కీసరలో వ్యక్తి దారుణ హత్య | man murdered in keesara | Sakshi
Sakshi News home page

కీసరలో వ్యక్తి దారుణ హత్య

Published Fri, Dec 18 2015 12:51 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man murdered in keesara

కీసర: రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కీసర మండలం తిమ్మాయిపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తిమ్మాయిపల్లిలోని శ్రీ బాలాజీ మెటల్ ఇండస్ట్రీస్ యజమాని కృష్ణమోహన్ రావు(45)గా గుర్తించారు. తలపై రాడ్‌తో కొట్టిడం వల్ల చనిపోయినట్లు తెలుస్తుంది. అనంతరం శవాన్ని రోడ్డు పక్కన పడేసి దుండగులు పరారయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement