![రేపు విజయవాడకు కేసీఆర్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51402305964_625x300.jpg.webp?itok=CIndd9gi)
రేపు విజయవాడకు కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం విజయవాడలో కలవనున్నారు. ఉదయం 11:30 గంటలకు బేగంపేట నుంచి విజయవాడ బయలుదేరుతారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. అయుత చండీ యాగానికి చంద్రబాబును, మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.
ఈ నెల 16న శృంగేరి మఠానికి కేసీఆర్ వెళ్లనున్నారు. శృంగేరి మఠాధిపతిని చండీ యాగానికి ఆహ్వనించనున్నారు.