department
-
‘పీఎం–ఈ–డ్రైవ్’ పథకంతో ఈవీ రంగానికి ప్రోత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ: ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవని, ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల పార్లమెంట్లో తెలిపింది. ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘ప్రధాన మంత్రి–ఈ–డ్రైవ్’ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చిoదని తెలిపింది. ఈ పథకం ద్వారా ఈ–కార్లకు జీఎస్టీ, పన్ను, పర్మిట్లో మినహాయింపు వంటి అనేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు చెప్పింది. 2030 నాటికి ప్రైవేటు ఎలక్ట్రిక్ కార్లలో 30శాతం, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలలో 80శాతం వృద్ధిని సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఏ విధమైన అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు ఛార్జింగ్ పాయింట్లను, ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్లో 1,266, తెలంగాణలో 1,289.. ‘ఫాస్టెర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్’(ఎఫ్ఏఎంఈ) సబ్సిడీ పథకం కింద దేశవ్యాప్తంగా 4,523 ఛార్జర్లు ఉండగా, 251 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ‘ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్’(ఓఎంసీఎస్) పథకం కింద దేశవ్యాప్తంగా 20,035 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఏఎంఈ పథకం కింద 354 ఛార్జర్లు ఇన్స్టాల్ జరగగా, 20 ఛార్జింగ్ స్టేషన్లు, ఓఎంసీఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా 912 ఛార్జింగ్స్టేషన్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎఫ్ఏఎంఈ కింద 238 ఛార్జర్లు ఇన్స్టాల్ చేయగా, ఒకే ఒక్క ఛార్జింగ్ స్టేషన్ ఉండగా, ఓఎంసీఎస్ కింద 1,051 స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16.14లక్షల ఈవీలు.. దేశవ్యాప్తంగా ఎఫ్ఏఎంఈ పథకం సెకెండ్ ఫేజ్లో 16,14,737 లక్షల ఈవీలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వీటిలో టూవీలర్లు 14, 28,009లక్షలు, త్రీవీలర్లు 1,64,180, ఫోర్ వీలర్లు 22,548 ఉన్నట్లు తెలిపింది. ఈసంఖ్యను రానున్న రోజుల్లో పెంచేదిశగా తాము ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వివరించింది. -
మస్క్కు మరింత పవర్ ఇచ్చిన ట్రంప్.. ఉద్యోగులే టార్గెట్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ఎలోన్ మస్క్ చేతికి అప్పగించారు. ఫెడరల్ వర్క్ ఫోర్స్ను మరింతగా కుదించేందుకు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య శాఖ (డోజ్)కు అధికారాలు కల్పించారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఓవల్ కార్యాలయంలో టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్తో పాటు అతని నాలుగేళ్ల కుమారుని సమక్షంలో ఈ సంతకాల కార్యక్రమం జరిగింది. PRESIDENT TRUMP: "I can't imagine a judge saying you got elected to look over the country and make America great again, but you don't have the right to look and see whether or not things are right that they are paying or that things are honest." pic.twitter.com/gUBlUJ0FLY— Rapid Response 47 (@RapidResponse47) February 11, 2025వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు.. ఫెడరల్ వర్క్ ఫోర్స్ను పరిమితం చేసేందుకు ఉద్దేశించినది. ఈ విషయంలో డోజ్ ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలని, పెద్ద ఎత్తున ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన స్థానాలలోని సిబ్బందిని మాత్రమే పరిమితం చేయాలని దానిలో ఆదేశించారు.ఈ ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ డోజ్ పని తీరును ప్రశంసించారు. ఇది చట్టం పరిధిలో పనిచేస్తుందా లేదా అనే విషయంలో పలు విమర్శలు ఉన్నప్పటికీ టెస్లా సీఈఓ మస్క్ ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని పనులు చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. దేశాభివృద్ధికి బాధ్యత వహించే వ్యక్తి , తనకు అన్ని విషయాలు నివేదించే వ్యక్తి ఈ పని చేసేందుకు సమర్థులని భావిస్తున్నానని అన్నారు. అమెరికాను అభివృద్ధి పథాన తీసుకువెళ్లేందుకే తాను ఎంపికయ్యాయని ఒక న్యాయమూర్తి చెప్పడం ఎన్నటికీ మరువలేనిదని ట్రంప్ పేర్కొన్నారు.‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే అక్షరాలు కలిగిన టోపీని ధరించిన మస్క్ మాట్లాడుతూ ప్రభుత్వానికి స్వయంప్రతిపత్తి కలిగిన సమాఖ్య బ్యూరోక్రసీ లేదని, అందుకే ప్రజల తరపున ప్రతిస్పందించే వ్యక్తి అండగా ఉండాలన్నారు. ప్రజలచేత ఎన్నిక కాని అధికారిగా తన పాత్రను సమర్థించుకున్న మస్క్ అమెరికా ప్రభుత్వంలోని వివిధ విభాగాలను తగ్గించే అధికారాన్ని అధ్యక్షుడు తనకు మంజూరు చేశారన్నారు. బ్యూరోక్రసీలో లక్షల డాలర్ల జీతం కలిగిన సిబ్బంది ఉండటం వింతగా ఉందని మస్క్ వ్యాఖ్యానించారు.That was one of the most incredible political press conferences I’ve ever seen.Trump + Elon standing in the Oval Office, telling the American people directly what they are doing… basic financial management of our out of control spending.“This isn’t optional, it’s essential.” pic.twitter.com/DDSGVjnQtW— Geiger Capital (@Geiger_Capital) February 11, 2025తాను ట్రంప్తో దాదాపు ప్రతిరోజూ మాట్లాడుతుంటానని ప్రభుత్వంలోని అవినీతిని గుర్తించి, అనవసరఖర్చులకు తగ్గించేందుకు ప్రయత్నిస్తానన్నారు. కాగా మస్క్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో అతని కుమారుడు లిటిల్ ఎక్స్ తండ్రి చేయి పట్టుకుని, అతనికి కాస్త ఇబ్బంది కలిగించాడు. గతంలో లిటిల్ ఎక్స్కు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది కూడా చదవండి: నేడు రాష్ట్రపతి భవన్లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే.. -
అమ్మ.. మరో జన్మ ఉంటే నీ కడుపున పుడతా
నిర్మల్టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఆరేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తనకన్నా జూనియర్లు రెగ్యలర్ అయ్యారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగి వకులాభరణం భరత్ కుమార్ (37) ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భరత్ రాసిన ఓ సూసైడ్ లేక అందరినీ కంటతడి పెట్టిస్తోంది.‘మా అమ్మానాన్నల కడుపులో పుట్టడం నా అదృష్టం. ఎంతో పెద్ద ఉద్యోగం వస్తుందని కలలు కన్నాను. 2018 లో ఆరోగ్యశాఖలో ఆర్ఎన్టీసీపీ విభాగంలో సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్గా ఉద్యోగం పొందాను. జీవితంలో స్థిరపడతానని ఆశించాను. కానీ నాకన్నా హోదా తక్కువ ఉన్నవారికి ఇదే శాఖలో జీతం ఎక్కువగా రావడం.. నా జీతం మాత్రం పెరగకుండా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉండిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాను. నాతోపాటు నాలాంటి వాళ్లను రెగ్యులర్ చేసే విషయంలో జీవో 510 అన్యాయం చేసింది. అప్పటి ప్రభుత్వంలో వచ్చిన ఈ జీవో వల్ల నష్టపోయాం. ఇటీవల జీవో 16 కూడా అమలు చేయవద్దని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మాకు తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశా. కానీ అది జరగక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యా. నా భార్య పల్లవికి అన్యాయం చేస్తున్నా. కుమారుడు దేవాను వీడిపోతున్నా. మీ ఇద్దరినీ బాగా చూసుకుంటానని కలలు కన్నా. కానీ ఉద్యోగం రెగ్యులర్ కాకపోవడంతో మీకు చెప్పినట్లుగా ముందుకు వెళ్లలేకపోయా. ఇంతకాలం పనిచేసిన కాలంలో నాకు రావాల్సిన పీవోఎల్ బకాయిలు నా భార్యకు ఇవ్వండి. నా ఆత్మహత్యతో అయినా మిగతా వారికి న్యాయం జరగాలి. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తెలిసేలా చూడండి. సహచర ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందరికీ రుణపడి ఉంటా. అమ్మా నాన్న సారీ..’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. భరత్ మృతి ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని.. -
మీరు వెళ్లిపోండి.. లేదంటే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్టులను ఇప్పుడు తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్న టీడీపీ కూటమి సర్కారు బాగోతాల్లో మరొకటి వెలుగులోకి వచ్చి0ది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కాలపరిమితి ఉన్నప్పటికీ ఉన్నఫళంగా రద్దుచేసుకుని వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేస్తూ రాష్ట్రంలో కాంట్రాక్టు సంస్థలను బెంబేలెత్తిస్తోంది. పైగా.. నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పొగపెడుతూ ‘మీ అంతట మీరు వెళ్లిపొండి’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరిస్తోంది. 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)ల నిర్వహణ విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ రెండు సర్వీసుల నిర్వహణ కాంట్రాక్టును అరబిందో సంస్థ దక్కించుకుంది. 2027 వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంది. కానీ, ఉన్నఫళంగా ఎంఓయూను రద్దుచేసుకుని వెళ్లిపోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పైసా విదల్చని ప్రభుత్వం.. 104, 108 వాహనాల నిర్వహణను తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రస్తుత నిర్వహణ సంస్థ అరబిందోను రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వైద్యశాఖ వర్గాల్లోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ సంస్థకు నయాపైసా చెల్లించలేదు. సాధారణంగా ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య రెండు క్వార్టర్లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేయలేదు. ‘సిబ్బందికి మూడునెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. పైగా.. వాహనాలను నడపాలంటే రోజుకు రూ.20 లక్షలు డీజిల్ కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బంది పడుతున్నాం’.. అని ప్రభుత్వానికి సంస్థ తెలియజేసినా చంద్రబాబు సర్కారు కనికరించడంలేదు. వీలైనంత త్వరగా రద్దుచేసుకోండి.. ప్రభుత్వం తమపట్ల విముఖత వ్యక్తపరుస్తుండటంతో చేసేదేమీ లేక మీరెలా చెబితే అలా చేస్తామని సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఎంఓయూలోని నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్టు ఇచ్చి మీరు పక్కకు తప్పుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పిన జేవీ కంపెనీ ఆఫ్ ఎమర్జెంట్ మెడికల్ సర్వీసెస్, యునైటెడ్ హెల్త్కేర్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని అరబిందో సంస్థ కూడా వైద్యశాఖకు ప్రతిపాదించింది.అయితే, ఆయా సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ అరబిందో సంస్థ పేరిటే కార్యకలాపాలన్నీ నడుస్తాయి కాబట్టి అరబిందో ప్రస్తావనే లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సబ్ కాంట్రాక్టు ప్రస్తావనను ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎంఓయూను మీరే రద్దుచేసుకుని వెళ్లిపోండని అరబిందోకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఎలాగైనా ఎంఓయూ రద్దుచేసి తీరాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఎంఓయూ రద్దు చేసుకోండని సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అంతేకాక.. ప్రభుత్వానికి విస్తృతమైన అధికారులున్నాయని, కాంట్రాక్టును రద్దుచెయ్యొచ్చని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (యూకే ఎన్హెచ్ఎస్) నిర్వహణ కాంట్రాక్టులో భాగస్వామిగా ఉందని.. ఇక్కడి పరిస్థితులపై సమాచారం ఇచ్చామని.. ఆ సంస్థ స్పందన ఆధారంగా ఎంఓయూ రద్దుపై తుది నిర్ణయం తెలియజేస్తాం’.. అని అరబిందో చెప్పినట్లు సమాచారం. సిబ్బందిలో ఆందోళన మరోవైపు.. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లేక 104, 108లో పనిచేసే 6,500 మంది సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దసరా, దీపావళి ఇలా పండుగలన్నీ పస్తులతోనే గడిపారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణ సంస్థ మారుతోందంటూ ప్రభుత్వమే ఎల్లో మీడియాలో లీకులిచ్చి కథనాలు రాయిస్తుండడంతో సిబ్బంది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నిర్వహణ సంస్థ మారితే తమకు రావాల్సిన బెని్ఫట్స్ రాకుండా పోతాయేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించండిరాష్ట్రవ్యాప్తంగా 104 సిబ్బంది నిరసనపెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు, ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్ల పరిష్కారం ఎజెండాగా 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సిబ్బంది నిరసన బాట పట్టారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో మెడికల్ ఆఫీసర్లకు తమ సమస్యలపై డీఈవోలు, డ్రైవర్లు వినతి పత్రాలు అందజేశారు. బుధవారం డీఎంహెచ్వోలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలోనూ నోడల్ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫణికుమార్ తెలిపారు. 8వ తేదీ తహసీల్దార్లు, ఎంపీడీవోలకు, 10న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. 11న గ్రీవెన్స్లో వినతులిస్తామని, 14వ తేదీన డ్రైవర్లు, డీఈవోలు అధికారిక గ్రూప్ల నుంచి లెఫ్ట్ అయి పనులు నిలుపుదల చేస్తామన్నారు. నిరసన చేస్తున్నన్ని రోజులూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. -
Polavaram: గడువులోగా పూర్తి చేయకపోతే ఆ సొమ్ము రుణమే
సాక్షి, అమరావతి : నిర్ధిష్ట గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.2,807.68 కోట్లను రుణంగా పరిగణిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకుగాను రూ.459.68 కోట్లను రీయింబర్స్ రూపంలో ఇచ్చి0ది. కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును 2026 మార్చిలోగా పూర్తి చేయకపోతే అడ్వాన్సు, రీయింబర్స్మెంట్గా ఇస్తున్న రూ.2,807.68 కోట్లను తిరిగి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది.నిర్మాణ సమయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది అంటే 2027 మార్చి వరకు మాత్రమే గడువు పొడిగించే వెసులుబాటును మాత్రమే కలి్పస్తామని స్పషీ్టకరించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన (ఎర్త్ కం రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై విధ్వంసం చోటుచేసుకున్న ప్రాంతాన్ని యథా స్థితికి తెచ్చే పనులను సైతం పూర్తి చేసింది. అందువల్లే వరద తగ్గగానే అంటే నవంబర్లో ప్రధాన డ్యాం గ్యాప్–2 డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించి, జూలైలోగా పూర్తి చేయడానికి.. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 41.15 మీటర్ల కాంటూర్ వరకు రూ.30,436.95 కోట్లుగా ఆగస్టు 28న ఆమోదించిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ2,807.68 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 9న కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిధుల వినియోగానికి మార్గదర్శకాలు ఇలా.. » రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలి. » కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు నిర్దేశించిన పనులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలి. » ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి.. షెడ్యూలు ప్రకారం పనులు చేయడానికి సమన్వయ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. » విడుదల చేసిన నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, వాటిని ఒప్పందంలో నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేశామని వినియోగ ధ్రువీకరణపత్రాలు పంపితేనే మిగతా నిధులు ఇస్తాం. » ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేశారా లేదా అన్నది తనిఖీ చేయడానికి కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. -
తప్పుతున్న వాతావరణశాఖ అంచనాలు
ఒకవైపు వనరుల కొరత.. మరోవైపు అంచనాలలో లోపం.. ఇంకోవైపు ప్రకృతిలో మారుతున్న తీరుతెన్నులు.. ఇవన్నీ వాతావరణ శాఖ అధికారులను ఇబ్బందులకు గురిచేసి, రుతుపవనాలను సరిగ్గా అంచనావేయలేకపోయేలా చేస్తున్నాయా? ఈ సీజన్కు సంబంధించిన అంచనాల్లో అప్పుడప్పుడూ పొరపాట్లు తొణికిసలాడటం దీనికి ఉదాహరణగా నిలిచించిందా?వాతావరణశాఖ ఇటీవలి కాలంలో జారీచేసిన అలర్ట్లు అంచనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో జనం వాతావరణశాఖపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ శాఖపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతున్నదనే వాదన వినిపిస్తోంది. జూన్ 28న దేశరాజధాని ఢిల్లీలో రుతుపవనాలు ప్రవేశించిన రోజున రికార్డుస్థాయి వర్షపాతం కురుస్తుందని వాతావరణశాఖ ముందుగా ప్రకటించింది. అయితే ఆ తరువాత ఆశాఖ అధికారులు వర్షపాతం అంచనాలు మార్చారు. ఇదేవిధంగా కొన్నిసార్లు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసి, వాటిని తిరిగి మారుస్తున్న సందర్భాలున్నాయి.వాతావరణ శాఖ విడుదల చేసిన రుతుపవనాల అంచనాలు మునుపటి కంటే తక్కువ ఖచ్చితత్వంతో ఉన్నాయని గత గణాంకాలను చూస్తే స్పష్టమవుతుంది. 2011 నుండి 2024 వరకు అంటే గత 14 ఏళ్లలో రుతుపవనాల అంచనాలు 96 శాతం ఖచ్చితమైనవనిగా రుజువు చేసిన ఏకైక సంవత్సరం 2022. మిగిలిన ఏళ్లలో ఇది 77 శాతం వరకూ నిజమయ్యింది. రుతుపవనాల ట్రెండ్లో మార్పు కారణంగా ఒకే నగరంలో రెండు విభిన్న పోకడలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడుతోంది.వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హిమాలయ పర్వతాలు ఆసియాలోని చల్లని గాలిని ఉత్తర భారతదేశ మైదానాలకు చేరుకోకుండా నిరోధిస్తాయి. రుతుపవనాలను కూడా ఆపుతాయి. ఇవి దేశానికి వర్షాలను తీసుకువస్తాయి. అయితే కొత్త మోడల్స్, రాడార్, రెయిన్ గేజ్ల సహాయంతో భవిష్యత్తులో వర్షాలు, రుతుపవనాల అంచనాలను మరింత ఖచ్చితంగా తెలుసుకునేందుకు వాతావరణశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. -
సచివాలయానికి ఉద్యోగులు ఆలస్యంగా రావడమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి కొంత మంది ఉద్యోగులు ఆలస్యంగా రావడం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మీరే ఇలా వస్తే జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు మీరిచ్చే సందేశం ఏంటని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పేషీని, సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారు. ఆ సమయంలో 50% ఉద్యోగులు కూడా ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేక ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజలు మాకు ఎన్ని వినతులిచి్చనా, పరిష్కరించాల్సింది ఉద్యోగులేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సచివాలయానికి ఉద్యోగులు ఇంత ఆలస్యంగా రావడం భావ్యం కాదని హెచ్చరించారు. సమయానికి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగు ల కుర్చీల వద్దకు వెళ్లి అభినందించిన మంత్రి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక రిద్దరు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరి స్థితి బాగాలేద ని చెప్పగా.. వారితో కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి తమ సెక్షన్కు రావడం మూలంగా సమస్యలు చెప్పుకునే అవకాశం దొరి కిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. -
‘ఆపరేషన్’ సిజేరియన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సహజ ప్రసవాలను పెంచేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కాగా, 2023–24లో రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ప్రసవాలు జరగ్గా, వీటిలో 4.48 లక్షల ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేశారు. వీటిలో 50 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అవసరం లేకపోయినా చేసిన సిజేరియన్ ఆపరేషన్లే. ఇలాంటి ప్రసవాలు చేసిన ఆస్పత్రులపై వైద్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా వంద శాతం సిజేరియన్లు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని 104 నెట్వర్క్ ఆస్పత్రులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటికి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. సాధారణ ప్రసవం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో గర్భిణులు ఆస్పత్రులకు రావడం వల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్లు అన్ని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అదే విధంగా తొలి కాన్పు సిజేరియన్ ఉండటం వల్ల రెండో కాన్పు కూడా సిజేరియన్ చేశామన్నారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలను వైద్య శాఖ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. కర్నూలులో అత్యధికంగా సిజేరియన్లు 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షలు సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. సిజేరియన్ ఆపరేషన్లలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 23,500 సిజేరియన్లు జరగ్గా, వీటిలో 16,678 ప్రైవేటు ఆస్పత్రుల్లో చేశారు. 20,059 సిజేరియన్లతో పశి్చమ గోదావరి రెండో స్థానంలో, 19,855తో అనంతపురం మూడో స్థానంలో ఉన్నాయి.45 శాతం అనవసరమే సిజేరియన్ ప్రసవాలను నియంత్రించడంలో భాగంగా 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మ«ధ్య రాష్ట్రవ్యాప్తంగా 62 ఆస్పత్రుల్లో 278 ఆపరేషన్లపై వైద్య శాఖ ఆడిట్ నిర్వహించింది. వీటిలో 155 సిజేరియన్లు ( 55 శాతం) గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో అవసరం మేరకే చేసినట్లు తేలింది. మరో 72 కేసుల్లో (26 శాతం) అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టు ఆధారాలతో తేలింది.. మిగిలిన 53 కేసుల్లో (19 శాతం) సిజేరియన్కు అవసరమైన ఆధారాలు ఏమీ లేనట్టు తేలింది. అంటే 45 శాతం సిజేరియన్లు అవసరం లేకుండానే చేసినట్లు తేలింది.⇒ ప్రైవేట్ ఆస్పత్రులు సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ⇒ సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఇస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం ⇒ సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు.⇒ సాధారణ ప్రసవానికి ప్రయతి్నస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీíÙయా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ⇒ యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు చేయడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ⇒సిజేరియన్ ప్రసవం వల్ల కలిగే సమస్యలను వివరించి, సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా గర్భిణి, కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది. శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాలకు నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో ఏపీ వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జునసాగర్కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్కు తరలిస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని సీఎం జగన్కు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. -
నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్నందన్కుమార్ వివరించారు. వెనకడుగు కాదు.. ముందడుగే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు. అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్లలోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. -
టీటీడీ ఈవో లేఖ.. ఎట్టకేలకు స్పందించిన పురావస్తుశాఖ
సాక్షి, తిరుపతి: అలిపిరి పాదాల మండపం శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండపం వెనుకభాగం కూలిపోయింది. దీంతో ఇనుప రాడ్లుతో మండపానికి సపోర్ట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు,.. కానీ ఏ సమయంలో కూలిపోతుందో తెలియని ఈ మండపం ద్వారా భక్తులకు ప్రాణహాని ఉందని.. టీటీడీ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. దీనిపై రాజకీయ రంగు పులిమి మండప నిర్మాణాన్ని అడ్డుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాసిన లేఖపై ఎట్టకేలకు పురావస్తుశాఖ స్పందించింది. ఢిల్లీ ఎఎస్ఏ నుంచి పురావస్తు బృందాన్ని పంపారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగుళూరు నుంచి జి.శ్రీనివాసులు, చెన్నై నుంచి ఏ. సత్యం, హైదరాబాద్ నుంచి కే.కృష్ణ చైతన్య బృందం మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మత్తుపై ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పించనున్నారు. -
ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా రెండో రోజు కనిష్ట ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. ఈ సమయంలో ఉదయం తేలికపాటి పొగమంచు కూడా ఉండనుంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్గా ఉండి, ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రెండు రోజుల తర్వాత అంటే రాబోయే సోమవారం నాడు ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం ఢిల్లీలోని లోధి రోడ్లో శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. శనివారం ఉదయం అంటే ఈరోజు వాతావరణంలో పొగమంచు వ్యాపించింది. పగటిపూట తేలికపాటి సూర్యరశ్మి ఉండనుంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ ఎవరిదో! -
‘గాడ్ డిపార్ట్మెంట్’ అంటే ఏమిటి? యూదుల లేఖల్లో ఏముంటుంది?
ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. దీనికి ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఉదాహరణగా నిలుస్తుంది. దీనినే ‘గాడ్ డిపార్ట్మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఉత్తరాలు వస్తుంటాయి. ఇజ్రాయెట్ 21సీ. ఓఆర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఈ దేవుని విభాగానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఉత్తరాలు వస్తుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉంటున్న యూదులు తమ ప్రార్థనలు, కోరికలు, బాధలు, సంతోషాలను ప్రస్తావిస్తూ దేవునికి లేఖలు పంపుతారు. వీటన్నింటికీ ఒకే చిరునామా ఉంటుంది. అదే.. కోటెల్ లేదా వెస్ట్రన్ వాల్. ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని ‘గాడ్ డిపార్ట్మెంట్’కు వచ్చే ఉత్తరాలన్నీ జెరూసలేంలొని ‘వెస్ట్రన్ వాల్’ రంధ్రాలలో ఉంచుతారు. ఇక్కడ పశ్చిమ గోడను కోటెల్ అని కూడా అంటారు. ఇది ‘వాల్ ఆఫ్ ది మౌంట్’లో ఒక భాగం. ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే తమ పవిత్ర దేవాలయం ఉండేదని యూదులు గాఢంగా నమ్ముతారు. దీన్నే ‘హోలీ ఆఫ్ ది హోలీస్’ అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది యూదులు తమ వారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
పథకాల అమలుపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు పథకాల పంపిణీ ఎలా ఉండాలి? నిబంధనల అమలు ఎలా ఉంది? అనే కోణంలో పరిశీలన మొదలుపెట్టింది. దళితబంధు, రైతుబంధు, బీసీ బంధులాంటి పథకాలకు సంబంధించి ప్రస్తుత సమయంలో లబ్ధిదారులకు సాయం అందించే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాల కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నోటిఫికేషన్ వచ్చే నాటికి లబ్ధి చేకూర్చాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తే ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని టీపీసీసీ ఎన్నికల సంఘానికి వివరించింది. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం.. సంబంధిత శాఖలను వివరణ కోరింది. తక్షణమే స్పందించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. నివేదికలు సిద్ధం సంక్షేమ పథకాల అమలుపై ఎన్నికల సంఘం నివేదిక కోరడంతో సంబంధిత శాఖలు వివరణ ఇచ్చేందుకు ఉపక్రమించాయి. పథకాల వారీగా శాఖలు ఇప్పటికే సమాచారాన్ని సిద్ధం చేసుకున్నాయి. దళితబంధు పథకం నియోజకవర్గం యూనిట్గా అమలు చేస్తున్న క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం మినహా మిగతా 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమాచారంతో ఎస్సీ కార్పొరేషన్ సిద్ధమైంది. కాగా, రెండోవిడత దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి ఐదు వందల మంది లబ్ధిదారులకు సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ద్వారా పలు సిఫార్సులు రావడంతో వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పథకం కింద మొదటి విడతలో కూడా ఎంతమందికి లబ్ధి చేకూర్చారన్నది కూడా ఎన్నికల సంఘానికి వివరించనుంది. అదేవిధంగా రైతుబంధు పథకం కింద గత ఐదేళ్లుగా పంపిణీ చేసిన మొత్తంతో పాటు ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు, వారికి ఇవ్వాల్సిన నిధులు తదితర సమాచారాన్ని సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దీంతోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న బీసీబంధు పథకం కింద అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ఎంతమందికి ఆర్థిక సాయం అందించారనే అంశాలను కూడా నివేదిక రూపంలో తయారుచేసి పెట్టుకుంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ వివరాలను ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం. -
బోధనాస్పత్రులపై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చివేసిన ప్రభుత్వం... రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లోనూ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 పాత బోధనాస్పత్రులకు ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులను వైద్యశాఖ నియమించనుంది. వీరికి సహాయకులుగా మరో 88 మందిని నియమిస్తుంది. ఈ మేరకు కొత్తగా 99 పోస్టులను ఇటీవల సృష్టించింది. ఎవరి బాధ్యతలు ఏమిటంటే... ♦ సాధారణంగా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యపరమైన (క్లినికల్) అంశాలను మెడికల్ సూపరింటెండెంట్ పర్యవేక్షిస్తారు. నాన్–క్లినికల్ (ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన అంశాలు) వ్యవహారాలపర్యవేక్షణకు సీఈవో/జీఎం ఆపరేషన్స్/అడ్మినిస్ట్రేటర్ హోదాలో మరొకరు ఉంటారు. ♦ ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో క్లినికల్, నాన్ క్లినికల్ రెండింటి పర్యవేక్షణ బాధ్యత సూపరింటెండెంట్ చూస్తున్నారు. ♦ ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మెడికల్ సూపరింటెండెంట్లను వైద్యపరమైన వ్యవహారాలకు పరిమితం చేస్తారు. ♦ పరిపాలన కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. జేడీ నేతృత్వంలో ముగ్గురు ఏడీలతోపాటు అసిస్టెంట్ ఇంజినీర్, ఫెసిలిటీ మేనేజర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్ వంటి సహాయక సిబ్బంది పనిచేస్తారు. వీరు ఆస్పత్రిలో భవనాల నిర్వహణ, సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, ఉద్యోగుల హాజరు, జీతభత్యాలు, ఇతర నాన్ క్లినికల్ అంశాలను చూస్తారు. ♦ సూపరింటెండెంట్లకు ఇప్పటివరకు ఉన్న ఆస్పత్రి నిర్వహణ భారం తొలగిపోయి రోగుల సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం లభిస్తుంది. వైద్యుల హాజరు, ఐపీ, ఓపీ, సర్జరీ సేవలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. ఎన్ఏబీహెచ్ గుర్తింపే లక్ష్యంగా... ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలు పెంచి మంచి వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఈ క్రమంలో మన ఆస్పత్రులకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్కేర్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు పొందడమే లక్ష్యంగా వైద్యశాఖ అడుగులు వేస్తోంది. ఈ దశగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటికే విశాఖపట్నంలోని ఛాతీ, మెంటల్ కేర్ ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించింది. మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్–క్వా‹Ù) గుర్తింపు పొందాయి. ఎన్–క్వాష్ గుర్తింపులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించడానికి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. -
తుది దశకు డ్రోన్ సర్వే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో కీలకమైన డ్రోన్ సర్వే (డ్రోన్లతో భూముల కొలత) తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తయింది. మిగిలిన 3 శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయడానికి సర్వే, సెటిల్మెంట్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని 17,595 గ్రామాలకు గాను, డ్రోన్ సర్వే సాధ్యం కాని 4,135 గ్రామాలను మినహాయిస్తే 13,460 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 13,075 గ్రామాల్లో దాదాపు 1.75 కోట్ల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇంకా కేవలం 385 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కావాల్సి ఉంది. వీటిలో శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉంది. ఈ నెలాఖరుకు మొత్తం గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని సర్వే శాఖ అధికారులంటున్నారు. ఇది పూర్తయితే రీ సర్వేలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసినట్లవుతుంది. మొత్తం 1.80 కోట్ల ఎకరాలను కొలిచినట్లవుతుంది. ఇది ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు. వేగంగా పూర్తి చేసేందుకు... వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్ సర్వే కోసం డ్రోన్లతోపాటు విమానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేట్ డ్రోన్ ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 వేలమంది సర్వేయర్లను నియమించడంతోపాటు సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలెట్లుగా శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తోంది. దీంతో సర్వే అత్యంత వేగంగా పూర్తవుతోంది. -
వాహనాలు ఢీకొనకుండా ఆటోమేటిక్ బ్రేకులు
అమరావతి: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కార్లు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా చేసేందుకు సరికొత్త టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించింది. ‘వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీని ముందుగా కార్లలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ భద్రతా ప్యానల్ కేంద్రానికి నివేదించింది. భారత్ ఎన్క్యాప్ ప్రోగ్రాంలో స్థానం దేశం మొత్తమ్మీద 2021లో 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో దాదాపు 1,53,972 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రహదారి భద్రత కోసం వీ2ఎక్స్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. ‘న్యూ కార్ ఎసెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్క్యాప్)లో చేర్చింది. అంటే ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లకు భద్రతా రేటింగ్స్ నిర్ణయించేటప్పుడు ఈ టెక్నాలజీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ రహదారి భద్రతా ప్యానల్ 58 పేజీల నివేదికను సమర్పించింది. ఈ టెక్నాలజీని దేశంలో తయారు చేసే కార్లలో ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రవాణా, టెలీ కమ్యూనికేషన్ల శాఖల ఉన్న తాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వీ2ఎక్స్ ఎలా పని చేస్తుందంటే... కార్ల తయారీలో అంతర్భాగంగా ఈ టెక్నాలజీని అమలు చేస్తారు. ఇది వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుంది. తగినంత దూరం నుంచే రహదారిపై ఎదురుగా, పక్కన, వెనుక ఉన్న వాహనాలను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రోడ్లపై రద్దీ, రోడ్డు పక్కన పాదచారుల విషయంలోనూ ఈ టెక్నాలజీ నిత్యం గమనిస్తూ వాహనదారులను హెచ్చరిస్తుంది. టోల్ గేట్లు, రోడ్డు మలుపులు, యూటర్న్లు, ప్రమాద హెచ్చరిక బోర్డుల గురించి ముందుగానే సమాచారమిస్తుంది. వాహనాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తే ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేసి ఆ వాహనాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం కార్లు, ఎస్యూవీలలో ఉన్న భద్రతా ఫీచర్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు భావిస్తున్నారు. -
వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2018కి ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శాంక్షన్ పోస్టుల్లో నియమితులైన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, పారా మెడికల్ సిబ్బందికి వంద శాతం గ్రాస్ వేతనం (పే+హెచ్ఆర్ఏ+డీఏ) పునరుద్ధరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనాన్ని రద్దు చేసి.. కన్సాలిడేట్ పేకి కుదించారు. ఈ నేపథ్యంలో వారంతా 2019కు ముందు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 తర్వాత నియమించబడి అర్హత ఉన్న ఉద్యోగులకు ఈ వేతనాలు వర్తింపజేసేలా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా విభాగాధిపతులను ఆదేశించారు. సీఎం జగన్కు రుణపడి ఉంటాం పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనం రద్దు చేసి మాకు అన్యాయం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3,914 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కేడర్ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనాలు పెరుగుతాయి. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. – రత్నాకర్, ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ -
నేడు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచే కొత్తగా తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. శుక్ర వారం సీఎం కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఇందులో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్ర సొంత నిధులతో ఇలా పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశంలో ఇదే ప్రథమమని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.. సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లలోనే కొత్త 21 కాలేజీలను ఏర్పాటు చేశారని అంటున్నాయి. వచ్చే ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారని.. వాటితో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. -
బాబు కుంభకోణాలన్నీ బయటకొస్తాయి
కొవ్వూరు/ఆరిలోవ (విశాఖ తూర్పు): చంద్రబాబు అవినీతి కుంభకోణాలన్నీ బయటకొస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. నేరం చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబునాయుడుకి విధేయులుగా ఉన్న కొందరు చట్టాన్ని తప్పుపట్టటం సరికాదని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన సాక్ష్యాదారాలున్నందునే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందని చెప్పారు. చంద్రబాబు జైలుకెళ్లడం పట్ల ప్రజలు సంతోషంతో ఉన్నారని, అందుకే టీడీపీ చేపట్టిన బంద్లో ప్రజలు పాల్గొనలేదని తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ప్రారంభమైన జైళ్లశాఖ జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతోను, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘సాక్షి’తోను మాట్లాడారు. నేరం చేసినవారు ఎంతటివారైనా చట్టం దృష్టిలో సమానులేనని చెప్పారు. టీడీపీ నాయకులు, కొన్ని చానళ్లు, పత్రికలు చట్టాన్ని, న్యాయవ్యవస్థను తప్పుపట్టడం మంచిది కాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తే, దాన్ని రాజకీయ వైరంగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. రాజధానికి వేలాది ఎకరాల భూముల సేకరణ విషయంలో బినామీల పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణలో ఓటుకి కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయాడన్నారు. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారి భూములను చంద్రబాబు, ఆయన మనుషులు దోచుకున్నారని చెప్పారు. ఏపీ ఫైబర్నెట్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పాటు రామోజీ కొడుకు వియ్యంకుడు ఆర్.వి.ఆర్.రఘు కేంద్ర ఐటీశాఖ అధికారులకు దొరికిపోవడం వలన రాజధాని కుంభకోణాలు విచారించడానికి వీల్లేదని వాదిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఐటీశాఖ చంద్రబాబుకి అవినీతిపై నోటీసులిస్తే పచ్చమీడియా నోరు మెదపడం లేదన్నారు. రూ.2 వేలకోట్ల లావాదేవీలు చేశారని, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ప్రధాన నిందితుడని ఐటీశాఖ సాక్ష్యాధారాలతో నోటీసులిచి్చనా విచారణగానీ, అరెస్ట్గానీ చేయకూడదా.. అని ప్రశ్నించారు. ఇంతకాలం చంద్రబాబు దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, స్టేలు తెచ్చుకుంటూ కాలం గడిపారని చెప్పారు. చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ దుష్టచతుష్టయానికి వాటాలు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్తో అవినీతి భాగస్వాముల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అవినీతికి పాల్పడిన కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ప్రతీకారంతో చేశారంటూ టీడీపీ, జనసేన, పచ్చమీడియా ప్రజలను నమ్మించేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. అవినీతి డొంక కదిలింది ఇంతకాలం చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని అవినీతి సామ్రాజ్యాన్ని నడిపారని హోంమంత్రి వనిత అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి డొంక కదిలిందని, ఒక్కో కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో లోకేశ్పైన కూడా అనుమానాలున్నాయని, సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. దీనిపై పోలీసులు బాధ్యతాయుతంగా వ్యహరించారని ఆమె పేర్కొన్నారు. -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
ఐటీ నోటీసులిస్తే మీకది వార్త కాదా?
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు జర్నలిజంపై గౌరవాన్ని పూర్తిగా దిగజారుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిస్తే ఆ పత్రికల్లో కనీసం వార్త కూడా ప్రచురించకపోవటానికి మించి దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో మీకు నచ్చిందే రాస్తారా? అని నిలదీశారు. మంగళవారం సచివాలయం వద్ద మంత్రి సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పకపోవటాన్ని బట్టి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చాలాసార్లు తప్పించుకున్నారు. ఆయన అక్రమాల్లో ఐటీ శాఖ గుర్తించింది అవగింజంతే. ‘సీబీఐ, ఈడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తక్షణం అదుపులోకి తీసుకోవాలి. చంద్రబాబు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో అందరికీ తెలుసు. రాజధానిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రూ.ఐదు లక్షలు దాటిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా పోలవరంలో నామినేషన్పై రూ.వేల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎంతో కాలం తప్పించుకోలేరు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్లా జైలుకు వెళ్లక తప్పదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాననే పవన్కళ్యాణ్ దీనిపై ఎందుకు స్పందించరు?’ అని మంత్రి సత్య నారాయణ నిలదీశారు. -
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్స్టర్లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్స్టర్లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్నెట్ స్కామ్లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
నోటీసులపై నోరు విప్పు
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విజనరీగా చెప్పుకునే ఆయన పొలిటికల్ స్కామ్స్టర్ అని ధ్వజమెత్తారు. కమీషన్లుగా దండుకున్న రూ.118.98 కోట్లపై నోరు మెదపకుండా నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమార్జనలో ఇది చిన్న భాగం మాత్రమేనని, క్షుణ్నంగా విచారిస్తే భారీ కుంభకోణాలు బహిర్గతం కావడం ఖాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కుంభకోణాలను అప్పట్లోనే తెహల్కా బయటపెట్టింది. అక్రమార్జనపై 17 కేసుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారు. ఢిల్లీలో రూ.700–రూ.800 కోట్లతో అత్యద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని కేంద్రం నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.500 – రూ.600 కోట్లతో సచివాలయ భవనాన్ని నిర్మించింది. ఏసీ, ఇంటీరియర్స్ సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేల నుంచి రూ.మూడు వేలు వ్యయం అవుతుంది. చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు పెట్టి రేకుల షెడ్డు లాంటి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి చదరపు అడుగుకు రూ.పది వేలకుపైగా ముడుపులు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరాయి. పోలవరంలో వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను నిర్మించకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను చంద్రబాబు చేపట్టారు. దీంతో 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలు ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయి. వాటిని యధాస్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత నష్టానికి కారకుడు చంద్రబాబే. ఈ పాపానికి చంద్రబాబు పాల్పడకుంటే పోలవరం ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది. చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్టంలో 2014–19 మధ్య పేదరికం 11.66 శాతం ఉండగా, సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల 6 శాతానికి తగ్గింది. -
ప్రపంచ ఆర్థిక ప్రగతిలో ఐదో స్థానానికి భారత్
దొండపర్తి (విశాఖ దక్షిణ):ప్రపంచ ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఐదో స్థానానికి చేరుకుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. విశాఖ పోర్టులో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూ.96 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి సోమవారం ప్రారంభించారు పోర్టులో రూ.237 కోట్లతో పూర్తి చేసిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్, కవర్డ్ స్టోరేజ్ షెడ్లతోపాటు ఓఆర్ బెర్తుల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ 2015లో ప్రారంభించిన సాగరమాల కార్యక్రమం ద్వారా రూ.5.60 లక్షల పెట్టుబడులతో పోర్టుల ఆధునికీకరణను చేపట్టినట్టు వెల్లడించారు. ఫలితంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో భారతీయ ఓడరేవులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. విశాఖను క్రూయిజ్ హబ్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ క్రూయిజ్ టెర్మినల్లో ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించే అవకాశం ఉందన్నారు. కేంద్ర షిప్పింగ్, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై.నాయక్ మాట్లాడుతూ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ను దేశంలోనే ప్రముఖ క్రూయిజ్ టూరిజం డెస్టినేషన్గా తీరిదిద్దాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పరిశ్రమ వివిధ రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్ విశాఖకు మైలురాయి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖలో పర్యాటకాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుబే, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గణబాబు పాల్గొన్నారు. -
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
2025 జూన్కు పోలవరం తొలి దశ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశను 2025 జూన్కి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అమలుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరా, కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తదితరులతో పోలవరం పనులపై సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాఫర్ డ్యామ్లలో లీకేజీలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి, వాటిని మరింత పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. డిజైన్ల ప్రతిపాదన, ఆమోదం నుంచి పనులు చేపట్టడం వరకూ పీపీఏ పాత్ర మరింత పెరగాలన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా డయాఫ్రమ్ వేస్తే సరిపోతుందా? అనే అంశంపై ఏం నిర్ణయం తీసుకున్నారని సీడబ్ల్యూసీని ప్రశ్నించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే మొగ్గుచూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్ వోరా చెప్పారు. కాఫర్ డ్యామ్లను మరింత పటిష్టం చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చించి నాలుగైదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు పంకజ్కుమార్ సూచించారు. ఈ నివేదికల ఆధారంగా మరో సారి సమావేశమై కాఫర్ డ్యామ్ల పటిష్టత, డయాఫ్రమ్ వాల్పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో వరదలు తగ్గేలోగా వాటిపై తుది నిర్ణయం తీసుకంటే ఈ సీజన్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టవచ్చని, తద్వారా గడువులోగా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి: దోచుకునే బుద్ధి మీది రామోజీ! -
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్హౌస్లు ఎందుకు మునిగాయి? పంప్హౌస్లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా..
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ఏపీకీ పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు ఇలా.. ► ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు ► ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు ► ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు ► పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు ► వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు ► పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు జీఐఎస్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు. చదవండి: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్.. ఇండస్ట్రీస్ మ్యాప్లో ఏపీ సుప్రీం -
వేసవిలో విద్యుత్ కొరత ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కాకాడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సూచించారు సీఎం జగన్. ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణం, మైన్స్ అండ్ జియాలజీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, ట్రాన్స్కో జేఎండీ పృధ్వీతేజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కామెంట్స్ బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలి: రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామన్న అధికారులు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టంచేసిన సీఎం. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామన్న అధికారులు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు వెల్లడి. విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపిన అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించిన అధికారులు. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామన్న అధికారులు. అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని వెల్లడి. ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించిన అధికారులు. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని వెల్లడి. -
ఇంధన శాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్
-
‘కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మాణం’
సాక్షి, ఢిల్లీ: పోలవరం ముంపు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీ ముగిసింది. ఈ భేటీకి ఏపీ, టీఎస్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో జలశక్తిశాఖ సమావేశమైంది. ఈ భేటీకి ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే పీపీఏ ఛైర్మన్ ఆర్కేగుప్తా.. గోదావరి ట్రిబ్యునల్కు కట్టుబడే పోలవరం కడుతున్నట్టు తెలిపారు. కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలను సంయుక్త సర్వేకు సహకరించాలని కోరాము. కాగా, సంయుక్త సర్వేకు ఒడిషా అంగికరించలేదని ఆయన వెల్లడించారు. పోలవరం కట్టినా గోదావరి వరద ముంపులో తేడా ఉండదు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయించామన్నారు. దీంతో, అక్టోబర్ 7వ తేదీన నాలుగు రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని జలశక్తిశాఖ పేర్కొంది. -
పోలవరం ముంపు రాష్ట్రలతో కేంద్ర జలశక్తిశాఖ కీలక భేటీ
-
‘మరమ్మతు హక్కుల’ నిబంధనలపై కసరత్తు
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉత్పత్తులను స్వయంగా లేదా థర్డ్ పార్టీల ద్వారా మరమ్మతు చేయించుకునే హక్కులను (రైట్ టు రిపేర్) కల్పించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 13న తొలిసారిగా భేటీ అయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ విషయాలు తెలిపింది. రిపేర్లు, విడిభాగాల విషయంలో కంపెనీలు ఏ విధంగా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయనేది కమిటీ .. సమావేశంలో చర్చించింది. ప్రధానంగా వ్యవసాయ పరికరాలు, మొబైల్ ఫోన్లు/ట్యాబ్లెట్లు, వినియోగ వస్తువులు, కార్ల వంటి ఆటోమొబైల్స్/ఆటోమొబైల్ పరికరాల రంగాల్లో ఇలాంటి ధోరణులను పరిశీలించింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తుల మరమ్మతుకు తాము తయారు చేసే పరికరాలే వాడాలని, తమ దగ్గరే రిపేరు చేయించుకోవాలని .. థర్డ్ పార్టీలు లేదా సొంతంగా మరమ్మతు చేసుకుంటే వారంటీలు పనిచేయవంటూ షరతులు పెడుతుంటాయి. అలాగే పలు సంస్థలు ఉద్దేశపూర్వకంగా .. కొంత కాలానికి మాత్రమే పనిచేసేలా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఆ తర్వాత అవి రిపేరుకు కూడా పనికి రాకుండా పోవడం వల్ల కస్టమర్లు మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా పాతవి వ్యర్ధాల కింద మారుతున్నాయి. ఇలాంటి నియంత్రణలు, గుత్తాధిపత్య ధోరణులు .. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించేవేనని ప్రభుత్వ కమిటీ అభిప్రాయపడింది. సమస్యలు వస్తే ఎలా రిపేరు చేసుకోవాలి, వేటిని ఉపయోగించాలి లాంటి విషయాల గురించి కస్టమర్లకు కంపెనీలు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం థర్డ్ పార్టీలు, వ్యక్తులకు ఆయా సాధనాలను అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రైట్ టు రిపేర్ వల్ల వ్యర్ధాలను కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్లోని పలు దేశాలు’ రైట్ టు రిపేర్’ని గుర్తించాయి. -
నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యం: మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అత్యంత సులువుగా, పూర్తిగా ఉచితంగా అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్లో గురువారం మంత్రి విడదల రజిని ఎన్హెచ్ఎం విభాగం ఉన్నతాధికారులు, కమిషనర్ నివాస్తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్.. వైద్య ఆరోగ్యశాఖ విషయంలో ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. చదవండి: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి ప్రజలందరికీ ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు జగనన్న ఏ మాత్రం వెనుకాడటంలేదని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మెడికల్ కళాశాలల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ, వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ఏకంగా 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. 40 వేలకుపైగా నియామకాలు చేపట్టామని వెల్లడించారు. పూర్తి ఉచితంగా అన్ని రోగాలకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా, నాణ్యంగా, ఉచితంగా అందాలంటే అధికారుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పారు. నిర్లక్ష్యం వీడితే చాలు తాను ఈ మూడేళ్లలో పలు ఆస్పత్రులు సందర్శించానని అన్ని చోట్లా మంచినీటి కొరత, అపరిశుభ్రత, నిర్వహణలో లోపాలు, టాయిలెట్లు సరిగా లేకపోవడం.. లాంటివి గమనిస్తూనే ఉన్నానని తెలిపారు. ఇవన్న చాలా చిన్న చిన్న సమస్యలని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇవి పెద్దవిగా కనిపిస్తున్నాయని చెప్పారు. సరైన సమయంలో స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోతుందని, అధికారులు చిత్తశుద్ధితో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారందరి సంక్షేమం గురించి కూడా మనం ఆలోచించాలని చెప్పారు. వారందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అందున్నాయో లేదో చూడాలన్నారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లాలని, ఏ ఒక్కరికి, ఎక్కడ సమస్య ఎదురైనట్లు గుర్తించినా.. సదరు ఏజెన్సీలపై చర్యలకు వెనుకాడొద్దని చెప్పారు. ఏఎన్ఎంలు, ఇతర ఫీల్డ్ సిబ్బంది బయోమెట్రిక్ విధానం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా పదే పదే తన దృష్టికి తీసుకొస్తున్నారని, వారి అభ్యర్థనలోనూ న్యాయం ఉందని, ప్రత్యామ్యాయ పద్ధతులను ఆలోచించాలని ఆదేశించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఎన్హెచ్ఎం లక్ష్యాలు ఏమున్నాయి.. వాటిని ఎంతవరకు రీచ్ అయ్యాం.. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక సంవత్సరంలో మనం ఎలా లక్ష్యాలను చేరుకోవాలి అనే విషయాలపై అందరికీ అవగాహన ఉండాలని చెప్పారు. ఆ మేరకు పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్హచ్ఎం నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలేదని, మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఆ నిధులు మురిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని, ఏ ఆస్పత్రిలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్హెచ్ఎం నిధులను అంతా సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఏ ప్రభుత్వాలకూ సాధ్యం కానంతగా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటే.. ఇప్పటికీ కొన్ని పీహెచ్సీల్లో మందులు బయటకు రాస్తున్నారని ఈ పరిస్థితి మారాలని చెప్పారు. ఎక్కడా, ఎప్పుడూ టెస్టులుగాని, మందులుగాని బయటకు రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆస్పత్రులకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, అయినా సరే కొన్ని ఆస్పత్రుల్లో మెటీరియల్ కొరత కనిపిస్తోందని చెప్పారు. ఎలుకలు, దోమలు ఆస్పత్రుల్లో ఎందుకు ఉంటున్నాయని, ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి ఈ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చూడండి రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చొరవ చూపాలని మంత్రి తెలిపారు. ప్రతి పీహెచ్సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా కచ్చితంగా ప్రయత్నించాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో కాన్పులు జరగకపోవడం వల్ల టీచింగ్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నోటిఫికేషన్ విడుదల చేయాలని వివరించారు. ఏపీ ఎం ఎస్ ఐడీసీ ద్వారా కొనుగోలు చేస్తున్న పరికరాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నాణ్యతను పరిశీలించే టెక్నికల్ టీమ్లో సంబంధిత వైద్యులు కూడా ఉండేలా చూడాలని సూచించారు. కావాల్సినన్ని ఆస్పత్రులు నిర్మిస్తున్నాం, కావాల్సినంత సిబ్బందిని నియమిస్తున్నాం, కోట్లాది రూపాయలతో పరికరాలు కొనుగోలు చేస్తున్నాం.. అయినా సరే కొన్నిచోట్ల టెస్టులు బయటకు రాస్తున్నారు.. ఈ పరిస్థితి మారాలని మంత్రి తెలిపారు. ల్యాబ్లలో ఉన్న వైద్య పరికరాల మెయింటినెన్స్కు సంబంధించి కాలిబ్రేషన్ సక్రమంగా జరుగుతోందా..? లేదా అని ప్రశ్నించారు. క్వాలిటీ ఎజ్యూరెన్స్ స్కీమ్ కింద కాలిబ్రేషన్ చేయాలని ఇది సక్రమంగానే చేస్తున్నారా అని అడిగారు. వైద్య విభాగంలో ప్రతి ఒక్కటి పారదర్శకంగా జరగాల్సిందేనని స్పష్టంచేశారు. పరికరాల నిర్వహణకు కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తోందని, సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు, వైద్య శాఖలో ప్రొఫెనల్ ఐడీలు, ? ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల మ్యాపింగ్ లాంటి వన్నీ గడువులోగా పూర్తికావాలని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలకు, జగనన్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. -
Corona Third Wave: బ్లాక్ మార్కెట్కు చెక్
సాక్షి, అమరావతి : కరోనా తొలి, మలి విడతల్లో విటమిన్ టాబ్లెట్లతోపాటు కొన్ని రకాల మందులకు తీవ్ర డిమాండ్ ఏర్పడడంతో మెడికల్ మాఫియా అప్పట్లో బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీసింది. ప్రస్తుతం మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో ఔషధ నియంత్రణ శాఖ నాటి పరిస్థితులకు చెక్ చెబుతూ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. కరోనాకు సంబంధించిన 30 రకాల అత్యవసర మందుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారులు వారంలో రెండుసార్లు 13 జిల్లాల ఔషధ నియంత్రణ అధికారులతో సమీక్షలు నిర్వహించి మార్కెట్లో మందుల నిల్వల సమాచారం సేకరిస్తున్నారు. ఏవైన మందుల నిల్వలు తక్కువగా ఉన్నట్లైతే డిమాండ్కు సరిపడా వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండెంట్ పెట్టిన వెంటనే మందులు సరఫరా చేసేలా పంపిణీదారులను ఆదేశిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తికి అనుమతులు ఇక కరోనా రోగుల చికిత్సలో వినియోగించేందుకు అవకాశమున్న మోల్నుపిరవిర్ మాత్రలను రాష్ట్రంలోనే తయారుచేసేందుకు ప్రభుత్వం లైసెన్స్లు ఇచ్చింది. దీంతో కరోనా మూడో దశ మందుల ప్రోటోకాల్ జాబితాలో ఈ మాత్రలకు అనుమతిస్తే వీటికి కొరత ఏర్పడే అవకాశం ఉండదు. నాట్కో, లారస్, దివీస్ ఫార్మా కంపెనీలు ఈ మందును తయారుచేయనున్నాయి. చిన్న పిల్లలు, గర్భిణులు, మరికొందరికి ఈ మందును వినియోగించకూడదని ఐసీఎంఆర్ వెల్లడించింది. అదే విధంగా కరోనా రెండో దశ చికిత్సలో కీలకంగా మారిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ప్రస్తుతం రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. పుష్కలంగా మందుల నిల్వలు రాష్ట్రంలో మందుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పుష్కలంగా వాటి నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం పీఎస్ఏ (ఆక్సిజన్) ప్లాంట్లను భారీగా ఏర్పాటుచేసింది. దీంతో ఆక్సిజన్కు కొరత లేదు. ఎక్కడైనా ఎమ్మార్పీని మించి మందులు విక్రయిస్తే వినియోగదారులు ఔషధ నియంత్రణ శాఖకు ఫిర్యాదు చేయాలి. ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులపై ప్రత్యేక నిఘా ఉంచాం. నకిలీ మందులు చెలామణి కాకుండా చూస్తున్నాం. – రవిశంకర్ నారాయణ్, ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ -
విద్యపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
ఏపీ: అత్యుత్తమంగా ఆలయాల నిర్వహణ
-
హైదరాబాద్లో నిప్పు రాజేస్తున్న నిర్లక్ష్యం
-
గత టీడీపీ సర్కారు నిర్వాకం: వైద్య రంగంలో భారీ కుంభకోణం..
జి. రామచంద్రారెడ్డి- సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఒక పని చేయాలంటే అందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫైలు పెట్టాలి. ఎన్నో రకాల అనుమతులు కావాల్సి ఉంటుంది. అదే నగదుకు సంబంధించినదైతే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్నో నిబంధనలుంటాయి. కానీ దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యవహారంలో ఎలాంటి అనుమతులూ లేవు. అసలు ఒక్క ఫైలు కూడా లేదు. ఉన్నతాధికారులకు అసలు తెలియనే తెలియదు. ప్రైవేటు సంస్థలతో పని చేయించేందుకు అవసరమైన ఎంఓయూలు (అవగాహనా ఒప్పందాలు)లేవు. కింది స్థాయి అధికారులతో తతంగం నడిపించేశారు. రూ.6వేలకు పని చేస్తామని ముందుకొచ్చిన సంస్థను కాదని అంతకు ఐదు రెట్లు ఎక్కువ కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించారు.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవినీతి బాగోతాలలో ఇదో మకిలి వ్యవహారం. వైద్య ఆరోగ్య శాఖను గబ్బు పట్టించిన ఈ తతంగాన్ని చూద్దాం పదండి.. వైద్య ఆరోగ్య రంగాన్ని అలక్ష్యం చేసి ప్రజల బాగోగులను గాలికి వదిలేసిన గత సర్కారు ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు మాత్రం ఏ ఒక్క మార్గాన్నీ విడిచిపెట్టలేదు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ హబ్ల ఏర్పాటు పేరుతో గత సర్కారు హయాంలో జరిగిన భారీ కుంభకోణం ఇది. తరచి చూస్తే నిర్ఘాంతపోయే వాస్తవాలు బైటపడ్డాయి. మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలందించేందుకు టెలిహబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ముసుగులో దాదాపు రూ.వెయ్యి కోట్ల స్కామ్కు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన కొందరు టీడీపీ నేతల సహకారంతో వైద్య ఆరోగ్యశాఖలో ఈ తతంగం నడిచినట్లు గుర్తించారు. టెలి మెడిసిన్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 2018లో టెలి మెడిసిన్ హబ్స్, ఐటీ సొల్యూషన్స్ పేరుతో టెండర్లు పిలిచారు. 5,500 ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ హబ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ హబ్ల ద్వారా మారుమూల ప్రాంతాల రోగులకు టెలి మెడిసిన్తో మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఒక్కో కేంద్రం నిర్వహణకు నెలకు రూ.6 వేల చొప్పున పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన సంస్థను తప్పించి రూ.28 వేలు కోట్ చేసిన ధనుష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు అప్పగించారు. ఎల్ 2 సంస్థకు ఇవ్వాలంటే ఎల్ 1 ధరకు అంగీకరించాలి. లేదంటే ఇంకా తక్కువకు చేయడానికి సిద్ధపడాలి. అవేవీ కాకపోయినా 2019లో ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థకు 3,010 సెంటర్లు, వరల్డ్ హెల్త్ పార్ట్నర్ అనే మరో సంస్థకు 2,490 కేంద్రాలను అప్పగించారు. ఒక్కో కేంద్రం నిర్వహణ వ్యయం రూ.28 వేలు కాగా నెలకు రూ.15.4 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.924 కోట్లకుపైగా చెల్లించేలా గుట్టుగా వ్యవహారం సాగింది. అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై ఉన్నతాధికారులు సంతకాలు చేయలేదు. అప్పటి ప్రజారోగ్య సంచాలకులతో కథ నడిపించారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) మరో కిందిస్థాయి అధికారితో తీసుకున్నారు. ఒప్పందం ఏమిటి? 5,500 ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలిమెడిసిన్ ఐటీ సొల్యూషన్స్ సేవలందించాలి. ఇంటర్నెట్తో పాటు టెలి వీడియో కన్సల్టెన్సీ, డ్రగ్ వెండింగ్ మెషీన్లు, మల్టీ పారామానిటర్ లాంటివి ఏర్పాటు చేయాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇవి పనిచేయాలి. వీటితో పాటు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, డయాబెటిస్, రక్తపోటు లాంటి జబ్బులకు స్క్రీనింగ్ చేయాలి. ధనుష్ సంస్థకు ఇచ్చిన టెర్మినేషన్ నోటీసు కాపీ.. నిర్వహణ దారుణం.. టెండరు నిబంధనల ప్రకారం 2019 ఏప్రిల్ నాటికి 5,500 ఆరోగ్య ఉప కేంద్రాలలో నిర్వహణ సంస్థల సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా కేవలం 500 కేంద్రాల్లో అరకొరగా మొదలయ్యాయి. రోగ నిర్ధారణ పరీక్షలు చేయలేదు. ఐటీ సొల్యూషన్స్ అభివృద్ధి చేయలేదు. 40 రకాల మందులను పంపిణీ చేయాల్సి ఉండగా ఒక్కటీ ఇవ్వలేదు. క్యాన్సర్ స్క్రీనింగ్ లేదు. సర్వీస్ ప్రొవైడర్ సేవలను కోర్డాష్ బోర్డుకు రోజూ అనుసంధానించాలన్న నిబంధనను గాలికి వదిలేశారు. ఆరోగ్యశాఖలో అతి పెద్దదిగా చెప్పుకునే ఈ ప్రాజెక్టు నిర్వహణ సంస్థలతో గత ప్రభుత్వ పెద్దలు భారీగా లావాదేవీలు చేసుకున్నట్లు తేలింది. ప్రపంచ బ్యాంకు దీనికి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కనీసం ఫైలు కూడా లేకుండా చేశారంటే ఇందులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో అంచనా వేయొచ్చు. బండారం ఇలా బయట పడింది 2019 జూన్ తర్వాత నిర్వహణ సంస్థ టెలిమెడిసిన్, ఐటీ సొల్యూషన్స్ పేరిట కుటుంబ సంక్షేమశాఖకు బిల్లులు రావడంతో బాగోతం బయటపడింది. దీనికి సంబంధించి కనీసం ఫైలు కూడా లేకపోవడంతో ఇద్దరు అధికారులకు నోటీసులు ఇవ్వగా అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి మౌఖిక ఆదేశాల మేరకు నడుచుకున్నట్లు వెల్లడించారు. భారీ అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ ప్రాజెక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్టును రద్దు చేయడంతో పాటు నిర్వహణ సంస్థలకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ముగ్గురు అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు కుటుంబ సంక్షేమశాఖ విచారణలో తేలింది. రూ.90 కోట్లు ఇవ్వండి టెలిమెడిసిన్ పేరుతో అప్పట్లో ధనుష్ సంస్థ నిర్వహణ చేపట్టింది. ఆ తర్వాత తమకు రూ.90 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని కోర్టులో వ్యాజ్యం వేసింది. నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం తనకు ఇప్పటివరకూ రూ.10 కోట్లే ఇచ్చిందని, మరో రూ.90 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. రూ.1,026 కోట్లు రికవరీ చేస్తాం నిర్వహణ సంస్థ సరిగా టెలిమెడిసిన్ సేవలు చేయకపోవడంతో దీనివల్ల ప్రజలకు రూ.1026 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, ఈ సొమ్మును మీరు ఇవ్వాల్సి ఉందని ధనుష్ సంస్థకు కుటుంబ సంక్షేమశాఖ నోటీసులు జారీచేసింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)తో పాటు, గర్భిణుల వైద్యపరీక్షలు ఇలా రకరకాల సేవలు చేయకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి, రూ.1026 కోట్లమేరకు వ్యయం చేశారని, ఈ సొమ్ము మీరే చెల్లించాలని ధనుష్ సంస్థకు నోటీసులు జారీచేసింది. చాలా రకాల సేవలు అందించలేకపోయారు.. నిర్వహణ సంస్థ అందించాల్సిన సేవలపై ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. ఇందులో పలు రకాల సేవలు ఉన్నాయి. అవేమిటంటే.. ♦టెలిమెడిసిన్ అప్లికేషన్ను సరిగా నిర్వహించలేక పోయారు. ♦ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా నిర్వహణ చేయలేక పోవడం వల్ల వీడియో కన్సల్టెన్సీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ♦జీవనశైలి జబ్బులకు సంబంధించిన పరీక్షలు (30 సంవత్సరాలు దాటిన మహిళలకు) రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి టెస్టులు చేయలేదు. ♦ సబ్ సెంటర్లలో మల్టీ పారామానిటరింగ్ చేయకపోవడం వల్ల టెస్టులు జరగలేదు. ♦డ్రగ్ వెండింగ్ మెషీన్ల నిర్వహణ లేదు. దీనిపై ఎవరైనా అడిగినా సరిగా స్పందించలేదు. దీనివల్ల రోగులు మందులు తీసుకోలేక పోయారు. ♦ప్రతి గర్భిణికి యాంటీనేటల్ చెకప్స్ (ఏఎన్సీ)చేయాల్సి ఉంది. కానీ వీరికి పరీక్షలు చేయలేకపోయారు. ♦టెలిమెడిసిన్ హబ్స్ను సరిగా ఏర్పాటు చేయకపోవడమే కాదు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహణ చేయలేకపోయారు. అప్పుడు ప్రైవేటుకు.. ఇప్పుడు ప్రభుత్వమే ప్రైవేటు సంస్థకు ఇవ్వకుండా ఇదే ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రభుత్వమే టెలీమెడిసిన్, ఈ–సంజీవనీ ఓపీడీ పేరుతో ఉచితంగా నిర్వహణ చేపట్టింది. ఇప్పటికే 2,960 కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు మరో 3 వేల కేంద్రాల్లో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి తేనున్నారు. మార్చి చివరి నాటికి 10,051 కేంద్రాల్లో టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. కనిష్టంగా రోజుకు లక్ష మందికి ప్రభుత్వమే సేవలు ఉచితంగా అందిస్తోంది. గతంలో ప్రైవేటు సంస్థ నిర్వహణకంటే మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే అత్యంత అద్భుతంగా టెలిమెడిసిన్ సేవలు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నట్టు జాతీయ హెల్త్మిషన్ పేర్కొంది. నివేదిక ఆధారంగా చర్యలు ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. నిర్వహణ కూడా లేదు. దీనికి బాధ్యులైన అధికారులను గుర్తించాం. నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నాం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంది. – అనిల్కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఇవీ చదవండి: బడికి వెళ్లకుంటే.. వలంటీర్ వస్తారు! మంత్రి వేముల పీఆర్వోపై కేసు: భార్యపై దాడి చేసిన వీడియో వైరల్ -
30న నివేదిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ను ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో కొత్త టారిఫ్ ప్రతిపాదనలను ఏఆర్ఆర్తోపాటు ఈఆర్సీకి సమర్పించడం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఏఆర్ఆర్ నివేదికతోపాటు టారిఫ్ పెంపు ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించిన అనంతరం బహిరంగ విచారణ నిర్వహించి కొత్త విద్యుత్ టారిఫ్ను ఖరారు చేసేందుకు ఈఆర్సీకి కనీసం 120 రోజులు అవసరం కానుంది. ఏటా నవంబర్ 30లోగా తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికతోపాటు టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలని టారిఫ్ నిబంధనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో వచ్చే ఏడాది టారిఫ్ పెంపు ప్రతిపాదనలు మినహా ఏఆర్ఆర్ నివేదికను మాత్రమే ఈఆర్సీకి సమర్పించాలని డిస్కంలు నిర్ణయించాయి. గృహ, వాణిజ్యం తదితర కేటగిరీల వారీగా పెంచాల్సిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈఆర్సీకి అందజేయనున్నాయి. యూనిట్పై రూ.1.66 నష్టం.. ఒక యూనిట్ విద్యుత్ సరఫరాకు 2018–19లో డిస్కంలు సగటున రూ. 6.91 ఖర్చు చేయగా, బిల్లుల వసూళ్ల ద్వారా సగటున రూ.5.25 మాత్రమే ఆదాయాన్ని ఆర్జించాయి. ప్రతి యూనిట్ విద్యుత్ సరఫరాపై సగటున రూ.1.66 నష్టపోయాయి. 2015–16లో యూనిట్ విద్యుత్పై రూ.0.95 ఉన్న ఆదాయలోటు 2016–17లో రూ.1.55కు, 2017–18లో రూ.1.42కు, 2018–19లో 1.66కు పెరిగింది. ఏటా 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను రాష్ట్రానికి డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. 2018– 19లో రూ.9970. 98 కోట్ల ఆర్థికలోటు ఎదుర్కోనున్నామని అప్పట్లో ఈఆర్సీకి ఇచ్చిన ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. విద్యుత్ చార్జీల పెంపుతో ఈ ఆదాయ లోటును భర్తీ చేసుకోవాలని డిస్కంలు భావించినా వరుస ఎన్నిక ల నేపథ్యంలో మూడేళ్లుగా విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతించలేదు. కాగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2019–20 ముగిసే నాటికి ఆర్థికలోటు రూ.11 వేల కోట్లకు చేరనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన రూ.6,079 కోట్లు విద్యుత్ రాయితీలకు పోగా రూ.5 వేల కోట్ల ఆర్థికలోటు మిగిలి ఉండనుంది. దీనిని భర్తీ చేసుకోవడానికి వచ్చే ఏడాది చార్జీల పెంపు తప్పదని అధికారులు అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే చార్జీల పెంపు ప్రతిపాదనలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
పదోన్నతి...జీతానికి కోతే గతి
సాక్షి, హైదరాబాద్ : పోలీసుశాఖలో పనిచేస్తూ సివిల్ కానిస్టేబుల్, ఎస్సైలుగా ఎంపికైన వారికి కొత్తగా వేతన కష్టాలు చుట్టుముట్టాయి. పదోన్నతి దక్కినందుకు సంబరపడాలో వేతనం తగ్గుతున్నందుకు బాధపడాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎస్పీఆర్బీ) ఆధ్వర్యంలో ఒకేసారి దాదాపు 18 వేల పోస్టుల ఫలితాలు ప్రకటించింది. వీరిలో 1,200 మంది ఎస్సైలకు శిక్షణ ప్రారంభమైంది. త్వరలోనే 16 వేల మందికి పైగా కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుంది. అయితే సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్సైలకు ఎంపికైన కానిస్టేబుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల టీఎస్ఎస్పీఆర్బీ నిర్వహించిన పరీక్షల్లో ఆర్మ్డ్ రిజర్వుడు (ఏఆర్), తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) బలగాల్లో పనిచేసే కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరిలో 2016 అంతకుముందు ఎంపికైనవారున్నారు. ఆ లెక్కన వీరందరి జీతం రూ.30 వేలకు కాస్తా అటుఇటుగా ఉంది. పాత కొలువులకు రాజీనామా చేసి.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో దాదాపు 1,500 మంది ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు సివిల్ కానిస్టేబుళ్లు, ఎస్సైలుగా ఎంపికయ్యారు. వీరంతా సివిల్కు రావాలంటే వీరంతా తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి, సంబంధిత విభాగం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకురావాలి. అప్పుడు వీరంతా తిరిగి కానిస్టేబుల్, ఎస్సై శిక్షణకు వెళతారు. శిక్షణకాలంలో వీరందరినీ ట్రైనీ కేడెట్లుగానే పరిగణిస్తారు. ఆ సమయంలో నెలకు రూ.9,000 స్టైపెండ్ కింద ఇస్తారు. వీరిలో చాలామంది వివాహితులు. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. శిక్షణకాలంలో ఇంత తక్కువ వేతనంతో ఎలా మనగలగాలి? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో ఎస్సైకి ఎంపికైన అభ్యర్థులు ర్యాంకు పెరిగింది కాబట్టి.. ఎలాగోలా సర్దుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ, సివిల్కానిస్టేబుల్కు ఎంపికైన ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు మాత్రం కుటుంబపోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. తామందరం ఇప్పటికే శిక్షణ తీసుకుని, కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న కారణంగా తిరిగి 9 నెలల సుదీర్ఘ శిక్షణ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గతంలో 2016లో నూ ఇలాంటి సమస్యే ఎదురైనపుడు ఏఆర్, టీఎస్ఎస్పీ, కానిస్టేబుళ్లకు కేవలం 3 నెలల తరగతులు బోధించి వెంటనే సివిల్ కానిస్టేబుళ్లుగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. తమకు తిరిగి అదే వెసులుబాటు కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు పలువురు కానిస్టేబుళ్లు డీజీపీ కార్యాలయానికి వస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. -
సెప్టెంబర్ 1 నుంచి ‘పథకాల’ డోర్ డెలివరీ
-
మోటార్లకు తగ్గట్టే తిరగనున్న మీటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది నుంచి విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ ఏర్పడనుందని నీటిపారుదల, విద్యుత్ శాఖలు అంచనా వేస్తున్నాయి. గరిష్టంగా 6 వేల మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉంటుందని, ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకే గరిష్టంగా 3,800 మెగావాట్లు అవసరం ఉంటుందని గుర్తించాయి. అవసరాలకు తగ్గట్లే విద్యుత్ సరఫరా చేసే విషయంపై దృష్టి సారించాయి. 6 వేల మెగావాట్లు..: రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తయినా, కొనసాగుతున్న 22 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 61.65 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 27.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే 12,084 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. నీటిని తీసుకునే మోటార్ల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి 1,410 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగిస్తున్నారు. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్కు రూ.6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి కల్వకుర్తితోపాటు బీమా, నెట్టెంపాడులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లకు వెట్రన్ నిర్వహిస్తున్నారు. సీతారామలో కొన్ని పంపులైనా నడపాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది నుంచి అదనంగా మరో 4,500 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం అదనంగా అవసరం ఉంటుంది. ఇప్పటికే ఉన్న విద్యుత్ అవసరాలను కలుపుకొని మొత్తంగా 6 వేల మెగావాట్ల డిమాండ్ దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాళేశ్వరానికే భారీ డిమాండ్... కాళేశ్వరంలో మేడిగడ్డ మొదలు అన్నిదశల్లో ఉన్న పంప్హౌస్ల్లో 82 మోటార్లను ఏ ర్పాటు చేస్తుండగా, ఇందులో ప్యాకేజీ–8లో 139 మెగావాట్లు, ప్యాకేజీ–6లో 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భారీ మోటార్లను వాడుతున్నారు. ఈ మొత్తం మోటార్ల ను నడిపించేందుకు 4,800 మెగావాట్ల విద్యుత్ అవసరాలను గుర్తించారు. వచ్చే ఖరీఫ్లో అన్ని మోటార్లను నడిపించే వీలులేకున్నా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 70 మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇందులో మేడిగడ్డ మొదలు మిడ్మానేరు వరకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకే 1,600 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అధికారులు గుర్తించారు. అనుకున్నది అనుకున్నట్టుగా పనులు పూర్తయితే గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని 6 నెలలపాటు ఎత్తిపోసేందుకు ఈ ఏడాది గరిష్టంగా 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరమని ట్రాన్స్కో, నీటి పారుదల శాఖలు అంచనా వేశాయి. జూలై నుంచి నీటిని ఎత్తిపోయనుండగా, జూలైలో 600 మెగావాట్ల విద్యుత్ అవసరాలతో మొదలై గోదావరిలో వరద ఎక్కవగా ఉండే అక్టోబర్, నవంబర్, డిసెం బర్ నెలల్లో 3,800 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని తేల్చాయి. దీనికి గాను రెండు శాఖలు ప్రణాళికలు రూపొందించుకోవాలని గురువారం సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. -
తెలుగు రాష్ట్రాల్లో 60,845 కోట్లు ఆదాయపు పన్ను టార్గెట్
-
క్రాష్ గార్డ్స్ను నిషేధిస్తే?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రమాదాల తీవ్రతను తగ్గించుకునేందుకు కార్ల యజమానులు ప్రత్యేకంగా క్రాష్ గార్డులను ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. ఈ కార్ క్రాష్ గార్డులపై కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ కొరడా ఝులిపిస్తోంది. మోటార్ వెహికల్ యాక్ట్ను ఉల్లంఘించి ఏర్పాటు చేసుకునే ఈ క్రాష్ గార్డులను నిషేధించే యోచనల రవాణ మంత్రిత్వ శాఖ ఉంది. క్రాష్ గార్డులనేవి.. పాదచారులకు, ద్విచక్ర వాహన దారులకు ప్రమాదమేనని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో కంపెనీ ఇచ్చిన వాటికి అదనగా ఏ మాత్రం మార్పులు చేర్పులు చేయరాదని మంత్రిత్వ శాఖ చెబుతోంది. సాధారణంగా వాహనదారులు కొత్త వాహనం కొత్త తరువాత ప్రమాద తీవ్రతను తగ్గించుకునే నేపథ్యంలో క్రాష్ గార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. దాదాపు ప్రతి ప్రభుత్వ వాహనానికి కూడా క్రాష్ గార్డులు ఉండడం గనార్హం. అయితే ఈ క్రాష్ గార్డుల వల్లే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశముదని రవాణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. క్రాష్ గార్డులు ఉండడం వల్ల ప్రమాద సమయంలో కంపెనీ ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కారణం వల్లనే క్రాష్ గార్డులను నిషేధించాలన్న ఆలోచనకి రవాణ మంత్రిత్వ శాఖ వచ్చినట్లు తెలుస్తోంది. -
తప్పుల తడకగా ‘ఇంటింటి సర్వే’
-
పైరవీలదే పవర్
–విద్యుత్ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు – ప్రక్రియ ముగిసిన తర్వాత మార్పులు, చేర్పులు – పదుల సంఖ్యలో ఈపీడీసీఎల్ మోడిఫికేషన్ ఉత్తర్వులు – తాజాగా రాజమహేంద్రవరం సర్కిల్లో ముగ్గురు డీఈల బదిలీ సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్) బదిలీల్లో పైరవీలు చేసిన వారిదే పై చేయి అయింది. మునుపెన్నడూ లేని విధంగా బదిలీల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియారిటీ పరిగణనలో ట్రాన్స్కో మార్గదర్శకాలకు విరుద్ధంగా జూన్ 25న బదిలీలు చేసిన ఈపీడీసీఎల్ తర్వాత కూడా పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసింది. కొందరు అధికారులు ఆపరేషన్ విభాగాల్లో పోస్టుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయడంతో మూడేళ్ల కాలపరిమితి ముగియకపోయినా ఆ స్థానంలో ఉన్న అధికారిని బదిలీ చేస్తూ పైరవీలు చేసుకున్న అధికారికి మోడిఫికేషన్ ద్వారా ఆ పోస్టును కట్టపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, మోడిఫికేషన్ల వ్యవహారం ఇప్పటికీ సాగుతూనే ఉంది. తమకు జరిగిన అన్యాయంపై కొందరు అధికారులు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేయడంతో వారికి న్యాయం చేసేందుకు తాజాగా కొత్తవారిని బలిచేశారు. శనివారం రాజమహేంద్రవరం సర్కిల్లో మరో మగ్గురు డీఈలను బదిలీ చేస్తూ ఈపీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. కాకినాడ ఆపరేషన్స్ డీఈగా పని చేస్తున్న పి.సాల్మన్రాజును అమలాపురం ఆపరేషన్స్ డీఈగా పంపుతూ ఆ స్థానంలో ఉన్న ఎన్.రమేష్ను రాజమహేంద్రవరం ట్రాన్స్ఫార్మర్స్ డీఈగా బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న డీఈ జి.ప్రసాద్ను కాకినాడ ఆపరేషన్స్ డీఈగా నియమించింది. ఒకరికి ఏడాదిలోనే రెండు బదిలీలు అప్పటి వరకూ ఆపరేషన్స్ విభాగంలో పని చేసిన కొందరు అధికారులు బదిలీల్లో అప్రధానమైన ట్రాన్స్ఫార్మర్స్, కన్స్ట్రక్షన్ తదితర విభాగాలకు వెళ్లారు. వీరిలో కొందరు తిరిగి ప్రధానమైన ఆపరేషన్స్ విభాగంలో పోస్టు కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేశారు. ఫలితంగానే ఈపీడీసీఎల్ బదిలీలు ముగిసిన తర్వాత పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు (మోడిఫికేషన్స్) చేసింది. దీంతో అనేక మంది అధికారులకు అన్యాయం జరిగింది. తాజాగా జరిగిన బదిలీల్లో కాకినాడ డివిజన్ ఆపరేషన్స్ నుంచి అమలాపురం ఆపరేషన్స్కు వచ్చిన పి.సాల్మన్రాజు జూన్ 25న జరిగిన బదిలీల్లో రాజమహేంద్రవరం ట్రాన్స్ఫార్మర్స్ డీఈగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆపరేషన్స్ నుంచి వచ్చారు. అయితే నాలుగు రోజులకే సాల్మన్రాజును కాకినాడ ఆపరేషన్స్ డీఈగా పంపుతూ బదిలీలో మోడిఫికేషన్ చేశారు. అక్కడ రెండేళ్లుగా పని చేస్తున్న జి.ప్రసాద్ను సాల్మన్రాజు స్థానంలోకి పంపారు. ఒక పోస్టులో మూడేళ్లు, ఒక స్టేషన్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారే బదిలీకి అర్హులు. అయితే కేవలం రెండేళ్ల సీనియారిటీ ఉన్న ప్రసాద్ను సాల్మన్రాజు కోసం మోడిఫికేన్ ద్వారా బదిలీ చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రసాద్ను కాకినాడకు పంపేందుకు అమలాపురం ఆపరేషన్స్ డీఈగా ఉన్న రమేష్ను బలి చేశారు. కాకినాడ డివిజన్ ఆపరేషన్స్ డీఈగా ఉన్న సాల్మన్ రాజును అమలాపురం డీఈగా పంపి అక్కడ ఏడాది నుంచి పని చేస్తున్న ఎన్.రమేష్ను రాజమహేంద్రవరం ట్రాన్స్ఫార్మర్స్ డీఈగా బదిలీ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఏడాది క్రితం అమలాపురం వచ్చిన రమేష్ను ఇంతలోనే తిరిగి బదిలీ చేశారు. కాగా, జూన్లో జరిగిన బదిలీల్లో ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు సీనియారిటీ నిర్ధారణలో భిన్నంగా వ్యవహరించాయి. ఎస్పీడీసీఎల్ ఒక లిస్టు తయారు చేయగా, ఈపీడీసీఎల్ మూడు లిస్టులు తయారు చేసి చివరకు జూనియర్లను బదిలీ చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలు మిన్నకుండిపోయాయి. -
‘‘దేవస్థానానికి అప్రతిష్ట తీసుకురాకండి’’
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆగ్రహం వేద పాఠశాల నిర్మాణ పనుల జాప్యంపై అసంతృప్తి సహజ ఆసుపత్రి నిర్వహణపైనా అదే రీతిలో స్పందన పారిశుద్ధ్యం బాగోలేదని కాంట్రాక్టర్కు రూ.పదివేలు జరిమానా యాగశాల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ అన్నదానం భవనం నిర్మాణస్థలం మార్పుపై పరిశీలన అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో అధికారుల పనితీరుపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు నత్తనడకన సాగడం, సహజ ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవించడంపై ‘ఇది దేవస్థానానికి అప్రతిష్ట’ అని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆయన అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. వివిధ నిర్మాణపథకాల పనితీరును పరిశీలించారు. సత్యగిరిపై రూ.2.82 కోట్ల వ్యయంతో చేపట్టిన స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులు నత్తనడకన సాగుతుండడంపై జేఎస్వీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంలో పారిశుద్ధ్యం నిర్వహణ, సహజ ఆసుపత్రి పనితీరుపైనా తీవ్ర అసంతృపి వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులను నిలదీశారు. డిసెంబర్ నాటికి పూర్తి కావాలి.. సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై ఆరాతీశారు. ఈ నిర్మాణాలు చేసే నిపుణులైన పనివారి కొరత ఉండడంతో ఆలస్యమవుతోందని కాంట్రాక్టర్ నాయుడు తెలిపారు. అవసరమైనంత మందిని తీసుకువచ్చి ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యేలోపు వేదపాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటాలని, స్థలం చుట్టూ పాతపద్ధతిలో మెస్తో ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. సహజ ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి.. దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి ఆసుపత్రి పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పది మంది సిబ్బంది, నలుగురు పేషెంట్లు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడాన్ని చూసి మండిపడ్డారు. ఇది ఆలయానికి అప్రతిష్ట అని ఈఓను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులు చూస్తున్న పద్మావతి సంస్థ అన్నవరం మేనేజర్ కుళాయప్పకు రూ.పదివేలు జురిమానా విధించారు. ఆర్జేసీ అజాద్కు ‘సహజ’ బాధ్యతలు.. సహజ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ సంస్థకు అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అన్నారు. ఇందుకుగాను 20 పాయింట్లు రూపొందించామన్నారు. ఆసుపత్రి ముందు ఔషద మొక్కలను పెంచుతామన్నారు. ఆ పనులను దేవాదాయశాఖ కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్కు అప్పగిస్తున్నట్టు తెలిపారు. పనులు పూర్తయ్యాక దీనిపై ఒక బ్రోచర్ ముద్రించి ప్రచారం చేస్తామన్నారు. చెందుర్తిలో సోలార్ పవర్ప్రాజెక్ట్ చెందుర్తిలో ఉన్న 135 ఎకరాల దేవస్థానం స్థలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ సూచించారు. ఈ ప్రాజెక్ట్ ను సత్యగిరిపై ఏర్పాటు చేయాలని గతంలోనే దేవస్థానం చైర్మన్, ఈఓ లతో కూడిన పాలకమండలి తీర్మానించింది. అయితే సత్యగిరిపై కాకుండా చెందుర్తి భూమిలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎట్టకేలకు యాగశాల నిర్మాణానికి మోక్షం: దేవస్థానంలో యాగశాల ఏర్పాటు పనులు 18 నెలలుగా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఈ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తన ఆదేశాలను దేవాదాయశాఖ కమిషనర్కు తెలియజేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన ఈఓను ఆదేశించారు. అన్నదానం భవన నిర్మాణస్థలం మార్పుపైనా సానుకూలత.. అన్నదాన భవన నిర్మాణాన్ని పాత టీటీడీ సత్రం భవనస్థలంలో నిర్మించే విషయమై పరిశీలనకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్, ఈఓలతో కలసి ఆయన టీటీడీ సత్రం స్థలాన్ని పరిశీలించారు. సత్యగిరిపై నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదు సత్యగిరిపై 138 గదుల సత్రంతో సహ ఈ విధమైన నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అయితే సౌండ్ అంట్ లైట్ షో, అర్బన్ గ్రీనరీ పనులు కొనసాగుతాయని వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ వెంట దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, దేవాదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈలు రామకృష్ణ, రాజు, ఏఈలు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
‘తూర్పు’లో మూలాలు ... ‘పశ్చిమ’లో సోదాలు
- పెద్దాపురం ఈవోపై ఏసీబీ కొరడా - అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు - రూ. కోటికి పైనే అక్రమాస్తులు - ఏసీబీ చేతిలో మరో అరడజన్ మంది చిట్టా - ‘సాక్షి’ వరుస కథనాలతో కొరడా ఝుళిపించి ఏసీబీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయశాఖలోని అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుడినే కాకుండా గుడిలో లింగాన్ని సైతం మింగేసే ప్రబుద్ధుల నిర్వాకాలతో ఆ శాఖపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అర్హత లేకున్నా అందలాలు ఎక్కించడం మొదలుకుని ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేయడం వరకు దేవాదాయశాఖలో అడ్డగోలు వ్యవహారాలకు అంతే లేకుండాపోయింది. ఈ బాగోతాలపై ‘సాక్షి’ ఇటీవల కాలంలో వరుస కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ శాఖలోని పలువురు అవినీతి అధికారులపై నిఘా పెట్టిన ఏసీబీ తొలి పంజా సోమవారం పెద్దాపురం మహారాణి సత్రం ఈఓ చీమలకొండ సాయిబాబుపై విసిరింది.ఆస్తులు గుర్తించింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా దాని మూలాలు మాత్రం పెద్దాపురం సత్రంలోనే ఉండటం గమనార్హం. రెండేళ్లుగా ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న సాయిబాబు ఆధ్వర్యంలో సత్రంలో పేదలకు అన్నదానం జరుగుతుంటుంది. అన్నదానం చేయకుండానే చేసినట్టుగా రికార్డులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ నిర్థారణకు రావడం, ఏకకాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో దాడులు జరపడంతో దేవాదాయ శాఖలో గుబులు రేపుతోంది. ఏసీబీ జాబితాలో మరింతమంది... ప్రస్తుతం ఏసీబీ వలకు చీమలకొండే చిక్కినా జిల్లాలో మరికొన్ని దేవాలయాల కార్యనిర్వాహణాధికారుల జాతకాలు కూడా ఏసీబీ సేకరించిందని సంబంధిత వర్గాల సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు అధికారుల అండదండలు దండిగా ఉండటంతో అర్హత లేకున్నా ఇన్చార్జీలుగా కొనసాగుతున్న వారి చిట్టా సిద్ధంగా ఉందంటున్నారు. ఇందులో అసిస్టెంట్ కమిషనర్లు,, గ్రేడ్–1, గ్రేడ్ –2 ఇఒలు అరడజన్ మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. తొలి తిమింగలం పెద్దాపురం మహారాణి సత్రం ఈఓ సాయిబాబుతోనే మొదలైందని మిగిలిన వారి భరతం కూడా త్వరలో పట్టడం ఖాయమంటున్నారు. సాయిబాబు అక్రమాస్తుల చిట్టా... సాయిబాబు ఆస్తులను నిగ్గుతేల్చేందుకు ఏసీబీ పెద్దాపురం, తణుకు బ్యాంకు కాలనీలో సొంత ఇల్లు, మరో రెండు ఇళ్లతోపాటు మూడు ఇళ్లస్థలాలు, ప్లాటు, పెద్దాపురం కార్యాలయం, భీమవరంలో బావమరిది ఇంటితోపాటు స్వగ్రామం రేలంగిలో ఇల్లు, తణుకులో స్నేహితుడి ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించడంతో ఆ శాఖల అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కోనాల గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 35 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, పాస్పుస్తకాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ లెక్కేస్తే అతని ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు చెందిన 14 బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు, బ్యాంకు లాకర్లకు చెందిన పత్రాలను సీజ్ చేయగం గమనార్హం. -
అర్హత లేకున్నా అందలమెక్కేస్తాం...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోరుకున్న కొలువు కావాలనుకుంటున్నారా.. అర్హత లేకున్నా ఫర్లేదు, కావల్సిందల్లా...దండిగా సొమ్ములు...సిఫార్సులే. ఇదంతా దేవాదాయశాఖలో మాత్రమే సాధ్యమనడానికి ఉదాహరణ జిల్లాలోని పలు ఆలయాల్లో అర్హతలేని ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో కూర్చొబెట్టడమే. అర్హతలుండీ అడిగినంత సొమ్ము ఇచ్చుకోలేని వారిని ప్రాధాన్యం లేని పోస్టులకే పరిమితం చేయడం అవినీతికి దర్పణం పడుతోంది. నెలవారీ మామూళ్ల మత్తులో పడి ఒకేచోట నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తున్న వైనందేవాదాయ శాఖలో సాగుతోంది. ఎవరైనా ఏదైనా అంటే పదేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నామని సమాధానం చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. డీసీ పోస్టులో జూనియర్... దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ పోస్టు ఇన్చార్జి ఏలుబడిలో నడుస్తోంది. రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు గడచిన ఎనిమిది నెలలుగా డీసీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కారుణ్య నియామకంలో 1986లో దేవాదాయశాఖలోకి వచ్చిన రమేష్బాబు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంట్గా పదోన్నతిపొంది అనంతరం 2009లో అడ్హాక్ ఏసీ అయ్యారు. రాజమహేంద్రవరంలో ప్రస్తుతం అడహాక్ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కాకినాడ డీసీగా కొనసాగుతున్నారు. ఒక్క ఏడాది తప్ప మిగిలిన సర్వీసంతా జిల్లాలోనే. జిల్లాలో పలువురు సీనియర్ అధికారులున్నా రమేష్బాబుకు డీసీ ఇన్చార్జిగా కట్టబెట్టడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రమేష్బాబు కంటే సీనియర్లయిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఈవో దేవుళ్లు, పెద్దాపురం మరిడమ్మ దేవస్థానం ఆర్ పుష్పనాథం, అన్నవరం దేవస్థానం సహాయ కమిషనర్ ఈరంగి జగన్నాథం. తలుపులమ్మ లోవ ఈవో చంద్రశేఖర్, అప్పనపల్లి బాలాబాలజీ స్వామి దేవస్థానం ఈవో బాబూరావులు రమేష్బాబుకంటే సీనియర్లు. వీరంతా పూర్తి స్థాయి అసిస్టెంట్ కమిషనర్లే. అయినా వీరందరినీ పక్కనబెట్టి అడహాక్ ఏసీగా ఉన్న రమేష్బాబును గడచిన ఎనిమిది నెలలుగా కాకినాడ డీసీగా కొనసాగించడంలో ఔచిత్యమేమిటో ఆ దేవుడికే తెలియాలి. డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) నిర్వహిస్తే పదోన్నతుల్లో పైన పేర్కొన్న ముగ్గురు డీసీ జాబితాలో ముందుంటారు...అయినా అడ్హాక్ ఏసీగా ఉన్న రమేష్బాబుకే పదోన్నతి పట్టం కడుతోండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేడ్ వన్ అధికారులు కూడా ఆయన తరువాతే... ఏసీలు, డీసీలే కాదు గ్రేడ్–1 అధికారులు కూడా అన్యాయమైపోతున్నారు. పళ్లంరాజు గ్రేడ్–1 అధికారి. ఆయన అర్హతకు తగ్గట్టు కాకుండా తక్కువ క్యాడర్ కలిగిన వారిని నియమించే 6బి పరిధిలోని కాండ్రకోట నూకాలమ్మ ఆలయానికి ఈవోగా కొనసాగిస్తున్నారు. మరో గ్రేడ్–1 అధికారి అల్లు భవాని కాకినాడ జగన్నాథపురం గ్రూపు దేవాలయాల ఈవోగా పనిచేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈవో పోస్టు 6–సీ అంటే గ్రేడ్–3 అధికారి పనిచేసే పోస్టింగ్ అది. మరో అధికారిణి ఆర్.చందన. ఈమె కూడా పదేళ్ల సీనియర్ గ్రేడ్–1 అధికారి. ఆమెను కూడా 6సీ అంటే గ్రేడ్3 రాజమహేంద్రవరం సత్యనారాయణస్వామి ఆలయం ఈవోగా పని చేస్తున్నారు. గ్రేడ్1అధికారైన పితాని సత్యనారాయణ (తారకేశ్వరరావు)ను 6బి పరిధిలోని రాజమహేంద్రవరం చందాసత్రం ఈఓగా పనిచేయాల్సిన పరిస్థితి. ఆర్.శ్రీనివాస్, సత్యవాణి వీరు కూడా గ్రేడ్1 అధికారులే. వీరిద్దరూ రాజానగరం సత్రం, రాజమహేంద్రవరం నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్(ఎన్ఎస్బిఎస్) ఈవోలుగా పనిచేస్తున్నారు. 6–బి, 6–సీ గ్రేడ్లు కలిగిన ఈ రెండు పోస్టుల్లో గ్రేడ్–1 అధికారులు పనిచేస్తున్నారు. వీరంతా ఆ శాఖలో సీనియర్ గ్రేడ్–1 అధికారులే అయినా ఉన్నతాధికారులు ఎవరికీ వీరు కనిపించకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా పైవారికి తెలియదా...? అర్హతలు లేని వారెందరో జిల్లాలో అందలాలెక్కి కూర్చున్నా ఆ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కమిషనర్కు తెలియకుండా ఉండి ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి కలిగిన ఆలయాల్లో అంతకు తక్కువ స్థాయి కలిగిన వారు పైరవీలతో పాతుకుపోయారు. బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం ఈవో వాసంశెట్టి ఉమామహేశ్వరరావు కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్, అమలాపురం వెంకటేశ్వరస్వామి ఈఓ వీవీవీఎస్ మూర్తి మందపల్లి, గ్రేడ్–1 స్థాయి కలిగిన ఈఓలు ఉండాల్సిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి, అయినవిల్లి సిద్దివినాయక ఆలయాల్లో అంతకంటే తక్కువ గ్రేడ్–2 క్యాడర్ కలిగిన రమణమూర్తి, సత్యనారాయణరాజు ఈవోలుగా పనిచేస్తున్నారు. అయినవిల్లి, వాడపల్లి రెండు దేవస్థానాల్లో పెరిగిన ఆదాయంతో ఏసీ క్యాడర్కు వచ్చేశాయి. అధికారికంగా ఉత్తర్వులు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అటువంటి ఈ రెండు దేవస్థానాలు గ్రేడ్–2 అధికారులనే కొనసాగిస్తున్నారు. ఇందులో తాజా బదిలీల్లో వాడపల్లి దేవస్థానానికి వచ్చేందుకు గ్రేడ్–1 రెగ్యులర్ ఇఒలు విశ్వప్రయత్నం చేసినా ఇన్ఛార్జిగా కొనసాగుతోన్న గ్రేడ్–2 వానపల్లి ఇఒ రమణమూర్తి తన స్థానాన్ని కాపాడుకోగలిగారు. ఆ ఆలయానికి పని చేయగలిగే అర్హతలున్న గ్రేడ్–1 ఈవోలను కాదని ఇన్ఛార్జిని కొనసాగించడంలో మర్మమేమిటో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. ఈ విషయాన్ని గత నెల 25న ‘వాడపల్లి వెంకన్నా నీ వాడిని నేనయ్యా’మ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయ ఈవో గ్రేడ్–2 కేడర్. ఆ ఆలయం చూస్తే గ్రేడ్–1 అంతకంటే ఎక్కువగా అసిస్టెంట్ కమిషనర్ను కూడా నియమించవచ్చు. అటువంటిది ఐదేళ్లయినా గ్రేడ్–2 ఈవోను రెగ్యులర్ చార్జితో ఇన్ఛార్జిగా ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రేడ్–1 ఈవోలు బీజేపీ నేతల దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారని తెలిసింది. దేవాదాయ శాఖలోని కమ్యునికేషన్ స్కిల్స్లో ఆరితేరిపోవడమే వారికి శ్రీరామ రక్షగా ఉందంటున్నారు. సరైన విధానం లేకనే... అయినవిల్లి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, మురమళ్ల వీరేశస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి...ఈ ఆలయాలన్ని ప్రస్తుతం గ్రేడ్–1, గ్రేడ్–2 ఈవోలు పనిచేస్తున్నారు. ఈ ఆలయాలన్నీ ఏసీ క్యాడర్ స్థాయికి ఎప్పుడో చేరిపోయాయంటున్నారు. వాటికి తగ్గ క్యాడర్ను ప్రకటించి ఆ తరహా ఈవోలను నియమించాల్సి ఉంది. ఇవి జరగనంత వరకు ఈ సిఫార్సు వ్యవహారాలు ఆ శాఖలో మామూలేనంటున్నారు. -
కొలిక్కి రాని రెవెన్యూ బదిలీలు
కాకినాడ సిటీ: జిల్లాలో కీలకమైన రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ బుధవారం రాత్రి 10 గంటల వరకు కూడా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీల గడువు ముగిసింది. దీంతో గురువారం నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి రానుంది. ప్రధానమైన రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి తహసీల్దార్ కేడర్ వరకు నిబంధనల మేరకు బదిలీలకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. -
వైద్యం ప్రజలకు చేరువ కావాలి
జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ : వైద్య ఆరోగ్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ పథకాల పటిష్ట అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. స్వైన్ప్లూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం యాంటీనేటల్ రిజిస్ట్రేషన్లు పెంచాలని, ఆసుపత్రులలో ఉన్న 48 శాతం ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. బాలస్వాస్థ కార్యక్రమంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య చికిత్సల తర్వాత నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలన్నారు. ఏజెన్సీ, సబ్ప్లాన్ ఏరియాల్లో మలేరియా తీవ్రత పెరిగిన గ్రామాలను గుర్తించి, అక్కడ ప్రత్యేకంగా యాంటీ మలేరియా పథకాలను అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులందరికీ ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, అమలాపురంలో మే నెలలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. వైద్య శిబిరాలు రెండు రోజుల నుంచి నాలుగు రోజులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. జేసీ–2 రాధాకృష్ణమూర్తి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్కిషోర్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. దిగుబడులు పెంచేలా చర్యలు జిల్లాలోని శివారు ప్రాంత ఆయకట్టు పంట భూములకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టి, దిగుబడులు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వ్యవసాయశాఖ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టెరేట్ కోర్టు హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివారు ఆయకట్టు ప్రాంత పంట పొలాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బా«ధ్యత సాగునీటి సంఘాలు, అధికారులపై ఉందన్నారు. ఖరీఫ్ –2018 కార్యాచరణ ప్రణాళికను మే 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కేఎస్వీ ప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ బి.రాంబాబు, ఆత్మ పిడీ పద్మజ, వ్యవసాయశాఖ డీడీ లక్ష్మణరావు పాల్గొన్నారు. 5వ తేదీలోగా సామాజిక పింఛన్ల పంపిణీ వృద్ధులు, వితంతువు, వికలాంగులకు ప్రభుత్వం అందజేస్నున్న సామాజిక పింఛన్లను ప్రతి నెలా 5వ తేదీలోగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీని కలెక్టర్ మిశ్రా ఆదేశించారు. మల్లిబాబు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడి
డీఎంఅండ్హెచ్వో ఘెరావ్ అంతర్గత బదిలీలు, సస్పెన్షన్కు గురైన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగుల డిమాండ్ సంఘీభావం ప్రకటించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కలెక్టర్ చొరవతో ఆందోళన విరమణ కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : వైద్య ఆరోగ్య శాఖలో అంతర్గత బదిలీలు, సస్పెన్షన్కు గురైన సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్లతో వైద్య ఆరోగ్య ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ డీఎంహెచ్వో కార్యాలయాన్ని ముట్టడించారు. ఏజెన్సీ, జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులు డీఎంహెచ్వో కార్యాలయం వద్దకు చేరుకుని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్యను ఘెరావ్ చేశారు. కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏజెన్సీలో అరకొర సౌకర్యాల నడుమ విధులు నిర్వర్తిస్తూంటే, అనారోగ్యం, రక్తహీనతతో సంభవించిన మరణాలకు సిబ్బందిని బాధ్యులు చేస్తూ సస్షెండ్ చేయడంపై జేఏసీ నాయకులు గొంతి ఆస్కారరావు, ఎస్.విజయకుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్ఎం, ఎంపీహెచ్, ఎంపీహెచ్ఈవో, పీహెచ్ఎన్, పారా మెడికల్ సిబ్బందిని బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు, అంతర్గత సమస్యల పరిష్కారం కోసం అనేక విపతి పత్రాలు అందించినా స్పందించకపోవడంతో మార్చి 23న సమ్మె నోటీసు ఉన్నతాధికారులకు ఇచ్చామన్నారు. అప్పటి నుంచి చర్చలు జరపకపోవడంతో ప్రజాస్వామ్య రీతిలో హక్కుల సాధనకు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. అత్యవసరసేవల విభాగానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న సమస్యలను కలెక్టర్, ఐటీడీఏ పీవోల దృష్టికి తీసుకెళ్లడంలో డీఎంహెచ్వో, గిరిజన డీఎంహెచ్వోలు వైఫల్యం చెందారని ఆరోపించారు. కింది స్థాయి íసిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ రోగులు, గర్భిణుల తరలింపునకు పీహెచ్సీకొక అంబులెన్స్, వైద్యాధికారి పర్యటనకు వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. రిస్క్ అలవెన్సు మంజూరు చేయాలన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా మూడేళ్లు దాటిన ఉద్యోగులను ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు రిలీవర్తో ముడిపెట్టకుండా చూడాలని కోరారు. తమ సమస్యలపై అధికారులు స్పందించేవరకుఆందోళన విరమించేది లేదని స్పష్టం చేయడంతో డీఎంహెచ్వో ఆందోళనకారులతో చర్చించారు. చర్చలు విఫలం కావడంతో తిరిగి ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు ఉమామహేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణ, డీఎల్ గంగాధర్, బియన్ మూర్తి, సీహెచ్ శ్రీనివాసరాజు, డీబీవీ ప్రసాద్, భాస్కరరావులతో పాటూ సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర సేవలు నిర్వీర్యం అత్యవసర సేవలైన వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన డీఎంహెచ్వో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాళ్లవాపు, రక్తహీనత సమస్యతో గిరిజనులు చనిపోతుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించే వరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. అత్యవసర విభాగానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని వేధింపులకు గురిచేయడం అన్యాయమన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఒక్కో రంగాన్ని ప్రైవేటీకరిస్తోందన్నారు. అధికారంలో కొస్తే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఉద్యోగులను తొలగించేందుకు అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడడ, అక్రమ సస్పెన్షన్ల పేరుతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం తమ వంతు చేయూతనిస్తామని ఆయన సంఘీభావం ప్రకటించారు. పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు ప్రూటీకుమార్, బీసీ నేతలు గుబ్బల వెంకటేశ్వరరావు, బి.ప్రసన్నకుమార్, అల్లి రాజబాబు, బి.గోవిందు, ముత్తు సతీష్, గోపిశెట్టి సత్యనారాయణ, ఎస్సీ నాయకులు జంగా గగారిన్ పాల్గొన్నారు. కలెక్టర్ చొరవతో ఆందోళన విరమణ డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగ సంఘాల నేతలతో కలెక్టర్ బంగ్లాలో చర్చలు జరిపారు. సస్షెండ్కు గురైన సిబ్బందిపై ఉన్న ఉత్తర్వులను రద్దు చేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డీఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత పీహెచ్సీ పరిధిలో చేపట్టిన అంతర్గత బదిలీలపై పునసమీక్ష చేయాలని సూచించారు. డీఎంహెచ్ఓ,ఉద్యోగ సంఘాలు ఒక కమిటీ వేసుకుని బదిలీ అవసరంపై చర్చించుకోవాలన్నారు. మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలని డీఎంహెచ్వోను కలెక్టర్ ఆదేశించినట్టు జేఏసీ నేలలు ఆస్కారరావు, విజయ్కుమార్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కలెక్టర్కు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
అన్యాక్రాంతమైన భూమి స్వాధీనం
పెనుగుదురు (కరప): దశాబ్ద కాలంగా అన్యాక్రాంతమైన పంటభూమిని ఎట్టకేలకు ట్రిబ్యునల్ తీర్పుతో దేవాదాయశాఖ సోమవారం స్వాధీనం చేసుకుంది. పెనుగుదురులోని వేణుగోపాలస్వామి దేవస్ధానానికి సంబంధించిన 1.45 ఎకరాల పంటభూమిని ఒకవ్యక్తి అనధికారికంగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినా, కుదరక పోవడంతో దేవాదాయశాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పు దేవాదాయశాఖకు అనుకూలంగా వచ్చింది. దీంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు పలువురు ఈఓలు, సిబ్బందితోపాటు వీఆర్వోలు, పోలీసు బందోబస్తుతో వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ పెన్సింగ్ ఏర్పాటుచేసి, ఎర్రజెండాలుపాతి, దేవాదాయశాఖకు చెందిన భూమిగా బోర్డును ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా డీసీ రమేష్బాబు మాట్లాడుతూ 20 రోజుల వ్యవధిలోనే మూడేళ్ల కాలపరిమితికి కౌలుహక్కుకోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తిఉన్న రైతులు రూ.10వేలు డిపాజిట్ చెల్లించి, వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు. వెంటనే బహిరంగ వేలంపాటకు ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఇన్స్పెక్టర్ డేగల సతీష్కుమార్ను డీసీ ఆదేశించారు. కరప ఎస్ఐ మెల్లం జానకీరాం ఆధ్వర్యంలో ఏఎస్ఐ కేఏవీఎస్ఎస్ ఆచార్యులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
మాపై చిన్నచూపేల?
విద్యాశాఖ ఉద్యోగుల ఆవేదన రెగ్యులర్ చేస్తామన్న ఎన్నికల హామీ గాలికే కనీసం జీతాలు కూడా పెంచకుండా చిన్నచూపు కాంట్రాక్ట్ సిబ్బంది అరకొర జీతాలతో ఆర్థిక ఇబ్బందులు కొత్తపేట :‘‘అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తాం’’ ఇది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో చేసిన హామీ. రెగ్యులర్ చేయడం అటుంచితే ఆయన అధికారం చేపట్టాక కనీసం ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని విద్యాశాఖ ఉద్యోగులు వాపోతున్నారు. విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా వివిధ విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 1,200 మంది పనిచేస్తున్నారు. వారిలో పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్స్ (డ్రాయింగ్, క్రాఫ్ట్, పీఈటీ)గా ప్రతి మండలం నుంచీ 10 నుంచి 12 మంది చొప్పున 692 మంది, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స (సీఆర్పీ)లుగా ప్రతి మండలంలో నలుగురి నుంచి ఆరుగురు చొప్పున సుమారు 300 మందితో పాటు కంప్యూటర్ ఆపరేటర్స్, మండల ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్స్, మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్సీ) అసిస్టెంట్స్గా 64 మంది చొప్పున పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు సుమారు పదేళ్లు క్రితం రూ.1,500 నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.10 వేలకు పని చేస్తున్నారు. ఎంఆర్సీ అసిస్టెంట్స్ కూడా పదేళ్ల నుంచి రూ వెయ్యితో ప్రారంభమై ప్రస్తుతం రూ 7,500కు పనిచేస్తున్నారు. సీఆర్పీలు 2011 నుంచి, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్స్ 2012లో రూ 4,500 జీతంతో చేరి ప్రస్తుతం రూ 8,500కు, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ రూ.6,500కు జీతానికి చేరి ప్రస్తుతం రూ.12 వేలకు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచి 2013 వరకూ ఏటా అలాగే టీచర్స్ పీఆర్సీ ప్రకటించినప్పుడల్లా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ జీతం పెరుగుతూ వచ్చింది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి పెంచిన దాఖలాలు లేవని ఆ ఉద్యోగులు వాపోయారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం ఆ ఉత్తర్వులు వర్తింపజేయలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణా ప్రభుత్వం తాజాగా గత ఏడాది సెప్టెంబర్లో జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం ఆదిశగా ఆలోచనే చేయడం లేదని పలువురు ఉద్యోగులు వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మూడు రోజులు సంతాప దినాలు
కొవ్వూరు రూరల్ : పోలవరంలో నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు జనాన్ని తరలించి.. ఆ వెనుకే మోటార్ సైకిల్పై అక్కడకు బయలుదేరిన కొవ్వూరు వ్యవసాయ అధికారి కాకర వేణుగోపాల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన వ్యవసాయ శాఖలో విషాదం నింపింది. ఈ విషయం తెలిసి వ్యవసాయ శాఖ అధికారుల సంఘ నాయకులు ఘటనా స్థలానికి తరలివచ్చి నివాళులు అర్పిం చారు. ఆయన మృతదేహాన్ని పోలవరం నుంచి రాజమండ్రికి తరలిం చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కమలాకరశర్మ మాట్లాడుతూ శనివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో సంతాప దినాలు పాటిస్తున్నట్టు చెప్పారు. తమ శాఖ ఉద్యోగులెవరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామన్నారు. అందరితో కలిసిమెలిసి, స్నేహభావంతో మెలిగే వేణుగోపాల్ మృతి తీవ్ర విషాదం మిగిల్చిందన్నారు. సంఘ కార్యదర్శి వైవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే సభలు, సమావేశాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యే అధికారులకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. వేణుగోపాల్కు ఇద్దరు కుమార్తెలని, 18 ఏళ్లు నిండిన వెంటనే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ సమయంలో లభించే అన్ని ప్రయోజనాలను వేణుగోపాల్ కుటుంబ సభ్యులకు అందించాలని కోరారు. సంఘ జిల్లా అధ్యక్షుడు, కొవ్వూరు ఏడీఏ జేవీఎస్ రామ్మోహనరావు మాట్లాడుతూ మంచి స్నేహితుణ్ణికోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. ఏవోలు జె.రత్నప్రభ, కె.రాజెంద్రప్రసాద్, డి.కృష్ణకిశోర్ తదితరులు నివాళి అర్పించారు. -
రిజిస్ట్రేషన్శాఖలో పదోన్నతులకు బ్రేక్
జీవో నంబర్ 224 జారీ ఉద్యోగులకు నిరాశే కాకినాడ లీగల్ : రాష్ట్రవ్యాప్తంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖలో జరగాల్సిన పదోన్నతులకు బ్రేక్ పడింది. జిల్లాస్థాయిలో కాకుండా జోన్లస్థాయిలో పదోన్నతుల జాబితాను తయారు చేయాలని కొంతమంది ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆదేశానుసారం ప్రభుత్వ కార్యదర్శి అజయ్కలాం పదోన్నతులకు బ్రేక్ వేస్తూ 224 జీవోను జారీచేశారు. గతంలో జిల్లాస్థాయిలో పదోన్నతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కొందరు ఉద్యోగులు జోనల్స్థాయిలో అయితే సీనియార్టీ ప్రకారం పదోన్నతులు వస్తాయని హైకోర్టుకు నివేదించారు. వీరి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పదోన్నతులను నిలిపివేయాలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభ్వుతం న్యాయస్థానం ఆదేశాన్ని అమలు చేసేందుకు జీవో నంబర్ 224 జారీచేసింది. జిల్లాలో 21 మందికి పదోన్నతులకు బ్రేక్ ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం పదోన్నతులొస్తే జిల్లాలో 21 మంది జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. కాకినాడ రిజిస్ట్రేషన్ పరిధిలో 11 మంది, రాజమహేంద్రవరం పరిధిలో 10 మందికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. పదోన్నతులు నిలిపివేయడంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. మళ్లీ జీవో వచ్చే వరకు వేచి ఉండక తప్పదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. -
నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా..
విద్యార్థులకు అవగాహన కల్పించనున్న విద్యాశాఖ ఈ బాధ్యతను ఎంఈఓలకు అప్పగిస్తూ ఎస్ఎస్ఏ పీవో ఆదేశాలు రాయవరం : నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు నగదు రహిత లావాదేవీలో మేలనే రీతిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఈ బాధ్యతను ఎంఈఓలకు అప్పగిస్తూ ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల ప్రకారం జిల్లాలోని అన్ని మండల విద్యాశాకాధికారి కార్యాలయాలకు సోమవారం పీవో ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా నిర్వహించాలి అనే విషయమై అవగాహన కల్పించి, వారి ద్వారా తల్లిదండ్రులకు గ్రామస్తులకు నగదు రహిత లావాదేవీల విషయంలో చైతన్యపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకిగ్ ఏ విధంగా చేయాలి? స్మార్ట్ఫోన్లో బ్యాంకింగ్ యాప్లను ఉపయోగించే పద్ధతులను విద్యార్థులకు తెలియజేసి వారి ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. నగదురహిత లావాదేవీలను పెంచితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఆయన తెలిపారు. అందరు ప్రధానోపాధ్యాయులు/స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు/ఎంఈవో/కేజీబీవీ అధికారులు నగదు లావాదేవీలు కాకుండా, అన్ని చెల్లింపులు కేవలం అకౌంట్ పేయి చెక్ల ద్వారా చెల్లించవలసినదిగా ఆదేశించడమైనది. -
డిపార్టుమెంటు సచ్చి పోయిందా!
–రవాణ అధికారులపై కలెక్టర్ నిప్పులు –నలుగురు ఎంవీఐలకు రెండు ఇంక్రిమెంట్లు కట్... చార్జి మెమోలు జారీ –ఆటోలు ఓవర్లోడ్తో వెళితే ఎంవీఐలను సస్పెండ్ చేస్తా కర్నూలు(అగ్రికల్చర్): డిపార్టుమెంటు ఉందా.. సచ్చి పోయిందా ... మీలో పవర్ లేదా? ఆటోలు ఓవర్లోడ్లో వెలుతుంటే మీకు కనబడదా? అంటూ రవాణ అధికారులపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రవాణ అధికారులతో కొద్ది సేపు నిర్వహించిన సమావేశంలో వారిపై నిప్పులు చెరిగారు. ఇదీ నేపథ్యం..ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కర్నూలులో పర్యటించారు. ముఖ్యమంత్రి పాల్గొనే డ్వాక్రా సదస్సుకు నగరం నుంచి వేలాది మందిని తరలించే విధంగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మహిళలను తరలించేందుకు వీలుగా మెప్మాలో పనిచేసే ఒక్కో కమ్యూనిటీ ఆర్గనైజర్కు 50 వాహనాలు సమకూర్చాలని రవాణ శాఖ ఎంవీఐలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే, కొందరు ఎంవీఐలు తగినన్ని వాహనాలు సమకూర్చలేదు. దీంతో మహిళలను తరలించడంలో మెప్మా అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని మెప్మా అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రవాణ అధికారులతో సమావేశం నిర్వహించి వాహనాలు సమకూర్చడంలో నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ఏం తమాషగా ఉందా...నిద్ర పోతున్నారా వీఐపీల కార్యక్రమాలకే వాహనాలు పంపలేరా... వాహనాలు స్వాదీనం చేసుకునే పవర్ లేదా అంటూ మండిపడ్డారు. సునీత, రఘునాథ్, శ్రీకాంత్, అతిగానా«థ్ అనే నలుగురు ఎంవీఐలకు రెండు ఇంక్రిమెంట్లను కట్ చేయడంతో పాటు చార్జి మెమోలు ఇచ్చారు. ఈ మేరకు ఫైల్ సర్క్యులేట్ చేయాలని డీటీసీని ఆదేశించారు. ఇక నుంచి ఆటోలు ఓవర్లోడ్తో వెళితే సంబంధిత ఎంవీఐలను సస్పెండ్ చేస్తానన్నారు. ఇందుకు డీటీసీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడీ రామాంజనేయులు పాల్గొన్నారు. -
ఆ సంతకం అవినీతికి అంకితం
దే‘వాదాయం’’లో చంద్రుడు రిటైర్మెంట్ చివర్లోనూ పీక్కుతినడమే పదవీవిరమణ అంటే అదో పండుగ ... ఆ ఉద్యోగితో ఉండే అనుబంధం ... సహచరులుగా వేసిన అడుగులు ... ఆయన చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ సాగిన ప్రసంగాల వేదిక. సిబ్బంది ప్రశంసలు ... ముంచెత్తిన పూలమాలలు ... సన్మాన దుశ్శాలువాల ఆత్మీయ స్పర్శతో పులకించిపోవాలి. ఇంతకుమంచి సిబ్బందితో కలిసి పనిచేయలేకపోతున్నానంటూ ఆ ఉద్యోగి గొంతు బాధతో గద్గద స్వరంగా మారిపోవాలి. కానీ దీనికి భిన్నంగా పవిత్ర శాఖ దేవాదాయ శాఖలో ఉన్నతాధికారిగా పని చేసి పదవీ విరమణ చేస్తున్న ఆ ఉద్యోగి ‘ఆదాయ వనరు వేదిక’గా మలుచుకుంటున్నాడు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయశాఖలో తిష్టవేసిన తిమింగలాన్ని చూసి దిగువ క్యాడరంతా బేజారెత్తి పోతున్నారు. ఆయన ప్రతి సంతకం అవినీతికి అంకితం అన్నట్టుగా సాగింది. ఆరు దశాబ్థాలు దేవాదాయ అధికారిగా పనిచేసినంత కాలం ఉద్యోగులను జలగల్లా పీక్కుతిన్నాడు.చివర్లో పీఠాన్ని విడిచిపెట్టే సందర్భాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. ‘రిటైర్ అయిపోతున్నాను బహుమతులు ఇచ్చుకోవాలని’ తలకో రేటు పెట్టి ‘లకా’రాలకు ‘లకా’రాలే లాంగిసేస్తున్నాడు. గడచిన పక్షం రోజులుగా అసలు పనులు మానేసి కొసరు కోసం కక్కుర్తిపడే పనిలో ఉన్నాడాయన. దేవాదాయశాఖ కాకినాడ ప్రాంతీయ కార్యాలయంలో తిష్ట వేసిన ఆ తిమింగలం ఐదు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపు ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా పీక్కుతింటోంది. ఆ తిమింగలం బారి నుంచి మిగిలిన ఆ ఐదు రోజులు ఎలా గట్టెక్కుతాము దేవుడా అంటూ దిగువ క్యాడర్ అధికారులు, ఉద్యోగులు హడలిపోతున్నారు. కొందరైతే డీసీ కార్యాలయం దరిదాపుల్లోకి రావడానికి కూడా వెనుకంజవేస్తున్నారు. రిటైరయ్యే సంబంధితాధికారి తన వద్దకు పనిమీద వచ్చిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టడం లేదు. 2013లో జిల్లా కేంద్రం కాకినాడ డీసీ కార్యాలయానికి వచ్చిన ఆ ఉన్నతాధికారి ఇక్కడ రెండేళ్లు పని చేశారు.అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి బదిలీపై వెళ్లారు. పది నెలలు అక్కడ పనిచేసి రిటైర్మెంట్ సమయంలో జిల్లాపై మమకారం చంపుకోలేక గత ఫిబ్రవరిలో తిరిగి వచ్చేశారు. త్వరలో రిటైర్ కానున్నారు. చేసిన పనులు గుర్తు చేస్తూ రేటు ఫిక్స్... ఫలానా అçప్పుడు ఈ పనిచేసి పెట్టాను ఇప్పుడు రిటైరైపోతున్న సందర్భంగా ఏదో ఒక నజారానా ఇచ్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలున్నాయి. అసిస్టెంట్ హోదా కలిగిన ఆలయాలు, సత్రాల్లో గ్రేడ్–1 ఈఓలుగా (ఎఫ్ఎసీ) పూర్తి అదనపు బాధ్యతలతో నియమించి అందినంతా మూటగట్టుకున్నారు. ఇటీవల జిల్లాలో ఆరుగురు ఇ¯ŒSఛార్జీలకు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన ఆలయాలను కట్టబెట్టారు. అందుకు 50 వేల నుంచి లక్షన్నర వరకు మూటగట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల సాధారణ బదిలీలను దాదాపు ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచే పూర్తి చేశారు. కానీ ’దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించని’ చందాన దేవాదాయశాఖ కమిషనరే స్వయంగా పోస్టింగ్ ఇచ్చినా జిల్లాకు వచ్చేసరికి సొమ్ములు ఇచ్చుకోక తప్పింది కాదని కొందరు ఉద్యోగులు గొల్లుమంటున్నారు. అప్పుడేదో అడిగారంటే అర్థం ఉంది, తమకు కూడా మంచి జరిగిందని ఇచ్చుకున్నాం, కానీ ఇప్పుడు రిటైర్మెంటప్పుడు కూడా బహుమతిలంటూ విడిచిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రపురంలో ఇదే అధికారి లక్షలు మెక్కేసి పలు దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లకు చెందిన పది మందికి అడ్డగోలుగా పే స్కేల్ కూడా పెంచారని దేవాదాయశాఖ కోడైకూస్తోంది. అడిగినంత ఇవ్వాల్సిందే... ఈ క్రమంలోనే పలు దేవాలయాలు, సత్రాలకు సంబంధించిన ఈవోలు దగ్గర అయినకాడికి దోచుకుంటున్నారు. తన పరిధిలో లేని దేవాలయాలకు చెందిన ఈవోలను కూడా ఆయన వదలడం లేదు. ఆలయాల ఫైల్పై సంతకం పెట్టాలన్న అధికారి రూ.20 నుంచి రూ.30 వేలుకు తక్కువ కాకుండా ఇండెంట్ పెడుతున్నారు. ఇందుకు పలువురు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతోపాటు, సూపరిటండెంట్లను దళారులుగా మార్చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోను ఆ అధికారి అజమాయిషీలో సుమారు రెండు వేలకు పైగా దేవాలయాలు, సత్రాలున్నాయి. తాను ఎలాగో రిటైరవుతున్నానని మళ్లీ తనకు ఇచ్చేది ఏమీ లేదంటూ ఈవోలతో ఆయనే స్వయంగా బేరసారాలు సాగిస్తూ లక్షలు నొక్కేస్తున్నారు. నగదు రూపంలో కాకుంటే బహమతులుగానైనా ఇవ్వండని సొంత హుండీ కూడా తెరిచాడు. ఇటీవల కాకినాడలో ప్రముఖ దేవస్థానం ఈవోకు ఫో¯ŒS చేసిన తనకు బహుమతి ఇవ్వాలన్నారు. చిన్నా,చితకా బహుమతి అనుకుని అడగగానే ఆ ఈవో అంగీకరించారు. ఆయన కోరిన బహుమతి, దాని ఖరీదు చూసి ఆ ఈబోకు దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. ఇంతకీ ఆ బహుమతి ఏమటనుకుంటున్నారు. శామ్సంగ్ లేటెస్ట్ వెర్ష¯ŒS గెలాక్సీ ఎడ్్జ–7పై ఆశపడ్డాడు ఆ అవినీతి తిమింగలం. అంత బరువు తాను మోయలేనని చెప్పడంతో మరో ఈఓతో జతకలిసి ఇవ్వక తప్పింది కాదు. బడ్జెట్ ఫైల్ వస్తే పండగే... ఇటీవల అదనపు బడ్జెట్ కోసం వచ్చిన ఈవోల నుంచి భారీగా డబ్బులు దండుకున్నారు. కావాలంటే బడ్జెట్ పెంచుకోవాలని ఆ అధికారి ఉచిత సలహా కూడా ఇస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక ఆలయ కార్యనిర్వాహణాధికారి అదనపు బడ్జెట్ కోసం ఇటీవల సంబంధితాధికారి వద్దకు వచ్చాడు. రూ.రెండు లక్షలు బడ్జెట్ అనుమతికి రూ.20 వేలు డిమాండ్ చేయడంతో కంగుతినడం ఆ ఈఓ వంతైంది. అంత ఇచ్చుకోలేమని బేరసారాలు అడి చివరకు రూ.15 వేలకు ఖాయం చేసుకున్నాకే రూ.2 లక్షల బడ్జెట్కు గ్రీ¯ŒS సిగ్నల్ ఇచ్చారని దేవాదాయశాఖ వర్గాల ద్వారా తెలిసింది.అందినంతా దండేసుకుని మళ్లీ రిటైర్మెంట్ ఫంక్ష¯ŒSకు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామని అధికారులు, ఉద్యోగులు ముఖం చాటేస్తున్నారు.ఆ అధికారి నిర్వాకం దేవాదయశాఖలో హాట్టాపిక్గా మారింది. -
శిశు సంక్షేమ శాఖకు కొత్తరూపు
విభజనలో నాలుగు జిల్లాలకు 18 ప్రాజెక్టులు మరికొన్ని అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు కొన్ని కేంద్రాలు పక్క జిల్లాలకు.. డైరెక్టరేట్కు చేరిన ఉద్యోగుల జాబితా హన్మకొండ చౌరస్తా : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భాగంగా ఉద్యోగులు .. ప్రాజెక్టులు.. సెంటర్ల.. విభజన ప్రక్రియపై మహిళా, శిశు సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రస్తుతం 18 ప్రాజెక్టులు కొనసాగుతుండగా.. కొత్తగా ఏర్పాటుకానున్న వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు ప్రాజెక్టులు, సెంటర్ల పంపకాల నివేదికను జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు కార్యాలయం ఇటీవల ప్రభుత్వానికి అందజేసింది. తాజాగా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జాబితా, కంప్యూటర్లు, వాహనాలు, ఇతర వివరాలను డైరెక్టరేట్కు పంపించేందుకు నివేదికను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వరంగల్ పీడీ పరిధిలో.. ప్రస్తుతం వరంగల్ పీడీ పరిధిలోని 18 ప్రాజెక్టుల్లో 4196 అంగన్వాడీ ప్రధాన సెంటర్లు, 327 మినీ సెంటర్లు కొనసాగుతున్నాయి. సీడీపీఓల పర్యవేక్షణలో అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. అయితే జిల్లాల విభజనలో భాగంగా కొన్ని అంగన్వాడీ సెంటర్లు సిద్ధిపేట, యాదాద్రి జిల్లాల్లోకి వెళ్తుండగా.. కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలోని కొన్ని అంగన్వాడీ సెంటర్లు కొత్త జి ల్లాల్లో విలీనమవుతున్నాయి. దీంతో శిశు సంక్షేమ శాఖ భౌగోళిక స్వరూపం కొత్త రూపాన్ని సంతరించుకుంది. కాగా, కొత్తగా ఏర్పడనున్న నాలుగు జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్ల నియామకంలో ప్రస్తుతం సీడీపీఓలుగా కొనసాగుతున్న వారిలో సీనియారిటీ ప్రాతిపదికన ఇన్చార్జి పీడీ లు నియమించే అవకాశం ఉన్నట్లు శాఖలోని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం పీడీ ఆఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఎవరిని ఏ జిల్లాకు పంపించాలనే అంశంపై డైరెక్టరేట్దే తుది నిర్ణయమని తెలుస్తుంది. ఈ శాఖ ద్వారా బాలింత, గర్భిణులు, చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం, ఇతర సంక్షేమ పథకాలకు అంతరాయం కలుగకుండా విభజన ఉంటుందని పీడీ ఆఫీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల వివరాలివీ.. చేర్యాల ప్రాజెక్టు : దీని పరిధిలో ప్రస్తుతం చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట మండలాలు కొనసాగుతున్నాయి. విభజనలో చేర్యాల మండలంలోని 79 అంగన్వాడీ కేంద్రాలు, మద్దూరు మండలంలోని 52 మెయిన్, 2 మినీ కేంద్రాలు సిద్ధిపేట జిల్లాలో విలీనమవుతుం డగా, బచ్చన్నపేట మండలంలో నిర్వహిస్తున్న 50 అంగన్వాడీ కేంద్రాలు యాదాద్రి జిల్లాలోకి వెళ్లనున్నాయి. నర్మెట మండలంలోని 72 మె యిన్, 7 మినీ సెంటర్లు హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి. చిట్యాల : ఈ ప్రాజెక్టు పరిధిలో చిట్యాల మండలంలోని 95 మెయిన్, 3 మినీ కేంద్రాలు, మొగుళ్లపల్లి మండలంలోని 66 మెయిన్, 1 మినీ, భూపాలపల్లి మండలంలోని 85 మెయిన్, 26 మినీ కేంద్రాలు భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి. వీటితోపాటు ప్రస్తుతం కరీంనగర్లో కొనసాగుతున్న మలహల్రావు, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం మండలం భూపాలపల్లి జిల్లాలో విలీనం కానున్న తరుణంలో ఆయా మండలాల పరిధిలోని అంగన్వాడీ సెంటర్లు చిట్యాల ప్రాజెక్టులోనే కొనసాగనున్నాయి. ఏటూరునాగారం : ఈ ప్రాజెక్టు పరిధిలోని ఏటూరునాగారం మండలంలోని 96 మెయిన్, 6 మినీ కేంద్రాలు, తాడ్వాయి మండలంలోని 68 మెయిన్, 2 మినీ కేంద్రాలు భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి. డోర్నకల్ : ఈ ప్రాజెక్టు పరిధిలోని డోర్నకల్ మండలంలోని 97 మెయిన్, 11 మినీ కేంద్రాలు కురవి మండలంలోని 110 మెయిన్, 12 మినీ సెంటర్లు మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతుండగా.. కొత్తగా ఖమ్మం జి ల్లాలోని గార్ల మండలంలోని సెంటర్లు ఇదే ప్రాజెక్టు పరి ధిలో మహబూబాబాద్ జిల్లాలో విలీనం కానున్నాయి. గూడూరు : ఈ ప్రాజెక్టులోని గూడూరు మండలంలోని 106 మెయిన్, 20 మినీ కేంద్రాలు, కొత్తగూడ మండలంలోని 82 కేంద్రాలు మహబూబాబాద్జిల్లాలో విలీనంకాగా..ఖానాపురం మండలంలో కొనసాగుతున్న43 మె యిన్, 2మినీ కేంద్రాలు వరంగల్ జిల్లాలో కొనసాగనున్నాయి. హన్మకొండ : ఈ ప్రాజెక్టులోని హన్మకొండ మండలంలోని 77 మెయిన్, 4 మినీ కేంద్రాలు నూతనంగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలో విలీనం కానుం డగా.. ప్రస్తుతం ఇదే ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న హసన్పర్తి మండలంలోని 76 మెయిన్, 2 మినీ సెంటర్లు ఆత్మకూరు మం డలంలోని 78 మెయిన్, 3 మినీ అంగన్వాడీ సెంటర్లు, గీసుగొండ పరిధిలోని 68 మెయిన్, 2 మినీ సెంటర్లు వరంగల్ జిల్లాలో కొనసాగనున్నాయి. వీటికి తోడు కొత్తగా హన్మకొండ ప్రాజెక్టులో హుజురాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల పరిధిలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు విలీనం కానున్నాయి. జనగామ : దీని పరిధిలోని జనగామ మండలంలోని 75 మెయిన్, 4 మినీ కేంద్రాలు లింగాలఘణపురంలోని 48 మెయిన్, 4 మినీ సెంటర్లు యాదాద్రి జిల్లాలోకి, రఘునాథపల్లి మండలంలోని 74 మెయిన్, 5 మినీ కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగేలా అధికారులు ప్రతిపాదించారు. కొడకండ్ల : ఈ ప్రాజెక్టు పరిధిలోని కొడకండ్ల మండలంలోని 69 మెయిన్, 6 మినీ సెంటర్లు, పాలకుర్తిలోని 63 మెయిన్, 8 మినీ సెంటర్లు, దేవరుప్పల మండలంలోని 62 మెయిన్, 1 మినీ సెంటర్ హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి. మహబూబాబాద్ : కొత్త జిల్లాగా ఏర్పాటుకానున్న మహబూబాబాద్ ప్రాజెక్టు పరిధిలోని మహబూబాబాద్ మండలంలోని 160 మెయిన్, 7 మినీ సెంటర్లు, నెల్లికుదురులోని108 మెయిన్, 12 మినీ సెంటర్లు, కేసముద్రంలోని 93 మెయిన్ 9 మినీ సెంటర్లు ఈ జిల్లాలోనే కొనసాగునున్నాయి. మంగపేట : మంగపేట ప్రాజెక్టులోని మంగపేట మండలంలో కొనసాగుతున్న 103 మెయిన్,1 మినీ కేంద్రాలను భూపాలపల్లి జిల్లాలో విలీనం చేయనున్నారు. మరిపెడ : ఈ ప్రాజెక్టులోని మరిపెడ మండలంలోని 174 మెయిన్ 17 మినీ సెంటర్లు, నర్సింహులపేటలోని 95 మెయిన్, 9 మినీ సెంటర్లు, తొర్రూర్ మండల పరిధిలోని 94 మెయిన్, 14 మినీ కేంద్రాలు మహబూబాబాద్ జిల్లాలో కొనసాగనున్నాయి. ములుగు : ఈ ప్రాజెక్టు పరిధిలోని ములుగు మండలంలోని 76 మెయిన్, 18 మినీ అంగన్వాడీ సెంటర్లు, గణపురం మండలంలోని 41 మెయిన్, 10 మినీ సెంటర్లు, గోవిందరావుపేట మండలంలోని 48 మెయిన్, 6 మినీ కేంద్రాలు, వెంకటాపూర్ మండలంలోని 47 మెయిన్, 11 మినీ కేంద్రాలను భూపాలపల్లి జిల్లాలో కొనసాగేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నర్సంపేట : ఈ ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట మండలంలోని 56 మెయిన్,1 మినీ కేంద్రాలను, నల్లబెల్లి మండలంలోని 55 మెయిన్, 2 మినీ కేంద్రాలను, దుగ్గొండిలోని 48 మెయిన్, 1 మినీ కేంద్రాన్ని, చెన్నారావుపేట మండలంలోని 74 మెయిన్, 3 మినీ కేంద్రాలను, నెక్కొండలోని 55 మెయిన్, 2 మినీ కేంద్రాలను వరంగల్ జిల్లాలో కలుపనున్నారు. పరకాల : దీని పరిధిలోని పరకాల మండలంలోని 100– 1 సెంటర్లు, శాయంపేటలోని 58 అంగన్వాడీ సెంటర్ల ను వరంగల్ జిల్లాలో,రేగొండ మండలంలోని 80 మెయి న్,1మినీకేంద్రం భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి. స్టేషన్ఘన్పూర్ : ఈ ప్రాజెక్టులోని స్టేషన్ఘన్పూర్ మండలంలోని 107 మెయిన్, 7 మినీ కేంద్రాలు, ధర్మసాగర్లోని 94–1 కేంద్రాలు, జఫర్గడ్ మండలంలోని 70 కేంద్రాలతో పాటు వేలేరు, చిల్పూరు మండల కేంద్రాల పరిధిలో కొనసాగే అంగన్వాడీ సెంటర్లను హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి. వరంగల్ అర్బన్–1 : ఈ పాజెక్టు పరిధిలోని వరంగల్ మున్సిపల్లోని 100 కేంద్రాలను వరంగల్ జిల్లాలో, హన్మకొండ మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగుతున్న 71 కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగున్నాయి. కొత్తగా వరంగల్ జిల్లాలో ఖిలావరంగల్ మండల కేంద్రాలు, హన్మకొండ జిల్లాలో కాజీపేట మండలంలోని అంగన్వాడీ సెంటర్లు విలీనం కానున్నాయి. వరంగల్అర్బన్–2 : ఈ ప్రాజెక్టులోని వరంగల్ మున్సిపల్లో ఉన్న 100 సెంటర్లు వరంగల్ జిల్లాలో, హన్మకొండ మున్సిపల్లోని 60 సెంటర్లు హన్మకొండ జిల్లాలో కొనసాగుతాయి. వర్ధన్నపేట : వర్ధన్నపేట ప్రాజెక్టులోని వర్ధన్నపేట మండలంలోని 73 మెయిన్, 12 మినీ సెంటర్లు, సంగెం మండలంలోని 55 మెయిన్, 8 మినీ సెంటర్లు, పర్వతగిరి మండలంలోని 52 మెయిన్, 15 మినీ కేంద్రాలు వరంగల్ జిల్లాలో కొనసాగుతుండగా.. రాయపర్తి మండలంలోని 58 మెయిన్, 28 మినీ కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి. -
రేపు బీసీ సంక్షేమ శాఖలో విభజన సమావేశం
హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగుల పంపిణీపై హైదరాబాద్లోని శాఖ కమిషనర్ కార్యాలయంలో శనివారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా నుంచి డీడీ నర్సింహస్వామి, డీబీసీడబ్ల్యూవో హృషీకేష్రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వివరాలు, జిల్లాలకు కేటాయింపు తదితర విషయాలపై స్పష్టత రానుంది. -
ఆది నుంచీ గందరగోళం!
అయోమయంలో అకడమిక్ కోఆర్డినేటర్ పోస్టులు ఇంటర్వూలు ముగిసినా వెలువడని ఫలితాలు రాయవరం : విద్యాశాఖలో పర్యవేక్షణ పెంచేందుకు ప్రభుత్వం మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ పోస్టులను సృష్టిం చింది. మండలానికి మూడు పోస్టులు వంతున ఎంపిక చేసేందుకు విద్యాశా ఖ చర్యలు చేపట్టింది. అందులో భా గంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఇం టర్వూలు కూడా చేసింది. ఇది జరిగి నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఫలితా లు మాత్రం ప్రకటించలేదు. మండలానికి మూడు పోస్టులు ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్కు ఒక్కొక్క మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ పోస్టులకు ప్రతి మండలంలో ఉ పాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. తొలుత అర్హత వయస్సు 40 ఏళ్ల లోపు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వారిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. అనంతరం నిబంధనలు సడలించి స్కూల్ అసిస్టెంట్తో పాటు ఎస్జీటీ క్యాడర్ వారిని, 45 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వూలు జిల్లాలో 64 మండలాలకు ఒక్కొక్క మండలానికి ముగ్గురు వంతున 192 మందిని ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విధంగా జిల్లాలో సుమారు 320 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. అయితే ఒక్కో మండలానికి మూడు పోస్టులు అవసరం.కొన్ని మండలాల్లో కేవలం ఒక్కరే దరఖాస్తు చేయగా, మరి కొన్ని మండలాల్లో 10 మంది వరకు దరఖాస్తు చేశారు. గత నెల 26న రాజమండ్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు 75 మార్కులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. గత నెల 28 నుంచి 30వ తేదీ వరకు డివిజన్ల వారీగా ఉపాధ్యాయులకు ఇంటర్వూ్యలు నిర్వహిం చారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలోఇంటర్వూ్యలు చేశారు. నెలరోజులు గడుస్తున్నా... ఇంటర్వూ్య అనంతరం రెండు రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తార ని ఆశించారు. అయితే నేటి వరకు ఫలితాలు ప్రకటించక పోవడంతో అసలు మండల అకడమిక్ ఫెర్మార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టులు ఎంపిక ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఇప్పుడు విద్యాశాఖ మిన్నకుండి పోవడం వెనుక ఆంతర్యం ఏమిటోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను డెప్యుటేషన్పై నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వెంటనే విధుల్లోకి రావాల్సిందిగా ఆదేశించడంతో 60 మంది వరకు ఉపాధ్యాయులు తమ విధుల్లో చేరారు. దీంతో ఎంఈపీఎస్లుగా ఉపాధ్యాయులను నియమిస్తే ఎటువంటి అభ్యంతరాలు వస్తాయోనన్న ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. మండల అకడమిక్ కోఆర్డినేటర్లుగా ఉపాధ్యాయుల నియామకంపై సరైన విధివిధానాలు రూపొందించిన తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారం వినపడుతోంది. ఆదేశాలురావాలి మండల అకడమిక్ ఫెర్ఫార్మెన్స్ కోఆర్డినేటర్ పోస్టుల ఎంపికపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఆదేశాలు వచ్చిన వెంటనే ఫలితాలు ప్రకటించి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఆర్.నరసింహారావు, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
ప్రైవేటు విద్యుత్ వదులుకోవచ్చు
► వీలు కాదంటూ ప్రభుత్వాన్ని, మంత్రిని తప్పుదారి పట్టించిన అధికారులు ► వదులుకుంటే మళ్లీ తీసుకోవడం కుదరదన్న మంత్రి ►కానీ కొనుగోళ్లకు రోజువారీగానే షెడ్యూలింగ్ ► కావాల్సిన విద్యుత్ ఎంతో ముందు రోజు తెలిపితే చాలు ► ఎలాంటి పెనాల్టీ లేకుండా 15 శాతం వదులుకోవచ్చు ► మిగిలిన 85శాతంలోనూ వదులుకున్న మొత్తంపైనే 20 శాతం పెనాల్టీ ►ఈ జరిమానా కూడా ఏడాది సగటున 85 శాతానికి తగ్గితేనే.. ► తర్వాతిరోజు కోరితే ఒప్పందం మేరకు మొత్తం కరెంటు ఇవ్వాల్సిందే ఓ ప్రైవేటు సంస్థ పీపీఏల పరిశీలనలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: అవసరం లేని సమయంలో ప్రైవేటు విద్యుత్ను వదిలేసుకోవచ్చు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ప్రైవేటు కంపెనీల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని (పీపీఏల్లోని) నిబంధనలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) కుదుర్చుకున్న స్వల్పకాలిక పీపీఏను పరిశీలించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. అందులోని నిబంధనలు సైతం విద్యుత్ను వదులుకోవచ్చన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో ‘ప్రైవేటు’ కొనుగోళ్లను కొనసాగించడానికి వీలుగా తరచూ జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి బ్యాక్డౌన్ చేస్తున్నారు. దీంతో జెన్కో ఉత్పత్తి సామర్థ్యం గతంలో ఎన్నడూ లేనివిధంగా 73.21 శాతానికి పతనమైంది. దీనివల్ల జెన్కో రూ.800 కోట్ల ఆదాయాన్ని నష్టపోగా.. ప్రైవేటు విద్యుత్ కారణంగా ప్రజలపై రూ.600 కోట్ల అనవసర భారం పడింది. ఈ అంశాన్ని వెలుగులోకి తెస్తూ.. ప్రైవేటు కరెంటుపై అంత ప్రేమెందుకు.. అయ్యో పాపం జెన్కో శీర్షికన సాక్షి మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి... 15 శాతానికి మించి ప్రైవేటు విద్యుత్ను వదులుకోలేమని, అంతకు మించాల్సి వస్తే జెన్కో విద్యుత్నే వదులుకోక తప్పదని వివరణ ఇచ్చారు. ఓ రోజు డిమాండ్ తగ్గిందని ప్రైవేటు విద్యుత్ను వదులుకుంటే మరుసటి రోజు తీసుకోవడం వీలుకాదని సైతం పేర్కొన్నారు. కానీ ఇవన్నీ సత్యదూరమని పీపీఏల్లో ఉండే పెనాల్టీ క్లాజ్ నిబంధనలు చెబుతున్నాయి. దీనిని బట్టి ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ట్రాన్స్కో, డిస్కంల ఉన్నతాధికారులు మంత్రిని కూడా తప్పుదోవ పట్టించారని స్పష్టమవుతోంది. ఒక రోజు ముందు కూడా వదులుకోవచ్చు తర్వాతి రోజు ఎంత విద్యుత్ అవసరమో ఒక రోజు ముందే బెంగళూరులోని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్సారెల్డీసీ)కు డిస్కంలు తెలియజేస్తాయి. దీనినే షెడ్యూలింగ్ అంటారు. అవసరమైనప్పుడు పూర్తిస్థాయిలో తీసుకోవడం, అవసరం లేని రోజు వదులుకోవడానికి షెడ్యూలింగ్ చేస్తుంటారు. ఒప్పందం ప్రకారం పెనాల్టీ లేకుండా 15 శాతం ప్రైవేటు విద్యుత్ను వదులుకోవచ్చు. వినియోగం తగ్గినప్పుడు ఓ రోజు ముందే నోటీసిచ్చి అంతకు మించి కూడా విద్యుత్ను వదులుకోవచ్చు. 15శాతానికి మించి అదనంగా వదులుకున్న విద్యుత్ ధరలో 20శాతాన్ని పెనాల్టీగా చెల్లిస్తే సరిపోతుంది. అసలు రోజువారీగా తగ్గించుకున్నా వార్షిక సగటు 85 శాతానికి తగ్గితేనే 20 శాతం పెనాల్టీ వర్తిస్తుంది. ఇలా ఓ రోజు తగ్గించుకున్నా మరుసటి రోజు అవసరమైన మొత్తం విద్యుత్ను ప్రైవేటు కంపెనీ సరఫరా చేయాల్సిందే. ఒకవేళ విద్యుత్ సరఫరాకు నిరాకరించి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే... ప్రైవేటు కంపెనీల నుంచే యూనిట్కు ఏకంగా రూ.10 చొప్పున డిస్కంలు నష్టపరిహారాన్ని రాబట్టవచ్చు. ఇక అత్యవసరంగా సైతం విద్యుత్ను వదులుకునే అవకాశం కూడా ఉంది. ముందస్తు నోటీసులో పేర్కొన్న దానికన్నా అధికంగా వదులుకున్న విద్యుత్లో 10 శాతం విద్యుత్ ధరను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. -
మద్యం విక్రయాలపై డేగకన్ను
ఒంగోలు టౌన్, న్యూస్లైన్ : వరుస ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్శాఖ నిఘా ముమ్మరం చేసింది. జిల్లా నలుమూలలా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒకేసారి మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నికల నియమావళితో పాటు అదే సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండటంతో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పాలకుల కనుసన్నల్లో నడిచిన మద్యం షాపులు, బార్లు వాటికి అనుసంధానంగా నడిచే బెల్ట్షాపులపై ఇప్పుడు అధికారులు చర్యలకు పూనుకుంటున్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో పాటు అక్రమ మద్యం తరలింపు, ఎన్డీపీ మద్యం వచ్చే దారులపై నిఘా ఉంచారు. ఎన్నికలనగానే ప్రధానంగా చర్చకు వచ్చేది మద్యం వ్యవహారమే. మద్యం లేనిదే ఏ పార్టీ కార్యకర్తా ప్రచారానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. అలాంటి పరిస్థితుల్లో గతేడాది ఎంతైతే మద్యం విక్రయించారో ఇప్పుడు కూడా అంతే మద్యం విక్రయించాలని ఎక్సైజ్శాఖ నిబంధన మద్యం వ్యాపారుల్లో గుబులు రేకెత్తిస్తోంది. సాధారణంగా నెల మొత్తం మీద వినియోగించే మద్యం ప్రస్తుత పరిస్థితుల్లో వారానికి కూడా సరిపోదంటే అతిశయోక్తికాదు. శాఖల మధ్య సమన్వయం ఎన్నికల్లో ఓటుకు నోటు కార్యక్రమాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు ఏ విధంగా అరికట్టాలో.. మద్యం ప్రవాహాన్ని కూడా పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులు యూనిట్గా ఏర్పడి అరికట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జిల్లాలో మొత్తం 278 మద్యం షాపులు, 41 బార్లు ఉన్నాయి. ఇక బెల్ట్షాపులు సరేసరి. హైవే, రహదారుల వెంట నడుస్తున్న దాబాల్లో ఎక్కడా మద్యం విక్రయించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మద్యం షాపుల యజమానులపై ఫిర్యాదు చేసేందుకు అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను 08592-233182 నంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు 24 గంటలూ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. మద్యం అక్రమ రవాణాకు చెక్ అక్రమ మద్యం, ఎన్డీపీ మద్యం, కల్తీ మద్యం, బెల్లం ఊట, నాటుసారాను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్శాఖ 8 చెక్ పోస్టులను ఏర్పాట చేసింది. అవి 5వ నంబర్ జాతీయ రహ దారిపై టంగుటూరు టోల్ప్లాజా వద్ద, ఒంగోలు-కర్నూలు హైవేలో చీమకుర్తి వద్ద, అద్దంకి-హైదరాబాద్ హైవే బొల్లాపల్లి టోల్ప్లాజా వద్ద చెక్పోస్టులు రోజుమార్చి రోజు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దోర్నాల, గిద్దలూరు సమీపంలోని వైఎస్సార్ జిల్లా సరిహద్దు ఆదిమూర్తిపల్లి, కర్నూలు జిల్లా సరిహద్దు దిగువమెట్ట, పామూరు ప్రాంతాల్లో కూడా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు రెండు మొబైల్ పార్టీలను నియమించారు. రైళ్లలో మద్యం తరలింపును అరికట్టేందుకు ట్రైన్ చెకింగ్ టీమ్ను కూడా నియమించారు. వీటికి తోడుగా ఇంటెలిజెన్స్ డిటెక్షన్ టీమ్ను రంగంలోకి దించారు. షాపుల్లో మద్యాన్ని ఎంఆర్పీకే విక్రయించాలని, అలా కాకుండా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా షాపులపై కేసులు నమోదు చేసి యజమానులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఎక్సైజ్శాఖ అధికారులకు వచ్చాయి. అధికారులు కఠినంగా ఉండాలి : ఎం.భాస్కరరావు ఈఎస్ ఎన్నికల నియమావళి అమలులో ఎక్సైజ్ అధికారులు కఠినంగా ఉండాలి. నిఘా ముమ్మరం చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. మద్యం షాపులు సమయపాలన పాటించాలి. మద్యం అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలి. జిల్లాలో ఇప్పటికే 143 బైండోవర్ కేసులు నమోదు చేశాం. -
పునర్విభజన విభాగం ఉండాలి: మహంతి
బాధ్యతలు సంతృప్తినిచ్చాయన్న సీఎస్ పొడిగింపు కోరబోనని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఒకట్రెండు కమిటీలు పని చేయడం కంటే పునర్విభజనకు ప్రత్యేకంగా ఒక విభాగముంటే మేలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి అభిప్రాయపడ్డారు. ‘‘ఎందుకంటే విభజనలో విస్తృతమైన, చాలా రోజులపాటు పని అవసరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మూడు నెలలు పడితే మరికొన్నింటికి ఏడాది దాకా పడుతుంది. అందుకే ప్రత్యేక విభాగంతో పనులు కొంత సులువవుతాయి’’ అని చెప్పారు.విభజనల పనుల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో సమీక్షకు హాజరైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహించిన కాలం నాకు సంతృప్తినిచ్చింది. విభజన నేపథ్యంలో పలు రకాల ఒత్తిడి వాతావరణంలోనూ మచ్చ లేకుండా పనిచేశాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్గా చేసిన కాలంలోనే గాక పరిపాలనాపరంగా ప్రభుత్వ లబ్ధి ప్రజలకు సులువైన పద్ధతుల్లో చేరేందుకు చర్యలు తీసుకున్నాం. మీసేవలో సర్వీసులను 300కు పెంచాం. నేను సీఎస్గా ఉండగా నాలుగు తుపాన్లు ఎదుర్కొన్నాం. ఉత్తరాఖండ్ బీభత్సంలో మనవాళ్లు చిక్కుకున్నారు. రాష్ట్రంలో అనేక కష్టాలు. ఉద్యమాలతో ఉద్యోగులు విధులకు రాని, ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి. వీటన్నింటినీ అధిగమించగలిగాం. సహచర ఐఏఎస్ అధికారుల సహకారం మరువలేనిది. నిజాయితీగా ఉంటే ఏ రంగంలోనైనా జాతికి సేవలందించవచ్చు. రిటైరయ్యాక పారితోషికం ఆశించకుండా ఏవైనా గౌరవ బాధ్యతలు స్వీకరిస్తా. పాలన నిర్వహణపై పాఠాలు బోధించాలని ఉంది’’ అని చెప్పారు. మహంతి పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఆయన 1979 ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. స్వరాష్ట్రం ఒడిశా. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. తొలుత రాష్ట్రంలో పనిచేసి 1993లో కేంద్ర సర్వీసుకు వెళ్లారు. 1999 జనవరిలో మళ్లీ రాష్ట్ర సర్వీసులో చేరారు. 2006లో మళ్లీ కేంద్ర సర్వీసుకు వెళ్లి 2013 జనవరి 31న రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వచ్చారు. సాధారణ, భూ పరిపాలన శాఖల్లో పని చేసి 2013 ఏప్రిల్ 30న సీఎస్ అయ్యారు. మహంతి కూతురు శ్వేత 2009లో సివిల్స్లో రెండో ర్యాంకు సాధించారు. -
బీసీ సంక్షేమాధికారి నాగరాణి బదిలీ
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధికారిణి ఆర్.వి.నాగరాణి బదిలీ అయ్యారు. ఆమెను వైఎస్ఆర్(కడప)జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. పలు క్యాడర్లలో పని చేసిన నాగరాణి 2011 జూలై 25న జిల్లా బీసీ సంక్షేమాధికారిగా నియమితులయ్యారు. అప్పటినుంచి ఈమె పైనా, ఆ శాఖపైనా వివాదాలు, ఆరోపణలు ఉన్నాయి. తన చాంబర్కు ఏసీ పెట్టించుకోవడం, పిల్లల బట్టలు కుట్టే ఏజెన్సీలతో వివాదాలు, సిబ్బంది బదిలీలు, ఇంక్రిమెంట్లు తదితర అంశాల్లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. లోకాయుక్తలోనూ కేసులు విచారణలో ఉన్నాయి. ఈనెల 23న మళ్లీ లోకాయుక్త విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసుల విచారణకు వీలుగా ముందుగా ఆమెను బదిలీ చేయాలని లోకాయుక్త ఆదేశించడంతో బదిలీ తప్పనిసరి అయ్యింది, ఇదిలా ఉండగా బదిలీని నిలుపుదల చేసుకొనేందుకు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రిని, ఆయన బంధువును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అయితే నాగరాణిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
కట్టబెట్టేదిఎవరికో...
=రూ .72 లక్షల విలువైన పనుల టెండర్లు రద్దు =చక్రం తిప్పిన ఐటీడీఏ ఇంజినీర్లు =కలెక్టర్ను తప్పుదోవ పట్టించేలా ఎత్తుగడ =డిపార్ట్మెంట్ పేరిట అనుంగు కాంట్రాక్టర్కు అప్పగించే యత్నం మేడారం మహా జాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ... అధికారులు తమ తమ ఆలోచనలకు పదునుపెట్టారు. వనదేవతల సందర్శనార్థం వచ్చే కోట్లాది మంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకని అనుకుంటే మాత్రం పొరపాటే. తమ దగ్గరివారికి పనులు కట్టబెట్టి.. జేబులు నింపుకునేందుకు వారు కొత్త ఎత్తులు వేశారు. ఇన్ఫిల్టరేషన్ పనుల్లో ఏకంగా కలెక్టర్ను తప్పుదోవ పట్టించి... టెండర్ల పద్ధతికి స్వస్తి పలికించి... దోపిడీకి దారి సుగమం చేసుకున్నారు. సాక్షి, హన్మకొండ: గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యులర్ ఎస్ఈ లేకపోవడంతో... ఐటీడీఏ ఇంజినీర్ల హవా నడుస్తోంది. పలువురు అధికారులు చక్రం తిప్పి.. డిపార్ట్మెంట్ పేరిట తమ అనుంగు కాంట్రాక్టర్కు ఇన్ఫిల్టరేషన్ పనులు అప్పగించేందుకు తెగబడ్డారు. వాటాల కోసం సర్కారు ఖజానాకు ఎసరు తెచ్చారు. టెండర్ల దాఖలు చివరి రోజున రద్దు చేసినట్లు ప్రకటించి తమ చాణక్యతను చాటుకున్నారు. మహా జాతర సందర్భంగా రెడ్డిగూడెం, చిలుకలగుట్ట వద్ద ఇన్ఫిల్టరేషన్ వెల్, పైపులైన్ నిర్మాణాలకు సంబంధించి ఒక్కో పనికి రూ.36 లక్షల వంతున గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన టెండర్లను ఆన్లైన్లో ఆహ్వానించారు. ఈ పనులకు టెండర్లు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2014 జనవరి 2 అని కూడా ప్రకటించారు. ఈ మేరకు పనులు దక్కించుకునేందుకు చాలా మంది కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. కానీ... దాఖలు చివరి రోజు గురువారం చివరి నిమిషంలో ఈ టెండర్లు రద్దయినట్లు ఆన్లైన్లో ఉత్తర్వులు రావడంతో కాంట్రాక్టర్లు షాక్ తిన్నారు. వాస్తవానికి ఈ టెండర్లు రద్దు చేస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 27వ తేదీనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ అధికారులు వెంటనే ధ్రువీకరించకుండా... టెండర్ దాఖలుకు చివరి రోజున వెల్లడించడాన్ని బట్టి వారి పన్నాగం ఏంటో ఇట్టే గ్రహించవచ్చు. తెరవెనుక ఒప్పందం తమకు అనుకూలంగా ఉండే ఓ కాంట్రాక్టర్తో ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ముందస్తుగా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సదరు కాంట్రాక్టర్తో పని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పైపులను సైతం అధికారులే దగ్గరుండి తెప్పించారు. అంతా తమ కనుసన్నల్లోనే జరుగుతోందని వారు అనుకుంటుండగా... హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ చీఫ్ ఇంజినీర్ పర్యవేక్షణలో గత ఏడాది డిసెంబర్ 26న ఈ పనులకు ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించారు. దీంతో ఏటూరునాగారం ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులకు దిక్కుతోచకుండా పోయింది. వెంటనే రంగంలోకి దిగి చ క్రం తిప్పారు. ఇప్పటికే ఐటీడీఏ నుంచి ఆలస్యంగా నిధులు విడుదలయ్యాయి.... ఇప్పుడు టెండర్లు అంటే మరింత ఆలస్యమవుతుంది.... దాని వల్ల జాతరకు ముందుగా పనులు పూర్తి కావనే ఉద్దేశంతో ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖ తరఫున పనులు ప్రారంభించామంటూ కలెక్టర్ను తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో టెండర్లు పిలిచిన మరుసటి రోజే కలెక్టర్ కిషన్ వాటిని రద్దు చేశారు. అయితే ఈ విషయాన్ని వెంటనే తెలిపితే తమ బండారం బట్టబయలవుతుందని గ్రహించిన అధికారులు మరో ఎత్తుగడ వేశారు. టెండర్ దాఖలు చేసేందుకు చివరి రోజున వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
విశాఖలో సాంఘీక సంక్షేమ శాఖ విద్యార్ధుల సైన్స్ ఫెయిర్