కదం తొక్కిన చింతలపూడి రైతులు | kadamtokkina chintalapudi rytulu | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన చింతలపూడి రైతులు

Published Thu, Nov 10 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

కదం తొక్కిన చింతలపూడి రైతులు

కదం తొక్కిన చింతలపూడి రైతులు

చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథ కం రైతులు గురువారం  కదం తొక్కారు. రైతులకు న్యా యం జరిగే వరకు కాలువ తవ్వకం పనులు అడ్డుకోవాలని తీర్మానించారు.  భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ప్రభుత్వం అవలం బిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి మార్కెట్‌ కమిటీ ఆవరణలో రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన భూ ములు కోల్పోతున్న జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో గురువారం ప్రజా చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సులో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడు తూ సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు జిల్లా అంతా ఒకే తరహా నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఏడాది కాలంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉం టామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజా చైత న్య సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్‌ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నాలుగు రెట్ల పరిహారం అందించాలని కోరారు. 

రైతుల ప్రదర్శన 
మార్కెట్‌ కమిటీ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు రైతులు భారీ ర్యా లీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షుడు అలవాల ఖాదర్‌బాబురెడ్డి,  కార్యదర్శి అంజిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ బొడ్డు వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, సీపీఎం డివిజ¯ŒS కార్యదర్శి ఆర్‌వీఎస్‌ నారాయణ, సీపీఐ, నీటి సంఘం, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement