సన్నిధానంకు జీవిత సాఫల్య పురస్కారం
రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రాణహిత కవి, బ్రౌనుమందిరం వ్యవస్థాపకుడు సన్నిధానం నరసింహశర్మ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. సాహితీ, గ్రంథాలయ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నవీన్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్టణంలోని ద్వారకా గ్రంథాలయంలో ఈ పురస్కారం అందించారు. నగర ప్రముఖుడు గణపతిరాజు వెంకటపతిరాజు తన తండ్రి దివంగత గణపతిరాజు అచ్యుత రామరాజు పేరిట ఈæపురస్కారాన్ని సన్నిధానంకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు.