ట్రిపుల్ఈ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
Published Wed, Jul 20 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
రామన్నపాలెం(కొడవలూరు) : ట్రిపుల్ ఈ బ్రాంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెండుగా ఉద్యోగావకాశాలు లభ్యమవుతాయని ఏపీ ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. రామన్నపాలెంలోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం ట్రిపుల్ ఈ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తక్కువనే భావన ఉందన్నారు. దీనికి పక్కనపెట్టాలన్నారు. ప్రతి పరిశ్రమ విద్యాధారమైనందున ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రమేష్బాబు, ట్రì పుల్ ఈ హెచ్ఓడీ రత్నజ్వోతి, ఏఓ ఎస్.వేణుగోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement