్గం అయింది... పాప్ కల్చర్ మూమెంట్ అనగానే యూత్కి సంబంధించి ఒక సినిమా రిలీజ్, క్రికెట్ ఆట, మ్యూజిక్ప్రోగ్రామ్... ఇలా ఏవేవో గుర్తుకు వస్తాయి. అయితే మిలీనియల్స్కు మాత్రం మీమ్స్, వైరల్ వీడియోలే పాప్కల్చర్ మూమెంట్. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మీమ్స్ ట్రెండ్ ఊపందుకుంది. టైమ్పాస్ కోసం చేసినా తమలోని ఒత్తిడి, అకారణ భయం, బోర్డమ్ దూరం కావడానికి మీమ్స్ ఉపకరించాయి. మొన్నటివరకు ట్రెండ్గా ఉన్న మీమ్స్ ఇప్పుడు మోర్ దేన్ ఏ ట్రెండ్గా మారాయి. దీనికి కారణం సోషల్ మీడియా బ్రాండ్ మార్కెటింగ్లో ‘మీమ్స్’ భాగం కావడమే కాదు కీలకం కావడం.‘ఒక విషయాన్ని సీరియస్గా, బోధన చేస్తున్నట్లుగా కాకుండా సరదాగా చెబితే కస్టమర్లకు వేగంగా చేరువ అవుతుంది’ అనే పబ్లిసిటీ సూత్రానికి మీమ్ అనేది నిలువెత్తు దర్పణంగా మారింది. బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగం అయింది.‘హైంజ్’ అనే అమెరికన్ ఫుడ్ ్రపాసెసింగ్ కంపెనీ యూత్ క్రియేటివిటీని ఉపయోగించి మీమ్స్ను బాగా వాడుకుంటోంది. మీమ్స్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బ్రాండ్కు సంబంధించి వోవర్ ప్రమోషన్ కనిపించదు. సహజంగా, సరదాగా ఉంటూనే బ్రాండ్ గురించి ఎలాంటి ఆడంబరం లేకుండా నిశ్శబ్దంగా ప్రచారం చేస్తాయి. ఎక్కువ సమయం తీసుకోకపోవడం మరో ప్రత్యేకత. ‘మీమ్స్ అనేవి ఫ్యూచర్ ఆఫ్ సోషల్ మార్కెటింగ్. వీటిలో యూత్ కీలక పాత్ర పోషించనుంది. కాలం మారింది. చిన్న బ్రాండ్, పెద్ద బ్రాండ్ అనే తేడా లేకుండా ఇప్పుడు అన్ని బ్రాండ్లకు సోషల్ మార్కెటింగ్లో మీమ్స్ అనేవి తప్పనిసరి అవసరం’ అంటున్నాడు మీమ్స్.కామ్ కో–ఫౌండర్ రజ్వన్. మీమ్స్ అనేవి కేవలం సరదా కోసం మాత్రమే కాదని పాకెట్మనీ సంపాదించుకోవచ్చనే సత్యం బోధపడడం తో యూత్ ఇప్పుడు వాటిపై సీరియస్గా దృష్టి పెట్టింది. ‘మీమ్ హిట్ కావడానికి గోల్డెన్ రూల్స్ ఏమిటి?’ అంటూ వెదకడం ్రపారంభించింది. గోల్డెన్ రూల్స్లో ఒకటి...‘అందరికీ నచ్చేలా ఉండాలి అని చేసే మీమ్స్ కంటే టార్గెట్ ఆడియెన్స్ను దృష్టిలో పెట్టుకొని చేసేవే బాగా క్లిక్ అవుతాయి’ అనేది.బెంగళూరుకు చెందిన ఎన్ఆర్.హారికకు మీమ్స్ అంటే ఇష్టం. తాను కూడా వాటిని చేయాలనుకుంటోంది. ఎలీన్ బ్రౌన్ అనే జర్నలిస్ట్ రాసిన ‘ది మ్యాథ్స్ బిహైండ్ ది మీమ్స్’ అనే వ్యాసాన్ని మిత్రులకు షేర్ చేయడం అంటే తనకు ఇష్టం. మీమ్స్ తయారీలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇష్టమైన వ్యాసాల్లో ఒకటి అంజలి వేణుగోపాలన్ రాసిన ‘ది సైన్స్ బిహైండ్ మీమ్ మార్కెట్’‘ఒకరు ఒక మీమ్ను క్రియేట్ చేయడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మోటివేషనల్ అండ్ ఎమోషనల్ రెస్పాన్స్’ అంటుంది ఎలీన్ బ్రౌన్. అయితే ఇప్పటి విషయానికి వస్తే మీమ్ను రూపొందించడంలో మోటివేషనల్, ఎమోషనల్ కంటే వినోదం, వ్యంగ్యం పాలే ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కావచ్చు...‘మీమ్ నిర్వచనం కాలంతోపాటు మారుతూ వస్తుంది’ అంటుంటారు. ‘మీమ్స్ అనేవి మన నిత్యజీవితంలో భాగం అయ్యాయి. పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు కొత్త న్యూస్ క్లిప్ల నుంచి పాత న్యూస్ క్లిప్ల వరకు ఏదైనా మీమ్ చేయవచ్చు. అయితే దాన్ని ఎలా హిట్ చేస్తాం అనేదే ముఖ్యం. యువతరం ఈ విద్యలో ఆరితేరింది’ అంటున్నారు మీమ్ మార్కెటింగ్ ఏజెన్సీ‘యంగ్గన్’ ఫౌండర్ సాక్ష్యమ్ జాదవ్.‘మీమ్’ల రూపకల్పనలో ఎన్నో వెబ్సైట్లు యూత్కు ఉపయోగపడుతున్నాయి. అందులో ఒకటి... సూపర్మీమ్. మీమ్కు అవసరమైన కంటెంట్ ఇస్తే ఈ ఏఐ ఆధారిత వెబ్సైట్ మనకు అవసరమైన మీమ్ తయారు చేసి ఇస్తుంది. టెక్ట్స్ను మీమ్గా కన్వర్ట్ చేయడమే కాదు మీమ్ సెర్చ్ ఇంజిన్గా కూడా ఉపయోగపడుతుంది. పాకెట్మనీ కంటే కాస్త ఎక్కువే! ‘మీమ్స్’కు డిమాండ్ ఏర్పడడానికి కారణం సంప్రదాయ అడ్వర్టైజింగ్లతో పోల్చితే తక్కువ ఖర్చు కావడం. క్రియేటర్లలో వైట్–కాలర్ ఎంప్లా యీస్ కంటే హైస్కూల్, కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువమంది ఉండడం! తమ క్రియేటివ్ టాలెంట్తో తల్లిదండ్రులపై ఆధారపడకుండా పాకెట్ మనీ, కొన్ని సందర్భాలలో అంతకంటే ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నారు. మీమ్ క్రియేటింగ్ అండ్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ‘మీమ్చాట్’ 1,50,000 క్రియేటర్స్కు ఒక్కో మీమ్కు 20 నుంచి 30 రూపాయల వరకు చెల్లిస్తుంది. అయితే ప్లాట్ఫామ్ను బట్టి ఈ రెమ్యునరేషన్ మారుతూ ఉండవచ్చు. -
లాక్డౌన్లో ఉత్తర కొరియా..కానీ కోవిడ్ గురించి మాత్రం కాదట!
ఉత్తర కొరియాలో ఏ ఘటన అయినా హాట్ టాపిక్గానూ, సంచలనంగానూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు చాలా విభిన్నంగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. దీంతో ఎప్పుడూ ఉత్తర కొరియా వార్తల్లో నిలుస్తుంటోంది. ఇప్పుడు తాజగా మరోసారి లాక్డౌన్ విషయమై వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సుమారు ఐదు రోజులు పూర్తి లాక్డౌన్లో ఉంది. కానీ కరోనా మహమ్మారీ గురించి మాత్రం కాదని తెగేసి చెబుతోంది. తమ ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారని, అందుకు సంబంధించిన కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ విధించామని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారులు ఆదివారం వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతిరోజు శరీర ఉష్ణోగ్రతలు గురించి నివేదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఐతే అక్కడే ప్రజలు ఈ నోటీసులు రాకమునుపే ముందస్తుగా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం విశేషం. ఉత్తరకొరియా ప్రజలకు జారీ చేసిన నోటీసుల్లో ప్రజల్లో చాలమంది తీవ్రమైన జలుబుతో కూడా బాధపడుతున్నట్టు సమాచారం. కానీ కోవిడ్ సంబంధించిన కేసుల గురించి మాత్రం గోప్యంగానే ఉంచుతోంది. గతేడాదే తొలిసారిగా ఉత్తర కొరియా కోవిడ్ కేసులు గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఆగస్టు నాటికే తాము కోవిడ్పై విజయం సాధించామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించాడు. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియాలోని శ్రామిక ప్రజలందరూ ఇప్పటికే స్వచ్ఛందంగా నిబంధనలను పాటిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: విచిత్ర ఘటన: యజమానినే కాల్చి చంపిన కుక్క) -
భారత్లో కోవిడ్ భయాలు: స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసిన కారణంగా త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వీటిపై స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇదంతా నిరాధారమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్లో పోస్టు చేసింది. మరోవైపు చలి తీవ్రత బాగా పెరగడంతో కాన్పూర్, నోయిడా లక్నో, బిహార్, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీలోని పలు పాఠశాలలను మూసివేశారు. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ కరోనా కారణంగా సెలవులు ప్రకటించలేదు. చదవండి: భారత్లో డ్రంక్ అండ్ డ్రైవ్ను అరికట్టడం ఎలా? सोशल मीडिया पर कई खबरों को शेयर करते हुए दावा किया जा रहा है कि #Covid19 के कारण देश में लॉकडाउन लगेगा और स्कूल/कॉलेज बंद रहेंगे। #PIBFactCheck ✅ ये सभी दावे फ़र्ज़ी हैं। ✅ कोविड से जुड़ी ऐसी किसी भी जानकारी को शेयर करने से पहले #FactCheck अवश्य करें। pic.twitter.com/jLcIeI9pBn — PIB Fact Check (@PIBFactCheck) January 4, 2023 -
దేశంలో మరో లాక్డౌన్ అక్కర్లేదు: ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
న్యూఢిల్లీ: పొరుగు దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్నా.. మన దగ్గర మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది. అయితే.. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. ఈ తరుణంలో.. ఒమిక్రాన్ వేరియెంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ గనుక విజృంభిస్తే.. భారత్లో మరోసారి లాక్డౌన్ విధిస్తారా? అనే చర్చ తెర మీదకు వచ్చింది. అఫ్కోర్స్.. కేంద్రం ఆ పరిస్థితి తలెత్తకపోవచ్చనే సంకేతాలను ఇప్పటికే పంపింది కూడా. ఈ తరుణంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, భారత్లో కరోనా కల్లోలాన్ని పర్యవేక్షించిన డాక్టర్ రణ్దీప్ గులేరియా స్పందించారు. భారత్లో కరోనా ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉందని, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటే చాలని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో.. లాక్డౌన్ పెట్టడంగానీ, అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడం లాంటి చర్యలు అసలు అక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గత అనుభవాలను పరిశీలిస్తే.. విమానాల నిషేధం ఎలాంటి ప్రభావం చూపించలేదు. వైరస్ వ్యాప్తిని ఆ నిర్ణయం అడ్డుకోలేకపోయింది. అన్నింటికి మించి చైనాను కుదిపేస్తున్న వేరియెంట్.. ఇప్పటికే భారత్లోకి ప్రవేశించింది కూడా. ఒకవేళ.. భారత్లో అత్యధికంగా కేసులు నమోదు అయినా, ప్రజలు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ అధికంగా నమోదు అయ్యింది. అలాగే.. వైరస్ సోకి తగ్గిపోయిన జనాభా కూడా అధికంగానే ఉంది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగింది అని పల్మనాలజిస్ట్ అయిన గులేరియా తెలిపారు. ఇలాంటి పరిస్థితులన్నింటిని గనుక పరిగణనలోకి తీసుకుంటే లాక్డౌన్ ప్రస్తావనే అక్కర్లేదు అని అన్నారు. మరోవైపు చైనా సహా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న దేశాల నుంచి వస్తున్న విమానాలపై భారత ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాకపోతే.. ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలను ప్రత్యేకంగా విడుదల చేసింది. ఎయిర్ సువిధా ఫామ్లో ఆరోగ్య స్థితిని తెలియజేయడంతో పాటు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని తప్పనిసరి చేసింది కేంద్రం. అక్కడ పరిస్థితులు భయానకం..ఏ క్షణంలోనైనా లాక్డౌన్ -
అక్కడ పరిస్థితులు భయానకం..ఏ క్షణంలోనైనా లాక్డౌన్..ప్లీజ్ వెళ్లకండి
వాషింగ్టన్: చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తమ పౌరులను హెచ్చరించింది అమెరికా. చైనాకు వెళ్లాలనుకునే అమెరికన్లు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పింది. వీలైతే పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించింది. చైనాలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించడానికి ఆలస్యం అవుతోంది. అంబులెన్సులు కూడా సరిగ్గా అందుబాటులో లేవు. పలు చోట్లు ఆంక్షలు కూడా అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు అక్కడకు వెళ్తే ఇబ్బందులు తప్పవు. మేం కూడా వైద్యపరంగా సాయం అందించలేం. అని అమెరికా తమ పౌరులను అప్రమత్తం చేసింది. అలాగే చైనా వెళ్లినవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, పాజిటివ్గా తేలితే క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. కరోనా లాక్డౌన్ ఉండదని ఎవరూ పొరపాటుగా అంచనా వేయవద్దని, పరిస్థితి అదపుతప్పితే చైనా ఏ క్షణంలోనైనా మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం ఉందని అగ్రరాజ్యం తమ పౌరులను హెచ్చరించింది. చదవండి: మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు -
కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్డౌన్ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్ స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు.. -
కరోనా లాక్డౌన్ నుంచి ఇంట్లోనే.. మూడేళ్లుగా బయటకు రాని తల్లీకూతుళ్లు
సాక్షి, కాకినాడ(కాజులూరు): మండలంలోని కుయ్యేరులో మానసిక అనారోగ్యంతో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తల్లీకూతుళ్ల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి అనారోగ్యం పాలవ్వటంతో విషయం తెలసుకున్న ఆరోగ్యశాఖ సిబ్బంది పోలీసులు, స్థానికుల సహకారంతో బలవంతంగా వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలివీ.. కుయ్యేరు గ్రామ పంచాయతీ సమీపంలో నివాసముంటున్న కర్నిడి సూరిబాబు ఇంటింటికీ తిరిగి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కరోనా లాక్డౌన్ సమయంలో అందరితోపాటు ఇంటికే పరిమితమైన అతని భార్య మణి, కూతురు దుర్గాభవాని మానసిక వ్యధతో నేటికీ బయటకు రాకుండా తలుపులు బిగించుకు ఉండిపోయారు. చుట్టుపక్కల ఇళ్లవారు, బంధువులు వచ్చి పిలిచినా మీరు మాకు చేతబడి చెయ్యటానికి వచ్చారా.. అంటూ తలుపులు తియ్యకుండా లోపలి నుంచే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండేవారు. దీంతో క్రమేపీ ఎవరూ వీరిని పలకరించటం మానేశారు. సూరిబాబు రోజూ కూరగాయల వ్యాపారానికి వెళ్లివస్తూ వీరికి అవసరమైన ఆహారం, వస్తువులు తెచ్చి ఇస్తున్నాడు. కొన్ని రోజులు అతని భార్య ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతో సూరిబాబు తన భార్యకు వైద్యం అందించమని దుగ్గుదుర్రు పీహెచ్సీలో సిబ్బందిని కోరాడు. చదవండి: (మళ్లీ అరకు ఇన్స్టెంట్ కాఫీ రెడీ) మంగళవారం వైద్యసిబ్బంది వచ్చి పిలిచినా తలుపులు తియ్యలేదు. గ్రామ సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి, స్థానికుల సహకారంతో తులపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. అయితే తల్లి, కూతుళ్లు వైద్యానికి నిరాకరిస్తూ సిబ్బందిపై దాడి చేశారు. సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి ఫోన్లో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణకు సమాచారమందించగా ఆయన ఆదేశాల మేరకూ గొల్లపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను 108 అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన భార్య, కుమార్తె మానసిక పరిస్థితి బాగోలేదని, ఎప్పటికైనా సరౌతుందనే భావనతో మూడేళ్లుగా ఎవ్వరికీ చెప్పలేదని భర్త సూరిబాబు తెలిపాడు. -
‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారీ షాక్!
చైనా నుంచి ఒక్కొక్క కంపెనీ తరలి వెళ్లిపోతుంది. ప్రముఖ కంపెనీలు భారత్కు క్యూ కడుతున్నాయి. మొబైల్ దిగ్గజం యాపిల్కు విడి భాగాలు సరఫరా చేసే ఫాక్స్కాన్ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం..యాపిల్కు అతిపెద్ద తయారీ భాగస్వామి సంస్థ, తైవాన్కు చెందిన ఫాక్స్కాన్..భారత్లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. చైనా నుండి ఉత్పత్తిని తరలించడంపై యాపిల్ ప్రయత్నిస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సూచించిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. విజృంభిస్తున్న కోవిడ్-19 డ్రాగన్ కంట్రీలో రోజుకు 20 వేలు అంతకన్నా ఎక్కువ కోవిడ్ కేసులు విజృంభిస్తున్న కారణంగా అక్కడ అమలు చేస్తున్న కఠిన లాక్ డౌన్ నిబంధనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా.. ఈ సారి ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఫ్యాక్టరీలో తయారీని కొనసాగించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీలో క్వారంటైన్ కేంద్రాల్ని ఏర్పాటు చేసి కార్మికులు, సిబ్బందిని అందులో నెలల తరబడి ఉంచుతున్నారు. కొన్ని చోట్ల ఇనుప కంచెలు వేసి సిబ్బంది తప్పించుకోకుండా ఏర్పాట్లు చేశారు. కంపెనీలు, ఫ్యాక్టరీల వెలుపల భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. తిరగబడ్డ యాపిల్ ఉద్యోగులు ఫలితంగా నెలల తరబడి క్వారంటైన్ కేంద్రాల్లో మగ్గిపోతున్న కార్మికులు, సిబ్బంది ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా యాపిల్ ఫోన్ ప్రధాన తయారీ భాగస్వామి జెంగ్షూలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వీరిని నిలువరించేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందితో వారు ఘర్షకు దిగారు. దీంతో ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ‘నా దారి నేను చూసుకుంటా’ అక్కడి ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడడంతో..ఐఫోన్ తయారీని చైనా వెలుపలి దేశాలకు తరలించాలని యాపిల్ తన కాంట్రాక్ట్ తయారీ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. మార్కెట్ కేపిటలైజేషన్ వ్యాల్యూలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీగా యాపిల్ తన ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్ల తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతుంది. ఈ తరుణంలో యాపిల్ సూచనతో ఫాక్స్కాన్ భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఫాక్స్కాన్ విషయానికి వస్తే ఫాక్స్కాన్ 2019 నుండి మనదేశంలో యాపిల్ ఐఫోన్ 11 నుంచి తయారీని ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 మోడల్ను అసెంబుల్ చేస్తోంది. ఇప్పుడు దాని సామర్థ్యాన్ని విస్తరించేందుకు, ఇతర ప్రొడక్ట్లను తయారు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఐప్యాడ్ను భారత్ లో ఇతర ప్రొడక్ట్లను తయారు చేసే అవకాశలను అన్వేషించేందుకు కేంద్రంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇతర దేశాలకు ప్రత్యామ్నాయంగా యాపిల్.. తన ఐపాడ్లను అసెంబుల్ కోసం మనదేశం వైపు చూస్తుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా వద్దు.. భారత్ ముద్దు భారత్లో తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, విస్ట్రాన్,పెగాట్రాన్లు యాపిల్ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కంపెనీలు భారత్లో ఐప్యాడ్ అసెంబుల్ చేయడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిక నైపుణ్యం, ప్రతిభ గల సిబ్బంది లేకపోవడం ఆందోళన వ్యక్త మవుతుంది. అయినా సరే ఫాక్స్ కాన్ $500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో సమీకరణాలు మారనున్నాయని, యాపిల్ గతంలో కంటే ఉత్పత్తికి కేంద్రంగా భారత్ అనువైన దేశమని భావిస్తోందంటూ చర్చ జరుగుతోంది. -
చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..
కరోనా పుట్టినిల్లు అయినా చైనాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఏళ్ల తరబడి క్వారంటైన్, లాక్డౌన్లతో మగ్గిపోయిన ప్రజలు ఆగ్రహంతో తిరబడే స్థాయికి వచ్చినా.. చైనా ఏ మాత్రం తగ్గేదేలే అంటూ మంకుపట్టు పడుతూనే ఉంది. ఇప్పుడుప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఆ మహమ్మారి నుంచి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ హాయిగా ఉంటున్నా...ఇంకా చైనా మాత్రం జీరో కోవిడ్ అంటూ కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉంది. ప్రజల్లో ఓపిక చచ్చి వీధల్లోకి వచ్చి నిరసనలు చేసినా... సైన్యంతో కట్టడి చేసింది. వారిని ఒక జంతువుల్లా బలవంతంగా నిర్బంధంలో ఉంచేందుకే యత్నించింది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని జిన్పింగ్ రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగానే గాక సోషల్ మీడియాల్లో సైతం నిరసన సెగలు ఊపందుకోవడంతో వెనక్కి తగ్గేంది. ఆఖరికి ప్రపంచ దేశాలు సైతం ఇంతలా కఠినా ఆంక్షలు విధించొద్దు అని సూచించినా.. తగ్గని చైనా లాక్డౌన్ ఆంక్షలను సడలించే ప్రయత్నం చేసింది. చైనా ప్రభుత్వం అనుహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్న తరుణంలోనే కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభించింది. ప్రజలు ప్రయాణించేలా ఆంక్షలు సడలించిన తర్వాత కేసులు పెరగడంతో చైనా గుట్టుచప్పుడూ కాకుండా తన పాలసీని తనదైన శైలిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఆరోగ్య అధికారులు గట్టి నిఘా ఉంచారు. ఏ వ్యక్తి అయినా కరోనా బారిన పడినట్లు తెలిస్తే చాలు అతని ఇంటి వద్దకు వచ్చేయడం క్యారంటైన్కి తీసుకుపోవడం వంటివి చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక వ్యక్తిని బలవంతంగా క్వారంటైన్కి తీసుకువెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హోం క్వారంటైన్లో ఉంటానన్న వినకుండా అదికారులు అతన్ని ఎలా బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మూడేళ్లు అయినా కరోన మహమ్మారీ కంటే అక్కడి ఆంక్షలతోనే చైనా ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్) -
పాలసీ తెచ్చిన ప్రజాగ్రహం
ఆశయం మంచిదే కావచ్చు... అది ఆచరణాత్మకం అవునో కాదో చూసుకోవడం ముఖ్యం. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవడం మరీ ముఖ్యం. కోవిడ్–19కు జన్మస్థానంగా అపఖ్యాతి పాలైన అగ్రరాజ్యం చైనా అక్కడే విఫలమైంది. ఆ దేశం తలకెత్తుకున్న ‘జీరో కోవిడ్ పాలసీ’ తలవంపులు తెచ్చిపెడుతోంది. దేశంలో ఒక్క కోవిడ్ కేసూ లేకుండా ఉండేలా, ప్రతి కేసునూ తీవ్రంగా పరిగణించాలంటూ... ఎడతెగని లాక్డౌన్లు, ప్రజాజీవితంపై కఠోర నిర్బంధాలు విధిస్తున్న ఈ మతి లేని విధానం సహజంగానే చైనీయుల్లో అసహనాన్ని పెంచిపోషిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు పెద్దయెత్తున నిరసనకు దిగడం, దేశాధినేత జిన్పింగ్ గద్దె దిగాలని నినదించడం దాని ఫలితమే. అయితే, కరోనా సమస్య పరిష్కారానికీ, ప్రభుత్వ విధానాన్ని సరిదిద్దుకొనేందుకూ ప్రయత్నించక పోగా, నిరసనల అణచివేతపై పాలకులు దృష్టి పెట్టడమే శోచనీయం. ఉరుమ్కీలో బహుళ అంతస్థుల భవన అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం తాజా నిరసనలకు ప్రేరేపించింది. ‘జీరో కోవిడ్ పాలసీ’లో భాగంగా 109 రోజులుగా ఆ నివాసం లోని వారందరినీ ఇంట్లోనే నిర్బంధించారు. ఇళ్ళకు తాళాలు వేసి మరీ ప్రభుత్వం కోవిడ్ నిర్బంధాల వల్లే అగ్నిప్రమాదంలో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రజాగ్రహం పెల్లుబుకింది. దేశ రాజధాని బీజింగ్, వాణిజ్య రాజధాని షాంఘైలలో ఆదివారం శాసనోల్లంఘన ఉద్యమం సాగింది. కోవిడ్ జన్మస్థానమైన ఊహాన్కు సైతం నిరసన సెగ తగిలినా, ప్రభుత్వ వర్గాలు క్షేత్రస్థాయిలో అంతా బాగుందంటున్నాయి. వాస్తవాల్ని నివేదించడానికి ప్రయత్ని స్తున్న విదేశీ విలేఖరులను తిట్టి, కొట్టి, తిప్పలు పెడుతుండడం మరీ దారుణం. దేశంలో సెన్సార్షిప్తో చైనీయులు నినాదాలేమీ లేకుండా, తెల్ల కాగితాలు, తెలుపు బోర్డులు పట్టుకొని, నిరసన తెలియజేయాల్సి వస్తోంది. కోవిడ్ వచ్చినప్పుడు 2020లో రికార్డు సమయంలో తాత్కాలిక భారీ ఆసుపత్రులను కట్టి, ప్రపంచం తలతిప్పి చూసేలా చేసిన ఘనత చైనాది. తీరా ఇప్పుడు అదే అగ్రరాజ్యం దిక్కుతోచని స్థితిలో పడింది. మరుగుదొడ్లను సైతం తాత్కాలిక క్వారంటైన్ శిబిరాలుగా మార్చి, జనాన్ని అందులో ఖైదీల కన్నా నీచంగా చూస్తున్న అపకీర్తిని మూటగట్టుకుంది. ఇప్పటికీ చైనాలో 50కి పైగా నగరాలు, పట్నాల్లో జనం కొన్ని వారాలుగా లాక్డౌన్లతో ఇంటికే పరిమితమయ్యారు. అయినా, మునుపెన్నడూ లేనంతగా రోజూ 40 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయంటే ‘జీరో కోవిడ్’ విధానం ఒక విఫల ప్రయోగమని అర్థమవుతూనే ఉంది. మహమ్మారిపై గత మూడేళ్ళుగా అనుసరిస్తున్న అవకతవక విధానాలతో లాక్డౌన్లు, నిర్బంధాలు నిత్యకృత్యమయ్యాయి. జనజీవనంతో పాటు ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. సాధారణ జీవితం సాగించాలని ప్రాథేయపడుతున్న జనంలోని వీధినపడ్డ అసహనం అర్థం చేసుకోదగినదే. జీవితకాలం చైనాకు తిరుగులేని నేతగా ఇటీవలే కొత్త అధికారాలు సంతరించుకున్న జిన్పింగ్ నెల తిరిగేసరికల్లా ఎదురైన ఈ యాంటీ కోవిడ్ నిరసనలతో జీరో కోవిడ్ పాలసీని సరళీకరిస్తారా అన్నది ప్రశ్న. ఇవి రాజకీయ నిరసనలుగా మారుతుండడం సవాలే. విద్యార్థుల సారథ్యంలోని 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ప్రజాస్వామ్య ఉద్యమం తర్వాత మళ్ళీ అలాంటి నిరసనలు కొందరి మాట. అప్పట్లో దాన్ని ఆర్మీతో అణిచేసిన అనుభవం ఉండనేవుంది. పైపెచ్చు, అంతర్గత సమస్యలు తలెత్తినప్పుడల్లా సరిహద్దుల్లో ఏదో ఒక రచ్చతో చైనీయుల్లో జాతీయవాదం రగిల్చి, అంతర్జాతీయ దృష్టి అంతా కొత్త అంశంపై మళ్ళేలా చేయడం డ్రాగన్ వ్యూహం. కనుక భారత్ అప్రమత్తం కావాలి. నియంతలు ప్రజాకాంక్షలకు విలువనివ్వడం కలలో మాటే. అలాగని చైనీయులు కళ్ళు తెరిచి చూస్తుంటే, మిగతా ప్రపంచం కోవిడ్ను దాటి ముందుకుపోతోంది. పొరుగునే ఉన్న తైవాన్లో తప్పనిసరి మాస్కుల నిబంధనను సైతం తప్పిస్తుంటే, తమ వద్ద తీవ్ర ఆంక్షలు వారిని ఉక్కపోతకు గురిచేస్తున్నాయి. ఫుట్బాల్ ప్రపంచ కప్ వేదిక సహా అన్నిచోట్లా వేలాది జనుల ఉత్సాహం వారికి కరోనా నిర్బంధరహిత జీవితంపై కోరిక రేపుతోంది. మిగతా ప్రపంచమంతా కరోనా నుంచి బయట కొచ్చేస్తున్నా, చైనా వేలకొద్దీ కరోనా కేసులతో కల్లోలం కావడానికి కొత్త వేరియంట్తో పాటు నిర్వ హణలోపాలూ కారణం. చైనాలో ఇప్పటికీ 80 ఏళ్ళు పైబడినవారిలో సగం మందికే ప్రాథమిక కరోనా టీకాకరణ జరిగింది. ఇక, బూస్టర్ డోస్ తీసుకున్నది వారిలో 20 శాతం లోపే. 60–69 ఏళ్ళ మధ్య వారిలోనూ పూర్తి టీకాకరణ జరిగింది 60 శాతంలోపే. పిల్లలకు టీకాల మాట దేవుడెరుగు. చైనా టీకాల సత్తా తక్కువ. అక్కడి టీకాలన్నీ ప్రభుత్వ రంగ సైనోఫార్మ్, ప్రైవేట్ సంస్థ సైనోవాక్ తయారీలే. వాటి క్లినికల్ ట్రయల్స్ డేటా ప్రజాక్షేత్రంలో ఇప్పటికీ లేదు. దీనికి తోడు ఇతర దేశాల టీకాలు వాడేది లేదన్న మూర్ఖత్వం సరేసరి. నిజానికి, తాజాగా చైనాను పీడిస్తున్నది బలమైన ఒమి క్రాన్ బీఎఫ్.7 వేరియంట్. నర్సింగ్హోమ్లు, స్కూళ్ళు, భవన నిర్మాణ స్థలాలలో సామూహిక ఇన్ఫె క్షన్లకు ఇది కారణం. చైనా విధానలోపం మాటెలా ఉన్నా, నేటికీ కరోనా పూర్తిగా వదిలివెళ్ళలేదని మిగతా దేశాలు గ్రహించాలి. సదరు వేరియంట్ అమెరికా, బ్రిటన్తో పాటు గత నెలలో కేరళకూ చేరింది. మన దగ్గర కేసులు తక్కువే ఉన్నా, పండుగలు దగ్గరకొస్తున్న వేళ టీకాలు, మాస్కుల లాంటి ప్రాథమిక జాగ్రత్తలే రక్ష. డ్రాగన్ సైతం భారత్ సహా ప్రపంచ దేశాల కరోనా నిర్వహణ విధానాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భీష్మించుకు కూర్చుంటే ప్రజలకే కాదు పాలకులకూ కష్టమే! -
లాక్డౌన్ ఇంకా ఎన్నాళ్లు? చైనాలో వెల్లువెత్తిన నిరసనలు..
బీజింగ్: అత్యంత అరుదుగా నిరసనలు చేపట్టే చైనీయుులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. జిన్జియాంగ్ ప్రావిన్స్ ఉరుమ్కిలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. జీరో కోవిడ్ పాలసీ పేరుతో చాలా రోజులుగా అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఎత్తివేయాలని భారీ ర్యాలీ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గురువారం రాత్రి ఉరుమ్కిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ నిబంధనల కారణంగా అందులోని నివసించేవారు బయటకు వెళ్ల పరిస్థితి లేదు. దీంతో 10 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై చైనా అధికారి ఒకరు నిర్లక్ష్యంగా మాట్లాడారు. వీళ్లు తమను తాము కాపాడుకోలేని రీతిలో చాలా బలహీనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. శుక్రవారం రాత్రి భారీ నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారుు. చైనా జాతీయ గీతం ఆలపిస్తూ నినాదాలు చేశారు. 100 రోజులకుపైగా అమలు చేస్తున్న కరోనా ఆంక్షలు, లాక్డౌన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే అగ్నిప్రమాదంలో చనిపోయిన వారికి పూలు, క్యాండిల్స్తో నివాళులు అర్పించారు. Rare protests broke out in China's Xinjiang region opposing prolonged COVID-19 lockdowns, according to footage seen on social media https://t.co/tHXkz5lRon pic.twitter.com/0phutiecBX — Reuters (@Reuters) November 26, 2022 Thread/1 Massive protest happened in Ulumuqi,Xinjiang,China after more than 100 days zero-covid city lockdown. People are chanting ‘stop lockdown’ ‘we are human being’ pic.twitter.com/trQhDSZLXr — 巴丢草 Bad ї ucao (@badiucao) November 25, 2022 చైనాలో మైనారిటీలైన వీగర్లు ఎక్కువగా ఉండే జిన్జియాంగ్లో కోటి మంది నివసిస్తున్నారు. ఉరుమ్కి నగరంలో 40 లక్షల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో 100 రోజులకుపైగా కఠిన కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఈ క్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది చనిపోయారు. BREAKING: A large crowd has surrounded the Municipal Government building in Urumqi (Xinjang’s largest city). It’s a rare case of a joint Uyghur & Han protest against the authorities. It comes after 10 people died in fire in a high-rise under lockdown.pic.twitter.com/lmXcHQ5Ggp — Visegrád 24 (@visegrad24) November 25, 2022 ఉరుమ్కిలో చేపట్టిన నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చైనా రాజధాని బీజింగ్ సరిహద్దు ప్రాంతంలోనూ జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. చదవండి: బ్రిటన్లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్! -
అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది సజీవదహనం
బీజింగ్: చైనా జిన్జియాంగ్ ప్రావిన్స్ టియాన్షాన్ జిల్లా ఉరుంఖిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. అపార్ట్మెంట్లో ఓ ఫ్లోర్లో మంటలు చెలరేగి ఇతర ఫ్లాట్లకు వ్యాపించడంతో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఏడుగురు చనిపోయారు. గరువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే 10 మంది చనిపోవడానికి ప్రభుత్వం 'జీరో కోవిడ్ పాలసీ' పేరుతో విధించిన కఠిన ఆంక్షలే కారణమని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. కింది ఫ్లోర్ లాక్ చేసి ఉండటంతో మంటలు చూసినా బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. దీంతో అందరూ అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్కి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొంత మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒకటి, రెండో అంతస్తుల నుంచి కిందకు దూకేశారని వివరించారు. మరికొంత మంది జంప్ చేసి పక్క ఫ్లాట్లలోకి వెళ్లినట్లు చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు నమోదైన అపార్ట్మెంట్లను లాక్ చేస్తోంది. ఎవరూ బయటకు రాకుండా కఠిన చర్యలు చేపడుతోంది. అగ్నిప్రమాదం సంభవించిన అపార్ట్మెంట్లో 109 రోజులుగా కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఫలితంగా ఇక్కడ నివసించేవారు వాళ్ల కార్లను ఇన్నిరోజులుగా బయటకు తీయలేదు. అపార్ట్మెంట్ ముందు దారిమొత్తం పార్క్ చేసి ఉన్నాయి. దీంతో మంటలార్పేందుకు వెళ్లిన ఫైర్ ఇంజిన్లకు దారి లేక సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. వారు కార్లను తొలగించి అపార్ట్మెంట్ చేరుకునేందుకు దాదాపు మూడు గంటలు పట్టింది. ఫలితంగా 10 మంది మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఫైరింజన్లు సమయానికి వచ్చి ఉంటే ఇంత మంది చనిపోయి ఉండేవారు కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్దా? -
చైనాను టెన్షన్ పెడుతున్న కరోనా.. ఆంక్షలు కఠినం, మళ్లీ లాక్డౌన్!
కరోనా వైరస్ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో, చైనాలో మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చైనాలో బుధవారం ఒక్కరోజే 31,454 కేసులు నమోదయ్యాయి. వీటిలో 27,517 కేసులు అసింప్టొమేటిక్ అని చైనా నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. ఇదే సమయంలో 5వేల మరణాలు కూడా నమోదు అయినట్టు సమాచారం. కాగా, పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా సోకిన నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఆఫీసులు, రెస్టారెంట్లను అధికారులు మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, ఏదైనా నగరంలో చిన్న ఔట్ బ్రేక్ వచ్చినా ఆ నగరం మొత్తాన్ని అధికారులు షట్ డౌన్ చేస్తున్నారు. Violent protests aren't stopping in China. Again started at #Foxconn's #Apple plant in #China's Zhengzhou Workers have engaged in violent clashes with security personnel & police protesting against corona virus restrictions and unpaid wages.#resurrection#TiananmenSquare2_0 pic.twitter.com/OX72l1LpvG — Zaira Mirza (@ZairaMirza1) November 24, 2022 మరోవైపు.. ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు, ప్రయాణ పరిమితులు, లాక్ డౌన్ విధించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేక క్వారంటైన్ గదులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) On Wed night, another quarantine facility or Fangcang hospital was put into operation in Beijing, where asymptomatic and mild patients will be isolated and treated. At present, 6 patients have been admitted, which is still short of the utilization rate of the designed 200 beds. pic.twitter.com/ekalQTUSTH — FrontSource (@FrontSource) November 24, 2022 Pekings Messezentrum im Norden der Stadt ist jetzt ein Corona-Quarantänezentrum. 🇨🇳 China hält stur an seiner Null-Covid-Politik fest und will jeden einzelnen Fall isolieren. Trotzdem gibt es im ganzen Land gerade eine Rekord-Welle neuer Infektionen. pic.twitter.com/ICHzPeMGVV — miriam steimer (@miriamsteimer) November 24, 2022 -
COVID-19: చైనా సంచలన నిర్ణయం
బీజింగ్: కరోనా వైరస్ కట్టడి విషయంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కఠిన ఆంక్షలతో అక్కడి జనాలు చుక్కలు చూస్తున్నారు. అయితే ఏం జరిగినా సరే.. లాక్డౌన్, కఠిన ఆంక్షలపై వెనక్కి తగ్గేది లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అక్కడి అధికారిక మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది. గత నెలలో జరిగిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం సైతం ఇదే నిర్ణయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. చైనాలో గత రెండున్నరేళ్లుగా ప్రజలు కరోనా కట్టడి చర్యలతో అల్లలాడిపోతున్న సంగతి తెలిసిందే. ఆకలి బాధలతో పాటు మానసిక సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నారు. అయినాసరే కరోనా వైరస్ టెస్టులు, లాక్డౌన్ పేరిట అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తోంది ఆ దేశం. అయితే.. ఎప్పటికప్పుడు వైరస్ రూపాంతరం చెందడం, కొత్త మ్యూటేషన్తో విజృంభిస్తుండడంతో ఆంక్షల సడలింపులను రద్దు చేస్తూ వస్తోంది అక్కడి ప్రభుత్వం. అయితే.. కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఇప్పట్లో ఎత్తేసే ఆలోచనలో లేదని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకుడు వాంగ్ లిపింగ్ స్పష్టం చేశారు. ఆంక్షలను సడలించకపోగా.. మరింత కఠినతరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ ఆంక్షల విధింపు అనేది శాస్త్రీయబద్ధంగా ఉండబోతున్నట్లు తెలిపారాయన. ఈ మేరకు గత నెలలో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ భేటీలో.. పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. ఇదీ చదవండి: అన్నంత పనిచేస్తున్న పుతిన్ -
ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా 'ఇండియన్ లాక్డౌన్'.. టీజర్ రిలీజ్
కరోనా సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ పేరు వింటేనే యావత్ ప్రపంచం వణికిపోయింది. ఎంతో మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది ఆ మహమ్మారి. ఎందరో ఆత్మీయులను దూరం చేసి ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఆనాటి చేదు జ్ఞాపకాలను తెరపై చూపించేందుకు వస్తోంది 'ఇండియన్ లాక్డౌన్' చిత్రం. కరోనా నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా వస్తున్న ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకుడు. శ్వేత బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సాయి తమంకర్, ప్రకాశ్ బెలవాడి, అహన్కుమ్రాలు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వలస కూలీలు అనుభవించిన వేదన ఎలాంటింది? అన్ని రంగాలపై కరోనా చూపిన ప్రభావమెంత? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మధుర్ భండార్కర్ తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. The tragedy you know, the untold stories you don't!#IndiaLockdown teaser, premieres 2nd Dec only on #ZEE5 🙌 @jayantilalgada @PenMovies @ZEE5India @prateikbabbar @SaieTamhankar @shweta_official @AahanaKumra @pjmotionpicture @itsmeamitjoshi @i_aradhana_ @ZEE5Global pic.twitter.com/g5LxbcEYoT — Madhur Bhandarkar (@imbhandarkar) November 8, 2022 -
లాక్డౌన్ అంటే పరుగులు తీసున్న చైనీయులు....కంచెలు, గోడలు దూకి...
బీజింగ్: చైనాలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక కోవిడ్ సోకిన రోగిని అత్యంత హేయంగా క్రేన్ సాయంతో తీసుకువెళ్లిన సంఘటన గురించి ఉన్నాం. ప్రపంచమంతటా చైనాలో కరోనా విషయమైన వ్యవహరిస్తున్న తీరుని విమర్శిస్తున్నా... ఏ మాత్రం తీరు మార్చుకోకపోగా మరిన్ని ఆంక్షలు విధిలించి ప్రజలను బెంబేలెత్తించేలా చేసింది. అది ప్రస్తుతం ఎంతలా ఉందంటే...చైనీయులు కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తారు అని తెలియగానే దూరంగా పరుగులు తీసే స్థాయికి వచ్చేశారు. ఈ మేరకు చైనాలో సెంట్రల్ సిటీ ఆఫ్ జెంగ్జౌలో అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్కాన్లో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. దీంతో చైనా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జీరో కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలు యథావిధిగా అమలు చేస్తోంది. దీన్ని తప్పించుకునేందుకు పలువురు కార్మికులు ఫ్యాక్టరీ కంచెలు దూకి పారిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. వాస్తవానికి ప్రపంచంలోని సగం ఐఫోన్లు ఈ ఫాక్స్కాన్లోనే ఇక్కడే తయారవుతాయి. అంతేగాక ఈ ఫ్యాక్టరీలో దాదాపు 3 లక్షల మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తారు. వారంతా ప్రస్తుతం ఈ లాక్డౌన్ గురించి భయపడి కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. పగటి పూట పొలాల మీదుగా రాత్రిళ్లు రోడ్ల మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఫాక్స్కాన్ కంపెనీ యూఎస్ ఆధారిత యాపిల్ కంపెనీకి సరఫరదారు. ఐతే ఈ కాలినడకన ఇళ్లకు వెళ్తున్న కార్మికులకు స్థానికులే ఉచిత ట్రాన్స్పోర్ట్ సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగజౌలో గత అక్టోబర్ 29 వరకు 167 కేసులు నమోదయ్యాయి. కేవలం గత ఏడు రోజుల్లోనే 97 కేసులు పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో జీరో కోవిడ్ విధానం పూర్తి స్థాయిలో అమలు చేసింది. చైనా ప్రజలు ప్రభుత్వం ఈ ఏడాదితో ఈ జీరో కోవిడ్ చట్టాన్ని ఉపసంహిరిచంకుంటుందని భావించారు. ఐతే ఇటీవల జరిగిన 20వ కమ్యునిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిలో ఆ చట్టాన్ని ఉసంహరించే అవకాశం లేదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పష్టం చేసి వారి ఆశలపై నీళ్లు జల్లారు. Workers have broken out of #Apple’s largest assembly site, escaping the Zero #Covid lockdown at Foxconn in #Zhengzhou. After sneaking out, they’re walking to home towns more than 100 kilometres away to beat the Covid app measures designed to control people and stop this. #China pic.twitter.com/NHjOjclAyU — Stephen McDonell (@StephenMcDonell) October 30, 2022 (చదవండి: కరోనా రోగుల పట్ల చైనా కర్కశత్వం.. పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..!) -
చైనా కర్కశత్వం.. వారిని పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కోవిడ్ రోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంది. కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షల విధించింది జిన్పింగ్ ప్రభుత్వం. ఈ క్రమంలో కోవిడ్ సోకిన ఓ రోగిని క్రేన్ ద్వారా తీసుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు చైనా ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రోగులను పశువలకన్నా హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఆంక్షలు విధించిన ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ భవనంలోని కిటికీలోంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాజిక దూరం పాటించే క్రమంలో వైరస్ సోకిన వ్యక్తిని క్రేన్ సాయంతో తీసుకెళ్లారు. ట్విటర్లో ఈ వీడియోను ఇప్పటి వరకు 221వేల మంది వీక్షించారు. 1.8వేల లైకులు వచ్చాయి. చైనాలో కరోనా వైరస్ కట్టడికి జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది జిన్పింగ్ ప్రభుత్వం. కరోనా కేసులు వచ్చిన ప్రాంతంలో కఠిన లాక్డౌన్లు విధిస్తున్నారు. కీలక నగరాల్లో లాక్డౌన్లు విధించటం ద్వారా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉన్నందున చైనా ప్రభుత్వంపై అంతర్జాతీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ తొలిసారి గుర్తించిన వూహాన్ నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 26 నుంచి 30వ తేదీ వరకు లాక్డౌన్ విధించగా.. 8 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. 中国式现代化。【方老师,投稿一个防疫大革命的荒谬视频。一个阳性患者被吊机吊出小区,因为他们不敢进去接,也不想患者的细菌留在地板上,这样能保证最小的接触面积。】 pic.twitter.com/2BM3Afm3V6 — 方舟子 (@fangshimin) October 25, 2022 ఇదీ చదవండి: పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్ -
ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి
నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలు పోషించి ఆమె బాగా గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియాల్లో సైతం ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ట్రెండింగ్ పాటలకు స్టెప్పులేస్తూ, జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోలను తరచూ పంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ట్రోల్స్ బారిన పడుతోంది. అయితే తల్లి పాత్రలు చేస్తున్న ఆమె మొదట ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఆడిషన్స్కి వెళ్లినప్పుడు దారుణంగా అవమానించారు: ప్రియదర్శి నటనపై మక్కువతో మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. ఈ క్రమంలో ఓ సీన్కు ఆమె అభ్యంతరం చెప్పడంతో హీరో చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయని, దీంతో హీరోయిన్గా చేయొద్దని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఆమె ఓ టాక్లో షో చెప్పింది. ఈ సందర్భంగా ప్రగతి తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. చదవండి: Actress Prema: మోహన్ బాబు గారిని చూస్తేనే భయం వేసేది, అలాంటిది..: ప్రేమ లాక్డౌన్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఫేస్ చేశానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘కరోనా సమయంలో షూటింగ్స్ లేవు. దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నా నగలు తాకట్టు పెట్టి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా’ అని తెలిపింది. ఇక అలాగే తన వైవాహిక జీవితం, విడాకులపై స్పందించింది. ‘నా వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నా పిల్లలను ఒంటరిగా నేనే చదివించాను. ఇప్పుడు వాళ్లు వారి లైఫ్కి సంబంధించిన నిర్ణయాలను సొంతంగా తీసుకునే స్థాయికి ఎదిగారు’ అంటే చెప్పుకొచ్చింది. -
ఆమె ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలు.. అతడు ఇంజనీర్.. భార్యాభర్తలిద్దరూ కలిసి
‘కాలంతోపాటు ఎన్నో మారుతున్నాయి. మారనిది మాత్రం జిమ్ మాత్రమే’ అంటూ ఫ్లెక్స్నెస్ట్ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టారు ఈ దంపతులు. ‘విజయం సాధిస్తామా?’ అనే సందేహం వారిలో ఏ ఒక్కరోజూ రాలేదు. ఎందుకంటే కొత్తదనాన్ని ఎవరూ నిరాకరించరనే విషయం వారికి బాగా తెలుసు. ఎన్నో రకాల ఫిట్నెస్ ఎక్విప్మెంట్లను పరిచయం చేసిన ‘ఫ్లెక్స్నెస్ట్’ అనుకున్నట్లుగానే గెలుపు జెండా ఎగరేసింది. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది... కోవిడ్ భీకరంగా కోరలు సాచిన సమయం అది. దిల్లీకి చెందిన రియా, రోనక్ ఆనంద్ దంపతులకు జిమ్కు వెళ్లనిదే రోజు మొదలు కాదు. అలాంటిది కోవిడ్ వల్ల జిమ్కు ఒక్కరోజు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇలా అయితే కుదరదు అనుకొని ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లాక్డౌన్ లేని సమయంలో ఎన్నో షాప్లకు వెళ్లారు. ఏ షాప్కు వెళ్లినా ఒకే దృశ్యం. అవే పాత ఎక్విప్మెంట్స్! మరికొన్ని షాప్లలో విదేశాల్లో నుంచి దిగుమతి చేసుకున్న కొత్త ఎక్విప్మెంట్ కనిపించిదిగానీ, ధరలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి. ‘రెండు దశాబ్దాల క్రితం ఇప్పుడున్న స్మార్ట్ఫోన్లు లేవు. స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ టీవీలు లేవు. ఎన్నో రంగాలలో స్మార్ట్ వచ్చేసింది. జిమ్ విషయంలో మాత్రం ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది’ అంటూ మాట్లాడుకున్నారు రియా, ఆనంద్లు. అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే ఈ దంపతులకు ‘ఫ్లెక్స్నెస్ట్’ అనే అంకుర ఆలోచన వచ్చింది. రియా ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలు. కొంత కాలం ఒక మీడియా సంస్థలో పనిచేసింది. ఆనంద్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఇద్దరికీ స్టార్టప్లో పూర్వ అనుభవం లేదు. అయినా సరే ధైర్యంతో ముందడుగు వేశారు. నిధుల సమీకరణకు వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్లపై ఆధారపడలేదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ చేశారు. అవసరమైతే తప్ప పొదుపు మొత్తాలను ఖర్చు చేయకూడదని నిర్ణయించుకున్నారు. థర్డ్ పార్టీ రీటెయిలర్స్, హోల్సేలర్స్, మిడిల్మెన్ ప్రమేయం లేని డి2సి (డైరెక్ట్–టు–కస్టమర్) బిజినెస్ మోడల్తో ‘ఫ్లెక్స్నెస్ట్’ పట్టాలకెక్కింది. మొదట ప్రయోగాత్మకంగా డంబెల్స్, యోగా మ్యాట్స్... అమ్మకాలు మొదలుపెట్టారు. ఆ తరువాత జర్మనీ, చైనా, తైవాన్ల నుంచి స్మార్ట్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్లను దిగుమతి చేసుకున్నారు. స్మార్ట్ ఎక్సర్సైజ్ సైకిళ్లు, ఫ్లెక్స్ ట్రైనర్, ఫ్లెక్స్ప్యాడ్, ఫ్లెక్స్ బెంచ్, ఫ్లెక్సి కెటిల్, ఫ్లెక్సిబెల్స్టాండ్, ఫ్లెక్స్ నెస్ట్ యోగా బ్యాక్స్, మసాజ్గన్, ఫ్లెక్స్ బ్యాంగిల్....ఇలా ఎన్నోరకాల ఎక్విప్మెంట్స్తో ఫ్లెక్స్నెస్ట్ స్మార్ట్గా తయారైంది. మొదలైన కొద్దికాలంలోనే పరుగులు ప్రారంభించింది. ఫిట్నెస్కు సంబంధించి ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్న ‘ఫ్లెక్స్నెస్ట్’ వర్కవుట్స్, బైక్రైడ్స్కు సంబంధించి సొంత కంటెంట్ తయారు చేసుకుంది. త్వరలో మరిన్ని వర్కవుట్ ప్లాన్స్ తమ యాప్లో లాంచ్ చేయనుంది. ‘మేము పరిచయం చేసిన ఎక్విప్పెంట్ వల్ల బ్యాడ్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ప్రాడక్ట్స్ మధ్య తేడా ఎంతోమంది తెలుసుకోగలిగారు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను ఒకే వేదికపై తీసుకురావడం ద్వారా ఫిట్నెస్ను మరింత సౌకర్యంగా మార్చాం. వినియోగదారుల ఫిట్నెస్ జర్నీకి మా వంతుగా సహాయం అందించాలనుకుంటున్నాం. ఇండియన్ ఫిట్నెస్ మార్కెట్లో విస్తరించడానికి మరిన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం’ అంటుంది రియా. ఆరోజు... సర్దుకు పోయి ఉంటే, సమస్య లేదనుకొని ఉంటే‘ఫ్లెక్స్నెస్ట్’లాంటి సక్సెస్ఫుల్ స్టార్టప్ ఆవిర్భవించేది కాదు. సమస్యతోపాటు పరిష్కారం ఆలోచించడం కూడా గొప్ప వ్యాపార లక్షణం కదా! చదవండి: Rutvik Lokhande: ఈ కుర్రాడు... ‘సక్సెస్’కు సన్నిహిత మిత్రుడు Anusha Shetty: లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ.. -
ప్రమాదకారి ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ల విజృంభణ
బీజింగ్: డ్రాగన్ కంట్రీపై కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి.. కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. మూడు రెట్లు కొత్త కేసులు పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒమిక్రాన్ నుంచి ప్రమాదకారిగా భావిస్తున్న రెండు ఉప వేరియెంట్లు శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేసుల సంఖ్య అమాంతం పెరగడానికి కారణంగా తేలింది. ఈ క్రమంలో పలు చోట్ల మళ్లీ లాక్డౌన్ విధించగా.. తీవ్ర ప్రభావం చూపించే వేరియెంట్లు కావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా వైరస్ వేరియెంట్ ఒమిక్రాన్ నుంచి బీఎఫ్.7, బీఏ.5.1.7 ఉప వేరియెంట్లు.. వాయవ్య చైనాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. సోమవారం నమోదు అయిన కేసుల సంఖ్య గణనీయంగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. వీటి బారిన పడ్డ చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారు. అదే సమయంలో బీఏ.5.1.7 సబ్ వేరియెంట్ కేసులు తొలిసారి చైనా గడ్డపై వెలుగు చూడడం గమనార్హం. ఈ విషయాన్ని గ్లోబల్ టైమ్స్ కూడా ధృవీకరించింది. షాంగైతో పాటు చాలా రీజియన్లలో సోమవారం నుంచే కఠిన లాక్డౌన్ను మళ్లీ అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ ఉప వేరియెంట్ BF.7. అత్యంత ప్రమాదకరమైందని, ఇన్ఫెక్షన్ రేటు వేగంగా.. అధికంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో పెనుముప్పునకు దారి తీయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో.. చైనాలోనే ఈ ప్రమాదకారిక ఉప వేరియెంట్ ప్రతాపం చూపిస్తుండడం గమనార్హం. అయితే ఇది చైనాకు మాత్రమే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచాన్ని హెచ్చరించింది డబ్ల్యూహెచ్వో. ప్రపంచంలోనే కట్టుదిట్టమైన కఠోర కరోనా ఆంక్షల్ని అమలు చేస్తోంది చైనా. సరిహద్దుల్ని మూసేసి.. జీరో కోవిడ్ పాలసీ విధానంతో ప్రజలు ఇబ్బంది పడినా.. విమర్శలు ఎదుర్కొన్నా కూడా కరోనా కట్టడికి యత్నిస్తోంది. అయినప్పటికీ కొత్త వేరియెంట్లు విరుచుకుపడడం గమనార్హం. అధికార కమ్యూనిస్ట్ పార్టీ 20వ పార్టీ కాంగ్రెస్ నేపథ్యంలో.. కరోనా విజృంభిస్తోందన్న కథనాలు చైనాను మాత్రమే కాదు.. ఇతర దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. -
మనసులో అలజడి
మనసు దృఢంగా ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. కానీ అదే మనసు కల్లోలమైతే జీవితమే అంధకారమవుతుంది. కోవిడ్ రక్కసి మానసిక అలజడులకూ కారణమైంది. తీవ్రమైన ఆర్థిక సామాజిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది మనో వ్యాకులతకు గురయ్యారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలుచోట్ల జాగృతి కార్యక్రమాలు జరిగాయి. బనశంకరి: కోవిడ్ మహమ్మారి వేటుకు సమాజంలో ఎక్కువమంది బడుగులు, మధ్య తరగతి వారే కాదు సంపన్నులు కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోయారు. వైరస్ భయం, లాక్డౌన్, ఉద్యోగాలను, ఆప్తులను కోల్పోవడం వంటి ఎన్నో వ్యతిరేకాంశాలతో క్లేశం అనుభవించారు. కర్ణాటకలో కోవిడ్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మానసిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందినవారి సంఖ్య ఏడాదిలో 10 లక్షలు ఉంది. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ ఇంకా ఎక్కువమందే మానసిక సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లి ఉంటారని ఎన్జీవోల అంచనా. కోవిడ్ సమస్యలతో కుంగుబాటు మానసిక సమస్యలకు కారణాలు అనేకం. కోవిడ్ వల్ల, ఆపై తలెత్తిన ఒంటరితనం ప్రధాన కారణం. ఉద్యోగాలు, వ్యాపారాలను కోల్పోవడం, ప్రేమ వైఫల్యం, జీవితంపై అభద్రత తదితర కారణాలతో ప్రజలు తీవ్రంగా కలత చెందారు. బాధితుల్లో చిన్నపాటి మానసిక సమస్యలు 34 శాతం ఉండగా, మతి చలించడం వంటి తీవ్ర సమస్యకు లోనైనవారు 18.4 శాతం ఉన్నారు. మద్య వ్యసనం, ఓ మోస్తరు మానసిక సమస్యల కేసులు 11.2 శాతం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కౌన్సెలింగ్ సెంటర్లకు వరదలా కాల్స్ కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మానసిక కౌన్సెలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో కాల్స్ వచ్చాయి. 27 లక్షల మందికి పైగా ప్రజలు ఫోన్ చేసి ధైర్యంగా ఉండడానికి సాయం కోరారు. 2020–21 లో 9 లక్షల మంది సంప్రదించగా, ఈ ఏడాది 10 నెలల్లోనే 8.65 లక్షల మంది ఫోన్ చేశారు. దీనిని బట్టి కోవిడ్ తరువాత మానసిక సంఘర్షణ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. కోవిడ్ వేళ టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన మృతుల దృశ్యాలు మహిళలను ఎక్కువగా భయాందోళనకు గురిచేశాయి. బలవన్మరణాల బెడద బలవన్మరణాల బెడద 2021లో దేశవ్యాప్తంగా 1.64 లక్షలమంది ఆత్మహత్యకు పాల్పడగా, అందులో 18 ఏళ్లలోపు వారు 13,089 మంది ఉన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారు 37 వేలమంది ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలో 2021లో 13 వేలమంది ఆత్మహత్య చేసుకోగా, ఈ సమస్య ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు 3వ స్థానంలో ఉంది. నగరంలో 2,292 మంది ఆత్మహత్యకు ఒడిగట్టారు. మానసిక ఆరోగ్యంపై జాగృతి మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల్లో జాగృతం చేయాలి. మానసిక రోగుల పట్ల చిన్నచూపు తగదు అని నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి అన్నారు. మంచి అలవాట్లు ముఖ్యం నిమ్హాన్స్ మానసిక విజ్ఞాన విభాగ అధ్యాపకుడు డాక్టర్ మనోజ్కుమార్ శర్మ మాట్లాడుతూ సోయల్ మీడియాను అతిగా వినియోగించిన వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. దీనికి బదులు బయట వాకింగ్, వ్యాయామం చేయడం, అందరితో కలవడం, ఖాళీగా లేకుండా చూసుకోవడం ముఖ్యమని సూచించారు. (చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..) -
కష్టకాలంలో కంటికి రెప్పలా!
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చాలా స్పష్టంగా కనిపిస్తోందని, లాక్డౌన్ కాలంలో వ్యవసాయం మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. అయితే కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను ఆదుకుందని తెలిపింది. 2020 – 21 ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్లో 6.60 శాతం, మే నెలలో 17.85 శాతం మేర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినప్పటికీ అదే సమయంలో మచ్చుకు 8 పథకాల ద్వారా రూ.16,410.12 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సాయం అందించిందని పేర్కొంది. 2020–21లో జాతీయ వృద్ధి తిరోగమనంలో ఉండగా ఏపీ మాత్రం 1.58 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక తెలిపింది. 2020–21లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనా«థ్ బుధవారం శాసన సభకు సమర్పించారు. కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ... ► కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న 2020–21లో ఆంధ్రప్రదేశ్ రూ.9,86,611 కోట్ల జీఎస్డీపీని నమోదు చేసింది. గతంలో రాష్ట్రం ఏటా పది శాతానికి పైగా వృద్ధి రేటు సాధించగా కోవిడ్ కారణంగా 2020–21లో మాత్రం 1.58 శాతం వృద్ధి రేటు నమోదైంది. ► కోవిడ్తో ఆర్థిక సంక్షోభం వల్ల వ్యవసాయం మినహా మిగిలిన రంగాలు దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే 2020–21లో నెలవారీ రెవెన్యూ రాబడులు తగ్గిపోయి వ్యయం పెరిగింది. ► రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2020 ఏప్రిల్లో 6.60 శాతం, మే నెలలో 17.85 శాతం తగ్గాయి. పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉన్న జూన్, జూలై, అక్టోబర్లో మాత్రం పన్ను బదిలీలతో రాబడులు పెరిగాయి. కోవిడ్తో పోరాడేందుకు కేంద్రం నుంచి రూ.580.25 కోట్ల గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వం పొందింది. ► వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పద్దుల కింద కోవిడ్ సహాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.337.25 కోట్ల రెవెన్యూ వ్యయం చూపించింది. 2020 ఏప్రిల్, మే ఆదాయ వ్యయాలను విశ్లేషించగా ఆ రెండు నెలల్లోనే కోవిడ్ మహమ్మారి సమయంలో లబ్ధిదారులకు సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టినట్లు స్పష్టం అవుతోంది. జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర విపత్తుల నిధి నుంచి రెండు నెలల్లోనే రూ.1,343.28 కోట్లు ఖర్చు చేసింది. ► కోవిడ్తో 2020–21లో జాతీయ జీడీపీ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో వృద్ధి సాధించింది. దేశ జీడీపీ –2.97 శాతంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధి రేటు 1.58 శాతంగా ఉంది. వృద్ధి రేటు తగ్గుదలకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో పరిశ్రమలు, సేవా రంగాలు కుదేలు కావడమే కారణం. ఉద్యాన పంటల వృద్ధితో 2020–21లో వ్యవసాయ రంగం 8.80 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అనంతరం పశుగణన, మత్స్య శాఖల్లో గణనీయమైన వృద్ది జరిగింది. వ్యవసాయ మినహా మిగతా రంగాల్లో వృద్ది రేటు తక్కువగా నమోదైంది. -
చస్తే చావండి.. బయటకు మాత్రం పోనివ్వం!
వైరల్: ఈ వీడియో చూస్తే ఇంత దుర్మార్గమా? అని ఎవరైనా అనకుండా ఉండలేరు. ఒకవైపు ప్రకంపనలు వస్తుంటే.. భయంతో జనాలు పరుగులు తీయకుండా ఉంటారా?. కానీ, ఏం జరిగినా బయటకు పంపేదే లేదని వాళ్లను అడ్డుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుని చాలాకాలమే అవుతోంది. అయితే.. చైనాలో జీరో-కొవిడ్ పాలసీ కఠినాతీకఠినంగా అమలు అవుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు టెస్టింగ్.. ఐసోలేషన్ను ఇంకా కొనసాగిస్తున్నారు అక్కడ. ఆ దెబ్బకు జనాలు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా.. మరో దారుణం బయటపడింది. చైనాలో సోమవారం రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 2017 తర్వాత సిచువాన్ ప్రావిన్స్లో సంభవించిన భారీ భూకంపం ఇదే. కొండచరియలు ఉండే ప్రాంతం కావడంతో భారీగానే నష్టం వాటిల్లింది. కనీసం 50 మంది దాకా మరణించగా.. 100 మందికి పైగా గాయాలయ్యాయి. At least 46 people killed after strong earthquake hits China's Sichuan province - Xinhua#Chinaearthquake pic.twitter.com/WWADoioVrX — Rani joshi (@RaniJoshi16) September 5, 2022 成都一小区志愿者阻拦因地震跑出屋的市民,居民:我们就该等死? 求生逃生是本能,中共的体制已经让这些人没有了本能,只有服从。#四川 #四川地震 #成都 #防疫 pic.twitter.com/OeHnZa2fdj — Sylvia (@Sylvia9988777) September 6, 2022 樱花【时事要闻】 #四川 大白拦着,不给出去 #地震 https://t.co/ozQg4DQZ7K pic.twitter.com/FDa2LOL8Ee — 荣耀678(意农🇭🇺) (@Antonio55184671) September 6, 2022 అయితే భూకంపం సమయంలోనూ లాక్డౌన్, ఐసోలేషన్లో ఉన్నవాళ్లను బయటకు వదల్లేదు ఆరోగ్య సిబ్బంది. పైగా బిల్డింగ్ కూలితే ఇందులోనే చావాలే తప్ప.. బయటకు వెళ్లకూడదంటూ అడ్డుకున్న వీడియోలు కొన్ని నెట్లో వైరల్ అవుతోంది ఇప్పుడు. ఈ క్రమంలో కొందరితో సిబ్బంది దురుసుగా సైతం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చైనా ట్విటర్ హ్యాండిల్స్ నుంచే వైరల్ అవుతుండడం గమనార్హం. అయితే వీటిపై చైనా అధికారులు స్పందించాల్సి ఉంది. అంతేకాదు భూకంప బాధితులకు సాయాన్ని సైతం కరోనా టెస్టుల క్లియరెన్స్ తర్వాత ఇస్తామని అధికారులు చెప్తున్నారంటే.. పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో పలు నగరాల్లో లక్షల మంది ఇంకా కరోనా కట్టడిలోనే ఉండిపోయారు. ఇదీ చదవండి: మీజిల్స్ విజృంభణ.. 700 మంది చిన్నారుల మృతి -
కుట్ర సిద్ధాంతం వారి పనేనా?
లాక్డౌన్: దానివల్ల ఉద్యోగం పోయింది / ఆదాయం తగ్గింది. బయటకు వెళ్లే వీలు లేదు. చేతిలో సెల్ ఫోన్. ఈజీ లోన్ అంటూ ప్రకటన. క్లిక్ చేశారు. దొరికి పోయారు. చక్రవడ్డీ .. అపరాధ రుసుము ఇది అందరికీ ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ రుణ యాప్లకు ఈ విషయం ముందే ఎలా తెలుసు? ఇలా లాక్ డౌన్ వస్తుందని జనాలు ఇంట్లో చిక్కుబడి బతకడం కోసం అప్పు చేయాల్సి వస్తుందని ముందుగానే పసిగట్టాయా? ఎప్పటినుంచి ఈ రుణ అప్ ల ప్లానింగ్ జరిగింది ? స్కూల్స్ తెరుచుకున్నాయి. ఆన్లైన్ ఎడ్యు కంపెనీలు దివాళా బాట పట్టాయి. అంటే స్కూల్ మూసివున్నంత కాలం వీరికి సిరుల పంట. అది ఓకే. 2020 లో అందరం ఏమనుకొన్నాము ? ఒకటి రెండు నెలలు స్కూల్స్ మూత. అటుపై తెరుచుకొంటాయి అని కదా? స్కూల్స్ రెండేళ్లు తెరవరని ఆన్లైన్ ఎడ్యు కంపెనీలకు ముందే తెలుసా ? రెండు నెలలకు అయితే పెట్టుబడులు రావు కదా. పిల్లల కోసం కరోనా వస్తుందనే ప్రచారం , కరోనా సోకితే పిల్లలకు కవాసకి వస్తుందని లాంటి వార్తలు , ప్రచారం యాదృచ్చికం గా ప్రజల హితం కోరి వచ్చిందా ? లేక ఆన్లైన్ ఎడ్యు కంపెనీల డబ్బు పలికించిందా ? కరోనాకు ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. అయినా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా చాలా మటుకు వర్క్ ఫ్రొం హోమ్ మోడ్ లోనే. సరే వారి ఇష్టం. కానీ లాక్ డౌన్ లాక్ డౌన్ అంటూ జరిగిన ప్రచారం వెనుక వారి పాత్ర ఏమీ లేదా ? “ లాక్ డౌన్ వల్ల కొంప కొల్లేరు. నీవు ఇంట్లో నక్కి నక్కి దాక్కున్నా అది సోకుతుంది. అందరికీ ఒక సారి సోకితేనే దానికి పరిష్కారం. మరో మార్గమే లేదు. సోకితే అది మరణానికి దారి తీయకుండా ఇమ్మ్యూనిటిని బలోపేతం చెయ్యాలి. భయపెట్టడం అంటే చంపడమే “ అని మొదటి నుంచి చెబుతున్నా. మరణ మృదంగం ! లాక్ డౌన్ కావాలి ! పిల్లలకు కరోనా లాంటి ప్రచారం ప్రజాహితం కోసం జరిగిందా ???? రుణ యాప్లు, ఆన్లైన్ ఎడ్యు కంపెనీలు , సాఫ్ట్వేర్ కంపెనీలు , ఫార్మా కంపెనీలు, బడా ఆసుపత్రులు పాపం పుణ్యం తెలియని అమాయక జీవులేనా ? కుట్ర సిద్ధాంతం వారి పనేనా ? ఏది నిజం ? ఏది అబద్దం ? కుట్రనా ? మతిభ్రమణా? ఆలోచించండి. - వాసిరెడ్డి అమర్నాథ్ ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
లాక్డౌన్లో కూలీలను విమానంలో పంపించిన రైతు ఆత్మహత్య
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్లో తన వద్ద పని చేసే కార్మికులను విమానంలో స్వరాష్ట్రానికి పంపించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రైతు పప్పన్ సింగ్ గెహ్లోట్(55) ఇక లేరు. ఢిల్లీలోని ఓ ఆలయంలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలిపోరా ప్రాంతంలోని తన ఇంటి ఎదురుగా ఉన్న గుడిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని పేరొన్న సూసైడ్ నోట్ లభించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పెంపించినట్లు వెల్లడించారు. ఢిల్లీ అలిపొరా ప్రాంతంలో పుట్టగొడుగుల సాగు చేస్తారు పప్పన్ సింగ్. ఆయన వద్ద బిహార్కు చెందిన పలువురు కార్మికులు పని చేస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి కట్టడి కారణంగా విధించిన లాక్డౌన్తో కార్మికులు స్వరాష్ట్రం చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తన వద్ద పని చేసే కార్మికులకు విమాన టికెట్లు కొనుగోలు చేసి బిహార్కు పంపించారు పప్పన్ సింగ్. దీంతో దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ తర్వాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి లాక్డౌన్ ఎత్తివేసిన క్రమంలో మళ్లీ విమానంలోనే వారిని తిరిగి పని ప్రదేశానికి తీసుకొచ్చారు రైతు. ఇదీ చదవండి: నితీశ్ బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు -
అక్కడ లాక్డౌన్ అంటే చాలు జనాలు జంప్! వీడియో వైరల్
చైనా: ప్రంపంచ దేశాలన్నింటిని గత రెండేళ్లుగా పట్టిపీడించిన కరోనా మహమ్మారీ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ విమాన సర్వీసులను పలు చోట్ల పునరుద్ధరించారు కూడా. చైనాలో మాత్రం కరోనా పగ సాధిస్తున్నట్లుగా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో చైనా అధికారులు ప్రజలను వరుస లాక్డౌన్లతో నిర్బంధించి, కఠిన ఆంక్షలు విధించారు. జీరో కోవిడ్ వ్యూహం ప్రజల్లో తీవ్ర అసహనానని రేకిత్తించింది. అది ఎంతలా మారిందంటే వారు లాక్డౌన్ అని చెబితే చాలు పరుగులు తీసి బయటకు వచ్చేసేంతగా విసిగిపోయారు. ఈ మేరకు చైనాలో ఒక ఐకియా స్టోర్లో కరోనాకి కేసుల ట్రేసింగ్లో భాగంగా స్టోర్ లాక్డౌన్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇలా రాగానే ఒక్కసారిగా ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆఖరికి సెక్యూరిటీ సిబ్బంది డోర్లు మూసేందుకు యత్నించినా.. బాబాయ్ ఇక మా వల్ల కాదంటూ దూకాణంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా గుంపులుగా తోసుకుంటూ బయటకి పరుగులు తీశారు. ఇటీవలే టిబెట్లోని లాసా నుంచి షాంఘై వచ్చిన ఆరేళ్ల బాలుడి కరోనా పాజిటివ్గా తేలడంతో ఈ స్టోర్ని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ బాలుడికి కరోనా రావడానికి ముందు ఆ ఐకియా దుకాణంలోని సుమారు 400 మందితో టచ్లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ఐకియా స్టోర్ని లాక్డౌన్ చేయాని అధికారులు నిర్ణయించి ప్రజలకు అనౌన్సమెంట్ ఇచ్చారు. అంతే ఒక్కసారిగా ప్రజల్లోంచి అసహనం కట్టలు తెంచుకుని బయటకు వచ్చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు, అధికారులు వారిని బయటకు రాకుండా నియంత్రించ లేకపోయారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Yesterday, an abnormal health code case was presented at an IKEA in Shanghai, & the entire mall was suddenly blocked🥶 Some ppl forced their way out for fear of being sent to concentration camps, but there is actually nowhere to escape under #AmazingChina’s digital surveillance pic.twitter.com/MWpbTOJ3kz — Donna Wong💛🖤 (@DonnaWongHK) August 14, 2022 (చదవండి: చైనా కక్ష పూరిత చర్య! తైవాన్ అధికారుల పై ఆంక్షల మోత) -
రాకాసిలా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారీ... మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు
Covid outbreak Tropical Sanya, ‘China’s Hawaii’: చైనాలో మళ్లీ కరోనా మహమ్మారీ రాకాసిలా విరుచుకుపడుతుంది. గత కొన్ని రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టిందని ఆనందంగా ఊపిరి పీల్చుకునేలోపు మళ్లీ పగపట్టినట్టుగా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ మేరకు చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ రాజధాని సాన్యాలో అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదీగాక సాన్యా పర్యాటక హాట్స్పాట్గా ప్రసిద్ధి. దీంతో ప్రస్తుతం అక్కడ సుమారు 80 వేల మంది దాక పర్యాటకులు ఉన్నారు. ఐతే వేగంగా విజృంభిస్తున్న ఈ కరోనా కేసుల దృష్ట్యా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో సాముహికంగా ప్రజలు తిరగడాన్ని నిషేధించారు. శనివారం ఉదయం నుంచి ప్రజల కదలికలను నియంత్రించడమే కాకుండా రెస్టారెంట్లు, బార్లు, నగరంలోని ప్రసిద్ధ డ్యూటీ-ఫ్రీ మాల్స్తో సహా చాలా బహిరంగ వేదికలను మూసివేయమని ఆదేశించారు. అంతేగాదు ప్రసుతం నగరంలో నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకుని పర్యాటకులు తమకు సహకరించాలని కోరారు. పర్యాటకులు సాన్యా నగరాన్ని విడిచిపెట్టడం కోసం సకాలంలో కరోనా టెస్టులు చేయించుకోవడం తప్పనసరి అని చెప్పారు. అలాగే విమానం ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎంతమంది సాధ్యమైనంత తొందరగా సాన్యా నగరాన్ని వదిలి వెళ్లగలరనేది చెప్పలేనని తెలిపారు. ప్రస్తుతం సాన్యాలో ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 455 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నగరంలో మాస్ టెస్టింగ్ జరుగుతోందని, కనీసం ఆగస్ట్ 8 వరకు బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని నివాసితులకు సూచించడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పౌరులు కూడా నగరంలోకి ప్రవేశించవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు కట్టడి చేసే దిశగా మళ్లీ కఠిన లాక్ డౌన్ ఆంక్షలు విధించనున్నట్లు నొక్కి చెప్పారు. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్లో ఆహుతైన వాహనాలు) -
ఒకరికి కరోనా పాజిటివ్.. లాక్డౌన్లోకి 3 లక్షల మంది!
బీజింగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా.. ఓ చిన్న నగరంలో మంగళవారం ఒకరికి కోవిడ్ పాజిటివ్గా తేలటం వల్ల ఆ నగరం మొత్తం లాక్డౌన్ విధించింది జిన్పింగ్ ప్రభుత్వం. దీంతో 3 లక్షల మందికిపైగా లాక్డౌన్లోకి వెళ్లాల్సి వచ్చింది. హెనాన్ ప్రావిన్స్లోని వుగాంగ్ నగరంలో సోమవారం ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వ్యాధిని అరికట్టేందుకంటూ మూడు రోజుల లాక్డౌన్ విధించారు అధికారులు. నగరంలోని 3,20,000 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలోని ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను స్థానిక ప్రభుత్వ సంస్థలు అందిస్తాయని తెలిపారు. మరోవైపు.. అత్యవసర పరిస్థితిలో కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆంక్షల చట్రంలో 25 కోట్ల మంది చైనాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్ బ్యాంక్ నోమురా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మంగళవారం 347 స్థానిక కేసులు నమోదయ్యాయి. అందులో 80 శాతానికిపైగా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇదీ చూడండి: ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకుతోంది -
చైనాలో లాక్డౌన్.. చైన్ సరఫరాలో విఘాతం.. ఇండియాలో ఇబ్బందులు
న్యూఢిల్లీ: ఇటీవల చైనాలోని లాక్డౌన్ల కారణంగా సరఫరా చైన్కు విఘాతాలు ఏర్పడినట్లు దేశీ ఆటోరంగ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా వెల్లడించింది. సరఫరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేసింది. దీంతో ప్రొడక్టులను డెలివరీ చేయడంలో సవాళ్లు ఎదుర్కొన్నట్లు తెలియజేసింది. ఫలితంగా కొన్ని ప్లాంట్లలో లేదా మొత్తంగా ఉత్పత్తి నిలిపివేయవలసిన పరిస్థితులు తలెత్తినట్లు వెల్లడించింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) వార్షిక నివేదికలో ఇంకా పలు అంశాలు ప్రస్తావించింది. దేశం నుంచి కీలక విడిభాగాల సరఫరాలు లభించకుంటే ఉత్పత్తి నిలిచిపోయేదని వివరించింది. కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్త సెమీకండక్టర్ కొరత నేపథ్యంలో పోటీ సంస్థలతో పోలిస్తే టాటా మోటార్స్ అత్యధికంగా ప్రభావితమైనట్లు తెలియజేసింది. కోవిడ్–19 కట్టడికి చైనాలో విధించిన లాక్డౌన్లతో అక్కడి కొన్ని ప్రాంతాలలో డీలర్షిప్లు తాత్కాలికంగా మూత పడినట్లు వెల్లడించింది. చదవండి: పాపం.. అప్పుల ఊబిలో రెవలాన్! -
నాలుగు గోడల మధ్య నరకాలు నడిచొచ్చిన చోట...
కొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి... కొన్ని చిత్రాల చిత్రజైత్రయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ‘కేజ్డ్’ అనే లఘుచిత్రం కూడా ఇలాంటిదే! దీనిలో ఎలాంటి కమర్షియల్ గిమ్మిక్కులు లేవు... కన్నీటిబొట్లు ఉన్నాయి. వాటిలోకి ఒకసారి తొంగిచూస్తే మన ఊరు,వాడ, ఇల్లు కనిపిస్తాయి. కరోనా కాలంలో... ముఖ్యంగా లాక్డౌన్ టైమ్లో... ఒక ఊళ్లో ఒక భర్త: ‘చికెన్ బిర్యానీ వండిపెట్టమని రెండురోజుల నుంచి చెబుతున్నాను. పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి టైమ్ ఉంటుందిగానీ నేను అడిగింది చేసి పెట్టడానికి మాత్రం టైమ్ ఉండదు. మగాడికి విలువ లేకుండా పోయింది’ మరో ఊళ్లో ఒక భర్త: ఈయన ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉండడమే ‘కుటుంబ సంక్షేమం’ అనుకుంటారు కుటుంబసభ్యులు. ఈ భర్త చాదస్తాల చౌరస్తా. ‘ఇది ఇల్లా అడవా? ఏంచేస్తున్నావు? ఎక్కడి వస్తువులు అక్కడే పని ఉన్నాయి’ అని గర్జించే ఈ భర్తకి టీవికి ఠీవీగా ముఖం అప్పగించడం తప్ప చిన్నచిన్న పనులలో కూడా భార్యకు సహాయం చేయడానికి మనసు రాదు. ఇంకో ఊళ్లో ఇంకో భర్త: ఈయనకు ఏమాత్రం టైమ్ దొరికినా అత్తింటివాళ్లు బాకీపడ్డ అదనపు కట్నం గురించి అదేపనిగా గుర్తొస్తుంది. అలాంటిది లాక్డౌన్ పుణ్యమా అని అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. మాటలతోనే ఇంట్లో వరకట్న హింసను సృష్టించాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. లాక్డౌన్ టైమ్లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రకరకాల హింసలు ఎదుర్కొన్నారు. ఈ హింసపై ఐక్యరాజ్య సమితి సాధికారికమైన నివేదికను ప్రచురించింది. దీనిని ఆధారం చేసుకొని అమెరికాలో స్థిరపడిన మలయాళీ డైరెక్టర్ లీజా మాథ్యూ ‘కేజ్డ్’ పేరుతో షార్ట్ఫిల్మ్ రూపొందించింది. లాక్డౌన్ టైమ్లో అక్షరజ్ఞానం లేని మహిళలతో పాటు బాగా చదువుకున్న మహిళలు, ఇంటిపనులకే పరిమితమైన వారితో పాటు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కున్న మానసిక, శారీరక, భావోద్వేగ హింసకు ‘కేజ్డ్’ అద్దం పడుతుంది. చిత్రంలో సంద్ర, జయ, విను, క్లైర్ ప్రధాన పాత్రలు. ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని వివిధ రకాల హింస బాధితులకు వీరు ప్రతీకలు. నిజానికి వీరు చిత్రం కోసం బాధితుల అవతారం ఎత్తిన వారు కాదు. నిజజీవితంలోనూ బాధితులే. సంద్ర, జయ, విను, క్లైర్ పాత్రలు పోషించిన సచిన్మై మేనన్, దివ్య సంతోష్, శిల్పఅరుణ్ విజయ్, రిలే పూల్లు భిన్నరకాల హింస బాధితులే. రిలే పూల్ విషయానికి వస్తే నిజజీవితంలోనూ ట్రాన్స్జండరే. ‘యువ అమెరికన్లపై హింస జరిగితే, తేరుకొని తిరిగిపోరాడతారు. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన కేసుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు. మానసికహింస భౌతికహింస కంటే తక్కువేమీ కాదు’ అంటుంది లీజా మాథ్యూ. కొట్టాయం (కేరళ)కు చెందిన లీజా మాథ్యూ గత పదిసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది. పద్దెనిమిది నిమిషాల నిడివి గల ‘కేజ్డ్’ మానసిక హింస నుంచి లైంగిక హింస వరకు మహిళలు ఎదుర్కొన్న రకరకాల హింసలను బయటపెడుతుంది. మొన్న మొన్నటి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్తో సహా లండన్ ఇండీ షార్ట్ఫిల్మ్ ఫెస్టివల్, నయాగరా ఫాల్స్ షార్ట్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్... ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శితమై రకరకాల ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. -
మమ్మల్ని బంధించకండి!: చైనా ప్రజల గగ్గోలు
Why Lock Us In A Cage?: చైనా గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారితో చిగురుటాకులా వణికిపోయింది. జీరో కోవిడ్ పాలసీని విచ్చిన్నం చేస్తూ అనుహ్యంగా పెరుగుతున్న కేసులతో చైనా బెంబేలెత్తిపోయింది. బాబోయ్ హోం క్వారంటైన్లో ఉండమని ప్రజలు గగ్గోలు పెడుతున్నా కఠిన ఆంక్షలు కొరడాని ఝళిపించి మరీ ప్రజలను నిర్భంధించింది. ఐతే గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో చైనా వాసులు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలే వరుస లాక్డౌన్లతో మగ్గిపోయిన చైనా వాసులను ఆ పేరు వింటేనే హడలిపోతున్నారు. ఇక తమ వల్ల కాదని తేల్చి చేప్పేశారు కూడా. కానీ చైనా అధికారులు మాత్రం కరోనా తగ్గిందని బహిరంగా ప్రదేశాల్లో తిరిగేతే ఊరుకోమని గట్టిగా చెప్పేశారు. ఈ మేరకు చైనా కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు సడలించినప్పటికీ ఇంకా వేలాది మంది నిర్బంధంలోనే ఉన్నారు. 'ఇక మా వల్ల కాదు, ఇంకా ఎన్నాళ్లు మేము ఇలా బోనుల్లోని జంతువుల మాదిరి ఉండాలంటూ' ప్రజలు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. కేసులు పెరగకూడదంటే ఆంక్షలు తప్పదనే నొక్కి చెబుతోంది. ప్రస్తుతం చైనాలో అధికారులు కొన్నిచోట్ల ఆంక్షలు సడలించటంతో ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వెళ్తున్నారు. అలాగే పాఠశాలలను కూడా దశల వారీగా తిరిగి ప్రారంభించారు. ఐతే కేసుల శాతం తక్కువగా ఉన్నప్రాంతాల్లోనే ఈ ఆంక్షలను సడలించారు. కానీ షాంఘైలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర కరోనా ఆంక్షలు అమలు చేస్తోంది. ఒక పక్క ప్రజలు భరించలేమని చెబుతున్నా...చైనా మాత్రం కేసులు పెరగకూడదనే ఇలా చేస్తున్నామంటూ బలవంతంగా లాక్డౌన్ ఆంక్షలు రుద్దుతోంది. (చదవండి: నూపుర్ కామెంట్లతో ముదురుతున్న వివాదం.. ‘భారత ఉత్పత్తులు మాకొద్దు!’) -
చిన్నారుల చదువుపై కోవిడ్ దెబ్బ.. నీతి ఆయోగ్ అధ్యయనం
సాక్షి, అమరావతి: దేశంలోని మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల చదువులపై కోవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రధానంగా లాక్డౌన్ సమయంలో ఈ వయస్సులోని పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాల్లో ఏర్పడిన అంతరాయాలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. ఆ సమయంలో దేశంలోని అన్ని పాఠశాలలు, ప్రీస్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. చిన్న పిల్లల వ్యక్తిగత విద్యను పూర్తిగా నిలిపేయడంతో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల ప్రారంభ అభ్యాసానికి తీవ్ర అంతరాయం కలిగిందని అందులో తేలింది. ఈ వివరాలను డిసెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య సేకరించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. అందుబాటులోలేని దూరవిద్య ఇక కోవిడ్ సంక్షోభ సమయంలో పిల్లలు చదువుకోవడానికి వీలుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏడాదిపాటు దూరవిద్య అందించేందుకు చర్యలను చేపట్టాయి. ఆన్లైన్ ప్లాట్ఫాంలు, టీవీ, రేడియో ద్వారా ఈ ప్రయత్నాలు జరిగాయి. అయితే.. దేశంలోని చాలా కుటుంబాలకు ఈ దూరవిద్య అందలేలేని అధ్యయనం పేర్కొంది. 42 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే కొంతమేర అభ్యసించే అవకాశం కలిగిందని, మిగతా కుటుంబాల పిల్లలకు లేదని తెలిపింది. ఉదా.. కోవిడ్కు ముందు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 84 శాతం మంది స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేరారని.. అయితే సంక్షోభ సమయంలో ఏపీలో కేవలం 29 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే దూరవిద్య అందిందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, రాజస్థాన్లో 23 శాతం మంది, తమిళనాడులో 17 శాతం మంది కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. అయితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య దూరవిద్య సౌకర్యంలో అంతరాలున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో దూర విద్య ఎక్కువ శాతం పిల్లలకు అందుబాటులో ఉండగా కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. వీడియోల వైపు పిల్లల మొగ్గు 2020 మార్చి కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు వీడియోలు చూడటానికి అలవాటుపడ్డారని.. టీవీ, ఫోన్ల వినియోగంతోపాటు కంప్యూటర్లో గేమ్లూ ఆడారని 41 శాతం పట్టణ తల్లిదండ్రులు తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొన్నట్లు 90 శాతం మంది ఫ్రంట్లైన్ వర్కర్లు చెప్పారు. తమిళనాడులో 66 శాతం మంది, ఆంధ్రప్రదేశ్లో 64 శాతం, ఒడిశాలో 60 శాతం మంది 2021 జనవరి, ఫిబ్రవరిలో అత్యధిక ఒత్తిడికి లోనైనట్లు వారు వెల్లడించారు. పిల్లల వైద్యంపై కూడా.. మరోవైపు.. లాక్డౌన్ కారణంగా 2020 మార్చి–మే నెలల మధ్య తల్లి, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్య సేవలు కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఆసుపత్రుల్లో కాన్పులు 21 శాతం తగ్గిపోగా ఆ స్థానంలో ఇంటివద్దే జరిగాయని.. అంతేకాక, ఆ సమయంలో గర్భిణీల ఆరోగ్య పరీక్షలూ నిలిచిపోయాయని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఇక కోవిడ్ తొలినాళ్లలో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంలో కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ 86 శాతం పిల్లలకు వేశారు. పట్టణ ప్రాంతాల్లో 90 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 85 కుటుంబాల్లోని పిల్లలకు ఇవి అందినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో 94 శాతం, పట్టణ ప్రాంతాల్లో 93 శాతం కుటుంబాలు కోవిడ్ సమయంలో తమ పిల్లలకు ఇతర వైద్య సదుపాయాలు అందాయని తెలిపారు. -
చికెన్ ధర రూ.300 దాటినా అదే తీరు.. ఇలా అయితే కష్టమే! బ్రాయిలర్ లాక్డౌన్?
ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కార్పొరేట్ కంపెనీలపై కోళ్ల పెంపకం రైతులు కన్నెర్ర చేస్తున్నారు. గ్రోయింగ్ చార్జీలు పెంచాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. కంపెనీలతో అమీతుమీ తేల్చుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని నిలుపుదల చేసి, లాక్డౌన్ చేపట్టాలని ఈనెల 18న కామవరపుకోటలో జరిగిన సమావేశంలో రైతులు నిర్ణయించారు. ఏలూ రు జిల్లా ద్వారకాతిరుమల మండల రైతులు మా త్రం ఆ రోజు నుంచే లాక్డౌన్ చేపట్టి, కంపెనీలపై యుద్ధం ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికను రూపొందించేందుకు బ్రాయిలర్ రైతుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ జిల్లా అన్నవరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. చదవండి👉🏼 రైతు బజార్లో టమాట పంపిణీ ప్రారంభం మార్కెట్పై పట్టు సాధించి.. గతంలో రైతులు సొంత ఖర్చుతో స్వయంగా కోళ్లను పెంచి, మార్కెట్లో హోల్సేల్గా అమ్ముకునేవారు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. కోడి పిల్లలను, దాణాను, మందులను రైతులకు అందించి, వాటిని పెంచినందుకు కిలోకు రూ.4.50 గ్రోయింగ్ చార్జీగా చెల్లిస్తున్నాయి. మొదట్లో రైతు చెప్పిన ధరకు కోళ్లను కొని మార్కెటింగ్ చేసిన వ్యాపారులు, క్రమంగా మార్కెట్పై పట్టు సాధించి హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయాయి. కొన్ని హేచరీలు ఏకంగా కంపెనీలుగా మారాయి. వారి వద్ద కోడి పిల్లలు, దాణాను తీసుకుని, తిరిగి కోళ్లను వారికే అమ్మే పరిస్థితిని తెచ్చాయి. చికెన్ ధర రూ.300 దాటినా.. మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 దాటినా.. కోళ్లను పెంచే రైతులకు దక్కేది మాత్రం కిలోకు రూ.4.50 మాత్రమే. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ శక్తులు కోళ్ల పరిశ్రమలను గుప్పెట్లో పెట్టుకుని హోల్సేల్, రిటైల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రోయింగ్ చార్జీలు పెంచకపోవడంతో, ఏటా వందలాది మంది రైతులు కోళ్ల పెంపకానికి స్వస్తి చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ విధించడంతో ఆ ప్రభావం మార్కెట్పై పడి, బ్రాయిలర్ కోళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు ఏపీలో లాక్డౌన్ చేపడితే కోళ్ల కొరతతో పాటు, చికెన్ ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. చదవండి👉🏾 సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి కోట్లలో వ్యాపారం.. లక్షల మందికి జీవనాధారం రాష్ట్రంలో సుమారు 4 వేలకు పైగా బ్రాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. ఒక్కో బ్యాచ్ నుంచి దాదాపు 3.05 కోట్లకు పైగా కోళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వందల కోట్లలో జరుగుతున్న వ్యాపారంపై లక్షలాది మంది రైతులు, వ్యాపారులు, కూలీలు జీవనాధారాన్ని పొందుతున్నారు. కోడిపిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కూలీలు, వ్యాక్సిన్ల ఖర్చు, విద్యుత్ బిల్లులు, ఊక, కోళ్ల లిఫ్టింగ్ తదితర ఖర్చులన్నీ రైతే భరించాల్సి వస్తోంది. కోడి పిల్లలు, దాణా, మందులు, అడ్మినిస్ట్రేషన్ చార్జీల పేరుతో సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లిఫ్టింగ్ సమయంలో లెక్కగడుతున్నారు. కోడి కేజీ బరువు పెరగడానికి రూ.95 మించి ఖర్చయితే ఆ భారాన్ని రైతుపైనే మోపుతున్నారు. ఖాళీగా ఫారాలు ద్వారకాతిరుమల మండలంలో మొత్తం 80 కోళ్ల ఫారాలకు గాను లాక్డౌన్ కారణంగా 70 ఫారాలు ఇప్పటికే మూతపడ్డాయి. మిగిలిన 10 ఫారాల్లోని కోళ్లను లిఫ్టింగ్ చేసిన తరువాత మూసివేస్తామని రైతులు చెబుతున్నారు. మూతపడ్డ కోళ్ల ఫారాల వద్ద అన్ని పరికరాలూ మూలనపడ్డాయి. పెట్టుబడులు కూడా రావడం లేదు బ్రాయిలర్ కోళ్ల పెంపకంతో అప్పులపాలయ్యాను. కార్పొరేట్ కంపెనీలు గత పదేళ్ల క్రితం నుంచి గ్రోయింగ్ చార్జీని పెంచలేదు. కూలీల ఖర్చులు, ఊక, విద్యుత్ బిల్లులు, రుణాలు, వడ్డీలు ఇతరత్రా ఖర్చులన్నీ విపరీతంగా పెరిగాయి. కంపెనీ వారు కిలోకి ఇచ్చే రూ.4.50 ఏ మూలకూ సరిపోవడం లేదు. – యలమర్తి రామకృష్ణ, రైతు, మెట్టగూడెం, ద్వారకాతిరుమల మండలం లాక్డౌన్ తప్పదు 10 వేల కోడి పిల్లల బ్యాచ్ను పెంచడానికి రైతుకు అయ్యే పెట్టుబడి రూ.1,72,600 అయితే కంపెనీ వారు ఇచ్చేది కేవలం రూ.94,050 మాత్రమే. అంటే ఒక బ్యాచ్కి రైతుకు రూ.78,550 నష్టం వస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించాం. గ్రోయింగ్ చార్జీని రూ.12కు పెంచడంతో పాటు మరో 17 డిమాండ్లను నెరవేర్చాలి. – చిలుకూరి ధర్మారావు, బ్రాయిలర్ రైతు సంఘం రాష్ట్ర సభ్యుడు, ద్వారకాతిరుమల చదవండి👇 క్వింటాల్ పసుపు రూ. 6,850 ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి -
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక వారంలో 4 రోజులే పని?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో పెట్రోలు, డీజిల్ కొరత నానాటికీ పెరుగుతోంది. దీంతోపాటు వాటి ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు పాక్ ప్రభుత్వం సరిక్తొత ప్లాన్ను అమలు చేయాలని భావిస్తోంది. ఉద్యోగుల పని దినాలను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజల్ కొరత సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందాలని పాక్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు పాక్ పత్రిక డాన్ సోమవారం ఓ కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, దేశంలో వినియోగం పెరగడం, దిగుమతి వ్యయం పెరగడం వంటి కారణాలతో పాక్ ఈ నిర్ణయం తీసుకోనుందట. ఈ పద్ధతిని అనుసరించి ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఆలోచన అమలు ద్వారా వార్షికంగా $2.7 బిలియన్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని పాక్ అంచనా వేసింది. దీనితో, సగటు పీఓఎల్ ఆదా నెలకు 12.2 కోట్లుగా అంచనా వేస్తూ, ఇది సంవత్సరానికి $1.5 బిలియన్లకు చేరుకోవచ్చని భావిస్తోంది. అంతేకాక 90 శాతం నూనె వాడకం పనిదినాల్లోనూ, మిగిలిన 10 శాతం సెలవు దినాల్లోనూ నెలలో వినియోగిస్తుండటం గమనార్హం. దీంతో వారానికి 4 రోజులే పని దినాలకే పాక్ ప్రభుత్వం మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Russian Army Dog Max: చనిపోయే స్థితిలో రష్యా ‘మాక్స్’.. ప్రాణాలు నిలిపిన ఉక్రెయిన్కు సాయం -
రూ. 3వేల కోసం థియేటర్లో పనిచేశా: స్టార్ హీరో మాజీ భార్య
Kamal Haasan Ex Wife Sarika About Her Financial Status: ఒకప్పుడు ఆమె స్టార్ హీరో భార్య, ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ తల్లి.. అయినా ఆమెకు మహమ్మారి కాలంలో ఆర్థిక సమస్యలు తప్పలేదు. లాక్డౌన్ సమయంలో కేవలం 3వేల కోసం ఆమె థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశానని చెప్పడం అందరిని షాక్కు గురిచేస్తోంది. ఆమె మరెవరో కాదు లెజెండరి నటుడు, హీరో కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్ తల్లి సారిక. సారిక కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ కమల్ హాసన్ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది. చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే.. ఇక ఆయనతో విడాకుల అనంతరం తిరిగి ముంబైకి వచ్చిన ఆమె మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెజాన్ ప్రైం ‘మోడ్రన్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్ రింకిల్స్’ అనే పార్ట్లో నటించింది. ఇందులో ఆమె నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరోనా కాలంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలపై నొరు విప్పింది సారిక. ‘కమల్తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చాయి. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్ చేయడం ప్రారంభించాను. అలా ఓ రోజు చూస్తే లైఫ్ రోటీన్గా అనిపించింది. చదవండి: బిగ్బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్? ఉదయం లేవడం వర్క్కు వెళ్లడం.. మళ్లీ రాత్రికి పడుకోవడం. కొత్తగా ఏం అనిపించడం లేదు. దీంతో ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్డౌన్లు వచ్చాయి. దీంతో అయిదేళ్లు ఈజీగా గడిచిపోయాయి. ఈ పాండమిక్ సమయంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్ పూర్తిగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశా. కానీ వారు కేవలం 2000 నుంచి 2700 వరకు మాత్రమే చెల్లించేవారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించడమే మంచిదని నిర్ణయించుకున్నా’ అంటూ సారిక చెప్పుకొచ్చింది. చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో హాట్టాపిక్గా నిలిచాయి. ఓ స్టార్ హీరోయిన్ తల్లి అయ్యిండి కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కమల్-సారికలు కొంతకాలం రిలేషన్లో ఉన్న అనంతరం 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్లు జన్మించారు. ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న కమల్-సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు. -
ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం
ప్యాంగ్యాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచ నలుమూలల వ్యాపించి వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో కూడా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వార్త ప్రపంచ దేశాలకు కొంత ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. కానీ తాజాగా ఆ దేశంలో కూడా కరోనా కేసు నమోదు అయినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చిన కిమ్ ప్రభుత్వం తాజాగా గురువారం( మే 11) నాడు తొలి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు ప్రకటించింది. రాజధాని ప్యోంగ్యాంగ్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండగా, సదరు వ్యక్తుల నుంచి ఆదివారం నమూనాలు సేకరించారు. గురువారం ఆ ఫలితాలు రావడంతో వారికి ఓమిక్రాన్ వేరియంట్తో సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ వార్త తెలిసిన తక్షణమే ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. అందులో.. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ భూభాగంలోకి కొవిడ్-19 ప్రవేశించకుండా అడ్డుకోగలిగామని ఉత్తర కొరియా ఇన్నాళ్లు గర్వంగా చెప్పుకుంటూ వచ్చిన చివరికి తలవంచాల్సి వచ్చింది. ఇటీవల చైనాలో వైరస్ కేసులు వెలుగు చూసిన వెంటనే అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసి.. వర్తకులు, పర్యాటకులను సైతం దేశంలోకి రాకుండా చేసింది. అయినప్పటికీ ఒమిక్రాన్ కొరియాలో ప్రవేశించింది. చదవండి: China: చైనాలో మరో విమాన ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు రావడంతో -
టెస్లాకి షాకిచ్చిన షాంఘై!
ఎన్నో ఆశలతో చైనాలో టెస్లా కార్ల తయారీ కర్మాగారం స్థాపించిన ఈలాన్ మస్క్కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సప్లై చెయిన్ సమస్యలతో షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూత పడినట్టు సమాచారం. నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ మూత పడటం ఇది రెండోసారి. ఏషియా మార్కెట్పై కన్నెసిన ఈలాన్ మస్క్ వ్యూహాత్మక భాగస్వామిగా చైనాను ఎంచుకున్నాడు. షాంఘై సమీపంలో బిలియన్ డాలర్లు వెచ్చింది టెస్లా గిగా ఫ్యాక్టరీని నిర్మించాడు. ఇక్కడి నుంచి జపాన్, ఇండియా, ఇతర ఏషియా దేశాలకు ఎలక్ట్రిక్ కార్లు సప్లై చేయాలని భావించాడు. అయితే చైనాలో తయారైన వస్తువుల దిగుమతిపై భారీ సుంకాలు విధిస్తోంది ఇండియా. దీంతో ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియా విషయంలో ఈలాన్ మస్క్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓ వైపు మార్కెటింగ్ సమస్యలు చుట్టుముట్టగా షాంఘైలో కరోనా కేసులు పెరిగిపోవడం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. మార్చి చివరి నుంచి షాంఘైలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో అక్కడ లాక్డౌన్ అమలు చేసింది డ్రాగన్ ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల కర్మాగారం మూత పడక తప్పని పరిస్థితి నెలకొంది. 22 రోజుల పాటు ఈ గిగా ఫ్యాక్టరీ షట్డవున్ అయ్యింది. షాంఘైలో కొంత మేర పరిస్థితులు చక్కబడటంతో 2022 ఏప్రిల్ 19 తిరిగి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. అయితే కరోనా దెబ్బతో కఠిన లాక్డౌన్ అమలు చేయడంతో చైనాలో సప్లై వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. కార్ల తయారీలో ఉపయోగించే అనేక ముడి వస్తువల లభ్యత తగ్గిపోయింది. దీంతో ఫ్యాక్టరీ తెరిచినా కార్లు ఉత్పత్తి చేసే పరిస్థితి లేక పోవడంతో మే 9న మరోసారి కర్మాగారానికి తాళం వేసింది టెస్లా. అయితే ఈ మూసివేతపై టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: ఈలాన్మస్క్.. అసలు విషయం ఎప్పుడో చెప్పు? -
కరోనా కట్టడి.. జింగ్పిన్ తీవ్ర హెచ్చరికలు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క చైనా మాత్రమే కరోనా కట్టడికి జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తోంది. అయితే.. ఆ అనుసరించే విధానం మరీ ఆరాచకంగా ఉండకపోవడమే సొంత పౌరుల నుంచే వ్యతిరేకతకు కారణం అవుతోంది. లాక్డౌన్తో నరకం అనుభవిస్తున్న వాళ్లు విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించే ప్రసక్తే లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జింగ్పిన్. బలవంతపు లాక్డౌన్లను చైనా ప్రజలు భరించలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ.. కొద్దిపాటి కేసులకే లాక్డౌన్, అదీ కఠినంగా విధించడం, సామూహిక కరోనా టెస్టుల పేరిట భౌతిక దాడులకు పాల్పడుతుండడం, ఐసోలేషన్ పేరిట జంతువుల కంటే హీనంగా మనుషులతో ప్రవర్తించడం లాంటి చేష్టలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ఆగ్రహానికి తోడు ఆహార, మందుల కొరత వాళ్లను వేధిస్తోంది. షాంగై వాసుల లాక్డౌన్ కష్టాలే అందుకు నిదర్శనం. ఈ తరుణంలో.. లాక్డౌన్ పరిణామాలపై ప్రశ్నిస్తే కఠిన శిక్షలు అమలు చేయాలని చైనా అధ్యక్షుడు జింగ్పిన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కమ్యూనిస్ట్ పార్టీ ‘సుప్రీం పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ’ సమావేశం జరిగింది. తమ దేశంలో కరోనా కట్టడికి ఏ విధానాలైతే మేలు చేస్తాయో వాటిని, అవి ప్రజలను ఇబ్బంది పెట్టినా పర్వాలేదని.. అంతిమంగా డైనమిక్ జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది కరోనా విజృంభణ పరిస్థితులు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్పిన్ తొలిసారి, అదీ ఒక కీలక సమావేశంలో ప్రసంగించడం విశేషం. ‘‘కఠిన నిర్ణయాలనేది సహజంగానే మన పార్టీతత్వం . కరోనా కట్టడికి తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటున్నాయి. వుహాన్లో ఏ తరహాలో కరోనాపై పోరాడి గెల్చాం.. అలాగే షాంగైలోనూ గెలిచి తీరతాం. జీరో కొవిడ్ పాలసీని తప్పుబట్టే వాళ్లను, పార్టీ విధానాలను వ్యతిరేకించే వాళ్లను కఠినంగా శిక్షించండి. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారానికి పుల్స్టాప్ పెట్టించండి’’ అని జింగ్పిన్ ప్రసంగించినట్లు సీఎన్ఎన్ ఓ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటిదాకా రాజధాని బీజింగ్లో 500కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో.. ఎక్కడ షాంగై తరహా లాక్డౌన్ అమలు చేస్తారో అని హడలి పోతున్నారు అక్కడి ప్రజలు. చదవండి: చైనాలో కరోనా కట్టడి పేరిట వికృత చేష్టలు -
అండమాన్కు చలో చలో
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి పోర్టు బ్లెయిర్కు తొలినాళ్లలో మూడు నెలలకోసారి పాసింజర్ షిప్ నడిచేది. క్రమంగా డిమాండ్ పెరగడంతో నెలకోసారి పరుగులు తీసింది. విశాఖ పోర్టు నుంచి ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రయాణికులు, ముఖ్యంగా వలసదారులు ఈ నౌక ద్వారానే అండమాన్ చేరుకునేవారు. ఫుల్ డిమాండ్తో నడుస్తున్న తరుణంలో కరోనా వ్యాప్తి చెందడం... లాక్డౌన్ కారణంగా.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండేళ్ల పాటు రాకపోకలను నిలిపివేసింది. తాజాగా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఫుల్ స్వింగ్లో షిప్ ప్రయాణం మొదలుపెట్టింది. శనివారం సాయంత్రం బయలుదేరి.. 450 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం పోర్టుబ్లెయిర్లో పాసింజర్ కార్గో షిప్ క్యాంప్బెల్ బే బయలుదేరింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే 95 శాతం మంది ఇందులో ఉండటం విశేషం. అండమాన్ నికోబార్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారంతా.. వేసవి సెలవుల కోసం తమ స్వస్థలాలకు బయలుదేరినట్లు షిప్ ఏజెంట్స్ చెబుతున్నారు. మూడు రోజుల ప్రయాణం తర్వాత విశాఖపట్నం పోర్టుకు ఈ నెల 3వ తేదీ ఉదయం చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ట్రాఫిక్ మేనేజర్ రత్నకుమార్ పూర్తి చేశారు. 5న ఫుల్ప్యాక్తో ప్రయాణం విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కూడా ఖరారైంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం క్యాంప్బెల్ బే షిప్ విశాఖ నుంచి బయలుదేరనుంది. 8వ తేదీ ఉదయానికి క్యాంప్బెల్ బే.. తిరిగి పోర్టు బ్లెయిర్కు చేరుకోనుంది. సుదీర్ఘ విరామం తర్వాత నడుస్తుండటంతో టికెట్స్ హాట్ కేక్స్లా అమ్ముడు పోయాయి. మొత్తం 500 మంది సామర్థ్యం ఉండగా బుకింగ్స్ ప్రారంభించిన రెండ్రోజుల్లోనే మొత్తం టికెట్స్ విక్రయించేశారు. అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను అనుసరించి క్యాంప్బెల్షిప్ని నడుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏవీ భానోజీరావు, గరుడ పట్టాభి రామయ్య అండ్ కో ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్ నేపథ్యంలో మరో షిప్ రెడీ..! క్యాంప్బెల్ బే ప్యాసింజర్ కార్గో షిప్ తొలి ప్రయాణంలోనే 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఇంకా కావాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుండటంతో మరో షిప్ని కూడా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్కు ఎంవీ స్వరాజ్ద్వీప్ నౌక రాకపోకలు సాగించేది. తర్వాత ఎంవీ హర్షవర్థన్ నడిపారు. రెండేళ్ల క్రితం ఇది మరమ్మతులకు గురికావడంతో డాక్యార్డులో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇది దాదాపు పూర్తయిందనీ.. త్వరలోనే ఎంవీ హర్షవర్ధన్ షిప్ని విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్కు రాకపోకలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణం చాలా చౌక అండమాన్కు చాలా తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు. అయితే ప్రయాణికులను రెండు రకాలుగా విభజించారు. అండమాన్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయాణికుడిని ఐలాండర్ అనీ.. పర్యాటకుల్ని నాన్ ఐలాండర్గా షిప్ టికెట్స్ విక్రయంలో విభజిస్తారు. ఐలాండర్కు జనరల్ టికెట్ కేవలం రూ.1250 మాత్రమే కాగా.. పర్యాటకుడికి జనరల్ టికెట్ రూ.3,375 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి అండమాన్కు విమానంలో వెళ్లాలంటే రూ.10 వేల వరకూ ఖర్చవుతుంది. ఎంత లగేజ్ తీసుకెళ్లినా.. ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయడం లేదు. మొత్తం నాలుగు విభాగాలుగా టికెట్స్ విక్రయాలు జరుపుతున్నట్లు షిప్పింగ్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. మంచి ప్రారంభం దక్కింది కోవిడ్ తర్వాత అండమాన్కు పాసింజర్ షిప్ ప్రయాణం మొదలు కావడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరిగానే ప్రారంభం నుంచే ప్రయాణికులు ఆసక్తి చూపించడం శుభపరిణామం. ఈ నెల 3న వస్తున్న షిప్కు బెర్తు, ఇతర సౌకర్యాలు పోర్టు పరంగా పూర్తి చేశాం. ప్రతి ప్రయాణికుడు కనీసం 10–15 పెద్ద సైజు బ్యాగ్లు, లగేజీతో ప్రయాణిస్తుంటారు. ఇందుకనుగుణంగా పోర్టులోకి ఆర్టీసీ బస్సులను కూడా ఆ సమయంలో అనుమతిస్తున్నాం. – కె.రామ్మోహన్రావు, విశాఖ పోర్టు చైర్మన్ (చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!) -
చైనాలో కరోనా ఉధృతి...మళ్లీ అమలవుతున్న జీరో కోవిడ్ పాలసీ
గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసులు అనూహ్యంగా నమోదవుతున్నాయి. కరోనా పుట్టినిల్లు అయినా చైనాని ఈ కొత్త కేసుల ఉధృతితో అతలాకుతులం చేస్తోంది. దీంతో చైనా కూడా కరోనా కట్టడి దిశగా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క శనివారమే సుమారు 21,796 కేసులు నమోదవ్వగా, 39 మరణాలు సంభవించాయి. అంతేకాదు చైనాలో పరిస్థితి చాలా భయనకంగా ఉందని, చైనాలో కొన్ని ప్రాంతాల్లో కరోనాకి సంబంధించిన కొత్త కేసులు వెలుగు చూశాయని బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ పాంగ్ జింగ్హువో తెలిపారు. పైగా చైనాలో దేశవ్యాప్తంగా 29,531 మంది కరోనాకి సంబంధించిన చికిత్స పొందుతున్నారని నివేదిక పేర్కొంది. ఓమిక్రాన్ వైరస్ ఆవిర్భావం తర్వాత గత నెల చివరిలో లాక్డౌన్ తదనంతరం నుంచి నగరంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 87కి చేరుకుంది. దీంతో 2019 డిసెంబర్లో వుహాన్లో మొదటిసారిగా కరోనా ఉద్భవించినప్పటి నుంచి చైనాలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 4,725కు పెరిగింది. కరోనా కట్టడిలో భాగంగా మెటల్ కంచెలు చైనా స్థానిక ప్రభుత్వాలు ఈ కరోనా కట్టడిలో భాగంగా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న ప్రాంతాల్లోని వీధుల్లో మెటల్ కంచెలు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వీధులు, అపార్ట్మెంట్ కాప్లెక్స్లో ప్రజలు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేసులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో కూడా ఈ మెటల్ కంచెలు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజలు లాక్డౌన్ ఆంక్షలతో విసిగిపోయి ఆగ్రహంతో వీటిని ధ్వంసం చేస్తున్నారు. చైనా అమలు చేస్తున్న ఈ కఠినమైన ఆంక్షల కారణంగా ప్రజలు నిత్వావసర వస్తువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా సకాలంలో తగిన వైద్యం పొందలేక నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాదు చైనా వాసులు కొంతమంది ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. షాంఘైలో అమలవుతున్న సరికొత్త జీరో కోవిడ్ పాలసీ షాంఘై ఒక సరికొత్త జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని అమలు చేస్తోంది. నమోదవుతున్న కరోనా కేసుల ప్రమాద తీవ్రత ఆధారంగా మూడు వర్గాలుగా విభజించింది. మొదటి వర్గం వారు కఠినతరమైన కోవిడ్ ఆంక్షలు ఎదుర్కొనక తప్పదు. రెండో వర్గం వారు కొద్దిపాటి ఆంక్షలను ఎదుర్కొంటారు. మూడో వర్గం వారికి ఆంక్షలు వర్తించవు, పైగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అనుమతి కూడా ఉంటుంది. చైనా అధికారులుకే కాకుండా ప్రజలకు కూడా ఈ లాక్డౌన్ ఆంక్షలు పాటించడం ఒక సవాలుగా మారింది. మాకు ఆహారం పంపండి అంటూ నిర్బంధంలో ఉన్నవారి ఆకలి కేకలతో హోరెత్తిపోతుంటే మరొకవైపు అధికారులు కరోనా కట్టడికై లాక్డౌన్కి సంబంధించిన సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు తలమునకలవుతున్నారు. (చదవండి: చైనాకు గట్టి షాకిచ్చిన భారత్) -
ఢిల్లీలో వెయ్యి కరోనా కేసులు
న్యూఢ్లిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. వరసగా మూడో రోజు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,451 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 14,241కి చేరాయి. 54 మంది మరణించారు. ఢిల్లీలో ఒక్క రోజే 1,042 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఢిల్లీలో స్కూళ్లో ప్రత్యేక క్వారంటైన్ గదులు సిద్ధం చేశారు. విద్యార్థులు లంచ్ బాక్స్లను షేర్ చేసుకోద్దని సూచించారు. మరోవైపు తమిళనాడునూ కరోనా వణికిస్తోంది. ఐఐటీ మద్రాసులో 30 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. శుక్రవారం 700 మందికి పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. స్వల్ప లక్ష్యణాలు ఉన్న విద్యార్థులను కళాశాల ప్రాంగణంలోనే హోం క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. క్యాంపస్లోని 19 హాస్టళ్లలో కరోనా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ, తమిళనాడుల్లో శుక్రవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ను మళ్లీ తప్పనిసరి చేశారు. లేదంటే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వాలు హెచ్చరించాయి. షాంఘైలో లాక్డౌన్ పొడిగింపు బీజింగ్: చైనాలోని షాంఘైలో కరోనా కలకలం కొనసాగుతోంది. దాంతో కోవిడ్ లాక్డౌన్ను ఏప్రిల్ 26 దాకా పొడిగించారు. నాలుగు వారాలుగా లాక్డౌన్ అమలు చేస్తూ కఠినమైన ఆంక్షలు విధిస్తుండటంతో అక్కడ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొనడం తెలిసిందే. చైనాలో గురువారం 2,119 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,931 షాంఘైలో వెలుగు చూశాయి. 11 మంది మరణించారు. దాంతో తాజా వేవ్ మృతుల సంఖ్య 36కి చేరింది. -
చైనాలో ఇప్పుడు భయం కరోనా కోసం కాదట!
కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ రెండేళ్లలో ఏనాడూ లేనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది డ్రాగన్ కంట్రీ. ఒకవైపు కేసులు వెల్లువెత్తుతుంటే.. మరోవైపు ప్రజలకు వైద్యం, నిత్యావసరాలు అందడంలో జాప్యం జరుగుతోంది. ఇందుకు కఠోరమైన లాక్డౌన్ కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపిక నశిస్తున్న ప్రజలు.. అధికారులపై ఎదురుదాడులకు తెగపడుతున్నారు, నిరసనలకు దిగుతున్నారు. అయినా జింగ్పిన్ ప్రభుత్వం మాత్రం తగ్గట్లేదు. జీరో టోలరెన్స్ పేరిట జనాలను మానసికంగా హింసిస్తోంది చైనా ప్రభుత్వం ఇప్పుడు. వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం, కరోనాను ఎదుర్కొగలిగే పరిస్థితులు ఉన్నా కూడా ‘స్టే హోం.. స్టే సేఫ్’ పాలసీకే మొగ్గు చూపిస్తోంది. దీనిపై వైద్య నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది జిన్పింగ్ ప్రభుత్వం. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యలన్నీ తాత్కాలికమని, కేసుల కట్టడికి ఈ స్ట్రాటజీ ఉపయోగపడుతుందని మొండిగా వాదిస్తోంది. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది లాక్డౌన్లో చిక్కుకుపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగరమైన షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ కఠినమైన లాక్డౌన్ అమలు అవుతోంది. వైద్య సిబ్బంది, డెలివరీ బాయ్స్, ఎమర్జెన్సీ స్టాఫ్ తప్ప.. ఎవరూ బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, మందులు దొరక్క జనాలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ.. సడలింపులకు ప్రభుత్వం నో అంటోంది. షాంఘై చుట్టుపక్కల నగర వాసుల్లో ఇప్పుడు లాక్డౌన్ ఫియర్ మొదలైంది. రెండువారాల పాటు అధికారులు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. తమ దగ్గరా షాంఘై తరహా పరిస్థితులు పునరావృతం అవుతుందని వణికిపోతున్నారు. ఇప్పటికే కొందరు ఎమర్జెన్సీ పాసులతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు మాత్రం అనుమతులు ఇచ్చేదే లేదని తెగేసి చెప్తున్నారు. షాంగ్జి ప్రావిన్స్ రాజధాని జియాన్ నగరం ఇదివరకే లాక్డౌన్ అక్కడి ప్రజలకు చీకట్లు మిగల్చగా.. తాజాగా మరోసారి లాక్డౌన్ ప్రకటించడంతో వణికిపోతున్నారు. ఇక అధికారులు మాత్రం ఇది తాత్కాలిక చర్యలు మాత్రమేనని, వైరస్ కట్టడికి ప్రజలు కొంతకాలం ఓపిక పట్టాలని చెప్తున్నారు. అయినా ప్రజల్లో మాత్రం మనోధైర్యం నిండడం లేదు. షాంఘై పరిస్థితులను కళ్లారా చూడడంతో కరోనా కంటే లాక్డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. This is how people walk their dog during #Covid19 #lockdown 😆 pic.twitter.com/RWOtzYCBQm — Clumsybear0129 (@clumsybear0129) March 29, 2022 షాంఘైలో ఉన్నత కుటుంబాలు తప్ప మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు నిరసనలు హోరెత్తుతున్నాయి. బారికేడ్లను బద్ధలు కొట్టి మరీ ఆహారం కోసం పరుగులు తీస్తున్నారు అక్కడి జనాలు. వైద్యం అందక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అంతేకాదు.. నిరసనలను నియంత్రించలేక పోలీసులు దాడులు చేస్తున్న ఘటనలు, మూగజీవాల అవసరాల కోసం బయటకు తీసుకొస్తే.. వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. Protest against lockdown in Shanghai. "We want to eat. We want to go to work. We have the right to know!"#chinalockdown #lockdown #Shanghai pic.twitter.com/I9DARcC06V — Eitan Waxman (@EitanWaxman) March 27, 2022 చదవండి: కరోనా కారణంగా చైనాలో విపత్కర పరిస్థితులు.. వీడియో వైరల్ -
‘చావమంటారా?’.. కరోనా పుట్టినింట హాహాకారాలు
లాక్డౌన్ను భరించడానికి ప్రజలకు ఓ ఓపిక అంటూ ఉంటుంది. కరోనా తొలినాళ్లలో లాక్డౌన్తో భారత్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కుందో చూశాం. అయితే కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం ప్రజలు పట్టుమని పది, పదిహేను రోజులు కూడా భరించలేకపోతున్నారు. కారణం.. అత్యంత కఠినమైన లాక్డౌన్ అక్కడ అమలు అవుతోంది కాబట్టి. జీరో టోలరెన్స్ పేరిట చైనా అనుసరిస్తున్న వైఖరిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య పేషెంట్లను కంటెయినర్లలో ఉంచి మానవ హక్కుల సంఘాల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొంది డ్రాగన్ క్రంటీ. ఇప్పుడు దేశంలోనే.. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంగైను లాక్డౌన్తో దిగ్భంధించి.. జనజీవనాన్ని అగమ్య గోచరంగా తయారు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాదాపు మూడు కోట్ల దాకా జనాభా ఉన్న షాంగై నగరం లాక్డౌన్ కట్టడిలో ఉండిపోయింది. ఇంటికే పరిమితమైన జనాలు.. పిచ్చెక్కిపోయి కిటికీలు, బాల్కనీల గుండా ఆర్తనాదాలు పెడుతున్నారు. ట్విటర్, ఇన్స్టా, ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చివరకు ఆకలి చావులు, ఆత్మహత్యల లాంటి విషాదాలే మిగులుతాయని నిపుణులు వాపోతున్నారు. Residents in #Shanghai screaming from high rise apartments after 7 straight days of the city lockdown. The narrator worries that there will be major problems. (in Shanghainese dialect—he predicts people can’t hold out much longer—he implies tragedy).pic.twitter.com/jsQt6IdQNh — Eric Feigl-Ding (@DrEricDing) April 10, 2022 యావో మింగ్ లె, యావో సీ(చావు బతుకుల) మధ్య ఉన్నమంటూ అపార్ట్మెంట్ల నుంచి కేకలు పెడుతున్నారు కొందరు. నిత్యావసరాలు దొరక్క.. ఆకలితో అలమటించిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అయితే 2019లో తొలి కరోనా కేసు వుహాన్ నుంచి వెలుగు చూశాక.. ఈ స్థాయిలో చైనా కరోనా కేసుల్ని ఎదుర్కొవడం ఇదే ప్రథమం. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియెంట్ (బీఏ.2) బ్రేకింగ్పాయింట్ను దాటేయడంతోనే కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి అక్కడ. ఒక్క ఆదివారమే ఇక్కడ 25 వేల కేసులు నమోదు అయ్యాయట!. రికార్డు స్థాయిలో టెస్టుల వల్లే ఈ ఫలితం కనిపిస్తోంది. ఈ తరుణంలో.. మరింత కఠినంగా లాక్డౌన్ను ముందుకు తీసుకెళ్లాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు సాయంలో కాస్త ఆలస్యమైనప్పటికీ.. సాయం మాత్రం అందుతూనే ఉందని అధికారులు అంటున్నారు. BREAKING—China’s grip on BA2. At least 23 cities in China on full or partial lockdown—cities with over 193 million residents. Food shortages throughout even Shanghai. Doctors and nurses also exhausted—this doctor collapsed, and was carried off by patients at an isolation center. pic.twitter.com/raJlRNEezC — Eric Feigl-Ding (@DrEricDing) April 9, 2022 నిత్యం జనాలతో సందడిగా ఉండే షాంగై నగరం.. ఇప్పుడు ఎడారి వాతావరణంను తలపిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, డెలివరీ బాయ్స్, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు(అదీ అత్యవసరం అయితే తప్ప) ఇతరులకు బయట తిరిగేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వైరస్ కట్టడికి జనాలు సహకరించాలని, ఏదైనా తేడా జరిగితే అమెరికా, ఇటలీ, బ్రిటన్ లాంటి పరిస్థితులు తప్పవని, కాబట్టి కష్టమైన కొంచెం సహకరించాలని ప్రజలను కోరుతున్నారు అక్కడి వైద్యాధికారులు. అయితే కేసులు ఎక్కువగా వస్తున్నా.. ప్రజావ్యతిరేక నిరసనల దృష్ట్యా మంగళవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సంబంధిత వార్త: కరోనా కోరల్లో చైనా.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు -
నాలుగడుగులు నడిచి హెల్దీగా ఉన్నామనుకుంటే సరిపోదు!
World Health Day 2022: భూమి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం భూమికి ఆరోగ్యకరమైన పనులు చేస్తే అది స్వస్థతతో ఉంటుంది. ఇరువురూ పరస్పరం సహకరించుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాలని 2022 సంవత్సరానికిగాను ‘వరల్డ్ హెల్త్ డే’ తన థీమ్ను ‘మన భూమి మన ఆరోగ్యం’గా ఎంచుకుంది. సకల జీవరాశికి భూమి నివాస స్థలం అయితే కుటుంబానికి ఇల్లు నివాస స్థలం. ఏ కుటుంబానికి ఆ కుటుంబం తన ఇంటిని, కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా ఉంచుకుంటే భూమి ఆరోగ్యంగా ఉన్నట్టే. లాక్డౌన్ ఒక రకంగా ఒక మెలకువ కలిగించింది. కుటుంబాలను ఆరోగ్యం గురించి గట్టిగా ఆలోచించేలా చేసింది. మహమ్మారులు వ్యాపించినప్పుడే కాదు... గట్టి ప్రతికూలతలు వచ్చినా ఎలా ఒకరికొకరు మద్దతుగా నిలవాలో చెప్పింది. మరొక మేలు అది ఏం చేసిందంటే లాక్డౌన్ కాలంలో పరిశుభ్రమైన ఆకాశాన్ని చూపించింది. వాహనాల రొద లేని పరిసరాలు ఇచ్చి దూరాన ఒక పక్షి కూసినా వినిపించేలా చేసింది. ఫ్యాక్టరీలు మూత పడి వ్యర్థాలు విడుదల కాకపోవడం వల్ల యమున వంటి కాలుష్య కాసార నది కూడా తేటబడింది. చెలమలు, కుంటలు, చెరువులు శుభ్రమయ్యాయి. ప్లాస్టిక్ వేస్ట్ దాదాపుగా లేదు. వాహన వ్యర్థాలు లేవు. అంటే మనిషి తన చర్యలను నిరోధించుకుంటే భూమికి ఎంత మేలో లాక్డౌన్ చెప్పింది. భూమి ఊపిరి పీల్చుకున్న సందర్భం అది. అంటే భూమికి చెడు చేయకూడదు. భూమికి చెడు జరిగితే ఆ చెడు మన ఇంటి దాకా వస్తుంది. కుటుంబంలోని వ్యక్తులను తాకుతుంది. భూమికి చెడు జరిగితే మనకెలా చెడు జరుగుతుంది? నేలను కలుషితం చేయకూడదు. దారుణమైన రసాయనాలతో పంటలు పండించకూడదు. కాలక్రమేణ ఆహార ఉత్పత్తికి దెబ్బ పడుతుంది. పంటలో కోత వస్తుంది. లేదా కలుషిత ఆహారం పండుతుంది. అది పిప్పి ఆహారంగా మారి మాల్ న్యూట్రిషన్కు దారి తీస్తుంది. పిల్లలు, పెద్దలు ఈసురో అని అనకతప్పదు. కనుక నేల కలుషితం కాకుండా చైతన్యాన్ని ఇంటి నుంచే కలిగి ఉండాలి. సమాజానికి అందివ్వాలి. భూమికి చేటు చేయడం అంటే పరిసరాలను చెత్తతో నింపడమే. ఇలా వ్యర్థాలతో భూమిని నింపడం వల్ల కుటుంబానికి ఎదురవుతున్న అతి పెద్ద ప్రమాదం మలేరియా. భూమిని మనిషి దోమల అభివృద్ధి కేంద్రంగా మురికిగా మారుస్తుంది. ఈ మురికి నీటిలోనూ తినే ఆహారంలోనూ చేరితే డయారియా వస్తుంది. ఇవాళ ప్రపంచాన్ని అంటే కుటుంబాలను బాధిస్తున్న మరో అతి పెద్ద సమస్య డయేరియా. కనుక ఇంటిలోని చెత్తను నేలకు చెడు చేయని విధంగా అనారోగ్యాలకు సాయం చేయని విధంగా పారేయాలి. మన రోజువారి రాకపోకలే గాలి కాలుష్యానికి అత్యంత ప్రధాన కారణం అని తేలింది. కారు, స్కూటరు ఇంటి సౌకర్యం కోసం వాడితే అవి వ్యర్థాలు వెదజల్లి తిరిగి మన ఇంటి సభ్యులకే అనారోగ్యాలు తెస్తాయి. ఆస్తమా, అలెర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు, కంటి సమస్యలు ఇవి వాయు కాలుష్యం వల్లే. దీని నుంచి ఇంటిని కాపాడి తద్వారా భూమిని కాపాడాలంటే ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలు వాడాలి. సైకిల్, నడక, కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్... ఇలాంటి వాటితో గాలి కాలుష్యం తగ్గించాలి. ఇంట్లో మొక్కలు నాటాలి. చెట్లు వేయాలి. వీధిలో కొన్ని చెట్లనైనా పెంచే బాధ్యత తీసుకోవాలి. ఆ పచ్చదనం భూమినే కాదు ఇంటినీ కాపాడుతుంది. నీటిని కాపాడాలి. నీటిని వృధా చేయకుండా కాపాడాలి. నీటి కేంద్రాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. సముద్రాలను, నదులను, చెరువులను కలుషితం చేస్తే ఆ నీరు అనారోగ్యాన్ని ఇస్తుంది. కలుషిత నీటి వల్లే ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. అడవిని పెంచితే వాన... వాన కురిస్తే అడవి... ఈ రెండూ ఎంత సమస్థాయిలో ఉంటే అంత భూమికి తద్వారా కుటుంబానికి మంచిది. వ్యక్తిగతంగానే కాదు ప్రభుత్వాలను చైతన్యపరచడం ద్వారా కూడా జలచక్రాన్ని కాపాడుకోవాలి. గ్లాసు నీళ్లు ముంచుకుని సగం తాగి సగం పారేసే పిల్లలను బాల్యం నుంచి హెచ్చరించకపోతే వారు పెద్దయ్యే వేళకు ఆరోగ్యకరమైన నీటిని తాగలేని పరిస్థితిలో నీళ్లు అడుగంటుతాయి. భూమిని కండిషన్లో పెట్టకపోతే కుండపోతలు వరదల్ని, వ్యాధుల్ని తెస్తాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగి వడదెబ్బ సంగతి సరే, అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతాయి. ఘోరమైన చలిగాలులు చరుకుదనాన్ని హరిస్తాయి. భూమికి ఏది జరిగినా కుటుంబం నివసించేది ఆ భూమిపైని ఇంటిలోనే కనుక ఇంటిని బాధించక తప్పదు. కనుక మనం డ్రైఫ్రూట్స్ తిని, విటమిన్ టాబ్లెట్స్ వేసుకుని, నాలుగడుగులు నడిచి హెల్దీగా ఉన్నాం అని అనుకోకూడదు. భూమి ఎంత హెల్దీగా ఉంది చెక్ చేయాలి. అలెర్ట్ చేయాలి. మనతోపాటు భూమి, భూమితో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే భవిష్యత్తు అని హెచ్చరిస్తూ ఉంది ఈ సంవత్సరపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. చదవండి: అమ్మ స్వీపర్.. కొడుకు ఎంఎల్ఏ.. -
పెరిగిన ఇళ్ల విక్రయాలు.. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు
సాక్షి, ముంబై: కరోనా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఇళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఒక్క మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో అంటే 15,700 ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో రూ.1,084 కోట్ల ఆదాయం వచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మార్చిలో రికార్డు స్ధాయిలో రెవెన్యూ వచ్చింది. ఫిబ్రవరితో పోల్చి చూస్తే మార్చిలో 51 శాతం ఆదాయం ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా మార్చిలో ప్రతీరోజూ సగటున 507 ఆస్తులు కొనుగోలు జరిగినట్లు స్టాంపు డ్యూటీ కార్యాలయంలో నమోదైన రిజిస్టేషన్లను బట్టి తెలిసింది. కొనుగోలు చేసిన ఇళ్లలోనూ అధిక శాతం రూ.కోటి నుంచి ఐదు కోట్ల వరకు విలువచేసే (అంటే 500 చదరపు అడుగుల నుంచి వేయి చదరపు అడుగుల వరకు) ఇళ్లు కొనుగోలు చేశారు. కరోనాతో కొనుగోళ్ల పతనం... కరోనా మొదటి, రెండో దఫా ప్రభావం భవన నిర్మాణ రంగాలపై తీవ్రంగా చూపింది. కానీ మూడో దఫాలో ఇళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసింది. దీంతో అస్తవ్యస్తమైన జనజీవనం గాడిన పడింది. పరిస్థితులు సర్దుకోవడంతో ఇళ్ల విక్రయాలు, కోనుగోళ్లు జోరందుకున్నాయి. ముంబైకర్లు గృహ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, ఫ్లాట్లతోపాటు నిర్మాణంలో ఉన్న వాటిని కూడా బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మొదటి దఫాలో ఆర్థికంగా దెబ్బతిన్న బిల్డర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం స్టాంపు డ్యూటీలో రాయితీ కల్పించింది. దీని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఫలితంగా బిల్డర్ల ఆర్ధిక వ్యవస్ధకు నవసంజీవని లభించినట్లయింది. -
చైనాను కలవరపెడుతున్న కరోనా.. జిన్ పింగ్ సంచలన నిర్ణయం
బీజింగ్: చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం చైనా సర్కార్ను టెన్షన్కు గురిచేస్తోంది. ఇక, ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. అయితే, రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ట కేసులుగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం నమోదైన పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా ఈశాన్య చైనాలోని బయో చెంగ్, షాంఘైలోనూ లాక్డైన్ విధించారు. అయితే, వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించలేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. కాగా, రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో భారీ స్థాయిలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న 26 మిలియన్ల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక్కడ టెస్టుల కోసం చైనా మిలిటరీని, వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలను షాంఘైకి పంపింది. ఇటీవల ఆర్మీ, నేవీ, జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్ల నుండి రిక్రూట్ అయిన 2,000 మందికి పైగా వైద్య సిబ్బందిని షాంఘైకి పంపినట్లు సాయుధ దళాల వార్తాపత్రిక నివేదించింది. దీంతో వీరందరూ షాంఘైలో ఉన్న ప్రజలకు టెస్టులు నిర్వహించనున్నారు. China has sent the military and thousands of healthcare workers into Shanghai to help carry out COVID-19 tests for all of its 26 million residents as cases continued to rise on Monday. https://t.co/VbbmOE2OvY — SBS News (@SBSNews) April 4, 2022 -
China Corona: ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు
కరోనా పుట్టుకకు చైనానే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఆరంభంలో వైరస్ విజృంభించినా.. అంతే వేగంగా వైరస్ను అదుపు చేసింది. అయితే రెండేళ్ల పాటు ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతుంటే.. చైనా మాత్రం జీరో టోలరెన్స్ పేరిట హడావిడి చేసింది. ఈ తరుణంలో ప్రపంచాన్ని నివ్వెరపరస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ. షాంగై.. రెండున్నర కోట్ల జనాభా ఉన్న మహానగరం. అధిక జనసాంద్రతతో పాటు ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో ఒకటి. అలాంటి నగరం మూగబోయింది. మనుషులు, పశువులు రోడ్డెక్కడం లేదు. కఠిన లాక్డౌన్తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిత్యావసరాలు, ఆస్పత్రి సేవలు సకాలంలో దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిరసనల గళం వీలైన రీతిలో వినిపిస్తున్నారు. రోబోలతో వీధుల వెంట కరోనా జాగ్రత్తలు చెప్పిస్తున్నారు. Behold… the abandoned streets of the most populace city on Earth, Shanghai, in the strictest pandemic lockdown the world has ever seen. Normally these streets are shoulder-to-shoulder crowded. Eeerie. pic.twitter.com/HGdvK6NLOD — Eric Feigl-Ding (@DrEricDing) April 1, 2022 ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్డౌన్ను అమలు చేస్తోంది చైనా ఇప్పుడు. సోమవారం నుంచి షాంగైలో ఇది మొదలైంది. షాంగైలో ప్రతి నలుగురిలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయట. ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తుండడంతో.. ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. This is how people walk their dog during #Covid19 #lockdown 😆 pic.twitter.com/RWOtzYCBQm — Clumsybear0129 (@clumsybear0129) March 29, 2022 కుక్కల ఓనర్లు వాటికి తాళ్లు కట్టి కిందకి దించి.. కాలకృత్యాలు తీర్చడం, ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్కు సరుకుల రవాణా తాళ్ల సాయంతో చేయడం, చెత్తను విసిరేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, స్మార్ట్ ఫోన్లలోనే ముఖ్యమైన పనులు, ప్రజల కోసం డ్రోన్ల సాయం.. ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ. Protest against lockdown in Shanghai. "We want to eat. We want to go to work. We have the right to know!"#chinalockdown #lockdown #Shanghai pic.twitter.com/I9DARcC06V — Eitan Waxman (@EitanWaxman) March 27, 2022 కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. ఆఖరికి విధుల్లోనూ పోలీసులు భాగం కావడం లేదంటే పరిస్థితి తీవ్రత అర్థంచేసుకోవచ్చు. రోబోలతోనే పాట్రోలింగ్ చేయిస్తున్నారు. నిశబ్దమైన రోడ్ల మీద అప్పుడప్పుడు ఆంబులెన్స్ సౌండ్ తప్ప మరేమీ వినిపించడం లేదు. వెరసి.. షాంగై ఇప్పుడు ఘోస్ట్ టౌన్ను తలపిస్తోంది. Full Lockdown in Shanghai, this is how they broadcast announcements. Robot Dog + Speakers#Shanghai #COVID #Lockdown pic.twitter.com/5kJdLrnL8p — Jay in Shanghai 🇨🇳 (@JayinShanghai) March 29, 2022 Breaking: Shanghai authorities are using drones to aid the #covid #lockdown in #Pudong #Shanghai. Skynet isn't enough for them. pic.twitter.com/GJS1g7xofw — Harvey JI-Campaigner of Toilet Revolution (@JiPrisoner) March 29, 2022 -
షాంఘైలో కొత్త రకం కరోనా కల్లోలం.. చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఇటీవలే కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్నామని ప్రపంచ దేశాలు ఊపరి పీల్చుకుంటున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ పుట్టినిల్లైన చైనాలో తాజాగా కొత్త కరోనా వేరియంట్కి సంబంధించిన కేసులు అనుహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చైనా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వైరస్ విజృంభణ చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే పరిస్థితి ఏ మాత్రం కనబడటం లేదు. చివరికి రోజువారీ కోవిడ్ కేసులు మంగళవారం రికార్డు స్థాయిలో 4,477కి పెరగడంతో షాంఘై నగరం తూర్పు భాగంలో నివసించే ప్రజలకు లాక్డౌన్ పరిమితులను విధించింది చైనా ప్రభుత్వం. ఆ ప్రాంత ప్రజలు కేవలం కోవిడ్ పరీక్ష కోసం మాత్రమే బయటకు రావాలని ఉత్తర్వులు జారీ చేసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్తో పాటు ఫైనాన్షియల్ సంస్థలకు పేరున్న పుడోంగ్ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అక్కడి స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు నివాసితులు బయటకు రావడం, బహిరంగ ప్రదేశాలలో తిరగడం నిషేధమని, షాంఘై మున్సిపల్ హెల్త్ కమిషన్ అధికారి తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. హాల్ వేస్, ఓపెన్ ఏరియాల్లు, రెసిడెన్షియల్ కాంపౌండ్స్లో కనీసం వాకింగ్ చేసేందుకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. గతంలో నివాసితులు తమ భవనాల లాబీలోకి వెళ్లి కూర్చునే అవకాశం ఉండేది. అలానే తమ పరిసర ప్రాంతాల్లో వైరస్ సోకిన వారు లేకపోతే ఆ ప్రాంతంలోనూ నిక్షేపంగా సంచరించే అవకాశం ఉండేది. అయితే కేసులు విపరీతంగా పెరిగేసరికి కేవలం ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ప్రజలను ఆదేశించింది. చదవండి: ఉక్రెయిన్ మహిళపై రష్యా సైనికుల దురాగతం...ఆమె భర్తను చంపి, వివస్త్రను చేసి.. -
చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ దశల వారిగా లాక్డౌన్
China to Start Phased Lockdown: చైనా కొత్త కరోనా వేరియంట్కి సంబంధించిన కేసులు అనుహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలేని విధంగా చైనాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనా అమలు చేసిన జీరో కోవిడ్ టోలరెన్స్ విధానాన్ని పటాపంచల్ చేస్తూ మరీ విజృంభిస్తోంది. అంతేగాదు పరిస్థితిని వారంలోగా అదుపులోకి తీసుకొస్తామని చైనా అధికారులు కూడా ప్రకటించారు. కానీ చైనాలోని పరిస్థితి చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు. దీంతో చైనా దశలవారిగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఇంతవరకు చైనా దేశవ్యాప్తంగా సుమారు 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్డౌన్ విధించిన సంగతి విదితమే. పైగా అతిపెద్ద నగరం షాంఘైలో కొద్ది మొత్తంలో ఆంక్షల సడలింపుతో లాక్డౌన్ విధించింది. కానీ ఇప్పడూ షాంఘైలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా దశాలవారిగా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు 17 మిలియన్లకు పైగా జనాభా ఉన్న షాంఘైటోని షెన్జెన్ నగరంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా పూర్తిగా మూసివేసింది. పైగా ఇక్కడ కరోనా మొదటి వేవ్ మాదిరిగా వేగంగా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు ఈ షెన్ జెన్ నగరంలో పరిస్థితిని అదుపులో తెచ్చే విషయమై చైనా మూడు రౌండ్ల కోవిడ్-19 పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది కూడా. అంతేకాదు రోజు వారీ అవసరాలకు మాత్రమే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది కూడా. (చదవండి: రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధానంగా ఆ దేశాల్లోనే..) -
ఈ కుక్క పేరు ఏంటో తెలుసా! వింటే షాక్ అవుతారు
Her Pet Dog Name Covid: పెంపుడు కుక్కలను పెంచుకునే వాళ్లు తమ కుక్కలకు విచిత్రమైన పేర్లు పెట్టడం సహజం. కానీ కొంతమంది మరింత విచిత్రంగా మనుషులకు పెట్టిన పేర్లుతో పిలుస్తుంటారు. మరీ కొంతమంది మనుషులతో ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక జంట తమ పెంపుడు కుక్కు ఓ విచిత్రమైన పేరు పెట్టడంతో అందరూ పెద్ద ఎత్తున మండిపడటం, విమర్శించడం మొదలు పెట్టారు. వివరాల్లోకెళ్తే...ఒక దంపతులకు కరోనా మొదటి వేవ్లో ఒక కుక్కపిల్ల దొరికింది. అయితే లాక్డౌన్ కారణంగా ఆ కుక్క యజమానిని కనుక్కోవడం వారికి కష్టమైంది.దీంతో ఈ కుక్క ఫోటోను తీసి పోస్టర్లు అంటించారు కూడా. కానీ ఎవరూ రాకపోవడంతో వారే ఆ కుక్కని పెంచుకోవడం మొదలు పెట్టారు. అయితే కరోనా లాక్డౌన్ సమయంలో దొరకడంతో కోవిడ్ అని పేరు పెట్టింది. అయితే అక్కడ వరకు అంతా బాగానే ఉంది. తనతోపాటు ఆ కుక్కపిల్లను బయటకు తీసుకువెళ్తున్నపుడల్లా మెదలైయ్యాయి అసలైన కష్టాలు. వాళ్లకు బయటకు తీసుకువెళ్లినప్పుడూ కోవిడ్ అని పిలవంగానే అందరూ విచిత్రంగ చూడటమే గాక అసలు అదేం పేరు అంటూ తిట్టడం మెదలు పెట్టారు. మరికొంతమంది ఆ కరోనా మహమ్మారితో మా ప్రియమైన వాళ్లని పోగొట్టుకున్నాం దయచేసి ఆ పేరు విన్నా కోపం వస్తోందంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆ దంపతులు సోషల్ మీడియాలో నెటిజన్లుతో పంచుకున్నారు. ఆఖరికి నెటిజన్లు కూడా అదేం పేరు అంటూ చివాట్లు పెట్టడం మెదలు పెట్టారు. (చదవండి: అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు! అట్లుంటది మరి ఆయనతోని!) -
China Corona: ప్చ్.. చైనా జీరో టోలరెన్స్ అట్టర్ ఫ్లాప్
జీరో టోలరెన్స్ పేరిట చైనా చేపట్టిన చర్యలేవీ సత్పలితాలను ఇవ్వడం లేదు. సరికదా.. గత మూడు వారాలుగా కరోనా కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి. తాజాగా.. ఒక్కరోజులో ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి. బయటి ప్రపంచం దృష్టిలో.. కరోనా మొదలైనప్పటి నుంచి చైనాలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే!. చైనా China లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఆదివారం బులిటెన్లో 1,337 కేసులు, సోమవారం బులిటెన్లో 3,507 కేసులు, మంగళవారం ఉదయం రిలీజ్ చేసిన కరోనా బులిటెన్.. ఏకంగా 5,280 కేసుల్ని చూపించింది. ఈశాన్య ప్రావిన్స్ అయిన జిలిన్లోనే మూడు వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు నేషనల్ హెల్త్ కమీషన్ వెల్లడించింది. అయితే పరిస్థితిని వారంలోగా అదుపులోకి తీసుకొస్తామని జిలిన్ గవర్నర్ ప్రకటించినప్పటికీ.. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చైనా వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జిలిన్, ఉత్తర కొరియాకు సరిహద్దు ప్రాంతం. అందుకే ఇరు ప్రాంతాల మధ్య ప్రయాణాలను కొన్నాళ్లపాటు నిషేధించింది చైనా. జీరో టోలరెన్స్ అంటే.. కఠినంగా కట్టడి చేయడం, పెద్ద ఎత్తున్న పరీక్షలు నిర్వహించడం.. ఇది జీరో టోలరెన్స్లో భాగంగా చైనా అనుసరిస్తున్న విధానం. రెండు సంవత్సరాల మూసేసిన సరిహద్దులు, సామూహిక పరీక్షలు, లాక్డౌన్లు, నిర్బంధాలు అమలు చేసింది. ఎక్కడికక్కడే కేసుల్ని కట్టడి చేసింది. ఈ క్రమంలో హేయమైన చర్యలకూ పాల్పడి.. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంది. కానీ, జీరో టోలరెన్స్ను పటాపంచల్ చేస్తూ.. వైరస్ విజృంభిస్తోంది ఇప్పుడు. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున.. మునుపెన్నడూ లేని పరిస్థితిని డ్రాగన్ ఎదుర్కొంటోంది. 2019లో వుహాన్లో కేసులు వెలుగు చూసినప్పటి నుంచి.. ఇప్పటిదాకా చైనాలో ఈ రేంజ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు కూడా జీరో కొవిడ్ స్ట్రాటజీతో.. కఠిన లాక్డౌన్ అమలు చేస్తూ జనాలను ఇళ్లకే కట్టడి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ లాభం లేకుండా పోతోంది. వింటర్ ఒలింపిక్స్ ముగిశాక.. ఆంక్షల సడలింపులతో జనసంచారం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభిస్తోంది. ఇది కొత్త వేరియెంట్లు అనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. సైంటిస్టులు మాత్రం అది ఒమిక్రాన్ stealth omicron అయి ఉండొచని అభిప్రాయపడుతున్నారు. ఇది ఏ తరహా వేరియెంట్ అన్నదానిపై చైనా ఆరోగ్య విభాగం స్పష్టత ఇవ్వడం లేదు. భారీ ఎఫెక్ట్ కేసులు పెరిగిపోతుండడంతో.. 11 ప్రధాన నగరాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న టెక్హబ్ షెంజెన్లో బయట మనిషి కనిపించడం లేదు. మరోవైపు లాక్డౌన్ వల్ల ఆర్థికంగానూ ప్రభావం పడుతోంది. మంగళవారం ఉదయం.. కరోనా ఎఫెక్ట్తో హాంకాంగ్ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయ్యింది. అక్కడా కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. బీజింగ్, షాంగై విమానశ్రయాలకు భారీగా విమానాలు రద్దు అయ్యాయి. షాంగైలోనూ లాక్డౌన్ కఠినంగా అమలు అవుతోంది. మరణాల గోప్యత కరోనా కేసుల వెల్లడి విషయంలో చైనా చాలాకాలం పాటు గమ్మున ఉండిపోయింది. కొన్ని నెలల కేసుల వివరాలను చైనా బయటకు రిలీజ్ చేయకపోవడం విశేషం. ఇక మరణాల సంగతి సరేసరి. ఇప్పటిదాకా కేవలం ఐదు వేల మరణాలు నమోదు అయ్యాయని చెప్తోంది. అత్యధిక జనాభా ఉన్న చైనాలో.. ఇది నమ్మశక్యంగా ఉందంటారా?. ఏది ఏమైనా జీరో టోలరెన్స్ను ఎంత ఘనంగా ప్రచారం చేసుకున్న చైనా.. ఇప్పుడు కరోనా కేసుల్ని కట్టడి చేయడంలో మాత్రం ఘోరంగా తడబడుతోంది. -
కొత్త వేరియంట్ కలకలం.. చైనాలో లాక్డౌన్.. టెన్షన్లో ప్రపంచ దేశాలు..!
బీజింగ్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న సంతోషంతో ఉన్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్డౌన్ విధించారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని టెక్ హబ్గా పిలువబడే షెన్జెన్లో ఒకే రోజు 66 మందికి పాజిటివ్గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. షెన్జెన్లో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా హువావే, టెన్ సెంట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్జెన్లోనే ఉన్నాయి. షెన్జెన్ నగరం హంకాంగ్తో సరిహద్దును కలిగి ఉంది. ఇదిలా ఉండగా.. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్ చున్లో శుక్రవారం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. షాన్ డాంగ్ ప్రావిన్స్లోని యుచెంగ్లో కూడా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజింగ్లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్నినిషేధించారు. దీంతో చైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. -
చైనాలో కొత్త వేరియెంట్ విజృంభణ!
ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసే వార్త, కథనాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. చైనా నుంచి మరో వైరస్ పుట్టుకొచ్చిందని, కాదు కాదు కరోనాలోనే కొత్త వేరియెంట్ విజృంభిస్తోందని.. హడలెత్తించే పోస్టులు సోషల్ మీడియాలోనూ దర్శనమిచ్చాయి. ఈ తరుణంలో కరోనా లెక్కలతో దోబుచులాడుతున్న చైనాలో అసలేం జరుగుతుందనే విషయాన్ని కొన్ని రహస్య దర్యాప్తు మీడియా విభాగాలు బయటపెట్టే ప్రయత్నం చేశాయి. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్లో ఉన్న చాంగ్చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో ఇటీవల లాక్డౌన్లు విధించారు. ఒక్క చాంగ్చున్ పట్టణ పరిధిలో దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్నారు. కరోనా వైరస్ వెలుగు చూశాక వుహాన్ లాక్డౌన్ తర్వాత.. ఈ రేంజ్లో భారీగా లాక్ డౌన్ విధించడం ఇదే కావడం గమనార్హం. ఈ సిటీలో ప్రస్తుతం లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. ఈ విషయాలన్నీ చైనా అధికారిక మీడియా సంస్థ కూడా ధృవీకరించింది. అసలు విషయం ఏంటంటే.. ఈ తరుణంలో ప్రస్తుతం విజృంభిస్తోంది కరోనా వైరస్సేనని, అందులో శరవేగంగా వ్యాపించిన ఒమిక్రాన్ వేరియెంట్ కేసులేనని స్పష్టత ఇచ్చాయి ఇండిపెండెంట్ మీడియా హౌజ్లు. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధించారట. శుక్రవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదుకాగా, చాంగ్చున్లో దాదాపు నాలుగు వందల కేసులు, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. బయటి ప్రపంచానికి తెలిసి.. సుమారు రెండేళ్ల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. శుక్రవారం నాడు నమోదైన కేసుల్లో.. అత్యధికంగా న్యూజిలాండ్ తొలిస్థానంలో ఉంది. చైనాలో మాత్రం 1,369 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో చాలావరకు ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి. దీంతో ప్రతీ ముగ్గురిలో ఒకరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. కరోనా వైరస్ నుంచి ఎలాగోలా బయటపడిపోయామంటూ ఊపిరి పీల్చుకుంటున్న దేశాలు.. చైనాలో కొత్త వైరస్, వేరియెంట్ వార్తలతో ఆందోళనకు గురయ్యాయి. అయితే చైనాలో విజృంభిచేది ఒమిక్రాన్ వేరియెంట్ అని, ప్రమాదకరమైంది కాదని సైంటిస్టులు ఊరట ఇస్తున్నారు. భారత్లో మరో వేవ్ కష్టమేనని, అయినా అప్రమత్తంగా ఉండడం మంచిదన్న సంకేతాలు ఇటీవలె వైద్య నిపుణులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ తర్వాత.. గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్ డాంగ్, జిలిన్, షాన్ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో కట్టడి ద్వారా కేసుల్ని నియంత్రించుకోగలిగింది చైనా. అయితే జీరో కోవిడ్ టోలరెన్స్ పేరిట దారుణంగా వ్యవహరించిన దాఖలాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. వింటర్ ఒలింపిక్స్ ఈవెంట్స్ ముగిశాక జనసంచారం పెరిగిపోవడంతో ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి అంతే. మరోవైపు హాంకాంగ్లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయట. దీంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితికి తగ్గట్లుగా అధికారులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇది అసలు సంగతి. -
నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం
‘‘ఉక్రెయిన్ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్ ఫేమస్ అయ్యారు. సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్ అమన్ను తీసుకొచ్చుకునేందుకు బోధన్ ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సాలంపాడ్ క్యాంప్ విలేజ్లో గవర్నమెంట్ టీచర్గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్ సుమీ స్టేట్ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్లో అతను ఆశ్రయం పొందుతున్నాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్ కలెక్టర్కు లేఖ కూడా రాశారు. -
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. 706 రోజుల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. 2020 మార్చి 24 కోవిడ్ తొలి లాక్డౌన్ వేళ నిలిచిన విషయం తెలిసిందే. రైల్వేచరిత్రలో ఇంత సుదీర్ఘకాలం రైళ్లు స్తంభించిన సందర్భం లేదు. కోవిడ్ వల్ల తొలిసారి ఆ పరిస్థితి ఎదురైంది. కోవిడ్ ఆంక్షలను తొలగించేకొద్దీ విడతలవారీగా రైళ్లను తిరిగి పునరుద్ధరించినా, ప్యాసింజర్ రైళ్లకు పచ్చజెండా ఊపలేదు. 706 రోజుల తర్వాత అన్రిజర్వ్డ్ ప్రయాణాలకు అనుమతినిస్తూ, కోవిడ్ ముందు ఉన్న తరహాలో ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేబోర్డు అనుమతించింది. కోవిడ్ ప్రబలుతుందని... కోవిడ్ మొదటిదశ తీవ్రత తగ్గిన తర్వాత మూడు నెలలకాలంలో 80% ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించారు. పండగల కోసం కొన్ని స్పెషల్ రైళ్లు నడిపించారు. రెండోదశ లాక్డౌన్తో మళ్లీ రైళ్లకు బ్రేక్పడింది. మళ్లీ తొందరగానే ఎక్స్ప్రెస్, స్పెషల్ రైళ్లను తిరిగి ప్రారంభించారు. కానీ, ఎంత రద్దీ పెరిగినా ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించలేదు. చివరకు స్టేషన్లకు వచ్చే రద్దీని నిలువరించలేక తప్పని పరిస్థితిలో కొన్ని ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించినా, వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లుగానే నడిపారు. అన్రిజర్వ్డ్ టికెట్లు జారీ చేస్తే బోగీల్లో రద్దీ పెరిగి కోవిడ్ ప్రబలుతుందని అధికారులు పేర్కొంటూ వచ్చారు. చదవండి: (ఆ మానవ మృగాన్ని అరెస్ట్ చేయకపోవడం దారుణం: బండి సంజయ్) ఇదీ అసలు కారణం... దక్షిణమధ్య రైల్వేలో 230 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. రోజుకు సగటును పదిన్నర లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తే, అందులో 8 లక్షలమంది ప్యాసింజర్ రైళ్లలోనే తిరుగుతారు. కానీ, ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధర నామమాత్రంగా ఉండటంతో వాటి ద్వారా భారీ నష్టాలు వచ్చిపడుతున్నాయి. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణవ్యయంలో 20 శాతం మాత్రమే టికెట్ ద్వారా తిరిగి వసూలవుతుంది. అంటే, 80 శాతం నష్టాలేనన్నమాట. ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా కలుపుకుంటే, మొత్తం నిర్వహణ వ్యయంలో 65 శాతం తిరిగి వసూలవుతాయి. దీంతో వాటిని నడిపే విషయంలో అధికారులు ఆసక్తి చూపలేదన్న అభిప్రాయముంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 230 ప్యాసింజర్ రైళ్లకుగాను 160 రైళ్లు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్ల తరహాలో అన్రిజర్వ్డ్ టికెట్లు లేకుండా నడుస్తున్నాయి. ఇవి ఇక కోవిడ్ ముందు ఉన్న ప్యాసింజర్ రైళ్ల తరహాలో నడుస్తాయి. ఇప్పటికీ ప్రారంభం కాకుండా ఉన్న మిగతా ప్యాసింజర్ రైళ్లను దశలవారీగా ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. -
గతేడాది తగ్గిన విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరుసగా ఆరేళ్లపాటు విద్యుత్ వినియోగం పెరగ్గా, 2020–21లో స్వల్పంగా తగ్గింది. 2014–15లో 39,519 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్ వినియోగం, క్రమంగా పెరుగుతూ 2019–20 నాటికి 58,515 ఎంయూలకు చేరింది. 2020–21లో 57,006 ఎంయూలకు పడిపోయింది. కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించడంతో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటమే ఇందుకు కారణం. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. పదవికి ఎసరు?
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాదంలో ఇరుకున్నారు. దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని నివాసం ఉన్న డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన ఓ పార్టీ వ్యవహారానికి సంబంధించిన కేసులో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను పంపించారు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గాను ఆయనకు వారం రోజుల గడువు విధించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. అయితే, కోవిడ్ వ్యాప్తి కారణంగా బ్రిటన్లో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో డౌనింగ్ స్ట్రీట్ నంబర్ 10లో మందు పార్టీలు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ పార్టీలకు అధికార పార్టీకి చెందినవారు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రధాని దంపతులతోపాటు దాదాపు 50 మందికి పోలీసులు పలు ప్రశ్నలను సంధిస్తూ లేఖలు పంపారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై పలువురు మాజీ నేతలు జాన్సన్పై విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను ప్రధాని ఉల్లంఘిస్తే ఆయన జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత ఐయాన్డంకన్ స్మిత్ మాట్లాడుతూ.. ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన పదవిలో కొనసాగడం కష్టమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
‘లాక్డౌన్’ కోసం పక్కా ప్లాన్.. రూ.2 లక్షలు ఇచ్చి కిడ్నాప్, ప్రేమతోనే అలా?
సాక్షి, చెన్నై: తమిళనాడులోని చైన్నై అంబత్తూరు గాంధీ నగర్లో ఒడిశాకు చెందిన కిషోర్, పుత్తిని దంపతుల కుమారుడు లాక్డౌన్(ప్రకాష్) ఆదివారం కిడ్నాప్ కాగా, మంగళవారం కోయంబేడు బస్టాండ్లో ఓ బస్సులో ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును అంబత్తూరు పోలీసులు విచారించారు. పోలీసులకు భయపడి.. గాంధీ నగర్ భవన నిర్మాణం ఇంజినీరుగా ఉన్న ఈరోడ్కు చెందిన బాల మురుగన్(28)కు బాలుడు లాక్డౌన్ బాగా నచ్చాడు. దీంతో అక్కడే పనిచేస్తున్న ఒడిశాకు చెందిన దుశ్యంత్(25) ద్వారా లాక్డౌన్ను కిడ్నాప్కు పథకం వేశాడు. ఇందుకోసం దుశ్యంత్కు రూ.2 లక్షలు ఇచ్చాడు. పథకం ప్రకారం ఆదివారం కిడ్నాప్ చేసి అదేరోజు రాత్రే లాక్డౌన్ను కడలూరుకు బాల మురుగన్ తీసుకెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన మహిళ వలర్మతి(53)తో బాలున్ని చూసుకోవాలని కోరాడు. అయితే వ్యవహారం పోలీసులు, మీడియా వరకు వెళ్లడంతో ఆమె నిరాకరించింది. దీంతో అతను కడలూరు నుంచి చెన్నైకు వచ్చిన బస్సులో బాలున్ని నిద్ర పుచ్చి జారుకున్నాడు. అయితే ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పిల్లలను పోషించేందుకు కిషోర్ దంపతులు పడుతున్న కష్టాన్ని చూసి తాను లాక్డౌన్ను తీసుకెళ్లాని బాల మురుగన్ విచారణలో చెప్పాడు. అయితే నిందితుడితో పాటు అతడికి సహకరించిన దుశ్యంత్, వలర్మతిని పోలీసులు అరెస్టు చేశారు. -
‘లాక్ డౌన్’ దొరికాడు! 2 రోజుల తర్వాత బస్సులో ప్రత్యక్షం
సాక్షి, చెన్నై : అంబత్తూరులో అదృశ్యమైన చిన్నారి ‘లాక్డౌన్’ బుధవారం కోయంబేడు బస్టాండ్లోని ఓ బస్సులో ప్రత్యక్షం అయ్యాడు. ఈ బిడ్డను కిడ్నాప్ చేసి ఇక్కడ పడేసిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. చెన్నై అంబత్తూరు గాంధీనగర్లో ఓ భవనం నిర్మాణ పనుల్లో ఒడిశాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కిషోర్, పుత్తిని దంపతులు కూడా ఉన్నారు. వీరికి ఆకాష్, లాక్డౌన్(ప్రకాష్) అనే చిన్నారులు కూడా ఉన్నారు. ఏడాదిన్నర వయస్సు కల్గిన ప్రకాష్ సరిగ్గా లాకౌడౌన్ సమయంలో జన్మించాడు. అందుకే ఆ బిడ్డకు లాక్డౌన్ అని నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తమతో పాటుగా గుడిసెలో నిద్రించిన బిడ్డ అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు అంబత్తూరు పోలీసుల్ని ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ రామస్వామి నేతృత్వంలో బృందం దర్యాప్తులో నిమగ్నమైంది. కాగా బుధవారం కోయంబేడు బస్టాండ్లో చెన్నై నుంచి సేలంకు వెళ్లే బస్సులో చిన్నారి లాక్డౌన్ ప్రత్యక్షం అయ్యాడు. డ్రైవర్ గుర్తించి కోయంబేడు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అన్ని పత్రికల్లో లాక్డౌన్ అదృశ్యం వార్త, ఫొటోలు రావడంతో ఆ బిడ్డను పోలీసులు గుర్తించారు. బస్సులో లాక్డౌన్ దొరికినట్టు అంబత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. -
Priyanka Nanda: గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్గా పోటీ!
Priyanka Nanda Contest In Panchayat Polls: మనలో మొలకెత్తిన ఒక ఆలోచన కొత్త మార్గాన్ని తెలుసుకునేదై ఉండాలి. ఆ ఆలోచనను ఆచరణలో పెడితే అది ఉత్తమమైన మార్గం వైపు సాగేలా ఉండాలి. ప్రియంకానంద ఆలోచన, ఆచరణ ఉన్నతి వైపుగా అడుగులు వేయించింది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి, తన గ్రామంలోని ఇరుకు రోడ్ల గతుకుల బతుకులను మార్చడానికి ప్రయాణమైంది. ఒరిస్సాలోని బలంగిర్ జిల్లాలోని ధులుసర్ గ్రామానికి చెందిన ప్రియంకానంద తన ఊళ్లో స్కూల్ చదువు పూర్తవగానే భోపాల్కి వెళ్లిపోయింది. అక్కడే పై చదువులు చదువుకుంది. కాలేజీ చదువులు పూర్తి చేసుకునే క్రమంలోనే గ్లామర్ ప్రపంచంవైపుగా అడుగులు వేసింది. ర్యాంప్ షోలలో పాల్గొంది. అందాల పోటీలలో టైటిల్స్ ఎన్నో గెలుచుకుంది. 2015 నుంచి మోడల్గా పనిచేస్తోంది. ఫస్ట్ ఇండియా రన్వే దివా బ్యూటీ పోటీలో పాల్గొని ఐదవస్థానంలో నిలిచింది. 2020లో ఇండియా స్టైల్ ఐకాన్ పోటీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం చేసింది. లాక్డౌన్ సమయంలో తన ఊరు ధులుసర్ గ్రామానికి వచ్చిన ప్రియాంకానంద దృష్టి అక్కడ ప్రజల మీద పడింది. తన చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేని ఊరి పరిస్థితులు ఆమెను ఆలోచనల్లో పడేలా చేశాయి. మోడలింగ్లో తనకు ఎన్నో అవకాశాలు రావచ్చు. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. డబ్బు సంపాదించడంలో అన్ని రకాల అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లచ్చు. ‘కానీ, ఎంతవరకు..? నా ఊరు లాంటి ఎన్నో ఊళ్ల పరిస్థితులు మార్చాలంటే ఇక్కడే ఉండాలి. గ్రామాభ్యుదయానికి పాటుపడే పని చేయాలి’ అనుకుంది. ఆ అనుకోవడానికి ఇటీవల వచ్చిన అవకాశం గ్రామ సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ పోటీలో బరిలో దిగి, వీధి వీధి తిరుగుతూ ‘మీ కోసం వచ్చాను. బాగు చేసే అవకాశం ఇవ్వండి’ అంటూ ఓట్లను అడుగుతోంది. గ్లామర్ ప్రపంచంలో బ్యూటీ గర్ల్ అని పిలిపించుకునే ప్రియంకానంద ఒక మంచి పని కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత ఆలోచనలు దేశాభ్యున్నతి వైపుగా కదలాలి అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ప్రియాంకానంద గెలిచి తన ఆలోచనలు అమలులో పెట్టే అవకాశం రావాలని అంతా కోరుకుంటున్నారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? -
పార్టీ గేట్ వివాదం; బ్రిటన్ ప్రధానికి షాక్
లండన్ : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చుట్టూ బిగుసుకున్న పార్టీ గేట్ వివాదం మరింత ముదురుతోంది. కరోనా మహమ్మారి కోరలు చాచిన వేళ తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో విందులు వినోదాలు చేసుకున్నారన్న వివాదంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 జూన్ 19న జాన్సన్ 59వ పుట్టిన రోజునాడు కేక్ పార్టీ జరిగినట్టు తమకు సమాచారం అందిందని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పార్టీ గేట్ వివాదంపై ఇంటర్నల్ కేబినెట్ ఆఫీసు ఎంక్వయిరీ జరుగుతోంది. ఈ వారంలో దాని నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ విచారణ సందర్భంగానే జాన్సన్ బర్త్ డే రోజు కూడా పార్టీ జరిగిందని వెల్లడైంది. గత రెండేళ్లలో డౌనింగ్ స్ట్రీట్, వైట్ హాలులో లెక్కలేనన్ని పార్టీలు జరిగాయని వాటిపై మెట్రోపాలిటన్ పోలీసుల బృందం విచారణ జరుపుతుందని కమిషనర్ డేమ్ క్రెస్సిడా డిక్ చెప్పారు. మరోవైపు 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధులు మాత్రం జాన్సన్ తన పుట్టినరోజు నాడు సి బ్బంది శుభాకాంక్షలు చెప్పడానికి వస్తే కేవలం 10 నిముషాలే ఉన్నారని వాదిస్తున్నారు. (చదవండి: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?) -
Weekend Curfew: వీకెండ్ లాక్డౌన్ ఎత్తివేత
సాక్షి, బెంగళూరు: కరోనా కట్టడిలో భాగంగా విధించిన వీకెండ్ లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కోవిడ్పై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన శుక్రవారం కృష్ణా అతిథి గృహంలో అత్యవసర సమావేశం జరిగింది. హోం, ఆరోగ్య, విద్య, జలవనరుల శాఖల మంత్రులు, బీబీఎంపీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ మీడియాకు వెల్లడించారు. ఈ నెలారంభం నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. దీనికితోడు వారాంతపు నిర్బంధంతో ఇబ్బందులు పడుతున్నట్లు సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు వీకెండ్ లాక్డౌన్ వెనక్కి తీసుకున్నట్లు మంత్రి ఆర్.అశోక్ వెల్లడించారు. బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొనసాగుతాయన్నారు. రాత్రి కర్ఫ్యూ యథావిధిగా ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!) బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేదన్నారు. పబ్లు, క్లబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో జనాలు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. కాగా బెంగళూరులో మరి కొన్ని రోజుల పాటు పాఠశాలలు మూతపడే ఉంటాయని, వచ్చే వారం నిపుణులతో మరోసారి సమావేశమై పాఠశాలల పునఃప్రారంభంపై తుది నిర్ణయం ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ తెలిపారు. -
శనివారం రాత్రి నుంచే పూర్తి లాక్డౌన్
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆదివారం జనవరి 23న పూర్తి లాక్డౌన్ విధించింది. అయితే ఈ లాక్డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఈ నెల ప్రారంభంలోనే తమిళనాడు ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జనవరి 9 నుంచి ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాక మిగతా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించింది. అయితే పాల దుకాణాలు ఏటీఎం కేంద్రాలు, ఆసుపత్రులు, సరుకు రవాణ, పెట్రోల్ బంక్లు అనుమతించింది. కాగా రెస్టారెంట్లు, హోటళ్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ డెలివరీ సౌకర్యాలతో పాటు టేకౌట్ సేవలను అందిస్తాయని తెలిపింది. ఈ మేరకు తమిళనాడులో గురువారం 24 గంటల్లో 28,561 కొత్త కోవిడ్-19 కేసులు, 39 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,79,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: ఉగ్రరూపం దాల్చిన కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా ఎన్నంటే!) -
‘ఈ నెల 25 తరువాత పతాకస్థాయికి కోవిడ్.. అయినా లాక్డౌన్ ఉండదు’
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో వారం రోజుల నుంచి భారీఎత్తున నమోదవుతున్న కరోనా ఉధృతి కొనసాగింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,156 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 7,827 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 14 మంది కోవిడ్తో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 32,47,243 కరోనా కేసులు రాగా, 29,91,472 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం మరణాలు 38,445 కి పెరిగాయి. కరోనా పాజిటివిటీ 12.45 శాతంగా నమోదైంది. 0.05 శాతంగా మరణాల రేటు ఉంది. అయితే గత రెండురోజులతో పోలిస్తే కరోనా కేసులు కొంచెం తగ్గాయి. వారాంతపు లాక్డౌన్ ఇందుకు కారణమని భావిస్తున్నారు. బెంగళూరులో 1.57 లక్షల యాక్టివ్ కేసులు యథా ప్రకారంలో బెంగళూరులోనే ఎక్కువ కరోనా కేసులు సంభవించాయి. 15,947 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 4,888 మంది కోలుకోగా, ఐదుమంది మరణించారు. ప్రస్తుతం బెంగళూరులో 1,57,254 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,17,297. కొత్తగా 2,16,816 డోస్ల టీకాలు వేయగా, 2,17,998 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కరోనా నూతన రూపం ఒమిక్రాన్ కేసులు విస్తరిస్తున్నాయి. కొత్తగా 287 కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 766 కి పెరిగాయి. చదవండి: కాస్త తగ్గిన కరోనా కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే లాక్డౌన్ ఉండబోదు బనశంకరి: ఈ నెల 25 తరువాత రాష్ట్రంలో కరోనా వైరస్ పతాకస్థాయికి చేరుకుంటుందని నిపుణులు తెలిపారు. వీకెండ్ లాక్డౌన్ కొనసాగించాలా, వద్దా అనేదానిపై త్వరలో చర్చిస్తాని రెవిన్యూ మంత్రి ఆర్.అశోక్ చెప్పారు. సోమవారం ఆయన సీఎంతో సమావేశం తరువాత విలేకరులతో మాట్లాడుతూ వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ గురించి శుక్రవారం సీఎం నిర్ణయం తీసుకుంటారని, అప్పటివరకు అవి కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని అన్నారు. లాక్డౌన్ గురించి చర్చించామని, సీఎంతో పాటు పలువురు మంత్రులు లాక్డౌన్ వద్దని అభిప్రాయపడ్డారని తెలిపారు. 144 సెక్షన్ పొడిగింపు బెంగళూరులో ఈ నెల 19 వరకు అమల్లో ఉన్న 144 సెక్షన్ నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు విస్తరించారు. ఎలాంటి సభలు, సమావేశాలు జరపడానికి వీలు ఉండదు. -
దేశంలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్
-
Omicron Alert: ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్!
Omicron Alert: తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్- 19 ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు పలుఆంక్షలు విధించినప్పటికీ, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు తెల్పింది. దీంతో రెస్టారెంట్లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయి. ఐతే టేక్అవే, ఫుడ్ డెలివరీ పద్ధతుల్లో మాత్రమే వాటి కార్యకలాపాలు నిర్వహించుకోవల్సి ఉంటుంది. రద్దీగా ఉండే రహదారులు, మార్కెట్లు, మాల్స్తోపాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో జనవరి 9 నుంచి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఐతే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత ఊర్లకు వెళ్లేందుకుగానూ తమిళనాడు ప్రభుత్వం 75% ఆక్యుపెన్సీతో ప్రయాణాలకు అనుమతిచ్చింది. అంతేకాకుండా జనవరి 14 - 18 వరకు రద్దీని నివారించేందుకు అన్ని ప్రార్ధనా స్థలాలను ప్రభుత్వం మూసివేసింది. ఐతే ఆదివారం లాక్డౌన్ సమయాల్లో.. విమానాలతో సహా ఇతర పబ్లిక్ రవాణా సేవలు తప్ప, మిగతా అంతటా పూర్తి స్థాయిలో లాక్డైన్ అమల్లో ఉంటుంది. వివాహాలు, వేడుకలకు 100 మందికి మించి పాల్గొనరాదు. 1 నుంచి 9 తరగతుల పాఠశాలల మూత, పరిమిత సీటింగ్ కెపాసిటీతో కోచింగ్ సెంటర్లు, పబ్లిక్ రవాణా సేవలపై పరిమితులు జనవరి 31 వరకు పొడిగింపబడ్డాయి. కాగా ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రోజు వారి కరోనా కేసుల్లో శనివారం ఒక్కరోజే 23,978 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 23 వేల మార్కును వరుసగా రెండో రోజు కూడా దాటాయి. గడచిన 24 గంటల్లో 11 మంది మృతి చెందగా, 11 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,31,007 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. జనవరి 9 నుంచి ఆదివారం లాక్డైన్ అమల్లో కొచ్చింది. నేడు రెండో ఆదివారం కావడంతో అక్కడ రోడ్లన్నీ నిర్మానుష్యంగా గోచరిస్తున్నాయి. చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు! -
సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ అంటూ చర్చ.. మంత్రి క్లారిటీ
సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్కు అవకాశమే లేదని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్ పరీక్షలను రాష్ట్రంలో నిలిపివేయడంతో పాటు.. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి ఉచితంగా పల్స్ ఆక్సీమీటర్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఉద్ధృతి పెరిగింది. గత ఐదురోజులుగా రోజుకు 14 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం కలవరం రేపుతోంది. చెన్నైలో 4072 వీధుల్లో కరోనా వ్యాప్తి చెందింది. ఇందులో 300 మేరకు వీధుల్ని కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి తెచ్చారు. నైట్ కర్ఫ్యూను ఈనెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యం మినహా తక్కిన కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, 10,12 తరగతుల విద్యార్థులకు మాదిరి పరీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక, నైట్కర్ఫ్యూను పొడిగిస్తూ సోమవారం రాత్రి వెలువడ్డ ప్రకటనలోని కొన్ని అంశాల మేరకు సంక్రాంతి తదుపరి రాష్ట్రంలో ఫుల్ లాక్డౌన్ అమలయ్యే అవకాశాలు అధికంగానే ఉంటాయన్న చర్చ ప్రారంభమైంది. దీంతో తమ ఆర్థిక పరిస్థితులపై ఆందోళన ప్రజల్లో పెరిగింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు స్వస్థలాలకు క్యూకట్టారు. కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్ తదితర జిల్లాల్లోని వస్త్ర, ఇతర పరిశ్రమల్లోని కార్మికుల్లో లాక్డౌన్ ఆందోళన కలవరపరిచింది. చదవండి: నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ ఆర్థిక నష్టాలను అంచనా వేశాకే.. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి వైద్య చికిత్స అందించడంతో పాటుగా ఉచితంగా ఆక్సిమీటర్ల పంపిణీని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ మంగళ వారం తిరువాన్మీయూరులో ప్రారంభించారు. అడయార్లో కమిషనర్ గగన్ దీప్సింగ్ బేడీ, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్తో భేటీ అనంతరం మీడియాతో సుబ్రమణియన్ మాటాడారు. తమిళనాడులో సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయి లాక్డౌన్ అమలయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. లాక్ కారణంగా ప్రజలకు ఎదురయ్యే ఆర్థిక కష్టాల్ని సీఎం స్టాలిన్ ఇప్పటికే అంచనా వేశారన్నారు. చదవండి:Supreme Court: ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణకు ప్రత్యేక కమిటీ ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన 85 శాతం మందిలో ఎస్జీన్ చాయలే ఉన్నాయని, వీరికి ఒమిక్రాన్ పరీక్ష నిర్వహించి.. ఆ ఫలితాలు వచ్చేలోపు ఆరోగ్యంగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఒమిక్రాన్ పరిశోధన నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, సీఎం ఎంకే స్టాలిన్ బూస్టర్ డోసు వ్యాక్సిన్చేయించుకున్నారు. ఆరోగ్య రక్షణకు టీకా కవచం అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తిరుపత్తూరు ఎమ్మెల్యే నల్లతంబి, తిరుప్పూర్ ఎమ్మెల్యే విజయకుమార్ కరోనా బారిన పడ్డారు. -
అమెరికాలో ఒకే రోజు 13.5 లక్షల కేసులు
వాషింగ్టన్: అమెరికా ఒమిక్రాన్ బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడమే తప్ప తగ్గుదల కనిపించడం లేదు. ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా 13 లక్షల 50 వేల కేసులు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రాలేవీ కేసులు రికార్డు చేయని కారణంగా సోమవారం నాటికి తారాస్థాయికి కేసులు చేరుకుంటున్నాయి. గత 3 వారాల్లో ఆస్పత్రులో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. వర్జీనియా, టెక్సాస్, కెంటకీ, కన్సాస్, చికాగోలలో వైద్యుల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చైనాలో మరో నగరంలో లాక్డౌన్ కోవిడ్–19 విలయానికి చైనాలో మూడో నగరం మూతబడింది. 55 లక్షల జనాభా ఉన్న అన్యాంగ్ నగరంలో లాక్డౌన్ విధించి మూకుమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జియాన్, యుఝో నగరాల్లో లాక్డౌన్ విధించారు. మూడు అతిపెద్ద నగరాల్లో లాక్డౌన్ విధించడంతో దాదాపుగా 2 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. -
చైనాలో పెరుగుతున్న ఒమిక్రాన్.. మరో సిటీలో లాక్డౌన్
బిజింగ్: చైనాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్లోని అన్యాంగ్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించిన అనంతరం లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చైనాలో లాక్డౌన్ విధించిన మూడో నగరమిది. కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నియంత్రించడంలో భాగంగా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అన్యాంగ్ నగరంలోని ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు సూచించారు. నగరవాసుల వాహనాల వినియోగాన్ని నిషేధించారు. సోమవారం ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ సోకగా, మంగళవారం మరో 58 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు జియాన్, యుజౌవు నగరాలను చైనా లాక్డౌన్తో దిగ్భంధించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదన్న సీఎం కేజ్రీవాల్
-
కోవిడ్ నుంచి కోలుకున్న కేజ్రీవాల్.. ఢిల్లీలో లాక్డౌన్పై క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే.. లాక్డౌన్ అవసరం ఉండదని తెలిపారు. థర్డ్ వేవ్ ఉధృతి తక్కువగానే ఉందని.. వైరస్ కట్టడికి కొన్ని ఆంక్షలు అమలుచేస్తే సరిపోతుందని ఆదివారం ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ రేపు మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, ఇటీవల కరోనాబారినపడ్డ అరవింద్ కేజ్రీవాల్ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నెల 4న ఆయనకు వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు. స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి వైరస్ను జయించారు. (చదవండి: భారత్లో థర్డ్వేవ్.. మొదటి వారంలో ఆర్– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు) करोना से ठीक होकर मैं वापिस आपकी सेवा में हाज़िर हूँ। — Arvind Kejriwal (@ArvindKejriwal) January 9, 2022 -
తమిళనాడు పాక్షిక లాక్డౌన్తో ఆర్టీసీ అప్రమత్తం
సాక్షి, అమరావతి: తమిళనాడులో రాత్రివేళ లాక్డౌన్ విధించడంతో ఏపీఎస్ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు తమిళనాడులో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్షిక లాక్డౌన్ అమలులోకి వచ్చినందున బస్ సర్వీసుల విషయంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం పలు సూచనలు చేశారు. తమిళనాడు వైపు వెళ్లే బస్సుల్లో 50 శాతం మాత్రమే సీట్లు భర్తీ చేయాలని, సిబ్బంది రెండు సార్లు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని, ఇతర కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. తమిళనాడులో లాక్డౌన్ అమలులోకి వచ్చే సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఏపీ బోర్డర్కు చేరుకోవాలని సూచించారు. -
ఇదే కొనసాగితే లాక్డౌన్ అమలు చేయక తప్పదు!
సాక్షి, ముంబై: కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రం కావడంతో కోవిడ్ నిబంధనలు పాటించని పక్షంలో లాక్డౌన్ అమలు చేయక తప్పదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హెచ్చరించారు. కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజుకోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జాల్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైన మించిపోయిందేమి లేదని, లాక్డౌన్ వద్దనుకుంటే కరోనా నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని లేని పక్షంలో ఆంక్షలు మరింత కఠినం చేయాల్సి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగడంవల్లే కేసులు పెరుగుతున్నాయన్నారు. దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో 1.17 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్క మహరాష్ట్రలోనే 36 వేల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ముందుజాగ్రత్తగా చర్యగా ఇప్పటి నుంచి కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. జనాలరద్దీని తగ్గిస్తే కేసులు అదుపులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లు, నాట్యగృహాలు, ఆలయాలు మూసివేత విషయంపై ఇంకా ఓ నిర్ణయాని కి రాలేదని, అనేక జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించామన్నారు. ముంబైలోని ధారావిలో ఇటీవలే వేయి రూపాయలకే నకిలీ యూనివర్సల్ పాస్ జారీచేసే ముఠాను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. చదవండి: (ఒకే వేదికపై నారా, గాలి!) ఈనెల 10 తర్వాత బూస్టర్ డోస్ తాజా పరిస్థితులపై ప్రతీరోజు ఉదయం ఫోన్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చర్చిస్తున్నారని మంత్రి టోపే తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా..? వద్దా..? లేక ఆంక్షలు మరింత కఠినం చేయాలా..? అనే దానిపై తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ను నియంత్రించడానికి కరోనా టీకాలను మరింత వేగవంతం చేయాలని సూచనలు జారీ చేశామన్నారు. ఈ నెల పదో తేదీ తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రజలు టీకా తప్పనిసరి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కోవిడ్ సమయాలు.. చిన్న చిన్న సంతోషాలకు స్వాగతం
పెరట్లో కొమ్మల గుబురు మాటున ఒక జామ పిందె లేత పసుపు కాయగా ఎదుగుతుంది. చూట్టానికి మనకు టైం ఉండదు. ఇంట్లో పిల్లవాడు హోమ్వర్క్ చేస్తూ చేస్తూ ఏదో అర్థం లేని కూనిరాగం అద్భుతంగా తీస్తాడు. వినడానికి మనకు టైం ఉండదు. దారిన పోతూ ఉంటే సూర్యుడి మీదకు మబ్బు తెరగట్టి చల్లటిగాలిని విసురుతుంది. ఆస్వాదించడానికి సమయం లేదే. అప్పుడే పుట్టిన దూడ చెంగనాలు వేస్తుంది. మనం బైక్ కిక్ కొట్టి ఎటో వెళ్లిపోతూ ఉంటాం. ఆగండ్రా... ఎక్కడికి ఆ పరుగు అని చెప్పడానికే మహమ్మారి పదే పదే వస్తున్నట్టుంది. లాక్డౌన్ విధించినా ఇంటి పట్టున ఒక్కరోజు ఉండలేనంత పరుగుకు అలవాటు పడిపోయాం. హాసం లాస్యం స్నేహం సౌఖ్యం నెమ్మది స్థిమిత మది వీటికి దగ్గరవ్వాలి. పిల్లలకూ దగ్గర చేయాలి. 2007. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి మెట్రో స్టేషన్. శీతగాలులు వీస్తున్న జనవరి నెల. ఉదయం పూట. ఒక మూల ఒక వయొలినిస్టు నిలబడి తన అద్భుతమైన వయొలిన్ వాదన మొదలెట్టాడు. అతని చేతిలోని ‘బౌ’ ఆరోహణ అవరోహణ చేస్తుంటే వేళ్లు తీగలను నిమురుతూ స్వరాలను పలికిస్తున్నాయి. జనం వస్తున్నారు. వెళుతున్నారు. స్వింగ్డోర్లు తెరుచుకుంటున్నాయి. మూసుకుంటున్నాయి. 45 నిమిషాలు అతను కచేరి చేస్తూ ఉంటే 1,097 మంది అతని ముందు నుంచి రాకపోకలు సాగించారు. కేవలం 7 మంది ఆగి మొత్తం కచ్చేరి విన్నారు. తల్లులతో వెళుతున్న పిల్లలు కుతూహలంతో ఆగబోతే తల్లులు వారిని లాక్కుంటూ తీసుకెళుతుంటే పిల్లలు తలలు తిప్పి ఆ వయొలినిస్ట్ను చూస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. 27 మంది అంత బిజీలోనూ ఒక్క క్షణం ఆగి, ఆ సంగీతం మీద ఏ మాత్రం పట్టింపు లేకుండా, పోనీలే పాపం అని ఎదుట పరిచిన హ్యాట్లో చిల్లర వేసి వెళ్లారు. మొత్తం 32 డాలర్లు వచ్చాయి. ఆ ఉదయం, ఆ మెట్రో స్టేషన్ రద్దీలో, ఒక గొప్ప కచ్చేరి అనామకంగా ముగిసింది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మూగలేదు. ఆ కళాకారుణ్ణి భుజాల మీదకు ఎత్తుకోలేదు. కాని అంతకు రెండు రోజుల ముందు బోస్టన్లో అదే వయొలినిస్టు షో కోసం 100 డాలర్లు పెట్టి టికెట్ కొనడానికి జనం విరగబడ్డారు. ఆ వయొలినిస్టు ఇప్పటికే తన వయొలిన్ వాదనతో మూడున్నర మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అతడే సుప్రసిద్ధ అమెరికన్ వయొలిస్ట్ జాషువా బెల్. మనలో చాలా మందిమి ప్రత్యేక సందర్భాలలోనే కళకు, సౌందర్యానికి, ఆనందానికి, వినోదానికి సమయం ఇవ్వాలనుకుంటాం. కాని రోజువారి బిజీ జీవితంలో కేవలం ఉపాధికే సమయాన్ని వెచ్చించాలనుకుంటాం. కళ్ల ముందు అంత గొప్ప వయొలిన్ వాదన కూడా ఆ బిజీలో వెలవెలబోతుంటే ఎన్ని చిన్ని చిన్ని బతుకు చిత్రాలు సుందర జీవన సౌందర్యాలు మిస్ అయిపోతున్నామో కదా అని ఈ ‘సోషల్ ఎక్స్పెరిమెంట్’ రుజువు చేసింది. అందుకే సమయాన్ని బతుకు వెతుకులాటకే ఖర్చు చేయకండి... నడుమ చిన్ని చిన్న ఆనందాలని ఆస్వాదించండి. జాషువా బెల్ చెప్పినా, కోవిడ్ సమయాలు చెప్పినా సారం అదే. గత సీజన్లో లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా మంది ఆకాశాన్ని తేరిపార చూడగలిగారు సమయం చిక్కి. ఇళ్లల్లోనే ఉండటం వల్ల సాయంత్రాలు డాబా ఎక్కినప్పుడు శిరస్సు మీద పరుచుకున్న ఆ నీలిమ అంత అందంగా ఉంటుందా... ఎలా మిస్ అయ్యాం అనుకున్నవారు ఉన్నారు. బాల్కనీలోని మొక్కల్లో ఒక రక్తమందారం రెక్కలు విచ్చుకుని ఉంటుంది. అది ఏదో సంభాషిస్తూ ఉంటుంది. వస్తూ పోతూ ఉంటే విష్ చేస్తూ ఉంటుంది. కాని ఆగి చూసే సమయం ఎక్కడ? లాక్డౌన్ వస్తే తప్ప సాధ్యం కాలేదు. అపార్ట్మెంట్ గేట్ ముందు వీధికుక్క నెల క్రితం కన్న పిల్లలు ఆడుకుంటుంటాయి. ఈ లోకం మీద విశ్వాసంతో మమ్మల్ని ఎవరో ఒకరు చూసుకుంటారులే అని అటూ ఇటూ గునగున నడుస్తూ ఉంటాయి. పిల్లలు కనిపిస్తే తోకలు ఊపుతాయి. వాటి దైవికమైన మూగ సౌందర్యాన్ని దర్శించామా. రోజువారి పరుగులో దర్శించేందుకు కన్నులు తెరుస్తున్నామా? మన ఇంటి పనిమనిషికి ఒక పదేళ్లు కూతురు ఉన్నట్టు మనకు తెలియదు. మాసిన గౌన్ వేసుకున్న ఆ పాప ఎప్పుడైనా వచ్చినా సిగ్గుకొద్దీ తల్లి కొంగు వదలదు. ‘ఇలా రా’ అని ఆ పాప చేతుల్లో కొత్త డ్రస్సు ఒకటి పెట్టి ఆ పిల్ల తెల్లటి కన్నుల్లో మెరిసే సంతోషాన్ని చూస్తున్నామా? కొత్తది ఇవ్వలేకపోయినా మన పిల్లవాడు గత సంవత్సరం వాడి పక్కన పెట్టిన స్కూల్ బ్యాగ్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇచ్చామా? చినుకుల జడి. చిన్న చిన్న బిందువులు జలధి. బుజ్జి బుజ్జి సంతోషాలు... జీవితం. ఈ జీవితానికి అర్థం ఏమిటి అని చాలామంది అంటుంటారు. అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... కవి చెప్పలేదా? పశువులకు కూడా తెలుసు పాటకు మోర ఎత్తాలని. మంచి సంగీతం వినడానికి కూడా సమయం లేదా? బైక్ మీద రోడ్పై వెళుతుంటే అంధుల బృందం మైక్ సెట్ పెట్టుకుని పాడుతూ ఉంటుంది. ఒక నిమిషం ఆగి ఒక పాటైనా విని ‘బాగా పాడారు’ అని చెప్పి పది రూపాయలు ఇస్తే ఈ చీకటి కళ్లల్లో వచ్చే సంబరం మనకు సంతృప్తి ఇవ్వదూ? సెల్ఫోన్ పక్కన పడేసి పక్కింటి మూడేళ్ల బుజ్జిగాణ్ణి తెచ్చుకుని వాడికి చిన్నప్పుడు విన్న నానమ్మ పాటో అమ్మమ్మ పాటో వినిపిస్తే వాడు లేత గులాబీరంగు పెదాలతో బోసిగా నవ్వి కళ్లు మిటకరిస్తూ చూస్తే... బదులు పాడితే మన అకౌంట్లో గుర్తు తెలియని అకౌంట్ నుంచి కోటి రూపాయలు పడిన దానితో సమానం. ఆ వేళ కొత్తిమీర పచ్చడి మనకు మనమే చేసుకున్నా... ఆ రాత్రి వంట మానేసి ఫుడ్ బజార్లో వేడి వేడి ఇడ్లీలు విసురు గాలిలో ఊదుకుంటూ తిన్నా ఆ ఆనందాన్ని కొలిచే కొలమానం లేదు. అప్పుడప్పుడు తీరిగ్గా కూచుని పాత ఆల్బమ్ తిరగేసినా, స్కూల్ నాటి ఫ్రెండ్ని ఫేస్బుక్లో పట్టుకుని పలకరించినా నింపిన టబ్లో పిల్లల కోసం బొమ్మ స్టీమర్ తిప్పినా చిట్టి పొట్టి చిరుతిళ్లు తినిపించినట్టే జీవితానికి. కొంపలు మునిగేదేమి లేదు... నిత్య పరుగులు లేకపోయినా మనం బతగ్గలం అని కరోనా పదే పదే మనకు చెబుతోంది. కాని మనమే వినడం లేదు. అది మ్యుటేషన్లు మార్చుకుంటోంది. మనం మన ధోరణి మార్చుకోవడం లేదు. ‘స్లో’ అనేది ఇటీవలి జీవన విధానం. ‘స్లో’గా ఉంటూ కూడా సంతోషంగా ఉండొచ్చేమో చూడండి. ఈ రెండు మూడు నెలలు గుంపుల్లో ఉండకుండా ఉరుకులు పరుగులు ఎత్తకుండా అనవసర ప్రయాణాలు చేయకుండా జీవితం ప్రసాదించి చిరు ఆనందాల ప్రసాదాన్ని ఆరగించండి. జయం. -
మహారాష్ట్రలో లాక్డౌన్?.. ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మరోసారి స్పష్టం చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, రాజేశ్ టోపే, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, తాజా పరిస్థితులపై పవార్, టోపే ఆరా తీశారు. రాష్ట్రంలో చాపకింద నీరులా రోజురోజుకూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న పవార్ వాస్తవాలు తెలుసుకునేందుకు టోపే, ఆరోగ్య శాఖ అధికారులతో స మావేశమయ్యారు. తాజా పరిస్థితులపై ప్రత్యామ్నాయ విధానాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వ్యాక్సినేషన్, లాక్డౌన్, కరోనా ఆంక్షలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంక్షలు సక్రమంగా అమలు కాకపోతే నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పవార్ నిర్ధేశించారు. రోగుల సంఖ్య పెరిగితే దుకాణాలు, సంస్థలు మూసివేయాలనే దానిపై కూడా చర్చ జరిగింది. అలాగే మాల్స్, రెస్టారెంట్లలో జనసమ్మర్థంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఈ విషయంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించని ప్రజలు, వాణిజ్య సముదాయాల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలని వారు ఆదేశించా రు. కరోనా టీకా విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని, సాధ్యమైనంత త్వరలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మోదీ పర్యటనలో భద్రతా లోపం.. సుప్రీంలో విచారణ ఇదిలాఉండగా ముంబైలో వీకెండ్ లాక్డౌన్పై కూడా చర్చలు జరిగినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్య మంత్రి తెలిపారు. ప్రస్తుతమైతే ఎక్కడా లాక్డౌన్ విధించే అలోచన ప్రభుత్వానికి లేదని వారు పునరుద్ఘాటించారు. ఇటీవల కూడా ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో లోకల్ రైలు ద్వారా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతానికి ఆ సేవలు నిలిపివేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కరోనా రెండు డోసుల టీకా తీసుకున్నవారినే రైళ్లలో అనుమతిస్తున్నామని, తగు జాగ్రత్తలతో రైళ్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. చదవండి: విదేశీ చేతుల్లోకి ఎల్ఐసీ! కేంద్రం కసరత్తు కాగా ముంబైలోనూ, రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 80 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ మాత్రం పెరగడం లేదని మంత్రి టోపే అన్నారు. ఇదిలాఉండగా శరద్ పవార్ కరోనా టీకా తీసుకుని 9 నెలలు కావస్తోంది. దీంతో ఆయన ఈ నెల 10వ తేదీన బూస్టర్ డోసు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
China: స్మార్ట్ఫోన్ బదులు బియ్యం! కూరగాయలకు బదులు..
ప్రపంచానికి కరోనా వైరస్ను అంటగట్టిందన్న అపవాదును మోస్తున్న డ్రాగన్ కంట్రీ.. వైరస్ కట్టడికి చేపడుతున్న చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. ఓవైపు కేసులు, మరణాల సంఖ్యను దాస్తూనే.. మరోవైపు జీరో కేసులంటూ ప్రకటనలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఒక్క కేసు కూడా బయటపడలేదంటూనే జియాన్ నగరంలో భారీ లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ పరిణామాలతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి కోటికి పైగా జనాభా ఉన్న జియాన్ మహానగరంలో లాక్డౌన్ అమలు అవుతోంది. కఠిన ఆంక్షలతో జనాలు అడుగు బయటవేయని పరిస్థితి నెలకొందక్కడ. మీడియా ఎలాగూ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా జనాలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకలి కేకలతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. Scenes from Xi’An lockdown: return of the barter economy 🚬 People can no longer leave their flats, even to shop. This resident makes light of the situation via Kuaishou, a TikTok-like social media platform pic.twitter.com/gsE9NnJnWz — Cindy Yu (@CindyXiaodanYu) January 3, 2022 ఓవైపు ప్రభుత్వమేమో.. తాము ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని ప్రకటించుకుంటోంది. కానీ, సోషల్ మీడియాలో జనాల ఆవేదన మరోలా ఉంటోంది. అసలు సహాయమే అందట్లేదని వాపోతున్నారు జియాన్ నగర వాసులు. ఈ మేరకు చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వెయిబోలో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. క్యాబేజీకి సిగరెట్, యాపిల్స్కు బదులుగా పాత్రలుతోమే లిక్విడ్, కూరగాయలకు బదులుగా శానిటరీ ప్యాడ్స్, రొట్టెలకు బదులు నూడుల్స్.. ఇలా వస్తు మార్పిడి ఇది అక్కడ కనిపిస్తోంది అక్కడ. ఎక్కువగా అపార్ట్మెంట్లలో ప్రజలు ఇలా వస్తు మార్పిడితో పొట్ట నింపుకుంటున్నారు. ఎమర్జెన్సీ అవసరాలకు సైతం.. లాక్డౌన్ ద్వారా ఎదుర్కొంటున్న పరిస్థితులపై రేడియో ఛానెల్స్ ఇంటర్వ్యూల ద్వారా పలువురు వాపోతుండడం విశేషం. బియ్యం కోసం ఏకంగా స్మార్ట్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను అమ్మేయడం, తాకట్టుపెట్టడం లాంటి పరిస్థితులు జియాన్ నగరంలో కనిపిస్తున్నాయి. కొందరు వయసుపైబడిన వాళ్లు.. పాత రోజుల్ని చూస్తున్నట్లు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓవైపు లాక్డౌన్ ఎప్పటిదాకా ఉంటుందో అనే గ్యారెంటీ లేకపోవడంతో.. ఫ్రిడ్జ్లను నింపేస్తున్నారు. మరికొందరు మాత్రం జాలి పడి.. ఇతరుకు దానం చేస్తున్న దృశ్యాలు సైతం కనిపిస్తున్నాయి. జియాన్ నగరంలో కరోనా కట్టడి సంగతి ఎలా ఉన్నా.. అధికారులు, ప్రభుత్వ తీరుపై మాత్రం విరుచుకుపడుతున్నారు జనాలు. తిండి కోసం క్వారంటైన్ సెంటర్లకు వెళ్తున్నారన్న కథనాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరో వైపు ఈ-కామర్స్ డెలివరీలకు, ఎమర్జెన్సీ వాహనాలకు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. గుండెపోటు, ఇతరత్ర ఆరోగ్య కారణాలతో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెయిబో అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. xi'an city When apartment building's gates locked and residents can't go out for groceries shopping... People go back to barter! 2022/1/2 pic.twitter.com/0NKBHmY1uI — Songpinganq (@songpinganq) January 2, 2022 కఠిన లాక్డౌన్తో చైనాలోని ఒక్కో ప్రాంతాన్ని బంధించుకుంటూ పోతోంది చైనా ప్రభుత్వం. కొన్ని ప్రాంతాలకే ఉచితంగా సరుకుల చేరివేత పరిమితంకాగా, కరోనా పరీక్షలకు సైతం సిబ్బంది వెనుకడుగు వేస్తుండడం విశేషం. మరోవైపు పోలీసులు జనాల్ని అడుగు తీసి బయటపెట్టనివ్వడం లేదు. చివరికి ఆస్పత్రులకు, అవసరాలకు సైతం బయట అడుగుపెట్టనివ్వడం లేదు. తాజాగా మూడే కేసులు వచ్చాయంటూ ప్రకటిస్తూ.. 11 లక్షల జనాభా ఉన్న యుజౌవు నగరాన్ని రాత్రికి రాత్రే లాక్డౌన్ పేరిట మూసేశారు. కొత్త సంవత్సర వేడుకలు, ఆ వెంటనే శీతాకాల ఒలింపిక్స్ ఉన్నందున ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సంబంధిత వార్త: వుహాన్ను మించిన లాక్డౌన్.. చైనా తీరుపై సంభ్రమాశ్చర్యాలు -
Telangana: త్వరలో పాక్షిక ఆంక్షలు దిశగా చర్యలు
-
కొత్త ఏడాదిలో ‘స్మార్ట్’గా ఫోన్ల అమ్మకాలు
ముంబై: కొత్త ఏడాదిలో స్మార్ట్ఫోన్లకు భారీ గిరాకీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఏడాదిలో 20 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా 5జీ ఫోన్లకు డిమాండ్ పెరగడంతో పాటు దిగ్గజ మొబైల్ కంపెనీల మధ్య పోటీతత్వం ఫోన్ల ఎగుమతులు పెరిగేందుకు తోడ్పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ గత ఐదేళ్ల నుంచి స్థిరమైన వృద్ధి పథంలో పయనిస్తోంది. కోవిడ్ ప్రేరేపిత లాక్డౌన్ల కారణంగా ఈ ఏడాది పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సెమికండెక్టర్ల కొరత సహా అన్ని అవాంతరాలను అధిగమిస్తూ కొత్త ఏడాదిలో 20 కోట్ల యూనిట్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది’’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషకులు శిల్పి జైన్ తెలిపారు. ఈ ఏడాదిలో (2021)మొత్తం 167–168 మిలియన్ల స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు జరిగినట్లు కౌంటర్ పాయింట్ నివేదిక పేర్కొంది 5జీ స్మార్ట్ఫోన్ల ఊతం ఇటీవల కస్టమర్లు 5జీ స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో వచ్చే ఏడాది నుంచి 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుత డిమాండ్కు తగ్గట్లు షావోమి, శాంసంగ్, వివో, ఒప్పో, వన్ప్లస్ కంపెనీలు 5జీ ఫోన్లు తయారీపై దృష్టి సారించాయి. ప్రారంభ ధరలోనే 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. 5జీ ఫోన్లకు నెలకొన్న డిమాండ్ కలిసిరావడంతో మొత్తం స్మార్ట్ఫోన్ల ఎగుమతులు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఈ ఏడాది(2021)లో 2.8 కోట్ల 5జీ ఫోన్ల షిప్మెంట్ జరిగింది. వచ్చే ఏడాదిలో 129 వృద్ధితో మొత్తం 6.8 మిలియన్ల అమ్మకాలు జరగవచ్చు. దీంతో కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 190 మిలియన్ల మార్కును అందుకోనే వీలుంది‘ అని సైబర్ మీడియా రీసెర్చ్ విశ్లేషకులు ఆనంద్ ప్రియా సింగ్ తెలిపారు కేంద్రం చేయూత కోవిడ్ ప్రేరేపిత లాక్డౌన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండెక్టర్ల కొరత ప్రభావం దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్పైనా పడింది. దీంతో ఈ గతేడాది స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు అంచనాల కంటే 20 శాతం తక్కువగా నమోదైంది. అయితే సెమీ కండక్టర్లు, కాంపొనెంట్ల తయారీ, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ ఏర్పాటుకు కేంద్రం డిసెంబర్లో రూ.76,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. పీఎల్ఐ స్కీమ్ను ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్కు విస్తరించడంతో దేశంలో ఫోన్ల తయారీ బాగా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మొబైల్ ఫోన్ల తయారీ, వాటి విడిబాగాల తయారీని పెంచేందుకు తలపెట్టిన ఫేజ్డ్ మాన్యుఫాక్చరింగ్ ప్రోగ్రామ్ (పీఎంపీ) కూడా కలిసొస్తుందని మొబైల్ పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. -
చిన్న షేర్లు రేసు గుర్రాలు
ఈ క్యాలండర్ ఏడాది(2021)ని నిజానికి చిన్న షేర్ల నామ సంవత్సరంగా చెబుతున్నారు విశ్లేషకులు. 2021 జనవరి మొదలు ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 21 శాతం ర్యాలీ చేస్తే.. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 60 శాతం దూసుకెళ్లింది. ఇక సెకండరీ మార్కెట్లు సైతం దూకుడు ప్రదర్శించాయి. 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రావడం ద్వారా రూ. 1.19 లక్షల కోట్లను సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డుకాగా.. కొత్త ఏడాది(2022)లోనూ మార్కెట్లలో బుల్ జోరు కనిపించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ స్టాక్ మార్కెట్లలో చిన్న షేర్లు దూకుడు ప్రదర్శించాయి. భారీ లాభాలతో ఇన్వెస్టర్లకు జోష్నిచ్చాయి. మార్కెట్లు నిర్మాణాత్మక బుల్ ట్రెండ్లో ఉండటంతో ఈ స్పీడ్ మరో రెండేళ్లపాటు అంటే 2022, 2023లోనూ కనిపించే వీలున్నట్లు ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్ధ్ న్యాటి అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత బలపడవచ్చని అంచనా వేశారు. కాగా.. సమీప కాలంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల ఎదురయ్యే రిస్కులు, అంతర్జాతీయ సంకేతాలతో హెచ్చుతగ్గులకు ఆస్కారమున్నట్లు తెలియజేసింది. అయితే దీర్ఘకాలంలో సానుకూల ఆర్థిక గణాంకాలు, కంపెనీల పటిష్ట ఆర్జనలు వంటి అంశాలు స్టాక్ మార్కెట్ ట్రెండ్ను ప్రభావితం చేయగలవని పేర్కొంది. దీర్ఘకాలిక లాభాలపై పన్ను, నియంత్రణా విధానాల్లో మార్పుల కారణంగా 2018–2020 మధ్య మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు గడ్డుకాలం ఎదురైనట్లు పార్ధ్ పేర్కొన్నారు. తదుపరి ఆర్థిక సంస్కరణలు తదితర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో చిన్న కంపెనీలు అధిక వృద్ధి బాట పట్టినట్లు వివరించారు. బడా ప్రాఫిట్స్ కరోనా మహమ్మారి ఆందోళనలను పెడచెవిన పెడుతూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో ఈ ఏడాది జనవరి– అక్టోబర్ మధ్య సెన్సెక్స్ 50,000 పాయింట్ల మైలురాయి నుంచి చరిత్ర సృష్టిస్తూ 61,000 పాయింట్లకు ఎగసింది. ఇది 21 శాతం వృద్ధికాగా.. ప్రస్తుతం 58,000 పాయింట్ల స్థాయికి చేరింది. అయితే చిన్న, మధ్యతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ నెలాఖరుకల్లా 37 శాతం జంప్చేసింది. స్మాల్ క్యాప్ మరింత అధికంగా 60 శాతం పురోగమించింది. ప్రపంచ బ్యాంకుల నుంచి లిక్విడిటీ మద్దతు, అంతర్జాతీయంగా వ్యాక్సిన్ల పంపిణీ వేగమందుకోవడం, ప్రోత్సాహక ఆర్థిక విధానాలు వంటి అంశాలు పలు మార్కెట్లకు అండనిచ్చాయి. వెరసి అక్టోబర్ 19కల్లా బీఎస్ఈ మిడ్ క్యాప్ 27,246 పాయింట్ల వద్ద, స్మాల్ క్యాప్ 30,417 వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్ 62,245 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 18,600 వద్ద ఆల్టైమ్ గరిష్ట స్థాయిలను అందుకున్నాయి. కోవిడ్–19 భయాలను అధిగమిస్తూ 2020లో మొదలైన ర్యాలీ 2021లోనూ కొనసాగడం విశేషం. నిజానికి 2020లో సెన్సెక్స్ 16 శాతం పుంజుకోగా.. సాŠమ్ల్, మిడ్ క్యాప్స్ 24 శాతం బలపడ్డాయి. లాక్డౌన్లకు చెల్లు 2020 మార్చిలో కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయన్న అంచనాలతో మార్కెట్లు ఒక్కసారిగా బేర్ గుప్పెట్లోకి చేరాయి. అయితే నెల రోజుల్లోనే ప్రపంచ బ్యాంకుల లిక్విడిటీ దన్నుతో బుల్స్ పట్టుసాధించినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా 2017లో దూకుడు చూపిన చిన్న, మధ్యతరహా కౌంటర్లు ఆపై కష్టకాలాన్ని ఎదుర్కొన్నట్లు పైపర్ సెరికా వ్యవస్థాపకుడు అభయ్ అగర్వాల్ తెలియజేశారు. దీంతో అధిక వృద్ధికి అవకాశమున్న చిన్న షేర్లు మార్కెట్లను మించిన క్యాచప్ ర్యాలీని అందుకున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది చివర్లో ఓవైపు విదేశీ ఇన్వెస్టర్లు బ్లూచిప్స్లో అమ్మకాలకు దిగినప్పటికీ దేశీ ఫండ్స్, సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూకట్టడం చిన్న షేర్లకు జోష్నిచ్చినట్లు వివరించారు. సాధారణంగా చిన్న షేర్లపట్ల స్థానిక ఇన్వెస్టర్లు ఆసక్తి చూపితే.. విదేశీ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్స్పైనే దృష్టిపెడతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీవో స్పీడ్ ఈ ఏడాది రిటైల్ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు సైతం క్యూకట్టారు. దీంతో కొత్తతరం టెక్ కంపెనీలు జొమాటో, నైకా, పేటీఎమ్, పాలసీబజార్ తదితరాలు భారీస్థాయిలో నిధులను సమకూర్చుకుని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. వెరసి గత రెండు దశాబ్దాలలోనే 2021 ఐపీవోలకు అత్యుత్తమ ఏడాదిగా నిలిచింది. పలు ఐపీవోలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దేవయాని ఇంటర్నేషనల్, నజారా టెక్నాలజీస్, గో ఫ్యాషన్, రోలెక్స్ రింగ్స్ ఏకంగా 100 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చదవండి: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది, యువత చూపంతా ఐపీవోలపైనే -
ఒమిక్రాన్ కేసులు జీరో.. అయినా భారీ లాక్డౌన్!
China Impose Huge Lockdown In Xian: ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణలో కరోనా పుట్టుక- వుహాన్ ల్యాబ్ థియరీ మరోసారి తెర మీదకు వచ్చింది. వైరస్ వెనుక డ్రాగన్ కంట్రీ హస్తమే ఉందన్న ఆరోపణను మరోసారి బలంగా లేవనెత్తుతోంది అమెరికా. ఈ తరుణంలో చైనాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒమిక్రాన్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోయినా.. భారీ లాక్డౌన్కు చైనా సిద్ధపడింది. కోటికి పైగా జనాభా ఉన్న చైనా వుహాన్ నగరాన్ని.. కరోనా వైరస్ పుట్టినిల్లుగా అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే వుహాన్లో గతంలో విధించిన లాక్డౌన్ను ప్రపంచమంతా భారీగా భావించించింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జనాభే ఉన్న నగరాన్ని లాక్డౌన్తో దిగ్భంధించింది చైనా ప్రభుత్వం. పశ్చిమ చైనా నగరం జియాన్లో గురువారం నుంచి లాక్డౌన్ అమలు అవుతోంది. మరికొన్ని నగరాలకు లాక్డౌన్ విధించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. కోటిన్నరకి పైగా జనాభా ఉన్న జియాన్లో అనవసరమైన ప్రయాణాల్ని నిషేధించారు. నిత్యావరసరాలకు ఒక్కరే బయటకు వెళ్లాలన్న నిబంధనను విధించారు. మరోవైపు డొమెస్టిక్ విమానాల్ని సైతం రద్దు చేసింది. కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు తమ దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని చైనా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో చైనా లాక్డౌన్ ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు డెల్టా వేరియెంట్ కేసులు మాత్రం ఉన్నాయి. 14 జిల్లాల్లో 127 కేసులు బయటపడ్డాయి తాజాగా. అయితే ఇవేవీ స్థానికంగా వచ్చినవి కావని, బయటి నుంచి వచ్చినవాళ్లవేనని ప్రకటించుకుంది ప్రభుత్వం. ఈ తరుణంలో వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించినట్లు చైనా మీడియా కథనాలు వెలువరుస్తోంది. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ప్రభావంతో ఇమ్యూనిటీ ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉన్నందునే.. చైనీస్ వైస్ ప్రీమియర్ సన్ చున్లాన్ ఆదేశాల మేరకు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. తద్వారా లోకల్ ట్రాన్స్మిషన్ తగ్గించే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం పని చేస్తోంది. ఇక సెలవుల ప్రయాణాలు, ఫిబ్రవరి నుంచి జరగబోయే వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలోనే కరోనా కేసుల్ని కట్టడి చేసే దిశగా చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. 2021లో చైనాలో తొమ్మిది సార్లు కరోనా విజృంభించింది. అయితే అధికారిక లెక్కలు చెప్పడానికి చైనా ఇష్టపడడం లేదు. మొత్తంగా కరోనా మొదలైనప్పటికీ లక్షకి పైగా కేసులు, 4 వేల మరణాలు మాత్రమే ప్రకటించుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యాన్ని గురి చేసింది డ్రాగన్ కంట్రీ. అంతేకాదు కరోనా విజృంభణ తర్వాత ‘జీరో’ కేసులుగా ప్రకటించుకున్న దేశాల్లో చైనా మొదటిది కావడం కొసమెరుపు. చదవండి: ఒమిక్రాన్ విజృంభణ.. రాబోయే మూడు నెలలు గడ్డుకాలమేనా? -
ఒమిక్రాన్ బాధితుడి ఇంట రెండు పాజిటివ్ కేసులు.. అక్కడ లాక్డౌన్
సాక్షి, ముస్తాబాద్ (సిరిసిల్ల): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన గూడెంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వేరియంట్ నిర్ధారణకు నమూనాలను హైదరాబాద్కు పంపించారు. గూడేనికి చెందిన పిట్టల చందు ఈ నెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. హైదరాబాద్ ఎయిర్పోర్టులో పరీక్ష చేయించుకోగా ఒమిక్రాన్ నిర్ధారణ అయిన సంగతి విదితమే. దీంతో జిల్లా వైద్యాధికారి, మండల వైద్యాధికారి అప్రమత్తమై.. సదరు వ్యక్తితో కాంటాక్టు అయిన 16 మందిని హోమ్ క్వారంటైన్ చేశారు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అతని భార్య, తల్లికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి సంజీవ్రెడ్డి బుధవారం తెలిపారు. ప్రస్తుతం వీరికి స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గూడెంలో ఒమిక్రాన్ నమోదవడం, మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో లాక్డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే దుకాణాలు, హోటళ్లు, బడులు మూసివేశామంది. మరో పది రోజులపాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. హయత్నగర్లో ఒమిక్రాన్ హయత్నగర్: హయత్నగర్ డివిజన్లో ఒమిక్రాన్ కేసు బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది. మూడు రోజుల క్రితం సూడాన్ దేశం నుంచి వచ్చి సత్యనారాయణ కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ తెలిపారు. దీంతో అధికారులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులకూ పరీక్షలు నిర్వహించారు. అతడి ప్రాథమిక కాంట్రాక్ట్లపై దృష్టి పెట్టి కాలనీలోని మరో 30 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది. #Lockdown: Gudem Village in Rajanna Sircilla dt enters into a self imposed #lockdown for 10 days after Gulf returnee tested positive for #OmicronVariant. His family too tested +ve for #Covid19 but not for #Omicron. All shops closed. #Telangana. pic.twitter.com/D7nxMsX3lh — krishnamurthy (@krishna0302) December 23, 2021 > -
మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో..
Netherlands going into lockdown again amid Omicron అమ్స్టర్డామ్: నెదర్లాండ్లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున ఉధృతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్ధేశ్యంతో డచ్ ప్రభుత్వం శనివారం లాక్డౌన్ను విధించింది. ఈ మేరకు హేగ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే ప్రకటించారు. ఈ నిర్ణయంతో నెదర్లాండ్స్ మరొకమారు లాక్డౌన్లోకి వెళ్తుంది. ‘ఊహించిన దానికంటే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. అందువల్లనే లాక్డౌన్ తప్పనిసరైంది. కొత్త లాక్డౌన్ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అమల్లోకొస్తుంది. కఠిన నిబంధనలతో ఈ లాక్డైన్ కొత్త సంవత్సరం జనవరి 14 వరకు అమల్లో ఉంటుంది. ఐదో వేవ్ చేరువ అవుతున్న తరుణంలో లాక్డైన్ అనివార్యమైంద'ని రుట్టే తెలిపారు. సూపర్ మార్కెట్లు, వైద్యపరమైన వృత్తులు, కార్ గ్యారేజీలు వంటి ఇతర ముఖ్యమైన షాపులు తప్ప, మిగతా ఇతర షాపులు, అన్ని విద్యా సంస్థలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్లు, మ్యూజియంలు, థియేటర్లు, జూపార్కులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించింది. శుక్ర, శని వారాల్లో దాదాపుగా 14,742 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, ఓఎమ్టీ సభ్యుడు జాప్ వాన్ డిసెల్ మీడియాకు తెలిపాడు. అంతేకాకుండా క్రిస్మస్ తర్వాత నెదర్లాండ్స్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాగా డిసెంబర్ 14న నెదర్లాండ్స్లో కొన్ని ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే! తాజాగా వాటిని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అప్రధాన షాపులకు నైట్లాక్డౌన్ అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించారు. అంతేకాకుండా క్రిస్టమస్ సెలవులకు ఒక వారం ముందునుంచే పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని ఆదేశించారు. ఐతే ఒమిక్రాన్ అడ్డుకోవాలంటే ఈ ఆంక్షలు సరిపోవని భావించిన డచ్ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసిన నాలుగు రోజులకే తాజాగా సంపూర్ణ లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!! -
విజృంభిస్తున్న ఒమిక్రాన్..క్రిస్మస్ తర్వాత రెండు వారాల లాక్డౌన్!
UK Omicron Lockdown:: వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతిని అడ్డుకోవడానికి కిస్మస్ తర్వాత రెండు వారాల లాక్డౌన్ విధించే ప్రణాళిక యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్–19 కట్టడికి శాస్త్రవేత్తల సలహా బృందం (సేజ్) ప్రధాని బోరిస్ జాన్సన్ ముందు ఉంచిన పలు ప్రతిపాదనల్లో రెండు వారాల లాక్డౌన్ సిఫారసు కూడా ఉంది. యూకేలో గురువారం 88,376, శుక్రవారం 93,045 కేసులు వచ్చాయి. లండన్లో శుక్రవారం ఒక్కరోజే 26 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో నగర మేయర్ సాదిక్ ఖాన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఒకవైపు ఆసుపత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతుండగా... మరోవైపు సిబ్బంది గైర్హాజరు పెరుగుతోంది. దాని కి తోడు లండన్, స్కాట్లాండ్లలో ఒమిక్రాన్ కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాసుత్రుల్లో అందేస్థాయి సేవలు అందకపోవచ్చనే సంకేతాలను మేయర్ ఇచ్చారు. ► నెదర్లాండ్లో ఆదివారం నుంచి కఠిన లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు అపద్ధర్మ ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు. ఒమిక్రాన్తో ఐదోవేవ్ విరుచుకుపడుతున్నందువల్ల తప్పట్లేదన్నారు. ► ఫ్రాన్స్ నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ‘జనవరి ఆరంభానికల్లా ఒమిక్రాన్ ప్రధాన వేరియెంట్గా అవతరించే అవకాశాలున్నాయి. ఐదోవేవ్ వచ్చేసింది, పూర్తిస్థాయిలో విరుచుపడుతోంది’ అని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్తక్స్ ప్రకటించారు. క్రిస్మస్కు పెద్ద సంఖ్యలో గుమిగూడొద్దని, వేడుకల్లో పాల్గొనే కుటుంబసభ్యుల సంఖ్యను కూడా పరిమితం చేయాలని కోరారు. ► డెన్మార్క్ థియేటర్లను, సంగీత కచేరి నిర్వహించే హాళ్లను, మ్యూజియంలు, అమ్యూజ్మెంట్ పార్కులను మూసివేసింది. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగమెక్కువ: డబ్లు్యహెచ్ఓ జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను 89 దేశాల్లో గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్యహెచ్ఓ) తెలిపింది. డెల్టా కన్నా ఇది చాలా వేగంగా వ్యాపిస్తోందని, దీని వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1.5–3 రోజుల్లోనే ఇది రెట్టింపవుతోందని హెచ్చరించింది. అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా శుక్రవారం ఒమిక్రాన్పై సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. సమూహ వ్యాప్తి జరుగుతున్న చోట డెల్టాను ఈ వేరియంట్ మించిపోగలదని తెలిపింది. -
స్కూల్కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు!
భువనేశ్వర్: స్కూల్కు సెలవులు ఇవ్వడం లేదని ఓ విద్యార్ధి ఏకంగా 20 మంది విద్యార్ధుల జీవితాలను ఇరకాటంలో పెట్టాడు. ఎందుకు చేశావని స్కూల్ ప్రిన్సిపాలు అడిగితే అతను చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్ల బెట్టారు. అసలేంజరిగిందంటే.. ఒడిశాలోని బర్గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ల్లో 11వ తరగతి చదివే విద్యార్థి (16) తన 20 మంది స్నేహితులకు బాటిల్ నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ ప్రేమానంద్ పటేల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కారణంగా మరోమారు లాక్డౌన్ విధించే అవకాశం ఉందని నేరానికి పాల్పడిన విద్యార్ధి ఆశించాడు. అలా జరగకపోవడంతో ఈ పనికి పూనుకున్నాడని తెలిపాడు. ఐతే అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు సదరు విద్యార్ధిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే విద్యార్ధి కెరీర్, చిన్న వయసును దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు. ఐతే పాఠశాల యాజమన్యం సదరు విద్యార్ధిని కొన్ని రోజులపాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాలలోని హాస్టల్లో నివసిస్తున్న విద్యార్ధి ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లు వచ్చినప్పుడు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల కూడా స్కూళ్లు మూతపడి సెలవులిస్తారని అనుకున్నాడు. అలా జరగకపోవడంతో తోటలోని పురుగుల మందును నీళ్లలో కలిపి విద్యార్ధులకు తాగేందుకు ఇచ్చాడు. నీళ్లను తాగిన విద్యార్ధులు ఆనారోగ్యానికి గురయ్యారు. చదవండి: జపాన్లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..! -
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లాక్డౌన్ తప్పదా..?
Omicron Scare CM Arvind Kejriwal Clarity On Lockdown: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. వీటిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. లాక్డౌన్ విధేంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. (చదవండి: ఒకే చోట 281 కేసులు.. లాక్డౌన్ విధిస్తారా?!) ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ భయపడాల్సిన పని లేదు. పరిస్థితులను నేను అనుక్షణం సమీక్షిస్తున్నాను. లాక్డౌన్ విధేంచే ఆలోచన లేదు. కానీ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మాస్క్ ధరించండి.. సామాజిక దూరం పాటించండి. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కే మనకు శ్రీరామ రక్ష. సమీక్షా సమావేశాల్లో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత, మందులు, ఆక్సీజన్ లభ్యత వంటి తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. ప్రజలు భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,347 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడగా.. భారత్లో ఈ సంఖ్య 24కి చేరుకుంది. చదవండి: వర్క్ ఫ్రం హోం.. పరిశ్రమల మూసివేత -
జర్మనీలో ఒమిక్రాన్ గుబులు.. అలా అయితే కష్టమే.. వారికి ‘లాక్డౌన్’
బెర్లిన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. టీకా తీసుకోని వారికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తికాని వారు.. మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. దీంతోపాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో జర్మనీ వ్యాక్సినేషన్ను తప్పనిసరి చేయనుంది. ప్రతి ఒక్కరికి టీకాలను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదం తర్వాత.. వచ్చే ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైవు.. జర్మనీ జనాభాలో ఇప్పటివరకు 75శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాదాపు 68శాతం మందికి మాత్రమే టీకాలు పూర్తి చేసింది. ఇక డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియెంట్కు సంబంధించి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. (చదవండి: Viral Video: కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్ కపుల్..) -
Omicron Variant: ఒమిక్రాన్ కట్టడి ఎలా?.. ప్రస్తుతానికి నో లాక్డౌన్: ఆరోగ్యమంత్రి
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా కట్టడి చేయాలా.. అని తర్జనభర్జనలు పడుతోంది. సరిహద్దుల్లో తనిఖీలను పెంచింది, మరోవైపు విద్యాలయాల్లో కరోనా పంజా విసురుతుండడంతో అక్కడ సదస్సులు, సాంస్కృతిక వేడుకలను నిషేధించింది. విద్యార్థులు, వైద్య సిబ్బందికి నిత్యం కరోనా పరీక్షలు చేయాలని, పాజిటివ్ తేలిన వారిని క్వారంటైన్కు పంపించాలని ఆదేశించింది. కరోనా సాంకేతిక సమితి, ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు మంగళవారం సమావేశమై మరిన్ని నిబంధనలు విడుదల చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలపై సస్పెన్స్ వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈసారి బెళగావి సువర్ణసౌధలో డిసెంబరు 13 నుంచి 24వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరపాలని నిర్ణయమైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో సమావేశాలను నిర్వహిస్తారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇక క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలపైనా మంగళవారం ప్రకటన చేసే అవకాశముంది. థర్డ్ వేవ్ రాకుండా చర్యలు: సీఎం తుమకూరు: మహమ్మారి కరోనా వైరస్ మూడవ దశ రాకుండా రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం బసవరాజు బొమ్మై చెప్పారు. సోమవారం తుమకూరు శ్రీ సిద్దగంగా మఠంలో శివకుమార స్వామీజీ సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినా కొన్ని చోట్ల కేసులు వస్తున్నాయని, వాటిని కట్టడి చేయడంతో పాటు ఒమిక్రాన్ రకం రాష్ట్రంలోకి రాకుండా చూడాలని ఆరోగ్య శాఖాధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. విదేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రతి ఒక్కరికి, అలాగే కేరళ నుంచి వచ్చేవారికి టెస్టులను తప్పనిసరి చేశామన్నారు. చదవండి: (‘ఒమిక్రాన్’ వేరియెంట్ కథాకమామిషూ) హాస్టల్లో కరోనా కలకలం బనశంకరి: హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో 13 మంది హైస్కూల్ విద్యార్థులకు కరోనా సోకింది. సోమవారం ఆరోగ్య శాఖ సిబ్బంది పాఠశాలలో 200 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇతర విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నో లాక్డౌన్: ఆరోగ్యమంత్రి దొడ్డబళ్లాపురం/ చిక్కబళ్లాపురం: ఒమిక్రాన్ రకం కరోనా వైరస్ని అడ్డుకోవడానికి మళ్లీ లాక్డౌన్ను విధించాలనే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో రెండు సార్లు లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఉద్యోగాలు పోగొట్టుకుని, జీవనోపాధి కరువై ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారన్నారు. ఇలాంటి తరుణంలో లాక్డౌన్ విధించడం సమంజసం కాదన్నారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో లాక్డౌన్ అని ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెల్టా వైరస్తో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియదన్నారు. ప్రజలు కోవిడ్ నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెల్టా కంటే ఇది ప్రమాదకరం కాదని అన్నారు. ప్రజలు గుంపులుగా చేరరాదని, సాంస్కృతిక కార్యక్రమాలను జరపరాదని కోరారు. -
ఒకే చోట 281 కేసులు.. లాక్డౌన్ విధిస్తారా?!
బెంగళూరు: కొత్త రకం కరోనా వేరియంట్ బీ.1.1.529. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టిన ఈ వేరియంట్.. గతంలో వెలుగు చూసిన డెల్టా, మిగతా వేరియంట్లకన్నా చాలా ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా యూరప్ దేశాల్లో కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా కరోనా కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా రెండు డోసులు తీసుకున్న మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారనే వార్తలు చూశాం. ఈ క్రమంలో కర్ణాటక, ధార్వాడ్ మెడికల్ కాలేజీలో శనివారం 99 మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, అధ్యాపకులు కరోనా బారిన పడటంతో వీరి సంఖ్య 281కి చేరుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్ ఎస్డీఎం మెడికల్ సైన్స్ కాలేజీ కోవిడ్ క్లస్టర్గా మారిందని తెలిపారు. (చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?) బారి ఎత్తున వైద్య విద్యార్థులు, అధ్యాపకులు కోవిడ్ బారిన పడటంతో.. రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై సుధాకర్ స్పందించారు. ‘‘ప్రస్తుతం కరోనా బారిన పడ్డ విద్యార్థులు, అధ్యాపకులు కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిసింది. దాని వల్ల ఇన్ని కేసులు వెలుగు చూశాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు విధించే పరిస్థితిలో లేము. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం మరో 1,822 పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నందున ఈ సంఖ్య పెరగవచ్చని ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీష్ పాటిల్ తెలిపారు. 281 మందిలో కేవలం ఆరుగురు రోగులకు మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ఇతరుల్లో ఎలాంటి లక్షణాలు వెలుగు చూడలేదని తెలిపారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. (చదవండి: భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’) ప్రస్తుతం కరోనా బారిన పడ్డ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు నవంబర్ 17న కాలేజ్ క్యాంపస్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో చాలా మందిలో అసలు లక్షణాలు కనిపించలేదు. పైగా అందరు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం కాలేజీకి 500 మీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని విద్యాసంస్థలకు ఆదివారం వరకు సెలవు ప్రకటించారు. చదవండి: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్ -
మళ్లీ కోవిడ్ కల్లోలం!
ముంబై: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలింది. వైరస్ కట్టడికి పలు దేశాల లాక్డౌన్ విధింపు యోచనలు ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను రెకేత్తించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 37 పైసల పతనమైంది. క్రూడాయిల్ అనూహ్య పతనం, వడ్డీ రేట్ల పెంపు భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ట్రేడింగ్ మొదలు.., తుదిదాకా అమ్మకాల సునామీ జరిగింది. ఒక్క ఫార్మా మినహా అన్నిరంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏడాదిలో అతిపెద్ద మూడో పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1688 పాయింట్లు నష్టపోయి 57,107 వద్ద, నిఫ్టీ 510 పాయింట్లు క్షీణించి 17,026 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల పతనం సూచీల భారీ క్షీణతకు కారణమైంది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, ఏషియన్ సిమెంట్స్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5786 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.2294 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడేలో 17వేల దిగువకు నిఫ్టీ సెన్సెక్స్ ఉదయం 540 పాయింట్ల నష్టంతో 58,255 వద్ద, నిఫ్టీ 17,339 పాయింట్ల పతనంతో 17,339 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 1801 పాయింట్లును కోల్పోయి 56,994 వద్ద, నిఫ్టీ 550 పాయింట్లు పతనమైన 17వేల స్థాయిని కోల్పోయి 16,986 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 2,529 పాయింట్లు, నిఫ్టీ 738 పాయింట్లు నష్టపోయాయి. నిమిషానికి రూ.1962 కోట్ల నష్టం సూచీలు మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.7.36 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రతి నిమిషానికి రూ.1962 కోట్ల నష్టం వాటిల్లింది. వెరసి ఇన్వెస్టర్ల ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.258 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. నష్టాలకు నాలుగు కారణాలు కలవరపెట్టిన కొత్త వేరియంట్ ... ఇప్పటికే డెల్టా వేరియంట్ విజృంభణతో యూరప్ దేశాలు విలవిలాడుతుండగా.., తాజాగా దీని కంటే అత్యంత ప్రమాదకారి, అసాధారణ రీతిలో మ్యూటేషన్ల(ఉత్పరివర్తనాలు)కు గురౌతున్న బి.1.1529 వేరియంట్ను దక్షిణాఫిక్రాలో గుర్తించారు. ఈ రకం కొత్త కేసులు రోజురోజుకూ శరవేగంగా పెరుగుతుండటంతో భారత్తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ ఒక్కసారిగా దెబ్బతింది. ఆసియాలో జపాన్ 2.53%, హాంగ్సెంగ్ 2.67%, జకార్తా 2.06% నష్టపోయాయి. యూరప్లోని ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ మార్కెట్లు 3–4 శాతం వరకు క్షీణించాయి. అమెరికాకు చెందిన ఎస్అండ్పీ, నాస్డాక్ ఫ్యూచర్లు ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. తెరపైకి లాక్డౌన్ విధింపు ఆందోళనలు... కేసుల కట్టడికి పలు దేశాలు రాత్రి కర్ఫ్యూను విధించాయి. స్లోవేకియా రెండు వారాల సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించింది. జపాన్, బ్రిటన్ దేశాలు ప్రయాణాలపై నిషేధాన్ని విధించాయి. చెక్ రిపబ్లిక్ బార్లు, రెస్టారెంట్లతో సహా జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలను మూసివేసింది. జర్మనీలో కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య లక్ష దాటింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు లాక్డౌన్లను ప్రకటించవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మూడో వేవ్ మరింత ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉండడంతో సూచీలు కుంగాయి. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపరం కొనసాగడం ప్రతికూలంగా మారింది. ఈ నవంబర్లోనే ఇప్పటి వరకు(25 తేది) రూ.25 వేల కోట్ల దేశీయ ఈక్విటీలను అమ్మినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత స్టాక్ సూచీలు అక్టోబరులో జీవితకాల గరిష్టాలకు చేరుకున్న తరువాత షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే కారణంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా అమెరికా వడ్డీరేట్లను వేగంగా పెంచవచ్చనే అంచనాలు వారి విక్రయాల ప్రక్రియను మరింత ప్రేరేపింస్తున్నాయి. తొలి దశ కోవిడ్, లెమన్ బ్రదర్స్ సంక్షోభ సమయాల్లోనూ ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర భయాలు... ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికాతో సహా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను వేగంగా పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు తెరపైకి వచ్చా యి. వీలైనంత తొందర్లో ఉద్దీపన ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్లో తెలిపింది. ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఈ అంశాలన్నీ సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. లాభాల్లో టార్సన్స్ ప్రోడక్ట్స్ లిస్టింగ్... టార్సన్స్ ప్రోడక్ట్స్ షేర్లు లిస్టింగ్లో అదరగొట్టాయి. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.662తో పోలిస్తే ఆరుశాతం లాభంతో రూ.700 వద్ద లిస్టయ్యాయి. స్టాక్ మార్కెట్ భారీ పతనంతోనూ ఈ షేర్లకు డిమాండ్ వెల్లువెత్తింది. ఫలితంగా ఇంట్రాడేలో 27% దూసుకెళ్లి రూ.840 అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 26.30 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ ఏడాదిలో టాప్–3 పతనాలు తేది సెన్సెక్స్ నిఫ్టీ ఫిబ్రవరి 26 1,939 568 ఏప్రిల్ 12 1,707 524 నవంబర్ 26 1,687 510 -
కరోనా 4వ వేవ్: 10 రోజుల లాక్డౌన్.. జనాల నిరసన
Covid 4th Wave Austria Re Enter Partial 10 Days Lockdown: గత కొద్ది రోజులుగా నెమ్మదించిన కరోనా మహమ్మారి ఉధ్రుతి పెంచింది. యూరప్ దేశాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ యూరప్ దేశాల్లో ఒక్కటైన ఆస్ట్రియాలో 10 రోజుల పాక్షిక లాక్డౌన్ సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగో వేవ్ కారణంగా ఆస్ట్రియాలో శనివారంనాడు 15,297 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజూ 10వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో అక్కడ పాక్షిక లాక్డౌన్ అమలుచేయాలని నిర్ణయించారు. గరిష్ఠంగా 10 రోజుల పాటు దేశంలో ఈ లాక్డౌన్ అమలులో ఉంటుందని ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి లాక్డౌన్ అమలులోకి రాగా.. పది రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. (చదవండి: టీకా వేయించుకోని వారికి ఆస్ట్రియాలో లాక్డౌన్) పాక్షిక లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా షాపులు, రెస్టారెంట్స్ మూతపడ్డాయి. సుమారు 8.9 కోట్ల మంది జనాలు ఇంటికే పరిమితం అయ్యారు. కాగా నిత్యవసారాలు, కార్యాలయాలకు వెళ్లేవారికి మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. పాఠశాలలు, కిండర్గార్డెన్స్ తెరిచి ఉంచినప్పిటికి.. కొన్ని రోజుల పాటు పిల్లలు ఇంటి వద్దనే ఉంచి.. ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యేలా చూడాలి అని ప్రభుత్వం తల్లిదండ్రులను కోరింది. అయితే వ్యాక్సిన్ వేయించుకోని వారికి మాత్రం లాక్డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం హెచ్చరించింది. అటు వాక్సినేషన్ను వేగవంతం చేసినట్లు ఆ దేశ ఇంటీరియర్ మంత్రి కార్ల్ నెహమ్మీర్ ఆదివారంనాడు మీడియాకు తెలిపారు. (చదవండి: 15 నెలలు..15 ఏళ్లుగా గడిచాయి...ఇక నావల్ల కాదు ) ఫిబ్రవరి 1 నుంచి దేశంలోని ప్రతిఒక్కరికా వ్యాక్సిన్ తప్పనిసరి చేయనున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండెర్ ఛాలెన్బెర్గ్ శుక్రవారంనాడు స్పష్టంచేశారు. అయితే దీన్ని ఎలా అమలుచేయనున్నారో ఆయన వెల్లడించలేదు. పశ్చిమ యూరప్లో అతి తక్కువగా ఆస్ట్రియాలో 66 శాతం మంది మాత్రమే ఇప్పటి వరకు పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ కట్టడికి సరైన చర్యలు తీసుకోకపోగా లాక్డౌన్ పేరుతో జనాలను బలి చేస్తున్నారని మండిపడుతున్నారు. చదవండి: ఒక్క కేసు.. లాక్డౌన్లో 6 మిలియన్ల మంది ప్రజలు -
20 నెలల తర్వాత పెళ్లి కళ వచ్చేసింది..!
సాక్షి, ముంబై: ఫంక్షన్ హాళ్లలో సుమారు 20 నెలల తరువాత పెళ్లి మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. కరోనా కారణంగా కొందరు మాత్రమే సాదాసీదాగా పెళ్లి తంతు పూర్తిచేసి చేతులు దులుపేసుకున్నారు. కాని గత సంవత్సరన్నర కాలంగా భారీగా, ఆర్భాటంగా పెళ్లిళ్లు నిర్వహించలేకపోయారు. ముఖ్యంగా కరోనా కేసులు పెరగడంతో విధించిన లాక్డౌన్ కారణంగా అనేక మంది శుభకార్యాలు, పెళ్లిలు వాయిదా వేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాళ్లన్నీ బ్యాండు మేళాలు, మంగళవాయిద్యాల చప్పుళ్లు లేక మూగబోయాయి. కానీ ఈనెల 15వ తేదీ నుంచి తిరిగి పెళ్లిళ్లకు ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం లాక్డౌన్లోని అనేక ఆంక్షలు సడలించడంతో గతంలో మాదిరిగా శుభకార్యాలు నిర్వహించడం ప్రారంభించారు. అదేవిధంగా గత సంవత్సరం వాయిదా వేసుకున్న పెళ్లిళ్లన్నీ ఇప్పుడు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో ఫంక్షన్ హాళ్లు, స్కూల్ మైదానాలు, బంక్వెట్ హాళ్లని బుకింగ్లతో ఫుల్ అయ్యాయి. పరిమిత సంఖ్యలో ఆహుతులతో.. గత సంవత్సరం కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మార్చి 23వ తేదీ నుంచి లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. కాని లాక్డౌన్కు ముందు ముహూర్తాలు పెట్టుకుని ఫంక్షన్ హాళ్లు బుకింగ్ చేసుకున్న వారికి కరోనా అంక్షలకు కట్టుబడి వివాహాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వధూవరుల వైపునుంచి కేవలం 20 మంది చొప్పున బంధువులు మాత్రమే వివాహానికి హాజరుకావాలని ఆంక్షలు విధించింది. ఆ తరువాత కరోనా కొంత అదుపులోకి రావడంతో ఈ సంఖ్యను 50కు పెంచింది. అనంతరం కరోనా రెండో వేవ్లో కోవిడ్ కేసులు పెరగడంతో కొద్ది నెలలపాటు తిరిగి శుభకార్యాలకు బ్రేక్ పడింది. దీంతో అనేక మంది పెళ్లిలు వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కరోనా అదుపులోకి రావడంతో వంద మంది చొప్పున బంధువులు పెళ్లికి హాజరయ్యేందుకు ప్రభుత్వం, బీఎంసీ నుంచి అనుమతి లభించింది. కానీ కోవిడ్ భయంతో శుభకార్యాలు చేసేందుకు అనేకమంది సాహసం చేయలేకపోయారు. చదవండి: (సినిమా చెట్టు: ఆ చెట్టు కింద 300 సినిమాల షూటింగ్..) చివరకు కొందరు దగ్గర బంధువుల మధ్య పెళ్లి తంతు పూర్తి చేసినప్పటికీ ఆర్భాటంగా నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం కోవిడ్ పూర్తిగా కాకపోయినా 90 శాతం అదుపులోకి రావడంతో ధైర్యంగా శుభకార్యాలు చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ ఫంక్షన్ హాలు బుకింగ్ చేసుకునే సమయంలో కోవిడ్ నియమాలు పాటించేలా హాలు యాజమాన్యాలు హామీ పత్రం తీసుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు తక్కువ సంఖ్యలో బంధువులను ఆహ్వానించాలని చెబుతున్నారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తారా అన్న విషయంలో అనుమానం నెలకొంది. సుమారు 20 నెలల తరువాత పెళ్లిళ్లు నిర్వహించేందుకు వాతావరణం అనుకూలించడంతో తమ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నారు. అయితే కేసుల తీవ్రత తగ్గినప్పటికీ కరోనా విషయంలో ఇప్పటికీ అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. భాజా భజంత్రీలకు మళ్లీ ఉపాధి పెళ్లిలో తాళి కట్టే సమయంలో వాయించే భాజాభజంత్రీలు, గట్టి మేళం, మంగళవాయిద్యాలను కూడా బుక్ చేసుకున్నారు. ఇప్పుడు వీరికి కూడా ఉపాధి లభించింది. గత సంవత్సరన్నర నుంచి బేరాలు లేక వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాయిద్యాల వినియోగం లేకపోవడంతో అవి తప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. ఇప్పుడు చేతి నిండా పని దొరకడంతో అప్పులుచేసి వాయిద్యాలకు మరమ్మతులు చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా చెల్లాచెదురైన వాయిద్యాల బృందాలు ఇప్పుడు ఒకచోట చేరి ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. మొన్నటి వరకు వాయిద్యాలకు డిమాండ్ లేకపోవడంతో బందం సభ్యులు ఖాళీగా గడిపారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పోటీ పడుతూ బుకింగ్ చేసుకుంటున్నారు. కరోనా తొలగి తిరిగి మంచి రోజులు రావడంతో ఆయా బృందాల కళ్లలో ఆనందం కనబడుతోంది. -
ఆ గాలిలోనే... గరళం
ప్రాణవాయువే... ప్రాణాంతకంగా మారితే అంతకన్నా ఘోరం ఉంటుందా? కాలుష్యం దెబ్బకు గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందనే కారణంతో ఏకంగా దేశరాజధానిలో కొద్ది రోజులు లాక్డౌన్ పెట్టే ఆలోచన చేస్తున్నారంటే ఇంకేమనాలి? దట్టంగా కమ్మేసిన వాయు కాలుష్యం... యమునా నదిని నింపేసిన విషపు నురగలతో జల కాలుష్యం... గత పది రోజుల్లో రెండున్నర వేలకు పైగా కొత్త డెంగ్యూ కేసులు... ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్ కేసులు – ఇలా ఢిల్లీలో పరిస్థితులు దయనీయం అనిపిస్తున్నాయి. సోమవారం సుప్రీమ్ కోర్టు వేసిన మొట్టికాయలను బట్టి చూస్తే, ఏయేటికాయేడు పెరుగుతున్న కాలుష్య సమస్యపై దృష్టి పెట్టని పాలకుల నిర్లక్ష్యం వెక్కిరిస్తోంది. చలి పెరిగేవేళ, ప్రధానంగా కొయ్యకాళ్ళు కాల్చే అక్టోబర్ చివర నుంచి నవంబర్ వరకు ఒక పక్క వాతావరణం, మరోపక్క ఇతర కాలుష్యాలు కలగలిసి ఢిల్లీలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏడెనిమిదేళ్ళుగా ఇది చర్చనీయాంశమే. ఈ ఏడాది పంటకోతలు ఆలస్యమై, అక్టోబర్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశలు రేపింది. కానీ, నవంబర్ మొదట్లో దీపావళి టపాసులు, పక్క రాష్ట్రాలలో పెరిగిన పంట వ్యర్థాల మంటలు తోడై, ఈ నెలలో తొలి పది రోజులూ ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరింది. గాలి గరళంలా మారడంతో నవంబర్ 13న సుప్రీమ్ కోర్టు కొరడా జుళిపించింది. ఢిల్లీ సర్కారు అత్యవసరంగా సమావేశమై, కరోనా తర్వాత మొన్నామధ్యే తెరిచిన స్కూళ్ళను సైతం మూసేసి, నిర్మాణ కార్యకలాపాలకు బ్రేక్ ప్రకటించింది. లాక్డౌన్కు కూడా సిద్ధమైంది. ప్రపంచ కాలుష్య నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఢిల్లీలో ఏడాది పొడుగూతా ‘వాయు నాణ్యత సూచి’ (ఏక్యూఐ) ఆందోళనకరమే. సగటున గంటకో చెట్టు నరికివేతకు గురవుతోందని లెక్కిస్తున్న ఢిల్లీలో దుమ్ము ధూళి, పరిశ్రమలు, వాహనాల లాంటి అనేక కాలుష్య కారణాలున్నాయి. కేవలం 3 వేల చిల్లర ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయనీ, ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో గత ఏడేళ్ళలో కొత్త బస్సుల ఊసే లేదనీ ప్రతిపక్ష ఆరోపణ. ఏమైనా, ఢిల్లీలో ప్రైవేట్ వాహనాల సంఖ్య యథేచ్ఛగా పెరుగుతోంది. ఇక, పంటపొలాల మంటలు చుట్టుపక్కలి హర్యానా, పంజాబ్ మీదుగా రాజధాని దాకా వ్యాపిస్తున్న సమస్య. ఢిల్లీ హైకోర్టు, సుప్రీమ్ కోర్టు కొన్నేళ్ళుగా పంజాబ్ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలను కాలుష్యంపై హెచ్చరిస్తూనే వస్తున్నాయి. ఫలితం లేదు. యమునా నది శుద్ధీకరణకు రూ. 4 వేల పైగా కోట్లు పాలకులు ఖర్చు పెట్టారంటున్నా, జరిగిందేమిటో నురగ రూపంలో కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రానికల్లా నిర్దిష్టమైన ప్రణాళికతో రావాలని సుప్రీమ్ కోర్టు చెప్పడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ఆ మాటకొస్తే – ప్రచార ప్రకటనల కోసం ఢిల్లీ ప్రభుత్వం పెడుతున్న వందల కోట్ల ఖర్చులో కాలుష్య నివారణకు పెడుతున్నది ఎంత అని సర్వోన్నత న్యాయస్థానమే నిలదీసిందంటే, పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరోపక్క ఢిల్లీ కాలుష్యానికి ఏది, ఎంత కారణమనే విషయంలో కేంద్రం సైతం తడవకో మాట మాట్లాడడం విచిత్రం. పంట కోసిన తరువాత మిగిలిన కొయ్యకాళ్ళను కాల్చడం ద్వారా రాజధానిలో తలెత్తుతున్న కాలుష్యం వంతు 10 శాతం లోపేనని కేంద్రం సోమవారం పేర్కొంది. కానీ, వరి మోళ్ళు 35 నుంచి 40 శాతం మేర కాలుష్యానికి కారణమన్న కమిటీ మాటలను కేంద్రమే తన అఫిడవిట్లో మరోచోట పేర్కొనడం విచిత్రం. ఏమైనా, ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 500 దాటేయడం ఆందోళనకరం. పంట పొలాల పొగేæ కాదు... పరిశ్రమలు, రవాణా సహా ఇంకా అనేకం ఈ దుఃస్థితికి కారణం. ప్రభుత్వాలు మాత్రం సమస్యను వదిలేసి, రైతుల తప్పును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విచారకరం. నిజానికి, పంట కోసేశాక, మిగిలిన వరి దుబ్బులనే ఇలా కాలుస్తున్నారనుకోవడం తప్పు. పత్తి, చెరకు, కాయధాన్యాలు, గోదుమలు – ఇలా అనేక పంటలకు పంజాబ్, హర్యానాల్లో ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అందుకే, ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. రైతుల వైపు నుంచి చూస్తే, కొయ్యకాళ్ళను వెంటనే తొలగిస్తే కానీ, తరువాతి పంట వేసుకోలేరు. అందుకు తగిన యంత్ర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో, కాలుష్యమని తెలిసినా సరే కాల్చడమే మార్గమవుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. వాయు ఉద్గారాలు లేకుండా, పంట వ్యర్థాలను ఇంధనంగా, ఎరువుగా మార్చే చౌకైన, పోర్టబుల్ యంత్రాన్ని రూపొందించి, అవార్డందుకున్న ‘తకచర్’ సంస్థ లాంటి వాటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. తాజా పర్యావరణ సదస్సు ‘కాప్–26’లో ప్రపంచ పరిరక్షణకు వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం, అంతకన్నా ముందుగా మన ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (ఎన్సీఆర్)పై దృష్టి పెట్టడం అవసరం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటికి రెండు మన నగరాలే కాబట్టి, నివారణ చర్యల్లో చైనా లాంటి దేశాల అనుభవాలను ఆదర్శంగా తీసుకోవాలి. విద్య మొదలు ఆర్థిక వ్యవస్థ దాకా అన్నీ స్తంభించే లాక్డౌన్ లాంటివి తాత్కాలిక ఉపశమనమే తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు కాలేవు. అందుకే, ఇప్పటికైనా ఉత్తరాది రాష్ట్రాల పాలకులను ఒకచోట చేర్చి, కాలుష్యంపై ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం చొరవ తీసుకోవాలి. కాలుష్యానికి కారణం వ్యవసాయ వ్యర్థాలా, వాహనాలా, పారిశ్రామిక ఉద్గారాలా అనే రాజకీయ చర్చ, పరస్పర రాజకీయ నిందారోపణలు మాని, పనిలోకి దిగడం మంచిది. ఎందుకంటే, ఈ అసాధారణ వాతావరణ ఎమర్జెన్సీ వేళ అసాధారణ రీతిలో స్పందించడమే అత్యవసరం. మీనమేషాలు లెక్కిస్తే... మొదటికే మోసం! -
టీకా వేయించుకోని వారికి ఆస్ట్రియాలో లాక్డౌన్
బెర్లిన్: కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో ఆస్ట్రియా ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ టీకా వేయించుకోని వారు ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ ఆదివారం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ ఆంక్షలు పది రోజుల పాటు అమలవుతాయని తెలిపింది. దేశ జనాభాలో కేవలం 65% మంది మాత్రమే కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నారు. దీంతో, 12 ఏళ్లు పైబడి టీకా వేయించుకోని వారు మరీ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆంక్షలు విధించింది. కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో సరిపోను వైద్య సౌకర్యాలు లేవని పౌరులను హెచ్చరించింది. -
లాక్ డౌన్ దిశగా ఢిల్లీ
-
కరోనా కేసులు: రికార్డు బ్రేక్ చేస్తున్న జర్మనీ
బెర్లిన్: గత ఏడు రోజులుగా దేశంలో ప్రతి లక్ష మంది జనాలకు కరోనా సంభవించే రేటు 201.1గా ఉందని జర్మనీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. పైగా గతేడాది జర్మనీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ (ఆర్కేఐ) ప్రచురించిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 22, 2020 నాటికి కరోనా కేసులు 197.6కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జర్మనీలో 70 శాతం మంది ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదన్నారు. (చదవండి: నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్పీరియన్స్ లేనట్టుందే....) రానున్న నెలల్లో త్వరితగతిన వ్యాక్సిన్ తీసుకోనట్లయితే వారంతా కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. తూర్పు రాష్ట్రమైన సాక్సోనీలో కరోనా సంభవంచే రేటు జాతీయ సగటు 491.3 కంటే రెండింతలు ఎక్కువగా ఉందిని తెలిపారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ తీసుకోనివారు మరిన్ని పరిమితులకు లోబడి ఉండాల్సిందేనని ఆంక్షలు జారీ చేశారు. గతనెలలో జరిగిని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే ఈ కేసులు అధిగమైనట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో సంకీర్ణ పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లోపు కనీసం వ్యాక్సిన్ తీసుకోని వారికి లాక్డౌన్ ఆంక్షలను విధించేలా చర్యలు తీసుకోవలని జర్మనీ అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: పువ్వుల్లొ దాగొన్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
కమలదళం మేధోమథనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్–19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. 124 మంది కార్యవర్గ సభ్యులు మాత్రమే ప్రత్యక్షంగా హాజరవుతారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గంలోని ఇతర సభ్యులు రాష్ట్ర కార్యాలయాల్లో వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్రెడ్డి, గరికపాటి మోహన్రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో వచ్చే ఏడాది ఆఖర్లో ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏడు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో మేధోమథనం నిర్వహించనున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహం రూపొందించే అవకాశం ఉంది. -
నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి
యడ్లపాడు(గుంటూరు): హైదరాబాద్ బిర్యానీ.. రాజస్తానీ పానీపూరీ.. ఆత్రేయపురం పూతరేకులు.. కాకినాడ కాజ.. మచిలీపట్నం బందర్లడ్డు.. మందస కోవా.. గుంటూరు కారం.. ఇవన్నీ తయారు చేసే విధానం ఒకటే. పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో తయారైన ఐటం ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అందుకే ఆయా ప్రాంతాల పేరుతో అవి ప్రసిద్ధి చెందాయి. అలా ప్రసిద్ధి చెందిన స్నాక్ఐటంలలో ‘మసాలా పకోడి’ ఒకటి. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఫిరంగిపురం మసాలా పకోడి తయారీకి ప్రత్యేకమని చెప్పాలి. మసాలా ఐటమ్స్లో ‘మగధీర’ మనం మసాలా దోశ, మసాలా వడ, మసాలా ఇడ్లీ, ముంత మసాలా (పిడతకింద పప్పు) ఇలా మసాలాతో చేసే బ్రేక్ఫాస్టు, స్నాక్స్ అనేకం చూశాం.. తిన్నాం. ఆ కోవకు చెందినదే మసాల పకోడి. శనగపిండితో తయారు చేసే పకోడిలో మెత్త పకోడి, గట్టి పకోడి అని రెండు రకాలు ఎక్కువగా స్ట్రీట్ఫుడ్స్ బండ్లపై చూస్తుంటాం. తింటుంటాం. కాని మసాలా పకోడిలా ప్రత్యేకమైంది. కేవలం ఫిరంగిపురంలో మాత్రమే స్పెషల్గా లభించిన చోటా వీటిని తిన్నామంటే ఆ టేస్ట్కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నాడు ఫిరంగులు..నేడు పకోడీలు తయారీ అద్దంకి రెడ్డిరాజులు కొండవీడును రెండోరాజధానిగా చేసుకుని పాలించే క్రమంలో రాజ్య సంరక్షణకు అవసరమైన ఫిరంగులను తయారీ, రవాణా కేంద్రంగా వర్థిల్లిన ప్రాంతమే ఫిరంగిపురం. భారతస్వాతంత్య్రానికి ముందు నుంచే ఈ చారిత్రక ప్రాంతంలోనే మసాలా పకోడి విక్రయాలు చేయడం విశేషం. ప్రస్తుతం ఫిరంగిపురం రాష్ట్రీయ రహదారిపక్కనే ఉన్న దుకాణాల బజారును పకోడిలా సెంటర్గా పిలుస్తారు. మద్రాసు నుంచి వచ్చిన మసాలా పకోడి మద్రాసు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మసాలా పకోడిని రాజమహేంద్రవరం నుంచి వలస వచ్చిన పెద్దకోట్ల లూర్థు ఇక్కడ వారికి తొలిసారిగా పరిచయం చేశారు. అప్పట్లో గారెలు, బజ్జీ, పకోడి వంటి బాండీ రకాలను కొద్దిమంది అమ్ముతున్నారు. స్థానికుల వద్దే అలవాటు పడ్డ కస్టమర్లు తనదుకాణానికి రావాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో అతని వద్ద పనిచేస్తున్న మద్రాసు వాసితో మసాలా పకోడిని తయారు చేయించడం ప్రారంభించాడు. కొత్త దుకాణం, కొత్త రుచి ఆనోటా ఈనోటా పాకి ఊళ్లోవారినే కాదు సమీప గ్రామాల ప్రజల్ని ఆకర్షించేలా చేసింది. దీంతో పది మంది పనివాళ్లతో చేసేస్థాయికి వ్యాపారం ఎదిగింది. ఐదుతరాలుగా అదే రుచి అందిస్తూ... 1940లో లూర్థు ద్వారా ప్రారంభమైన ఈ మసాలా పకోడి నేటికీ ఆయన వంశీయులు తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. కేవంల శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, చెక్క, లవంగా, అల్లం వంటి ఆరు దినుసులతో మసాలా పకోడి తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఐదోతరం వారు ఇక్కడ మూడు దుకాణాలను పక్కపక్కనే ఏర్పాటు చేసుకున్నప్పటికీ అందరూ లూర్థు పకోడి పాత దుకాణం అంటూ పేరు పెట్టుకోవడం గమనార్హం. ఈ మూడు దుకాణాల్లో లూర్థు, బాలసురేంద్ర, అన్నదమ్ములు చెందిన పిల్లలే వీటిని తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. దేశవిదేశాలకు, రాజకీయ ప్రముఖులకు పరిచమైన పకోడి లూర్థు మసాలా పకోడి దేశ రాజధాని ఢిల్లీ, బొంబాయి తదితర మహానగరాలకు వెళ్లడమే కాదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మాజీ మంత్రులు సైతం గుంటూరు వాసులు అందించే ఊరగాయ పచ్చళ్లతో పాటు మసాలా పకోడి తీసుకెళ్లేవారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో పాటు రాష్ట్రంలోని ఎందరో రాజకీయ, పారిశ్రామిక పెద్దలు వీటి రుచి చూసిన వారే. అంతేకాదు లాక్డౌన్కు ముందు వరకు ప్రతినెలా రెండుసార్లు అమెరికా, జపాన్లో ఉన్న మన తెలుగు వారు వీటిని కొరియర్లో తెప్పించుకోవడం పరిపాటి. సో ఈ సారి మీరెప్పుడైనా ఫిరంగిపురం వెళ్తే మసలా పకోడిని ఓ పట్టు పట్టండి. -
ఒక్క కేసు.. లాక్డౌన్లో 6 మిలియన్ల మంది ప్రజలు
City Heihe in Heilongjiang Province Under Lockdown: కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు నగరాల్లో లాక్డౌన్ విధించిన చైనా.. ఇప్పుడు మరో పెద్ద నగరమైన హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హీహెలో లాక్డౌన్ విధించింది. ఒక్క కేసు కారణంగా.. 6 మిలియన్ల మంది ప్రజలు లాక్డౌన్ అయ్యారు. వీరందరిని ఇంటి వద్దనే ఉండాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. వింటర్ ఒలింపిక్స్ నాటికి బీజింగ్లో జీరో కరోనా కేసులు సాధించాలనే లక్ష్యంతో ఉంది చైనా. 2019లో తొలి కరోనా కేసు వెలువడిన నాటి నుంచి చైనాలో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మహమ్మారి కట్టడి కోసం సరిహద్దులను మూసేసింది.. విదేశాల నుంచి ప్రయాణిలకు అనుమతించలేదు. కఠిన క్వారంటైన్, లాక్డౌన్ నియమాలు పాటిస్తూ.. జీరో కేసులు సాధించింది. (చదవండి: చైనాలో డెల్టా వేరియెంట్ భయం) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండగా.. చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచలోనే అత్యధిక జనాభా గల చైనాలో ప్రస్తుతం కనీసం పదకొండు ప్రావిన్సులలో కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వైరస్ కట్టడి కోసం ఈ వారంలో నాలుగు మిలియన్లకు పైగా జనాభా ఉన్న లాన్జౌ నగరం, ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఎజిన్లో లాక్డౌన్ విధించింది డ్రాగన్ ప్రభుత్వం. తాజాగా గురువారం ఒక్క కొత్త కేసు నమోదవడంతో 6 మిలియన్ల జనాభా గల హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హీహెలో అధికారులు లాక్డౌన్ విధించారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జనాలను హెచ్చిరించారు. ఈ క్రమంలో బస్సు, టాక్సీ సేవలను నిలిపివేసినట్లు రాష్ట్ర మీడియా తెలిపింది. వాహనాలు నగరం దాటి బయటకు వెళ్లడానికి అనుమతిలేదని పేర్కొంది. (చదవండి: మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం) రష్యాకు ఉత్తరాన సరిహద్దుగా ఉన్న నగరంలోని 1.6 మిలియన్ల మంది నివాసితులను పరీక్షించడంక కోసం కరోనా సోకిన వ్యక్తి సన్నిహిత పరిచయాలను గుర్తించడం ప్రారంభించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు చైనా ఆరోగ్య శాఖ అధికారులు. ఇక చైనాలో గురువారం 23 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే.. కొత్త కేసులు సంఖ్య సగం తగ్గినప్పటికి దేశంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. చదవండి: థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ -
ఎఫ్బీ అకౌంట్ డిలీట్ చేసింది.. భారీగా బరువు తగ్గింది
బరువు తగ్గాలంటే.. వ్యాయామం చేయాలి.. డైట్ ఫాలో కావాలి.. అంతే కానీ ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేయడం వల్ల బరువు తగ్గడం ఏంటని ఆలోచిస్తున్నారా.. ఇదేమైన కొత్త టెక్నిక్ అనుకుంటున్నారా.. అవుననే అంటుంది ఓ మహిళ. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్లు డిలీట్ చేశాకే తాను ఏకంగా 32 కేజీల బరువు తగ్గినట్లు వెల్లడించింది. ఇదేలా సాధ్యం అయ్యిందో ఆమె మాటల్లోనే.. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించడంతో ఇంటికే పరిమితం అయ్యారు జనాలు. ఇంటి నుంచి పని చేస్తుండటంతో.. నోటికి కూడా బాగానే పని చెప్పారు. చాలా మంది లాక్డౌన్ సమయంలో విపరీతంగా బరువు పెరిగారు. దాన్ని తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడ్డారు.. పడుతున్నారు. (చదవండి: ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది) ఈ కోవకు చెందిన మహిళే బ్రెండా ఫిన్. లాక్డౌన్లో కాలంలో బ్రెండా దాదాపు 38 కిలోల బరువు పెరిగింది. వెయిట్ తగ్గించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. అసలు సమస్య ఎక్కడ ఉంది అని ఆలోచించిన బ్రెండాకు.. సోషల్ మీడియా అకౌంట్లే తనకు అతి పెద్ద అని శత్రువు అని తెలుసుకుంది. దీని గురించి బ్రెండా మాట్లాడుతూ.. ‘‘నేను నా అధిక బరువు తగ్గించుకోవాలని చాలా ప్రయత్నించాను. ఆ సమయంలో సోషల్ మీడియా వినియోగించడంతో.. అందులో ఫుడ్కు సంబంధించి వచ్చే యాడ్స్.. నా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేవి. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ తినేదాన్ని. ఈ చెడు ఆహారపు అలవాట్లను మానుకోవడం నా వల్ల కాలేదు. కొన్ని రోజుల పాటు ఇలానే అయ్యింది. చివరకు సమస్య ఎక్కడ ఉందో అర్థం అయ్యింది’’ అని తెలిపింది బ్రెండా. (చదవండి: అసలు చూస్తున్నది కిమ్నేనా? 20 కిలోలు తగ్గిండు.. మనిషి మారిండు) ‘‘వెంటనే నా సోషల్ మీడియా అకౌంట్లయిన ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్లను డిలీట్ చేశాను. ఆ తర్వాత నా ఫోకస్ బాగా పెరిగింది. నాకు నేను సాకులు చెప్పుకోవడం కూడా మానేశాను. నా ప్రయత్నం విజయవంతం అయ్యింది. అధికంగా పెరిగిన 32 కేజీల బరువును తగ్గించుకున్నాను. ప్రస్తుతం నా పూర్వపు వెయిట్ 58 కిలోగ్రాములకు వచ్చాను. ఇప్పుడు నాకు నేను ఎంతో నచ్చుతున్నాను. నా నిర్ణయం సరైందే అని నాకు అర్థం అయ్యింది’’ అని తెలిపారు బ్రెండా. చదవండి: రెండో కిలోలు తగ్గితే మోకాలిపై 8 కిలోల భారం తగ్గినట్టే! -
చైనాలో డెల్టా వేరియెంట్ భయం
బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా కేసులు అధికమైపోతున్నాయి. డెల్టా వేరియెంట్తో కేసుల వ్యాప్తి పెరుగుతోంది. గత వారం రోజుల్లో 11 ప్రావిన్స్లలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. 40 లక్షల జనాభా కలిగిన లాన్జువో నగరంలో అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని చైనా స్పష్టం చేసింది. చైనాలో ఇప్పటికే 75 శాతానికి పైగా ప్రజలకు రెండు డోసులు కరోనా టీకా ఇవ్వడం పూర్తయింది. అయినా కొత్త కేసులు రావడం ఆందోళన పుట్టిస్తోంది. జీరో కోవిడ్ లక్ష్యంతో ముందుకు వెళుతున్న చైనా... ఇలా కేసులు పెరిగిపోవడంతో ఉలిక్కిపడుతోంది.అందుకే ఒకట్రెండు కేసులు కనిపించినా కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. లాన్జువాలో 6 కేసులు బయటపడగానే అప్రమత్తమై లాక్డౌన్ విధించింది. 24 గంటల్లో 29 కేసులు వెలుగులోకి వస్తే అందులో లాన్జువాలో 6 కేసులు నమోదయ్యా యి. (చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు) పకడ్బందీగా కరోనా పరీక్షలు మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే చైనాలో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ జీరో కోవిడ్ లక్ష్యం వైపు వెళుతున్న చైనా ఎక్కడా రాజీపడడం లేదు. షాంఘైకి చెందిన ఒక జంట ఇటీవల పలు ప్రావిన్స్ల్లో పర్యటించింది. వారితో కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా సోకడంతో ప్రభు త్వం పరీక్షలు భారీగా నిర్వహిస్తోంది. (చదవండి: Afghan Baby Girl Sell: తోబుట్టువుల కడుపు నింపడం కోసం పసికందు అమ్మకం ) -
ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం!
మాస్కో: గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచదేశాలకు తన ప్రతాపాన్ని చూపిస్తూ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కట్టడికి శానిటైజేషన్, సామాజిక దూరం, వ్యాక్సినేషన్ కార్యక్రమంతో చెక్ పెట్టాలని ఆయా దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా రష్యాలోని లాట్వియాలో కరోనా మరణాలు ఇటీవల ఒక్కసారిగా పెరిగింది. వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం నెల రోజుల లాక్డౌన్ కూడా విధించింది. ఓ వైపు వైరస్ వ్యాప్తి చెందడం, మరో వైపు శీతాకాలం కావడంతో అంటువ్యాధుల భయం కూడా రష్యాకు తలనొప్పిగా మారింది. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయడం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు. పైగా ఆ వారం పాటు ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ మహమ్మారి అంతానికి సహకరించడంతో వారి జీతం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రజలందరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో రష్యాలో 1,028 మంది మరణించారు. ఇప్పటికే కొన్ని యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా యూకేలో కరోనా కేసుల పెరుగుతూ అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికితోడు శీతాకాలం సమీపిస్తుండడంతో వైరస్ ఫోర్త్ వేవ్ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చదవండి: మనోడి లక్ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేది..! -
కరోనా విజృంభణ: స్కూల్స్ బంద్.. విమానాలు రద్దు
బీజింగ్: చైనాలో తాజాగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం వందలకొద్ది విమానాలను రద్దు చేయడం, పాఠశాలలను మూసివేయడం వంటి కఠిన ఆంక్షలను విధించింది. అంతేకాదు చైనా దేశవ్యాప్తంగా సార్స్-కోవీ-2కి సంబంధించిన సాముహిక పరీక్షను కూడావేగవంతం చేయనుంది. అయితే ఇతర దేశాలు మాదిరిగా కాకుండా చైనా మాత్రం ఇంకా లాక్డౌన్ని కొనసాగించడమే కాక పొరుగుదేశాలతో ఉన్న సరహద్దులను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) క్రాస్ ప్రావిన్షియల్ పర్యటనలో ఉన్న ఏడుగురు వృద్ధ బృందానికి నిర్వహించిన కోవిడ్ -19 పరీక్షలో కేసులు వెలుగు చూశాయి. పైగా ఈ వృద్ధ బృందం జియాన్, గన్సు ప్రావిన్స్, మంగోలియాకు వెళ్లే ముందు షాంఘైని కూడా సందర్శించారు. దీంతో బీజిగ్తో సహా కనీసం ఐదు ప్రావీన్స్లు కరోనా ప్రభావం ఉండోచ్చని చైనా ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత కొన్ని రోజులగా ఉత్తర వాయువ్య ప్రాంతాల నుంచి కొత్త కేసులు నమోదవుతున్నట్లు కూడా చైనా గుర్తించింది. అయితే చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం నాటికి తాజాగా 13 కోవిడ్ -19 కేసులు నమోదైనట్లు పేర్కొంది. (చదవండి: అందుకే ఇంగ్లండ్ నుంచి వస్తున్నారు) -
లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది
కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది దీన్నే అవకాశంగా మలుచుకని తమ జీవితాలను మూడుపూవులు ఆరుకాయల్లా మార్చుకున్నారు. ఆ కొంతమందిలో అమెరికాలోని అలబామా, పెల్ సిటీకి చెందిన 32 ఏళ్ల బ్రాంట్లీ గెర్హార్డ్ట్ ఒకడు. లాక్డౌన్ సమయంలో అతనికొచ్చిన ఓ ఐడియా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే.. గ్రిన్చ్ ( ఒళ్లంతా జుట్టు ఉండే ఓ వింత జంతువు) వేషాన్ని ధరించి ఆ పరిసరాలు మొత్తం చక్కర్లు కొట్టడం. అలా ఎందుకంటే.. లాక్డౌన్ సమయం కాబట్టి పిల్లల్ని బయటికి రాకుండా చూడటం వారి తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. కనుకు అతను పిల్లలను భయపెట్టి వాళ్లు ఇళ్లలోంచి బయటకు రాకుండా చూడాలి. అతడి ఆలోచన నచ్చి భార్య సరేనంది. దీంతో అతడు గ్రిన్చ్ వేషంలో దగ్గరలోని నిత్యవసర వస్తువుల దుకాణాలు తిరగటం మొదలుపెట్టాడు. అలా ప్రతీ షాపు దగ్గర కొంత సేపు చక్కర్లు కొట్టేవాడు. కొంతమంది పిల్లలు అతడ్ని చూసి భయపడగా, మరికొంతమంది ఫొటోలు తీసుకోవటానికి ఎగబడేవారు. అలా కొంత మేర డబ్బు సంపాదించిన అది సరిపోయేది కాదు. ఓ రోజు గ్రిన్చ్ దుస్తుల్లో బ్రాంట్లీని చూసిన ఓ వ్యక్తి తన పిల్లల్ని భయపెట్టాలని, అందుకోసం 20 డాలర్లు (సుమారు 1500రూపాయలు) ఇస్తానని అన్నాడు. ఆ రోజు నుంచి గత సంవత్సరం వరకు ఆ వ్యక్తి పిల్లలను భయపెట్టేందుకు దాదాపు 20 వేల కుటుంబాలను కలుసుకున్నాడు. రోజుకు కనీసం 20 ఇళ్లలోని పిల్లల్ని భయపెడుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ఇందులోనూ కొత్తదనం కోరుకుంటూ ఎప్పటికప్పుడు తన వేషాలను మారుస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆ నగరంలో అతనో సెలబ్రిటీలా మారిపోయాడు దీంతో అతడితో ఫొటోలు దిగటానికి జనం ఎగబడుతున్నారట. ప్రస్తుతం అతను పిల్లల్ని భయపెట్టడానికి 30 డాలర్లు(2,251రూపాయలు) వసూలు చేస్తున్నాడు. ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు కదా.. బహుశా అది ఇదేనేమో. చదవండి: Niloufer Cafe Hyderabad: కప్పు చాయ్ రూ.1000.. ఎక్కడో తెలుసా? -
ఈ చిన్నారి కష్టం తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది
ఇంగ్లండ్/ బ్రిస్టల్: కరోనా మహమ్మారి ఏ నిమిషాన ఈ ప్రపంచంలో అడుగుపెట్టిందో తెలియదు కానీ... మనుషులెవరిని ప్రశాంతంగా బతకనీయడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా బాధిస్తోంది. ప్రతి ఒక్కరి మీద ప్రభావాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ చాలా మందిపై ఆర్థిక, మానసిక ప్రభావం చూపింది. పాఠశాలలు మూసివేయడం.. బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఇంటికే పరిమితం కావడంతో పిల్లలు కూడా డిప్రెషన్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఒత్తిడి భరించలేక ఎనిమిదేళ్ల చిన్నారి చేసుకున్న కొత్త అలవాటు ప్రస్తుతం తన జీవితాన్ని నరకప్రాయం చేసింది. స్నేహితులు, చుట్టుపక్కల వారు గేలి చేస్తూ ఏడిపిస్తున్నారు. ఆ చిన్నారి వ్యధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. (చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా ఇంగ్లండ్, బ్రిస్టల్ నగరానికి చెందిన అమెలియా అనే ఎనిమిదేళ్ల చిన్నారి.. మొదటిసారి 2020లో విధించిన లాక్డౌన్ కాలంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. దాన్ని తట్టుకోలేక కనురెప్పలను లాగి పడేయ్యడం ప్రారంభించింది. ఆ అలవాటు అలానే కొనసాగి.. చివరకు తల వెంట్రుకలను కూడా అలానే లాగసాగింది. కొన్ని రోజుల్లోనే బాలిక కనురెప్పలు, తలలో ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు పూర్తిగా మాయమయ్యాయి. అమెలియా పరిస్థితి చూసిన ఆమె తల్లి.. స్నేహితులను కలవకుండా ఉండటం, పాఠశాలకు వెళ్లకపోవడం వల్లే.. తన కుమార్తె ఇలా అయ్యిందని భావించింది. ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్లో డాక్టర్ని సంప్రదించి కుమార్తె పరిస్థితిని వివరించింది అమెలియా తల్లి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తను ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతుందని వెల్లడించారు. ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా (చదవండి: వైరల్: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా..) కొద్ది కాలం తర్వాత లాక్డౌన్ ఎత్తేశారు.. పాఠశాలలు తెరిచారు. కానీ అమెలియా మాత్రం తన అలవాటును మానుకోలేకపోయింది. వైద్యుల ప్రకారం జనాభాలో ప్రతి 50 మందిలో ఒకరు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆందోళన, ఏదైన బాధ. ప్రస్తుతం అమెలియా తల మీద.. అది కూడా వెనకభాగంలో మాత్రమే కొన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయి. విగ్గు, స్కార్ఫ్ లేకుండా అమెలియా బయటకు వెళ్లడం లేదని ఆమె తల్లి తెలిపింది. ఈ వ్యాధి కారణంగా తన కుమార్తె ఎన్నో అవమానాలు ఎదుర్కొందని.. తోటి పిల్లలు తనను ఏడిపించారని.. ఫలితంగా అమెలియా మరింత డిప్రెషన్కు గురైందని తెలిపింది. (చదవండి: అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా అమెలియా తల్లి మాట్లాడుతూ.. ‘‘తను ప్రారంభంలో కనురెప్పలను లాగుతున్నప్పుడు నేను దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ తన కనురెప్పలు పూర్తిగా పోయాయో అప్పుడు నాకు భయం వేసింది. ఈ అలవాటును మాన్పించాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. అలా పెరుగుతూనే ఉంది. చివరకు తల వెంట్రుకలను లాగడం ప్రారంభించింది. ప్రస్తుతం తన తల వెనకభాగంలో మాత్రమే వెంట్రుకలు ఉన్నాయి. ముందు భాగం అంతా గుండయ్యింది’’ అని వాపోయింది. తన కూతురు పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న అమెలియా తల్లి, ఆమెను వారం వారం స్కూల్ థెరపిస్ట్, ప్రైవేట్ హిప్నోథెరపీ సెషన్లకు తీసుకెళ్తుంది. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని తెలిపింది. అంతేకాక ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతున్నారని కానీ ఇప్పటికీ దాని గురించి పెద్దగా అవగాహన లేదని.. పరిస్థితికి చాలా తక్కువ మద్దతు ఉందని వాపోయింది. చదవండి: ఒక్క కరోనా కేసు.. మూడు రోజులు దేశాన్నే మూసేశారు -
బార్లు,రెస్టారెంట్లు,నైట్క్లబ్లకు క్యూ కట్టిన నార్వే ప్రజలు
-
యూట్యూబ్తో లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన యూట్యూబ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?. అక్షరాల నాలుగు లక్షలకు పైనేనంట. అంతేకాదు తనకు పిల్లనిచ్చిన మామ ఇంటిని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చారట. అది ఎందుకో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. హరియాణాలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పనుల్ని సమీక్షించడానికి వెళ్లిన గడ్కరీ.. ఓ ఈవెంట్కు హాజరై కింది వ్యాఖ్యలు చేశారు. ‘‘కరోనా టైంలో ఇంటికే పరిమితమైన నేను రెండే పనులు చేశా. ఒకటి వంట చేయడం, రెండోది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం. ఆన్లైన్లో చాలా క్లాసులు తీసుకున్నా నేను. అంతేకాదు యూట్యూబ్లోనూ అప్లోడ్ చేశా. వాటిని వ్యూస్ ఎక్కువ రావడంతో యూట్యూబ్ నెలకు నాకు నాలుగు లక్షలు చెల్లిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు గడ్కరీ. ఇది చదవండి: టోల్ గేట్ల ధరలపై నితిన్ గడ్కరీ విచిత్ర వ్యాఖ్యలు ఇక పెళ్లైన కొత్తలో తన భార్య కాంచనకు తెలియకుండా.. రోడ్డు మధ్యలో ఉన్న ఆమె తండ్రి ఇంటిని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశానని గుర్తు చేసుకున్నారాయన. ఈ విషయాన్ని తోటి అధికారులు తన దృష్టిని తీసుకొచ్చారని, అయినా కూడా ఆ పని చేయాల్సిందేనని ఆదేశించాలని చెప్పినట్లు నితిన్ గడ్కరీ నవ్వుతూ చెప్పారు. క్లిక్ చేయండి: ‘హారన్’ సౌండ్లు మార్చేస్తాం: గడ్కరీ -
అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్
ఉప్పు నీటిని ఆరుగాలం శ్రమించి ఉప్పుగా మార్చే రైతుల బతుకు తిరిగి కరిగి నీరైపోతోంది. కరోనా విపత్తు ఉప్పు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఎగుమతులు లేక.. ధర పతనం కావడంతో మార్కెట్ లేక ఉప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉప్పు నిల్వలు తడిసి కరిగిపోతున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరుగా సముద్ర నీటితో యంత్రాల ద్వారా అయోడైజ్డ్ ఉప్పు తయారీ జరుగుతోంది. జిల్లాలో ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులపై ఆధారపడుతున్న పరిస్థితి నెలకొనడంతో ఈ పరిణామాలు దాపురించాయి. విడవలూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ఉప్పు సత్యాగ్రహానికి నాంది పలికి బ్రిటిష్ వారినే గడగడలాడించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప్పు రైతుల బతుకులు నానాటికి కరిగిపోతున్నాయి. జిల్లాలో విడవలూరు, అల్లూరు, ముత్తుకూరు తీర ప్రాంత గ్రామాలు ఉప్పు ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలు. వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఈ మూడు తీర ప్రాంత మండలాల్లో ఉప్పు ఉత్పత్తిది రెండవ స్థానంగా నిలుస్తోంది. గతంలో సుమారుగా పాతిక వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతుండేది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఉప్పు తయారీకి యంత్రాలు రావడంతో సముద్ర నీటితో నేరుగా ఉప్పుగా మార్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. దీంతో సంప్రదాయ ఉప్పు కొనుగోళ్లు తగ్గాయి. కాలక్రమేణ ఉప్పు సాగు గణనీయంగా తగ్గిపోయింది. విడవలూరు మండలంలోని రామతీర్థం, అల్లూరు మండలంలోని ఇస్కపల్లి, గోగులపల్లి, ముత్తుకూరు మండలాల్లో సుమారు 4000 ఎకరాల్లో సొసైటీల ద్వారా ఉప్పు ఉత్పత్తి చేపడుతున్నారు. అయితే గతేడాది నుంచి కరోనా విపత్తు కారణంగా ఎగుమతులు లేకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయి. ఈ ఏడాది 3200 ఎకరాల్లోనే ఉప్పును ఉత్పత్తి చేశారు. క్వింటా రూ.220 గతేడాది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉప్పు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. అన్లాక్ అనంతరం ఉప్పు ధర గరిష్ట స్థాయిలో క్వింటా రూ.350 వరకు పలికింది. ఉప్పును నిల్వ ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఈ మూడు ప్రాంతాల నుంచి ఉప్పును కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. అన్లాక్ తర్వాత మళ్లీ ఉప్పు ఆధారిత పరిశ్రమలు ప్రారంభమైన సంతోషం అంతలోనే ఆవిరైంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో పాటు వాహనాలకు కూడా సరిగా అనుమతులు లేకపోవడంతో ఉప్పు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉప్పు నిల్వలు మళ్లీ పేరుకుపోతున్నాయి. జిల్లాలో ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకనే... జిల్లాలో ఉప్పు ఉత్పత్తి జరుగుతున్నా.. ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరులో ఒక పరిశ్రమ ఏర్పాటైనా పదేళ్ల క్రితమే అది మూతపడింది. ప్రధానంగా అయోడైజ్డ్ ఉప్పు వినియోగం పెరగడంతో సంప్రదాయ ఉప్పు వినియోగం లేకుండా పోయింది. ఉప్పు ఆధారిత పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో ఏర్పాటు కాలేకపోయాయి. కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి రెండేళ్ల నుంచి కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఉప్పు ఉత్పత్తి కేవలం సంవత్సరంలో 5 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ పనులకు వెళ్లాల్సిందే. ఈ 5 నెలల్లో ఉత్పత్తి చేసిన ఉప్పు సరిగా ఎగుమతులు లేకపోవడంతో పాటు మంచి ధర కోసం నిల్వ ఉంచితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా దెబ్బతింటున్నాం. – ఆటా లక్ష్మయ్య పెట్టుబడులు వస్తే చాలు ఉప్పు ఉత్పత్తి చేసేందుకు ఎకరాకు రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. వర్షాలు, వాతావరణంలో ప్రతికూల పరిస్థితులతో పాటు కరోనా కూడా జత కట్టడంతో మా పరిస్థితి దయనీయంగా మారింది. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉప్పును కొనేవారు కరువయ్యారు. ఈ కారణంగా పెట్టిన పెట్టుబడులు వస్తే చాలు అనుకుంటున్నాం. – పుచ్చలపల్లి వినోద్ ఉన్న ధరకే విక్రయిస్తున్నాం కరోనా కారణంగా గతేడాది పూర్తిగా ఉప్పు ఉత్పత్తులు నిలిచిపోయాయి. అన్లాక్ సమయంలో ఉప్పునకు మంచి ధర లభించింది. దీంతో నిల్వ ఉంచిన ఉప్పును విక్రయించాం. ప్రస్తుతం కరోనా కొనసాగుతున్న కారణంగా పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. – ఓరుంపాటి ప్రసాద్ చదవండి: -
'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు'
Pratyusha Banerjees Father About Sidharth Shukla : బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతి అందరినీ షాక్కి గురి చేస్తుంది. 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందడాన్ని అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. తాజాగా దివంగత నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ బెనర్జీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ శుక్లాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'సిద్ధార్థ్ను నేను నా కొడుకులా భావించాను. బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)సీరియల్ టైం నుంచి సిద్ధార్థ్, ప్రత్యూష మంచి స్నేహితులు. అయితే నా కూతురు చనిపోయాక సిద్ధార్థ్-ప్రత్యూషల గురించి మీడియాలో ఏవేవో వార్తలు రాసేవారు. దీంతో తను మా ఇంటికి రావడం మానేశాడు. కానీ నాతో ఫోన్లో ఎప్పుడూ టచ్లో ఉండేవాడు. మా బాగోగుల గురంచి అడిగి కనుక్కునేవాడు. లాక్డౌన్ టైంలో కూడా తరుచూ వాట్సాప్లో నాతో టచ్లో ఉండేవాడు. అంకుల్,ఆంటీ..మీరు బాగున్నారా? మీకు ఏదైనా సహాయం కావాలా? నేను మీకు ఏదైనా సహాయడగలనా అంటూ తరుచూ మమ్మల్ని అడిగేవాడు. వద్దన్నా బలవంతంగా ప్రతీ నెల 20వేల రూపాయలు పంపేవాడు. అతని మరణం సడెన్ షాక్లా అనిపిస్తుంది' అంటూ సిద్ధార్థ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మకి దుల్హనియా” తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7”, “బిగ్ బాస్ 13” వంటి రియాలిటీ షోలలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. బాలికా వధు సీరియల్లో ప్రత్యూష బెనర్జీ, సిద్ధార్థ్ శుక్లా హీరో, హీరోయిన్లుగా నటించి స్టార్స్గా ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ 24 ఏళ్ల వయసులోనే ప్రత్యూష బెనర్జీ కన్నుమూసింది. 2016లో ప్రియుడితో వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు ప్రచారంలో ఉంది. ఇటీవలె బామ్మగా అలరించిన సురేఖ సిఖ్రి కన్నుమూయగా, ఇప్పుడు సిద్ధార్థ్ మరణం తీరని విషాదాన్ని నింపింది. చదవండి: సిద్ధార్థ్ శుక్లా మరణవార్త విని కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్ సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో వివాదం..వీడియో వైరల్ -
లాక్డౌన్లతో పెరిగిన వాయు నాణ్యత
కరోనాతో మానవాళికి పెనుముప్పు దాపురించింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు కరోనా నివారణకు తీసుకున్న కొన్ని చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణానికి మేలు చేశాయి. ఇదే విషయాన్ని తాజాగా ఐరాస వాతావరణ ఏజెన్సీ ధృవీకరించింది. ప్రపంచంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా నివారణకు విధించిన లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు పర్యావరణపరంగా సత్ఫలితాలిచి్చనట్లు తెలిపింది. 2020 లాక్డౌన్ కాలంలో గాలిలోకి వాయుకాలుష్యకాల విడుదల భారీగా తగ్గిందని తెలిపింది. ప్రపంచ వాతావరణ సమాఖ్య(డబ్ల్యఎంఓ) తొలి ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమెట్ బులిటన్ను శుక్రవారం విడుదల చేసింది. గతేడాది కాలుష్యంలో తరుగుదల అంతంతమాత్రమేనని, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ నిరి్ధష్ట ప్రమాణాల కన్నా అధికంగా వాయు కాలుష్యం నమోదవుతోందని హెచ్చరించింది. కొన్ని రకాల కాలుష్యకాలు గతంలో కన్నా ఎక్కువగానే విడుదలవుతున్నాయని తెలిపింది. కరోనా లాక్డౌన్తో అనుకోని విధంగా వాయునాణ్యతా ప్రయోగం జరిగినట్లయిందని, దీనివల్ల స్థానికంగా తాత్కాలికంగా మంచి మెరుగుదల కనిపించిందని సంస్థ ప్రతినిధ/æ పెట్టెరి తాలస్ చెప్పారు. కనిపించని ప్రభావం గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, ఓజోన్లాంటి ప్రధాన కాలుష్యకారకాల స్థాయిలను సంస్థ తన నివేదికలో మదింపు చేసింది. సమావేశాలపై నిషేధం, బడుల మూసివేత, లాక్డౌన్ విధింపు తదితర చర్యలు చాలా ప్రభుత్వాలు చేపట్టడంతో ప్రధాన కాలుష్యకాలు అనూహ్యంగా గతేడాది తగ్గాయని విశ్లేíÙంచింది. అయితే ఈ చర్యల వల్ల ఒనగూరిన ప్రయోజనాలు తాత్కాలికమని, తిరిగి జన జీవనం మామూలు స్థాయికి రాగానే కాలుష్యకాలు తిరిగి పెరిగాయని తాలస్ తెలిపారు. పైగా లాక్డౌన్ చర్యలు కీలకమైన గ్రీన్హౌస్ వాయువుల స్థాయిలు తగ్గించలేకపోయాయని, ఇందుకు సంవత్సరాలు పడుతుందని వివరించారు. ఆ్రస్టేలియాలాంటి దేశాల్లో కార్చిచ్చు, సైబిరియాలో బయోమాస్ దగ్ధం, సహారాలో గాడ్జిల్లా ఎఫెక్ట్ వంటివి గతేడాది వాయునాణ్యతపై ప్రభావం చూపాయన్నారు. పర్యావరణంలో అనూహ్య మార్పులకు ప్రధాన కారణాల నివారణకు లాక్డౌన్ విధింపు సమాధానం కాదన్నారు. దేశాల ధోరణిలో మార్పుతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. -
లాక్డౌన్లోనూ అద్భుత ప్రగతి సాధించాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన ఏడేళ్లలో వేగంగా పురోగతి సాధిస్తోందని సీఎస్ సోమేశ్కుమార్ అన్నారు. కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో లాక్డౌన్ కాలంలోనూ రాష్ట్రం అద్భుత వృద్ధిని సాధించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. ‘ఎగుమతిదారుల సవాళ్లు.. అధిగమించడం’పై గురువారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ భవన్లో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎగుమతిదారులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని, ప్రభుత్వం ఎగుమతిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీనిచ్చారు. కంటైనర్ల కొరత గురించి వివిధ రకాల ఆటంకాలు ఎదుర్కొంటున్నారని, కంటైనర్ల కొరత తీర్చాలని సీఎస్కు ఎగుమతిదారులు విజ్ఞప్తిచేశారు. మూలధన వస్తువులకు సంబంధించి జీఎస్టీ రీఫండ్ సమస్యను కేంద్రప్రభుత్వంతో కలిసి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రైల్వే, డీజీఎఫ్టీ అధికారులు తదితరలు పాల్గొన్నారు. -
తమిళనాడులో లాక్డౌన్ పొడిగింపు..
సాక్షి, చెన్నై: ఆగస్టు 31వ తేదీతో ముగుస్తున్న లాక్డౌన్ను సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 5వ తేదీ నుంచి ఆదివారాల్లో అన్ని బీచ్లలో ఇకపై సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించారు. వారాంతపు మూడురోజులు (శుక్ర, శని, ఆది) అన్ని ప్రార్థనాలయాలు మూసివేసే ప్రక్రియను కొనసాగిస్తారు. కేరళలో రోజుకు 30వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు–కేరళ సరిహద్దు ప్రాంతాలైన కోయంబత్తూరు, కన్యాకుమారీ, తెన్కాశీ, తేనీ జిల్లాల్లోని చెక్పోస్టులను కట్టుదిట్టం చేయాలని, కేరళ నుంచి వచ్చే పౌరులకు కరోనా పరీక్షలు చేసిన తరువాతనే అనుమతించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. చదవండి: ప్రియుడి కోసం బిడ్డను హింసించిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు -
10 రోజుల్లో ఆలయాలు తెరవకపోతే..: అన్నా హజారే
సాక్షి, ముంబై: రాష్ట్రంలో కరోనా కారణంగా మూసివేసిన ఆలయాలన్నింటినీ పది రోజుల్లోగా తెరవాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. లేకపోతే జైల్ భరో చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు సహా వైన్ షాపులు కూడా తెరిచే ఉంటున్నాయని, ఆలయాలను తెరవడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని అన్నా హజారే నిలదీశారు. పది రోజుల్లో ఆలయాలను తెరవని పక్షంలో మందిర్ బచావ్ కృతి సమితి జైల్ భరో నిర్వహిస్తుందని, అందుకు తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ ఆంక్షల వల్ల గత ఏడాదిన్నర నుంచి ప్రార్థనా స్థలాలన్నీ మూసే ఉంటున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నియమాలను దశలవారీగా సడలిస్తున్నారు. దీంతో బార్లు, వైన్ షాపులు, హోటళ్లు, వివిధ వ్యాపార రంగ సంస్థలు అన్నీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లాక్డౌన్ నియమాలకు కట్టుబడి జనాలు కూడా నిర్భయంగా ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో ఆలయాలను కూడా తెరవాలని గత కొద్ది నెలలుగా ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. వివిధ సేవా సంస్థలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతినివ్వడం లేదు. దీంతో అహ్మద్నగర్ జిల్లాకు చెందిన మందిర్ బచావ్ కృతి సమితి బృందం రాళేగణ్సిద్ధి గ్రామంలో అన్నా హాజారేతో భేటీ అయి ఓ నివేదికను అందజేసింది. ఆ నివేదికను పరిశీలించిన హజారే, ఆలయాలను మూసివేసి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. మందిరాలకు వచ్చే భక్తులు కోవిడ్ నియమాలు కచ్చితంగా పాటిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆలయాలను తెరిచేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: BMC Election 2022: ఆ ఓట్లన్నీ బీజేపీకే.. చెక్ పెట్టేందుకు శివసేన.. -
కేరళ లో పెరుగుతున్న కరోనా కేసులు
-
కేరళలో మళ్లీ ఆదివారం లాక్ డౌన్
-
బాబోయ్.. ఈ చికెన్ చిక్కనంటోంది
సాక్షి, పరిగి( హైదరాబాద్): కోడి మాసం ధరలు కొండెక్కాయి. శ్రావణమాసంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ప్రస్తుత ధర రూ.270 పలుకుతోంది. దీంతో ముక్క గొంతు దాటని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వ్యవధిలో ధరలు రెండింతలు పెరిగాయి. దాణా రేట్లు సైతం ఇదే స్థాయిలో పెరిగాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. స్థానికంగా దాణా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని పేర్కొంటున్నారు. పండుగ రోజుల్లో కూడా.. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 1.7 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఆదివారం, ఏదైనా పండగ ఉంటే ఆయా రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో కోళ్ల పెంపకం ముమ్మరంగా సాగుతోంది. కోడి పిల్లలు వేసిన 40 రోజుల్లో కోళ్లు ఎదిగి అమ్మకానికి వస్తాయి. దీంతో కోళ్ల పెంపకందారులు రెండు నెలలకో బ్యాచ్ తీస్తున్నారు. ఏడాది పొడువునా చికెన్కు డిమాండ్ ఉంటున్నా.. గతంలో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విక్రయాలు బాగా తగ్గేవి. వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. దీంతో రేట్లు కూడా తగ్గుముఖం పడుతుంటాయి. ఈఏడాది శ్రావణమాసం ముగుస్తున్నా చికెన్ ధరలు మాత్రం పైపైకే వెళ్తున్నాయి. వ్యాపారులంతా సిండికేట్గా మారి ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణాలు ఇవే.. కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో కోళ్ల దాణా ధరలు పెరిగాయి. ఆంక్షలు సడలించినా అదుపులోకి రావడం లేదు. దాణాలో ప్రధానమైన సోయాబీన్ అమాంతం ఎగబాకింది. గతంలో కిలో రూ.33 ఉండగా మూడు నెలలుగా రూ.100 పలుకుతోంది. మొక్కజొన్న రూ.14 నుంచి రూ.25 వరకు పెరిగిందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో చాలా మంది రైతులు ఫారాల్లో కొత్త బ్యాచ్లు వేయలేదు. దీంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. అలాగే కోవిడ్ను ఎదుర్కొనేందుకు చికెన్ను ఎక్కువగా తింటున్నారు. వీటి ప్రభావం ధరలపై పడుతోంది. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
ఒక్క కరోనా కేసు.. మూడు రోజులు దేశాన్నే మూసేశారు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో మంగళవారం ఒకే ఒక్క కరోనా కేసు బయట పడింది. దీంతో దేశంలో మూడు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని జెసిందా ఆర్డెర్న్ ప్రకటించారు. మంగళ వారం అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ ప్రారంభమవు తుందని తెలిపారు. దీంతో ఒక్కసారిగా నిత్యావసర మార్కెట్ల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. న్యూజిలాండ్ డాలర్ విలువ కూడా పడిపోయింది. ఆక్లాండ్లో నివసిస్తున్న ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆయన కోరమాండల్ ప్రాంతాన్ని కూడా సందర్శించాడు. దీంతో ఈ రెండు చోట్లా ఏకంగా వారం పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని జెసిందా ప్రకటించారు. ఆ వ్యక్తికి కరోనా ఎలా సోకిందో నిపుణులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచమంతటా డెల్టా వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్కు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైరస్ను కట్టడి చేయడం కాకుండా, అసలు లేకుండా చూసేందుకే లాక్డౌన్ బాట పట్టాల్సి వచ్చిందని వివరించారు. కరోనా బయటపడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 26 మరణాలు మాత్రమే న్యూజిలాండ్లో సంభవించాయి. దేశంలో 32శాతం మందికి మొదటి డోసు, 18శాతం మందికి రెండో డోసు వ్యాక్సినేషన్లు పూర్తయ్యాయి. -
Covid Third Wave: 2 శాతం పాజిటివిటీ దాటితే మళ్లీ లాక్డౌన్..?
సాక్షి, బెంగళూరు: కరోనా మూడో ఉధృతి వ్యాప్తి భయాలు విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షల వైపు మొగ్గుచూపుతోంది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన నిపుణులు, అధికారులతో కీలక సమావేశం జరిగింది. థర్డ్ వేవ్ను అడ్డుకోవాలంటే లాక్డౌన్ తరహా ఆంక్షలను విధించక తప్పదని నిర్ణయించారు. కఠినతరం చేస్తాం: సీఎం.. సమావేశ అనంతరం సీఎం బొమ్మై మీడియాతో వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ అవసరం లేదు. కొత్త నిబంధనల బదులు ఉన్న వాటినే కఠినతరం చేస్తాం. కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు కాబట్టి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలిపారు. తాజా నిబంధనలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండబోవని చెప్పారు. ఆంక్షలకే నిపుణుల సిఫార్సు.. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం దాటిన ప్రాంతాల్లో లాక్డౌన్ చేస్తే బాగుంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాలను నిషేధించాల్సిందేనని ఈ సమావేశంలో నిపుణులు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి సెప్టెంబరు వరకు వేచి ఉంటే మేలు అని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ బదులు వారాంతపు కర్ఫ్యూ అమలు చేయడం ఉత్తమం. పండుగలు, జాతరల్లో జన సమ్మర్దాన్ని నివారించాలి. ఇతర రాష్ట్రాలవారికి నెగిటివ్ రిపోర్టు వస్తేనే అనుమతించాలి. సరిహద్దు జిల్లాల్లో కరోనా పరీక్షలను పెంచడంతో పాటు అందరికీ టీకా అందేలా చూడాలి అని అభిప్రాయపడ్డారు. కరోనా తీవ్రత పెరిగిన చోట ఈ నిబంధనలు విధిస్తారు అంత్యక్రియలకు 10 మందే హాజరు కావాలి. పబ్లు, బార్లు, జిమ్లు, యోగా సెంటర్లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాల బంద్ దేవస్థానాల్లో భక్తుల ప్రవేశం నిషేధం. ర్యాలీ, బహిరంగ సమావేశాలకు అనుమతి లేదు. జన రద్దీ మార్కెట్లను తాత్కాలికంగా మూసేయాలి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల విక్రయాలు వారాంతపు కర్ఫ్యూ శుక్రవారం సాయంత్రం 7 నుంచి మొదలవుతుంది. కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో విద్యాసంస్థలకు అవకాశం. ఒకవేళ పాఠశాలల్లో కేసులు నిర్ధారణ అయితే వారం రోజుల పాటు బంద్ చేయాల్సి ఉంటుంది. బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ ఉండదు. పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉంది. దాటితే నిబంధనల్లో మార్పు ఉంటుంది. -
చెన్నై కథలమ్మ: ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించవచ్చు!
చెన్నైకి చెందిన ప్రతిగయా హరన్ జీవితం లాక్డౌన్కు ముందు లాక్డౌన్ తర్వాత వేరువేరుగా ఉంది. లాక్డౌన్కు ముందు స్కూళ్లు, కాలేజీలకు వెళుతూ ఆమె కథలు చెప్పేది. లాక్డౌన్ తర్వాత అంతా ముగిసినట్టే అనుకుంది. కాని జూమ్ ద్వారా ఆన్లైన్లో కూడా కథలు చెప్పొచ్చు అని ఎప్పుడైతే ప్రయత్నించిందో అప్పటినుంచి ఒక్క చెన్నై ఏంటి ప్రపంచమంతా వినేవాళ్లే. డబ్బులూ వస్తున్నాయి. కథ కూడా ఒక ఉపాధే సుమా. కథలన్నీ వెళ్లి కరోనా దగ్గరకు చేరే ఈ కాలంలో కూడా కథలు చెప్పి పిల్లలను కాసేపైనా మాయాలోకాలలో విచిత్ర మార్గాలలో సమయస్ఫూర్తి కలిగేలా నీతిని బోధిస్తూ విహరింప చేసే వారున్నారని తెలిస్తే సంతోషం కలుగుతుంది. ఇటీవల ప్రతిగయా హరన్ చెన్నై నుంచి హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్కూల్ వారి కోసం ఒక ఆన్లైన్ కథా సమయం నిర్వహించారు. అయితే అందులో పాల్గొంది పిల్లలు కాదు. టీచర్లు. అవును... పిల్లలేనా కథల మజా చూసేది పెద్దలు ఎందుకు చూడకూడదు అంటారు ప్రతిగయా. నిజమే. పెద్దలు కథలు వింటేనే కదా పిల్లలకు చెప్పగలుగుతారు. చెన్నై కథలమ్మ చెన్నైకి చెందిన ప్రతిగయా హరన్ గత ఏడేళ్ల నుంచి ‘స్టోరీ టెల్లింగ్’ను ఒక ఉపాధిగా చేసుకున్నారు. ‘స్టోరీ శాక్’ అనే ఫేస్బుక్ పేజీని నడుపుతున్నారు. తల్లిదండ్రులకు, ఇంట్లోని పెద్దలకు కథలు చెప్పే తీరిక లేని ఈ రోజుల్లో పిల్లలకు కథలు చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి కథలు చెబుతూ గుర్తింపు పొందారామె. అయితే లాక్డౌన్కు ముందు ఆమె నేరుగా పిల్లలను కలుస్తూ కథలు చెప్పారు. రెండేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు అన్నీ మూతపడితే తన కథల సంచి కూడా మూలన పడేశారు. అంతా అయిపోయినట్టే అనుకున్నారు కానీ, కాదు. ఆన్లైన్ కథలు మూడు నెలల క్రితం ఆమె ఇలా ఆన్లైన్లో కథలు చెబుదాం అని నిశ్చయించుకున్నారు. అయితే సందేహం. పిల్లలు ఎదురుగా ఉంటే వారిని ఆకర్షిస్తూ కథలు చెప్పడం సులువు. ఆన్లైన్లో అంత బాగా చెప్పగలమా అనుకున్నారు. కాని ఆమె చేసిన మొదటి సెషన్ పెద్ద హిట్ అయ్యింది. పిల్లలు ఆమె కథలు చెబుతుంటే ఎంజాయ్ చేశారు. అంతేనా ఆమె నేరుగా ఉంటే చెన్నైలోని పిల్లలనే కలిసి చెప్పగలదు. ఆన్లైన్లో అడ్డంకి ఏముంది? ఎక్కడి వాళ్లకైనా చెప్పగలదు. ‘ఇంతకు ముందు నేను నాలుగు వారాలకు ఒక సెషన్ నిర్వహించేదాన్ని. ఇప్పుడు వారానికి ఒకటి. చాలామంది ఆన్లైన్ కథలను ఇష్టపడుతున్నారు’ అంటుంది ప్రతిగయా. జూమ్ ద్వారా ఆమె కథలు చెబుతుంది. ఆ ఒక్క సెషన్లో పాల్గొని కథలు వినాలంటే 150 నుంచి 250 వరకూ చెల్లించాలి. ‘అలా చెల్లించి అమెరికా, అరబ్ దేశాలలో నా కథలు వింటున్నారు’ అంది ప్రతిగయా. కొత్త అనుభూతి ప్రతిగయా చెన్నైలో పిల్లలకు ఇంగ్లిష్లో, తమిళంలో కథలు చెప్పేది. కాని ఆన్లైన్లో కథలు చెప్పడం మొదలెట్టాక తన మాతృభాషైన రాజస్తానీలో తన స్వరాష్ట్రం రాజస్థాన్ పిల్లలకు చెప్పే అవకాశం వచ్చింది. ‘ఇది ఊహించలేదు’ అంది ప్రతిగయా. ఒక పని చేయాలంటే ఇవాళ ప్రత్యేకంగా ప్రచారం అక్కర్లేదు. వాట్సప్, ఫేస్బుక్ చాలు. మీలో ప్రతిభ ఉంటే మీరు ఇంట్లో కూచునే మంచి వ్యాపకాన్నీ, ఆ వ్యాపకం నుంచి డబ్బును కూడా సంపాదించవచ్చు అంటుంది ప్రతిగయా. ఆమె చేసిన ఇంకో విశేషమైన పని ఏమిటంటే పెద్దలకు కథలు చెప్పడం. పెద్దవాళ్లు వచ్చి కథలు వినండి... బాల్యం గుర్తొస్తుంది.. ఉల్లాసమూ కలుగుతుంది అంటుందామె. ఇప్పుడు ఆమె కథలను నిజంగానే ఆబాలగోపాలం వింటున్నారు. చదవండి: పెట్రోలుపై రూ. 3 తగ్గింపు.. నష్టాన్ని భరిస్తామన్న ప్రభుత్వం! -
వర్చ్యువల్లో... ‘నో ఫీల్’ అంటున్న లవర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరి జీవన శైలిపైనా, చేసే పనులపైనా కరోనా మహమ్మారి చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ప్రభావం ఎన్నింటికో అతీతమైన ప్రేమ ప్రపంచాన్నీ వదలలేదు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎవరి ఇంట్లో వారు బందీలుగా గడిపిన దాదాపు ఏడాదిన్నర కాలం.. పరస్పర ప్రేమ, సాన్నిహిత్యాలను ను పునః సమీక్షించుకునే అవకాశాన్ని మాత్రం అందించింది. ఈ నేపథ్యంలో ‘లవ్ సర్వే 2021’ను ఐప్సోస్ భాగస్వామ్యంతో ఐటీసీ ఎంగేజ్ నిర్వహించిన తొలి ప్రేమ అధ్యయనం.. పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 63% మంది స్పందన దారులు దీర్ఘకాలపు బంధాలను విశ్వసిస్తున్నారు. భౌతికదూరం..ప్రేమకు అవరోధం ఈ ప్రశ్నకు సమాధానంగా నాన్ మెట్రో నగరాలలోని 36% మంది, భౌతికంగా దూరంగా ఉండాల్సి రావడమనేది ప్రేమానుబంధాలకి అవరోధం కానే కాదని అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో ప్రేమను సజీవంగా ఉంచడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే దీనిపై నాన్ మెట్రో నగరాల ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా కేవలం 24% మంది మెట్రో సిటిజనులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు. లవ్కి లాక్... దాదాపుగా 80% సింగిల్/క్యాజువల్ డేట్స్, తమ లవ్ జర్నీ ఆరంభించడం/ ఓ బంధాన్ని అల్లుకోవడం ఈ సమయంలో కష్టంగానే భావించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 75% మంది లాక్డౌన్ల కారణంగా కొత్త లవ్ అఫైర్ను స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, తాజాగా అల్లుకున్న అనుబంధాలను బలోపేతం చేయడం కూడా కష్టంగానే మారిందన్నారు. అయితే అదే సమయంలో మరో కోణంలో నుంచి చూస్తే తమ సంబంధాల లోతుపాతుల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడిందని అంగీకరించారు. వర్చ్యవల్...రియల్? వాస్తవ ప్రేమతో పోల్చినప్పుడు వర్చ్యువల్ ప్రేమాయణం పూర్తి భిన్నమైనదని 98% మంది భావించారు. వర్చ్యువల్ ప్రేమాయణంలో ప్రామాణికత ఉండదని, కొన్ని సార్లు ప్రమాదకరమైనదిగా కూడా అత్యధికులు భావిస్తున్నారు. అయితే వాస్తవ జీవితంలో ఎవరైతే కాస్త సిగ్గరిగా అంతర్ముఖులుగా ఉంటారో అలాంటి వారికి వర్చ్యువల్ ప్రేమాయణం సహాయపడవచ్చని 50% మంది భావించారు. అలాగే 50% మంది వర్చ్యువల్ ప్రేమ సరసమైనది/క్యాజువల్గా ఉంటుందని.. అయితే తీవ్రంగా మాత్రం ఉండదని చెబుతున్నారు. అదే విధంగా ఈ తరహా ప్రేమానుబంధం కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరంగా మారవచ్చని 46% మంది అభిప్రాయపడ్డారు. కలివిడిగా...విడివిడిగా... మహమ్మారి కాలంలో ప్రేమికుల లవ్జర్నీ స్లోగా మారింది. కోవిడ్ నేపధ్యంలో ‘కలిసి ఉండటం’ అనే పద ప్రయోగం 23% తగ్గగా, ‘కెమిస్ట్రీ’ అనే పద ప్రయోగం ఇప్పటి వాతావరణంలో 14%కి పడిపోయింది. అయితే ప్రేమికుల మధ్య నెగిటివ్ వర్డ్స్గా పేర్కొనే ‘ కష్టం’, ‘ఆందోళన’, ‘అసహనం’ వంటి పద ప్రయోగాలు వరుసగా 25%, 15%, 20% పెరిగాయి. ఈ ఎంగేజ్ లవ్ సర్వే 2021ను 18-35 సంవత్సరాల వయసు కలిగిన, మెట్రో, మెట్రోయేతర నగరాలలో ఉన్న యువతీయువకులతో నిర్వహించారు. -
పుణేలో పాక్షిక ఆంక్షల సడలింపు
సాక్షి, ముంబై: పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ల పరిధిలో లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా సడలించింది. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి అజిత్ పవార్ ఆంక్షల సడలింపు ప్రకటన చేశారు. ఆగస్టు 9వ తేదీ నుంచే ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని పవార్ వెల్లడించారు. దీంతో పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ల పరిధిలోని వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఇరు కార్పొరేషన్లలో రికవరీ రేటు గణనీయంగా పెరగడంతో పాటు కరోనా వైరస్ కూడా మెల్లమెల్లగా అదుపులోకి వస్తోంది. దీంతో లాక్డౌన్ ఆంక్షలను పాక్షికంగా సడలించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి అజిత్ పవార్ తెలిపారు. సడలించిన నిబంధనల ప్రకారం ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని రకాల షాపులు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. హోటళ్లు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. మాల్స్ రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని అజిత్ పవార్ వెల్లడించారు. అయితే, కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే మాల్స్లోకి అనుమతించాలని పవార్ మాల్స్ యాజమాన్యాలకు సూచించారు. ఒకవేళ ప్రజల నిర్లక్ష్యం వల్ల పాజిటివిటీ రేటు 8 శాతాన్ని దాటితే సడలించిన ఆంక్షలను రద్దు చేస్తామని, మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు వెనుకాడబోమని పవార్ హెచ్చరించారు. ప్రజలు అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని పవార్ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నియమాలను పాటించాలని ఆయన కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజిత్ పవార్ హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దని పౌరులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలోని ఉద్యానవనాలు ప్రస్తుతం అమలులో ఉన్న సమయానుసారంగానే తెరిచి ఉంటాయని వెల్లడించారు. పుణే, పింప్రి–చించ్వడ్ ప్రాంతాల్లో ఈత తప్ప మిగతా అన్ని క్రీడలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇక్కడి ప్రార్థనా మందిరాలు అన్నీ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, తమ వ్యాపారాలు, కార్యకలాపాల వేళలను మార్చాలని పుణేలోని రెస్టారెంట్ల ఓనర్లు, వ్యాపారులు, మాల్ సిబ్బంది అసోసియేషన్లు డిమాండ్లు చేస్తూ గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కరోనా ఆంక్షలు సడలించిన ప్రభుత్వం లెవల్–3 జిల్లాలైన పుణే సహా మరో 9 జిల్లాలకు కరోనా ఆంక్షలను సడలించలేదు. కాగా, ప్రస్తుతం పుణేలో పాజిటివిటీ రేటు 3.3 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్లో కూడా çకరోనా పాజిటివిటీ రేటు 3.7 శాతానికి తగ్గిందని అక్కడి అధికారులు వెల్లడించారు. -
విద్యుత్ డిమాండ్కు ‘లాక్డౌన్’!
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో గతేడాది విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. ప్రధానంగా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, రైల్వే, మెట్రో రవాణా సేవలు మూతపడటంతో విద్యుత్ డిమాండ్ అమాంతం పడిపోయింది. 2019–20లో 68,303 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వార్షిక విద్యుత్ వినియోగం జరగ్గా 2020–21లో అది 67,694 ఎంయూలకు తగ్గిపోయింది. ప్రస్తుత 2021–22 సంవత్సరంలో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో మళ్లీ విద్యుత్ వినియోగం పుంజుకుంటోంది. ఈ ఏడాది రోజువారీ రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,900 మెగావాట్లకు పెరగనుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అంచనా వేసింది. ఆ మేరకు విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం పెంచుకోవడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అనుమతిచ్చింది. మరోవైపు 2026–27 నాటికి రోజువారీ విద్యుత్ గరిష్ట డిమాండ్ 18,653 మెగావాట్లకు, వార్షిక విద్యుత్ వినియోగం 1,04,345 ఎంయూలకు పెరగొచ్చని కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) 19వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే రిపోర్టులో పేర్కొంది. అవసరానికి అక్కరకు రాని పునరుత్పాదక ఇంధనం.. పునరుత్పాదక విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంలో దేశంలోనే సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో దీనివల్ల ఆశించిన ప్రయోజనం చేకూరట్లేదు. విద్యుత్ గరిష్ట డిమాండ్ నెలకొన్న వేళల్లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం తెలంగాణ 4,389.4 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నా వాటి వాస్తవ ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) సుమారు 20 శాతమే. -
ఆరువారాల లాక్డౌన్, అయినా లొంగని డెల్టా వేరియంట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా శరవేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్తో సిడ్ని నగరం విలవిలలాడుతోంది. ఆరు వారాల కఠిన లాక్డౌన్ తర్వాత కూడా రికార్డు స్థాయిల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని అతిపెద్ద నగరం సిడ్నీలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 291కి పెరిగింది. అంతేకాదు పరిస్థితి మరింత దిగజారవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుత ధోరణి ప్రకారం రోజువారీ కేసు సంఖ్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రీమియర్ గ్లాడిస్ బెరెజిక్లియన్ శుక్రవారం ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని మూడు అతిపెద్ద నగరాలతో సహాఇతర ప్రాంతాల్లో కూడా కరోనా మహమ్మారి విధ్వంసం కారణంగా దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది లాక్డౌన్లో ఉన్నారు. ఉత్తరాన ఉన్న క్వీన్స్ల్యాండ్, పశ్చిమ ఆస్ట్రేలియాలలో కూడా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా క్వీన్స్లాండ్లో10, మెల్బోర్న్లో విక్టోరియాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. సిడ్నీ, మెల్బోర్న్, బ్నిస్బేన్ నగరాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆగస్టు 28 వరకు సిడ్నీ లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఒక్క సిడ్నీ నగరంలోనే దాదాపు 50లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
Naveen Polishetty: ‘జాతిరత్నం’ పెద్దమనసు.. ఆ యువకుడికి ఉద్యోగం
కరోనా కష్టకాలంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అభిమానులకు అండగా ఉంటున్నాడు. బాధల్లో ఉన్నవారితో ఫోన్లొ మాట్లాడడమే కాకుండా.. తనకు తోచిన సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే వ్యక్తికి ఒక్క ట్వీట్తో జాబ్ ఇప్పించాడు ఈ ‘జాతిరత్నం’. లాక్డౌన్ సమయంలో జాబ్ కోల్పోయిన ఇబ్బంది పడుతున్న సమీర్ గురించి నవీన్ పొలిశెట్టికి తెలియగానే.. ఆ యువకుడి వివరాలను ట్వీటర్లో పోస్ట్ చేస్తూ ఉద్యోగం ఉంటే చెప్పండని కోరాడు. నవీన ట్వీట్కు స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్కు స్టోర్ మేనేజర్గా ఉద్యోగాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ.. సమీర్కు వచ్చిన ఆఫర్ లెటర్ని పోస్ట్ చేశాడు నవీన్. సమీర్ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన నెటిజన్స్ చరణ్, సౌమ్యలకు థ్యాంక్స్ చెప్పారు. త్వరలో ఈ స్టోర్కు తాను వెళ్తానని చెప్పాడు. అలాగే పాండమిక్ టైమ్లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వీలైనంత మందికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ ట్వీట్ చేశారు. Offer letter :) the guy has got a job. Folks at ewoke cafe , am going to visit your cafe and meet all of you soon. So happy today. Big shout out to @charan_tweetz @iamsowmya18 We need to help people get jobs back in this pandemic. Do your bit if you can :) https://t.co/GX5TrGF1s7 pic.twitter.com/ebeYelcZB0 — Naveen Polishetty (@NaveenPolishety) August 3, 2021 -
ప్రైవేటు కంపెనీలో మేనేజర్.. లాక్డౌన్ దెబ్బకి దొంగగా మారాడు
బెంగళూరు: లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కొందరు ఉపాధి లేక కూలి పనులు చేసుకోగా, మరికొందరు వారి చదువు కన్నా తక్కువ స్థాయి పని చేస్తూ రోజులు గడుపుతున్నారు, ఇంకొందరు ఉద్యోగ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక అడ్డదారులు తొక్కుతున్నారు. అలా ఓ ఎంబీఏ చదివిన యువకుడి ఉన్న ఉద్యోగం పోవడంతో దొంగగా మారి కటకటలా పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటు చేసుకుంది. అతడు ఎంబీఏ చదివి ప్రైవేటు కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం చూస్తూ కాలం గడుపుతున్న ఆ యువకుడికి కరోనా దెబ్బతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో చైన్స్నాచర్ అవతారం ఎత్తాడు. జయనగర పూర్ణిమా కన్వెన్షన్ హాల్ నుంచి వస్తున్న మహిళ మెడలో బంగారుచైన్ లాక్కుని పారిపోయిన షేక్ గౌస్ అనే చోరున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రశ్నించగా తన దయనీయ గాథ చెప్పాడు. సార్ నేను ఎంబీఏ పూర్తి చేశా. కరోనా లాక్డౌన్ వల్ల నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. రూ.35 వేల అప్పు ఉంది. అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. వేరే ఉద్యోగాలేవీ దొరకలేదు. దీంతో చైన్స్నాచింగ్ చేశానని చెప్పాడు. -
లాక్డౌన్ కాలంలో వీటికి భారీ డిమాండ్!
కరోనా మహమ్మారి కాలంలో చాలా వ్యాపారులు కుదెలు అయినప్పటికీ కొన్ని వ్యాపారులు మాత్రం ఎన్నడూ లేనంతగా తిరిగి పుంజుకున్నాయి. అటువంటి వాటిలో ప్యాకేజ్డ్ కుకీలు, చిప్స్, నూడుల్స్, మాకరోని వంటి స్నాక్స్ కు గత రెండు సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. ఈ మహమ్మారి కాలంలో వినియోగదారులు రక రకాల తినుబండరాలపై ఆసక్తి కనబరిచారు. గురువారం కాంటార్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్-మే 2019 నుంచి ఏప్రిల్-మే 2020 మధ్య స్నాక్స్ కు డిమాండ్ 8 శాతం పెరగింది. ఆ తర్వాత సంవత్సరం ఏప్రిల్-మే 2020 నుంచి ఏప్రిల్-మే 2021 మధ్య వీటి డిమాండ్ 12 శాతం పెరిగింది. భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి వేగంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్డౌన్ విధించింది. దీంతో చాలా మంది ఇంట్లోనే ఉండటం, బయటకు వెళ్లే ఆస్కారం లేకపోవడంతో ప్యాకేజ్డ్ కుకీలు, చిప్స్, నూడుల్స్, మాకరోని వంటి స్నాక్స్ కు డిమాండ్ ఏర్పడింది. అలాగే, ప్రజలు తమ ఇంట్లో కొత్త రకంవంటకాలతో ప్రయోగాలు చేశారు. ఇంకా పట్టణాలలోని ప్రజలు బ్రాండెడ్ ఆహారాలను కొనుగోలు చేశారు. లాక్డౌన్ కాలంలో యూట్యూబ్ లోని ఫుడ్ మేకింగ్ వీడియోలకు డిమాండ్ ఏర్పడింది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ మహమ్మారి కాలంలో అల్పాహార స్నాక్స్ కి భారీగా డిమాండ్ ఏర్పడినట్లు అని కాంటార్ తెలిపారు. ఉదాహరణకు పార్లే ప్రొడక్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ రెండూ గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదుచేశాయి. -
జూన్లో మౌలిక పరిశ్రమ ఓకే!
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమల గ్రూప్ జూన్లో 8.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెల్లో అతి తక్కువ క్షీణ (లో బేస్ ఎఫెక్ట్) గణాంకాలు నమోదుకావడం తాజా ఫలితంపై సానుకూల ప్రభావం చూపింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 జూన్ నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగంలో అసలు వృద్ధిలేకపోగా 12.4 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది మే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 16.3 శాతంకాగా, ఏప్రిల్లో ఏకంగా 60.9 శాతంగా ఉంది. ఎనిమిది పరిశ్రమలు వేర్వేరుగా చూస్తే.. ఆరు రంగాలు వృద్ధి బాటలోకి... ► బొగ్గు : 7.4 శాతం పురోగతి చోటుచేసుకుంది. 2020 ఇదే నెల్లో 15.5 శాతం క్షీణించింది ► సహజ వాయువు : 12 శాతం క్షీణత నుంచి 20.6 శాతం వృద్ధికి మళ్లింది. ► రిఫైనరీ ప్రొడక్టులు : 8.9 శాతం క్షీణత 2.4 శాతం వృద్ధి టర్న్ తీసుకుంది ► స్టీల్: 25 శాతం వృద్ధి సాధించింది. 2020 జూన్లో 23.2 శాతం క్షీణతలో ఉంది ► సిమెంట్: 6.8 శాతం క్షీణ బాట నుంచి 4.3 శాతం పురోగతి బాటకు మారింది ► విద్యుత్: 10% క్షీణత 7.2 వృద్ధికి మళ్లింది. తగ్గిన వృద్ధి స్పీడ్ ► ఎరువులు: 2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2020 ఇదే నెల్లో వృద్ధి 4.2 శాతం నుంచి తాజా సమీక్షా నెల్లో తగ్గడం గమనార్హం. మైనస్లోనే క్రూడ్ ఇక క్రూడ్ ఉత్పత్తి క్షీణతలోనే కొనసాగుతోంది. సమీక్షా నెల్లో 1.8 శాతం మైనస్ ఉత్పత్తి నమోదయ్యింది. అయితే 2020 జూన్తో పోల్చితే క్షీణత (– 6 శాతం) తగ్గడం కొంత ఊరట. మొదటి త్రైమాసికంలో... ఎనిమిది మౌలిక రంగాలు ఏప్రిల్–జూన్ మధ్య 25.3 శాతం వృద్ధి సాధించాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 23.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఐఐపీ వృద్ధి 12 నుంచి 17 శాతం.. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వెయిటేజ్ దాదాపు 44 శాతంగా ఉంది. వచ్చే రెండు వారాల్లో వెలువడనున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలపై తాజా జూన్ మౌలిక రంగం ఫలితాలు సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జూన్ ఐఐపీ 12 నుంచి 17 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. లో బేస్ ఎఫెక్ట్తో పాటు జీఎస్టీ ఈ–వే బిల్లులు మెరుగుపడ్డం, ఆటో ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడం, కరోనా సెకండ్వేవ్ కేసులు తగ్గి పలు రాష్ట్రాల్లో సాధారణ వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డం వంటి అంశాలు కూడా జూన్ ఐఐపీ చక్కటి వృద్ధి రేటుకు దోహపడతాయని విశ్వసిస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
25 జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే కరోనా రోగుల సంఖ్య సరాసరి కంటే తక్కువ ఉన్న 25 జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు మంత్రి రాజేశ్ టోపే వెల్లడించారు. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నియమాలు సడలించే విషయంపై గురువారం చర్చించినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా లెవల్–3 ఉన్న జిల్లాలో వ్యాపారులు తమ షాపులు ఆదివారం పూర్తిగా మూసివేయగా, శనివారం సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు టోపే వెల్లడించారు. ఇదివరకు శని, ఆదివారాలు షాపులు మూసి ఉండేవి. కరోనా ప్రభావిత 11 జిల్లాలను లెవల్–3లో ఉంచనున్నారు. ఇందులో పశ్చిమ మహారాష్ట్రలోని సాతారా, సాంగ్లీ, పుణే, షోలాపూర్, కోల్హాపూర్ ఇలా ఐదు జిల్లాలున్నాయి. అదేవిధంగా కొంకణ్ రీజియన్లోని నాలుగు జిల్లాలు, మరాఠ్వాడలోని బీడ్, ఉత్తర మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లాలున్నాయి. ఈ 11 జిల్లాలు మినహా మిగతా 25 జిల్లాలో నిబంధనలు త్వరలో ఎత్తివేస్తామన్నారు. ఇక సామాన్యులకు లోకల్ రైళ్లలో అనుమతించే విషయంపై మాట్లాడుతూ గురువారం జరిగిన చర్చల్లో వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతించాలని ఇప్పటికే సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రైల్వే అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని టోపే అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య విభాగం, కరోనా టాస్క్ ఫోర్స్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన నివేదిక ఆమోదం కోసం ముఖ్యమంత్రికి పంపించనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించగానే అమలుకు రంగం సిద్ధం చేస్తామన్నారు. ఒకట్రెండు రోజుల్లో అమోదం లభిస్తుండవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. -
థర్డ్వేవ్కు.. కేరళే కేంద్రమా!
భారత్లో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రంగా నిలిచిన కేరళ మరోమారు భయపెడుతోంది. సెకండ్ వేవ్ ముగిసిపోతోందని దేశమంతా ఊపిరి తీసుకుంటున్న వేళ థర్డ్వేవ్కు కేరళ కేంద్రంగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ కేరళ ప్రాంతంలో పెరిగిపోతున్న ఇన్ఫెక్షన్ వ్యాప్తి కేరళ ప్రభుత్వాన్నే కాదు, కేంద్రాన్ని కూడా కలవరపెడుతోంది. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు రాష్ట్రం మరోమారు వీకెండ్ లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగించింది, అటు కేంద్రం ఒక నిపుణుల బృందాన్ని కేరళకు పంపి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. గతేడాది ఒకదశలో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేస్తోందని ప్రశంసలు అందుకున్న కేరళలో పరిస్థితి ఎందుకిలా మారింది? పరిస్థితి ఎంత డేంజర్? ప్రభుత్వం ఏంచేస్తోంది? కేంద్రం నుంచి ఎలాంటి సాయం లభిస్తోంది? నిపుణులేమంటున్నారు?.. చూద్దాం! పరిస్థితేంటి? కరోనా సెకండ్ వేవ్ ఆరంభమైన కొత్తలో కేరళ కోవిడ్ నిర్వహణలో మంచి పనితీరే చూపింది. కానీ క్రమంగా పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. తాజాగా ఐసీఎంఆర్ చేసిన నేషనల్ సీరోసర్వేలో దేశంలో అత్యల్ప యాంటీబాడీలున్న రాష్ట్రంగా కేరళ(44 శాతం) నిలిచింది. అంటే రాష్ట్ర జనాభాలో 56 శాతం మందికి కోవిడ్ ముప్పుందని తేలుస్తోంది. పొరుగురాష్ట్రాలతో పోలిస్తే కేరళలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు తమిళనాడులో జూన్ 6న 20వేల పైచిలుకు కేసులుండగా, జూలై 27నాటికి ఈ కేసులు 1,767కు పరిమితమయ్యాయి. కర్ణాటకలో జూన్ 27న 1,501కేసులు నమోదయ్యాయి. కానీ కేరళలో జూలై 27న 22వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అదేరోజు దేశం మొత్తం మీద నమోదైన కొత్త కేసులు 43 వేలున్నాయి. అంటే ఒక్క కేరళ నుంచే దేశంలోని మొత్తం కేసుల్లో సగభాగం వచ్చాయి. అలాగే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33 .3 లక్షలకు చేరింది. దేశంలో ఆర్ రేట్ విలువ 0.95 ఉండగా, కేరళలో 1.11గా ఉంది. అలాగే దేశంలో టాప్ 30 కరోనా జిల్లాల్లో పది జిల్లాలు కేరళలోనే ఉన్నాయి. ఎందుకిలా? కేరళలో జనాభా సాంద్రత అధికం(చదరపు కిలోమీటర్కు 859 మంది). అలాగే జనాభాలో 15 శాతం వరకు 60 ఏళ్లు పైబడినవారున్నారు. అలాగే డయాబెటిస్లాంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా అధికమే. ఇవన్నీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నాయి. తక్కువ టెస్టింగ్ రేటు, బ్యూరోక్రసీపై అధికంగా ఆధారపడాల్సిరావడం వంటి కారణాలు కరోనాపై కేరళ పోరాటానికి అడ్డుతగులుతున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. కేసులు తగ్గుముఖం పడుతున్న దశలో అనూహ్యంగా లాక్డౌన్ ఎత్తివేయడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమైందని కొందరి భావన. కేరళకు కేంద్ర బృందం రాష్ట్రంలో పరిస్థితిపై ఆందోళనగా ఉన్న కేంద్రం పరిస్థితి అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కూడిన ఒక నిపుణుల బృందాన్ని కేరళకు పంపింది. ఎన్సీడీసీ డైరెక్టర్ ఎస్కే సింగ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను బృందం సమీక్షిస్తుందని, తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలని, ప్రజలు గుంపులుగా కూడకుండా నిరోధించాలని కేంద్రం కోరింది. మరోవైపు రాçష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పకుండా మరోమారు వీకెండ్ లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శని, ఆదివారాల్లో లాక్డౌన్ పాటించనుంది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ మనదేశంలో థర్డ్వేవ్కు కేరళ కేంద్రంగా మారకూడదని ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని, ప్రజలు కూడా గైడ్లైన్స్కు అనుగుణంగా నడుచుకోవాలిన నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మూడో ముప్పు తప్పదని హెచ్చరించారు. ఆర్– వాల్యూ అంటే? దేశంలో జూలై చివర్లో ఆర్– వాల్యూ (రిప్రొడక్టివ్ ఫ్యాక్టర్) 0.95గా ఉంటే... కేరళలో మాత్రం దేశంలోనే అత్యధికంగా 1.11గా ఉంది. ఇది ప్రమాదఘంటికగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒక కోవిడ్ బాధితుడి నుంచి ఎంతమందికి వైరస్ సోకుతోందనే దాన్ని ఆర్ వాల్యూ సూచిస్తుంది. కేరళలో 1.11 ఆర్ వాల్యూ ఉందంటే దానర్థం... ప్రతి 100 మంది కోవిడ్ రోగుల నుంచి 111 మందికి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు లెక్క. ఆర్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే... కేసులు అదుపులోకి వస్తున్న ట్లు, తగ్గుముఖం పడుతున్నట్లు నిపుణులు పరిగణిస్తారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడు (మార్చి– ఏప్రిల్లో) దేశ సగటు ఆర్ వాల్యూ ఏకంగా 1.37 శాతం ఉండేది. సెరో పాజిటివిటీ... ఐసీఎంఆర్ జూన్ 14 – జూలై 6వ తేదీల మధ్య పదకొండు రాష్ట్రాల్లో సీరో సర్వే (సెరో పాజిటివీటి... జనాభాలో ఎంతశాతం మందికి కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయో తెలుపుతుంది) నిర్వహించింది. దీంట్లో అన్ని రాష్ట్రాల్లో 69 శాతం పైనే సెరో పాజిటివిటీ ఉండగా... కేరళలో మాత్రం ఇది కేవలం 44.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. అంటే రాష్ట్ర జనాభాలో మరో 56 శాతం మందికి కోవిడ్ బారినపడే అవకాశం ఉన్నట్లు లెక్క. –నేషనల్ డెస్క్, సాక్షి -
Coronavirus: కేరళలో కరోనా కలకలం.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్!
-
దారులు.. రక్తధారలుగా!
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద సోమ వారం ఉదయం క్వాలిస్ రాంగ్రూట్లో వచ్చి మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదం లో కారులో ఉన్న నాన్నమ్మ, తాతలతోపాటు వారి మనవడు కూడా ప్రాణాలొదిలారు. నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో ఇటీవల రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. లాక్డౌన్ కాలంలో రోడ్డుప్రమాదాలు తగ్గినట్టే తగ్గినా, ఇప్పుడు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్ అనంతరం జనజీవితం క్రమంగా సాధారణస్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో చాలామంది దైవదర్శనాలు, వివాహాలు, ఇతర వేడుకల కోసం దూరప్రయాణాలు చేస్తున్నారు. అయితే కరోనా నివారణలో భాగంగా ప్రజారవాణా వాహనాలకు బదులుగా వ్యక్తిగత వాహనాలవైపే ఎక్కుమంది మొగ్గు చూపుతుండటం మంచిదే అయినా.. హైవేలపై వాహనాలను చాలామంది సరిగా నియంత్రించలేకపోతున్నారని పోలీసులు అంటున్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు మునుపటిస్థాయికి చేరుకున్నాయని తెలిపారు. గతేడాది 12 నెలల్లో 6,882 మంది రోడ్డుప్రమాదాల్లో మరణించగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30వ తేదీ వరకు 3,245 మంది పౌరులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని రోడ్సేఫ్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే నెలలో తగ్గినట్టే తగ్గి.. కరోనా వైరస్ నియంత్రణకుగాను ఏప్రిల్ చివరివారం నుంచి జూన్ మొదటివారం వరకు వివిధ దశల్లో రాత్రిపూట కర్ఫ్యూ, తర్వాత పూర్తిస్థాయిలో లాక్డౌన్ కొనసాగింది. ఈ క్రమంలో వాహనాల సంచారంపై నియంత్రణ ఉండటంతో ప్రమాదాలు కాస్త తగ్గాయి. మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 1,315 ప్రమాదాల్లో 1,092 మంది గాయపడగా, 474 మంది మరణించారు. జూన్లో కరోనా ఆంక్షలు సడలించగా రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో ఆ 1,598 ప్రమాదాలు జరిగాయి. అందులో 1,467 మంది గాయపడగా.. 530 మంది విగతజీవులుగా మారారని రోడ్సేఫ్టీ గణాంకాలు వెల్లడించాయి. మే నెలలో రోజుకు 42 ప్రమాదాలు జరగ్గా.. అందులో సగటున 15 మంది మరణించారు. 35 మంది గాయాలపాలయ్యారు. జూన్లో రోజుకు 51 ప్రమాదాలు జరగగా, 17 మరణాలు సంభవించాయి. 47 మంది గాయపడ్డారు. జూన్ 30 వరకు మొత్తం 6,130 రోడ్డుప్రమాదాలు సంభవించగా అందులో 3,245 మంది మరణించారు. 9,575 మంది క్షతగాత్రులయ్యారు. వివిధ పోలీస్ యూనిట్లపరంగా మృతుల సంఖ్య... రాచకొండ(274), సైబరాబాద్ (264), సంగారెడ్డి(212), వరంగల్ (207), రామగుండం (202)లు ముందు వరుసలో నిలిచాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా జాతీయ రహదారులు ఉన్న జిల్లాల పరిధిలోనే చోటుచేసుకోవడం గమనార్హం. రూ.84 కోట్లకు చేరుకున్న ఉల్లంఘనలు రోడ్డు భద్రతానియమాలు పాటించకపోవడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుండటం గమనార్హం. ఎంత జరిమానాలు విధించినా చాలామంది నిబంధనలు పాటించడంలేదు. కేవలం ఆరునెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా విధించిన ట్రాఫిక్ చలానాలు రూ.84.11 కోట్లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. ఉల్లంఘన రకం కేసులు విధించిన జరిమానా ఓవర్ స్పీడింగ్ 7,61,926 రూ.68.51 కోట్లు ఓవర్ లోడింగ్ 1,10,626 రూ.97.66 లక్షలు రాంగ్ పార్కింగ్ 4,42,933 రూ.8.81 కోట్లు మొబైల్ డ్రైవింగ్ 66,813 రూ.4.60 కోట్లు సీటుబెల్టు ధరించనివారు 62,174 రూ.67.35 లక్షలు మొత్తం 14,75,725 రూ.84.11 కోట్లు -
నేటి నుంచి ఢిల్లీలో మరిన్ని కరోనా ఆంక్షల సడలింపులు
-
లాక్ డౌన్ ఆంక్షలకు వ్యతిరేఖంగా ఆస్ట్రేలియాలో ఆందోళనలు
-
ఆట మొదలుకానుంది.. ఇక బొమ్మ దద్దరిల్లాల్సిందే!
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): కరోనా సెకండ్వేవ్తో మూతపడిన సినిమా థియేటర్లు శుక్రవారం నుంచి తెరచుకోనున్నాయి. గురువారం థియేటర్లను శానిటైజ్ చేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లను మాత్రమే తెరవనున్నారు. కరోనా లాక్డౌన్తో గతేడాది మార్చి 14వ తేదీన థియేటర్లను మూసేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 4న థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కరోనా సెకండ్వేవ్ విశ్వరూపం దాల్చి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఈ ఏడాది మే 1 నుంచి మళ్లీ మూతపడ్డాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సినిమా హాళ్లను తెరిచేందుకు మళ్లీ అనుమతినిచ్చింది. శుక్రవారం నగరంలోని 60 శాతం థియేటర్లు తెరచుకోనున్నాయి. మరో మూడు వారాల్లోగా 100 శాతం థియేటర్లను తెరవనున్నారు. -
ఆ 2 గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామాలు మరోసారి స్వచ్ఛంద లాక్డౌన్ వైపు కదులుతున్నాయి. వెల్గటూర్ మండలం ఎండపల్లి (జనాభా 4,200) గ్రామంలో జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు లాక్డౌన్ విధించారు. తాజాగా మల్యాల మండలం మద్దుట్ల (జనాభా 2,000)లోనూ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఇటీవల రోజూ వందకుపైనే కేసులు నమోదవుతున్నాయి. మద్దుట్లలో రెండ్రోజుల్లో 32, ఎండపల్లిలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రెండు గ్రామాల సర్పంచ్లు గ్రామాల్లో లాక్డౌన్ విధిస్తూ తీర్మానాలు చేశారు. మద్దుట్లలో ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 7 నుంచి 8 వరకు సడలింపులనిచ్చారు. ఇతర సమయాల్లో బయటకు వెళ్తే రూ.5 వేల జరిమానా విధిస్తున్నారు. ఎండపల్లిలో ఉదయం 7 నుంచి 9 వరకు మాత్రమే సడలింపు అమల్లో ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధిస్తున్నారు. మాస్క్ ధరించకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు.