భూరికార్డుల పునఃపరిశీలన | Land records to be re verified | Sakshi
Sakshi News home page

భూరికార్డుల పునఃపరిశీలన

Published Wed, Sep 14 2016 10:57 PM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

భూరికార్డుల పునఃపరిశీలన - Sakshi

భూరికార్డుల పునఃపరిశీలన

 
  • జేసీ ఇంతియాజ్‌ అహ్మద్‌ 
నెల్లూరు(పొగతోట): భూరికార్డులను పునఃపరిశీలించాలని  జాయింట్‌ కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ అహ్మద్‌  రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో బుధవారం ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. గతంలో ఆనక్షరీ 1, 2, 3, 4, 5 ప్రొఫార్మాలో భూరికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు. పరిశీలించిన రికార్డులను సీసీఎల్‌ఏకు పంపించడం జరిగిందన్నారు. పంపించిన రికార్డులను పునఃపరిశీలించమని సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసిందన్నారు. భూములకు సంబంధించిన రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. వారం రోజుల్లో భూ రికార్డు ల పరిశీలన పూర్తి చేసి సీసీఎల్‌ఏకు నివేదిక అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతక ముందు 22(ఏ) రికార్డుల పరిశీలనకు సంబం«ధించి కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ హాల్లో రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో మార్కండేయులు, గూడూరు, నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, ఎంవీ  రమణ, నరసింహన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement