keesara
-
HYD: ఫుల్లుగా తాగి కారు నడిపి.. చెట్టును ఢీ కొట్టి..
సాక్షి, మేడ్చల్: వాళ్లు మైనర్లు.. పైగా మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర చౌరస్తా నుండి యాధ్గార్ పల్లి వైపు వెళ్తున్న బెలీనో కార్ (TS 10 ES 7428) అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భువేష్ (17 ), తుషార (18) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని అల్వాల్ బొల్లారం ప్రాంతం కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ప్రమాదానికి గురైన కారు నుంచి మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుల్లుగా తాగిన మత్తులో డ్రైవ్ చేసే ప్రమాదానికి వాళ్లు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గాయపడిన పిలిప్స్, రుబిన్లతో పాటు వాళ్లతో ఉన్న యువతిని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
హైదరాబాద్- విజయవాడ రహదారిపై స్తంభించిన రాకపోకలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్-విజయవాడ)అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్వేలోనే ట్రాఫిక్ను పోలీసులు మళ్లిస్తున్నారు. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొందరు వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద ఈ మూడు నదులు కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే సమయం గడుస్తున్నా కొద్ది వరద మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. చదవండి: రెడ్ అలర్ట్.. మరో 24 గంటలు అతి భారీ వర్షాలు -
ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయవంతం
కీసర: స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తే విజయవంతమవుతాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. సోమవారం రాంపల్లిదాయరలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి కమిటీల మహాసభకు హరీశ్రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జన నిర్మాణంతోనే సమాజం నిర్మితమవుతుందని, ఇందుకు బాలవికాస సంస్థ చేపడుతున్న పనులే నిదర్శనమన్నారు. బాలవికాస నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటుచేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఆ స్ఫూర్తితో మిషన్ భగీరథను తెచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ సంస్థ గ్రామాల్లో సేవాగుణం గలవారిని కమిటీలుగా నియమించి వారికి శిక్షణ ఇచ్చి కార్యక్రమాలను నడిపించడం గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, చామకూర మల్లారెడ్డి, బాలవికాస వ్యవస్థాపకుడు ఆండ్రూ జింగ్రాస్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరీరెడ్డి పాల్గొన్నారు. బాల వికాస సంస్థ 23 బ్రాంచీలు ఏర్పాటుచేసి 8 వేల గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి!
సాక్షి, హైదరాబాద్(కీసర): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బొమ్మలరామారం మండలం తూంకుంటకు చెందిన రాధిక అలియాస్ లావణ్య(22)కు పదినెలల క్రితం కీసరకు చెందిన పూండ్రు శేఖర్తో వివాహం జరిగింది. ఆమె 5 నెలల గర్భిణీ కాగా.. ఆమెకు కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఈనెల 16న కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యురాలు చికిత్స చేసి ఇంటికి పంపించారు. నొప్పి తగ్గకపోవడంతో అదే రోజు భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంటనే నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. గాంధీలో పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ పరిస్థితి బాగాలేదని తొలగించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబీకులు ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్ను సైతం ధ్వసం చేశారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. గర్భిణీ అయిన తన భార్యను వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చినప్పుడు పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పలేదని ముందే చెబితే జాగ్రత్త పడేవారమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. చదవండి: (హైదరాబాద్లో కోటి విలువ చేసే వజ్రాభరణాలు చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం) -
చిగురిస్తున్న మెట్రో ఆశలు.. ఔటర్రింగ్రోడ్డు చుట్టూ మెట్రో హారం...
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పలు మార్గాల్లో మెట్రో మార్గం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు పునాదిరాయి పడిన నేపథ్యంలో.. తాజాగా పలు ప్రాంతాల నుంచి మెట్రో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికి అధికార, విపక్ష పార్టీలు, వివిధ వర్గాల వారు మద్దతునిస్తుండడంతో నూతనంగా చేపట్టాల్సిన మెట్రో మార్గాలపై అధ్యయనానికి హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరు మెట్రో పూర్తికి సుమారు రూ.300 కోట్లు అంచనా వ్యయం అవుతుంది. ఈ స్థాయిలో నిధులు వ్యయం చేసే స్థితిలో రాష్ట్ర సర్కారు లేదన్న విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యం, లేదా కేంద్ర సహకారంతో పలు రూట్లలో ప్రాజెక్టులు చేపట్టడం.. తొలుత ప్రైవేటు సంస్థలు చేసే వ్యయంతో పూర్తిచేసి ఆ తర్వాత వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు వడ్డీతో సహా చెల్లించడం (హైబ్రిడ్ యాన్యుటీ ) తదితర విధానాలపై సర్కారు దృష్టి సారించడం విశేషం. (క్లిక్ చేయండి: ఇక ఈజీగా ఆధార్ అప్డేట్) ఔటర్ చుట్టూ మెట్రో హారం... మహానగరానికి మణిహారంలా 158 కి.మీ మేర విస్తరించిన ఔటర్రింగ్రోడ్డు చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సుమారు 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలు ఔటర్ రింగ్రోడ్డు లోపలున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రూటు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగవడంతో పాటు వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ప్రధానంగా ఐటీ, హార్డ్వేర్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు మెట్రో రూటు మరింత ఊపునిస్తుందన్న అంచనాలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
బీసీలు పోరుబాట పట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
కీసర: రాజ్యాధికారం కోసం బీసీలు పోరుబాట పట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కీసర మండలంలోని రాంపల్లి పూలపల్లి బాలయ్య ఫంక్షన్హాల్లో మంగళవారం జరిగిన కురుమల రాష్ట్ర స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ ఉమతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాజకీయాల్లో బీసీలకు ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యం నేడు ధనస్వామ్యంగా మారిందని, ఎన్నికల్లో ధనమే కీలకమైందని తెలిపారు. బీసీలు విద్యావంతులు కావాలంటే.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కురుమ యువజన నాయకుడు శ్రీకాంత్, ఆలేరు కాంగ్రెస్ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్య, కార్పొరేటర్ కృష్ణ పాల్గొన్నారు. -
పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..
సాక్షి, హైదరాబాద్ (మేడ్చల్): వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఆ మహిళ భర్త ఇద్దరు కొడుకులు కలిసి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. కీసర ఇన్స్పెక్టర్ రఘువీర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన రుద్రబోయిన బాలరాజ్గౌడ్(36) నాలుగేళ్ల క్రితం సొంత గ్రామం నుంచి భార్య మమత ఇద్దరు పిల్లలతో వ్యాపార రీత్యా ఉప్పల్లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్తో పాటు మద్యం వ్యాపారం చేస్తున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉండే రమేష్ భార్య మంజులతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. మొదటి సారి హెచ్చరించి దాడి.. ►విషయం తెలియడంతో మంజుల భర్త రమేష్ పలుమార్లు బాల్రాజ్గౌడ్ను హెచ్చరించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో రమేష్ ఒకసారి బాలరాజ్గౌడ్పై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టాడు. సదరు మహిళను తీసుకొని వెళ్లిపోయిన బాలరాజ్గౌడ్ బాలరాజ్గౌడ్ వ్యవహారం నచ్చక అతడి భార్య మమత ఇద్దరు పిల్లలను తీసుకొని అమ్మగారింటికి వెళ్లిపోయింది. బాలరాజ్గౌడ్ మంజులను తీసుకొని వెళ్లిపోయి కొన్ని రోజలు మేడ్చల్లో ఉన్నారు. ఆ తర్వాత కీసర మండలం గోధుమకుంట మైత్రినగర్లో ఓ ఇంటినిఅద్దెకు తీసుకొని ఉంటున్నారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) ఆచూకీ తెలియడంతో ఆదివారం రాత్రి... వీరున్న ఆచూకి తెలుసుకున్న రమేష్ ఎలాగైనా బాలరాజ్గౌడ్ను హతమార్చాలని పథకం వేశాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ ఆటోలో తన ఇద్దరు కొడుకులు అరుణ్, తరుణ్తో పాటు మంజుల ఇద్దరు సోదరులతో కలిసి బాల్రాజ్గౌడ్ అద్దెకు ఉండే ఇంటికి వచ్చారు. ►కొద్దిసేపు బాలరాజ్గౌడ్తో వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రమై కర్రతో పాటు ఇటుకతో బాలరాజ్గౌడ్ తలపై కొట్టారు. రమేష్ పెద్ద కొడుకు అరుణ్ బయట ఉండగా.. చిన్న కొడుకు తరుణ్ కలిసి అతను కింద పడిపోగానే పక్కనే ఉన్న బట్టతో ఊపిరి ఆడకుండా చేసి కత్తి, స్క్రూడ్రైవర్తో విచక్షణ రహితంగా పొడిచి చంపారు. ►అక్కడే ఉన్న మంజుల వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న బాలరాజ్గౌడ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మంజులతో పాటు ఆమె భర్త రమేష్, ఇద్దరు కుమారులు, మంజుల సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రఘువీర్రెడ్డి తెలిపారు. -
తల్లి మృతిని తట్టుకోలేక..
కీసర: తల్లి మృతిని తట్టుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని రాంపల్లిదాయర గ్రామంలో ఈ ఘటన జరిగింది. కీసర సీఐ రఘువీర్రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన సుశీల భర్త మరో వివాహం చేసుకొని ఇంటినుంచి వెళ్లిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలసి ఉంటోంది. ఇటీవల పెద్ద కుమారుడు మాధవరెడ్డికి వివాహం కాగా అతని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆయన గండిపేటలో ప్రైవేటు ఉద్యోగంచేస్తూ అక్కడే ఉంటున్నారు. అతని సోదరులు యాదిరెడ్డి(30) మహిపాల్రెడ్డి (28) దిల్సుఖ్నగర్లోని ఓ సంగీత పాఠశాలలో పనిచేస్తున్నారు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చివెళ్లేవారు. కాగా, వీరి తల్లిసుశీల ఎనిమిది నెలల క్రితం కేన్సర్ వ్యాధితో మృతిచెందింది. తల్లి చనిపోయిన తర్వాత ఇంటిని వదిలేసి ఇద్దరు సోదరులు దిల్సుఖ్నగర్కు వెళ్లిపోయారు. యాదిరెడ్డి, మహిపాల్రెడ్డి ఈనెల 21న ఇంటిని శుభ్రం చేసేందుకు రాంపల్లిదాయరకు వచ్చారు. అయితే గండిపేటలో ఉన్న అన్న మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో పక్కింటి వారికి ఫోన్చేసి చెప్పారు.వారు వెళ్లి కిటికిలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్కు ఉరివేసుకొని ఉండటం, మహిపాల్రెడ్డి పురుగు మందుతాగి కిందపడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో మృతులు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో తమ తల్లి చనిపోవడం తట్టుకోలేక మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం, ఏజెన్సీ ప్రాంతంలో కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి... అక్రమంగా ముంబైకి తరలించి రూ.12 వేలకు విక్రయిస్తున్న గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 410 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కే మురళీధర్తో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం వివరాలు వెల్లడించారు. ♦నాగర్కర్నూల్ జిల్లా, బైరాపూర్ గ్రామానికి చెందిన గుడ్లనారం వెంకట్ నారాయణ తుర్కయాంజల్లోని ఏబీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత మూడేళ్లుగా గంజాయి వ్యాపారం ఇతనికి పలు రాష్ట్రాల్లోని గంజాయి కొనుగోలుదారులతో సంబంధాలు ఉన్నాయి. భద్రాచలం, ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. ఈ దందాలో అతడికి మండలి శ్రీనివాస్, దబ్బడి రజనీకాంత్, యాచహరం నాగరాజు సహకరించేవారు. ♦ ముంబైకి చెందిన షాహీన్, మాజిద్ నుంచి ఆర్డర్ అందడంతో వీరు నలుగురు కలిసి ఈనెల 20న రెండు వాహనాలతో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సత్తిబాబు అనే వ్యక్తి నుంచి 410 కిలోల గంజాయి కొనుగోలు చేసి వాటిని కారు లోపల సీట్ల కింద దాచిపెట్టారు. పోలీసుల తనిఖీల నుంచి త ప్పించుకునేందుకు వెరిటో కారును పైలట్ వా హనంగా వినియోగిస్తూ భద్రాచలం నుంచి ఓఆర్ఆర్ మీదుగా ముంబై బయలుదేరారు. ♦ బుధవారం దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, కీసర పోలీసులు కీసర టోల్గేట్ వద్ద వాహనాలను అడ్డగించి తనిఖీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి 410 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకట్పై పాత కేసులు కూడా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకట్ నారాయణపై గతంలో రెండు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. 2019లో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది. నల్లగొండ జిల్లా, చిట్యాల పోలీస్ స్టేషన్లో నమోదైన మరో గంజాయి కేసులో వెంకట్తో పాటు ఏఓబీ ప్రాంతానికి చెందిన సత్తి బాబు నిందితులుగా ఉన్నారు. వెంకట్ను పాత కేసుల్లో కూడా రిమాండ్కు తరలించి, కోర్టు ఎదుట హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తామన్నారు. -
125 గజాల వరకు ఉచితం... ఆపై పైకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను 125 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అందు కోసం గత నెల 21 నుంచి మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆయితే అధికారులు ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. పేదలకు క్రమబద్ధీకరణ జీఓ పై సరైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం జీఓ.58, 59 దరఖాస్తు అవగాహన కోసం మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కీసర ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్లో కార్పొరేషన్, రెవెన్యూ సంయుక్తంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం వీరికే వర్తిస్తుంది.. 2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గత నెల 14వ తేదీన కొత్త జీఓ జారీ చేసింది. 250 గజాలు దాటితే మార్కెట్ విలువ చెల్లించాల్సిందే.. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ ప్రకారం 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 300 చదరపు గజాలు దాటితే 75శాతం, 500 నుంచి 1000 గజాల్లో నిర్మాణాలు చేసుకుంటే 100 శాతం మార్కెట్ విలువ చెల్లించాలి. ఈసారైనా ముందుకొచ్చేనా? జవహర్నగర్ కార్పొరేషన్లో దాదాపు 2 లక్షల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. 2014 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా మంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వివరాలు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. (క్లిక్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ) అడ్డదారుల్లో వెళ్తే క్రిమినల్ కేసులు: ఆర్డీవో జీఓ.58, 59 దరఖాస్తుల కోసం అడ్డదారుల్లో వెళ్లి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర ఆర్డీవో రవి హెచ్చరించారు. గ్రామపంచాయితీ పేరున గతంలో తీసుకున్నట్లు బిల్లులు తీసుకువస్తే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లక్రమబద్ధీకరణ కోసం కొన్ని చోట్ల 2014 సంవత్సారానికి ముందు తేదీలలో నకిలీ ధ్రువపత్రాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిపై దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్గనర్లో గతంలో జీఓ.58 ప్రకారం 5,546, జీఓ 59 ప్రకారం 1,666 మంది దరఖాస్తులు చేసుకున్నారని వీటికి సంబంధించి మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 31 వరకు మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ► 2014 జూన్ 2వ తేదీకి ముందున్న నిర్మాణాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారు. ► ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ► రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ► ఆధార్కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్, నీటి బిల్లులు దరఖాస్తులతో సమర్పించాలి. ► ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారన్న వివరాలు తెలియజేయాలి. ► గతంలో అధికారులు ఏదైనా నోటీస్ జారీ చేస్తే అది కూడా జత చేయాలి. ► కోర్టు కేసులు ఉంటే వివరాలు తెలియజేయాలి. -
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
సాక్షి, మేడ్చల్: కీసర: ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్ డివైడర్ను కారు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సతీమణితో పాటు సమీప బంధువులు ఉన్నారు. శుభకార్యం కోసం చీరాలకు... సైబర్ క్రైమ్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్న కార్యంపూడి వెంకట మురళీధర్ ప్రసాద్ తన కుటుంబంతో మూసాపేటలో నివాసముంటున్నారు. ఈయన భార్య శంకరమ్మ (48) ప్రభుత్వ టీచర్. శంకరమ్మతో పాటు ప్రసాద్ అన్న కుమారుడు కార్యంపూడి బాలకృష్ణమూర్తి (48), ఈయన భార్య రేణుక (42), కుమారుడు భాస్కర్లు (జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థి) ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వీరితో పాటు బాలకృష్ణమూర్తి సోదరుడు కూడా వీరితో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పుడే డ్రైవింగ్ అప్పగించిన భాస్కర్... చీరాల నుంచి పెద్ద అంబర్పేట వరకు ఈ వాహనాన్ని భాస్కర్ డ్రైవ్ చేశారు. అక్కడ ఎల్బీనగర్ వైపు వెళ్లాల్సి ఉండటంతో బాలకృష్ణ మూర్తి సోదరుడు దిగిపోయారు. ఆ తరువాత బాలకృష్ణమూర్తి డ్రైవింగ్ సీటులోకి వచ్చారు. ముందు సీట్లో భాస్కర్, వెనుక సీటులో శంకరమ్మ, రేణుక కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ వాహనం కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ దాటి యాద్గార్పల్లి వరకు వెళ్లింది. అక్కడ ఎదురుగా వెళ్తున్న లారీ మరో లైన్ నుంచి వీరు ప్రయాణిస్తున్న లైన్లోకి వచ్చింది. గమనించిన బాలకృష్ణమూర్తి ప్రమాదాన్ని తప్పించుకోవడానికి కుడి వైపునకు తిప్పారు. కారు వేగంగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీ కొంది. ఈ ప్రభావంతో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. వెనుక సీట్లలో కూర్చున్న శంకరమ్మ, రేణుకలు పైకి ఎగిరడంతో వారి తలలకు కారు టాప్ బలంగా తగిలింది. ఈ దుర్ఘటనలో వారిద్దరూ కారులోనే ప్రాణాలు వదిలారు. డ్రైవింగ్ చేస్తున్న బాలకృష్ణమూర్తి సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ స్టీరింగ్ బలంగా ముఖానికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న భాస్కర్కు స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మూసాపేట ఆంజనేయనగర్లో కేవీఎం ప్రసాద్ నివాసానికి తరలించారు. అక్కడకు వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అదనపు సీపీ షికా గోయల్, సంయుక్త సీపీ అవినాష్ మహంతి నివాళుల్పించారు. చదవండి: Khammam: చిన్నారిపై బాలుడు అఘాయిత్యం -
కీసర ఔటర్ రింగ్రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం
-
కీసరలో విషాదం: అవమానం భరించలేక కుటుంబం ఆత్మహత్య
సాక్షి, కీసర: ఓ వివాదం.. దాడి.. అవమానం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవమానం భరించలేనంటూ జీవితంపై విరక్తి చెందాడు. భార్యా, ఇద్దరు కన్నబిడ్డలకు ఉరిపోశాడు. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఓ కుటుంబం బలైంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన శుక్రవారం కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ అడిషనల్ డీసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి (37), ఉష (33) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు అక్షిత (11) యశ్వంత్ (7). కొన్నేళ్లుగా నాగారంలోని వెస్ట్గాంధీనగర్లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. భిక్షపతి ఆటోనడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇంటి సమీపంలోని ఫిల్టర్ వాటర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ తన 15 ఏళ్ల కూతురుతో ఉంటోంది. ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆ బాలిక బంధువులు గురువారం సాయంత్రం భిక్షపతి ఇంటికొచ్చి గొడవకు దిగారు. అతడిపై దాడి చేశారు. ఇదే విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి భిక్షపతిని వదిలేశారు. శుక్రవారం ఉదయం భిక్షపతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటో తీసుకొని వెళ్తుండగా బాలిక కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి ఇంట్లోకెళ్లాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలకు ఉరివేసి తర్వాత తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను బాలికతో ఎంతమాత్రం అసభ్యంగా ప్రవర్తించలేదని, కొంతమంది కావాలని తనపై నింద వేసినట్లు గురువారం రాత్రి స్థానికులు, బంధువులకు భిక్షపతి చెప్పినట్లు సమాచారం. సూసైడ్నోట్ రాసి.. ఇరుగుపొరుగు వారి సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని భిక్షపతి ఇంట్లోకెళ్లి పరిశీలించగా భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. భిక్షపతి ఫ్యాన్కు ఉరేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. క్లూస్టీమ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఓ సూసైడ్నోట్ కూడా దొరికింది. తమ చావులకు కారణమంటూ కొంతమంది పేర్లను భిక్షపతి రాసినట్లు గుర్తించారు. తర్వాత భిక్షపతి కుటుంబీకుల మృతదేహాలను తీసుకెళ్లనీయకుండా స్థానికులు, బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. కారకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, సూసైడ్నోట్లో పేర్కొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఉంటే.. గురువారం రాత్రి భిక్షపతిపై దాడి జరిగిన సమయంలో ఆయన భార్య ఉష డయల్ 100కు ఫోన్ చేసి తన భర్తను కొడుతున్నారని చెప్పింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పుడు గొడవకు దిగిన వారిలో కొందరు కులపెద్దల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకుంటామని చెప్పడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. గురువారం రాత్రే పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అన్నారు. ‘ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. తనపై దాడి వల్లనే మనస్తాపానికి గురై భిక్షపతి ఇలా ఘాతుకానికి పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తాం. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం’అని కుషాయిగూడ అదనపు డీసీపీ శివకుమార్ చెప్పారు. -
నాగరాజు రెండో లాకర్లో భారీగా బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ ఖాతాలో భారీగా బంగారం బయటపడింది. నాగరాజు బినామీ అయిన అల్వాల్కు చెందిన నందగోపాల్ అనే వ్యక్తి ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో నందగోపాల్ పేరిట అల్వాల్లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒక లాకర్, పీజే మహేందర్ కుమార్ పేరిట మేడ్చల్లోని ఐసీఐసీఐ బ్రాంచ్లో మరో లాకర్ను కూడా నాగరాజు, అతని భార్య స్వప్న వాడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ లాకర్లను గురువారం అధికారులు తెరవగా నందగోపాల్ పేరిట ఉన్న లాకర్లో రూ.60 లక్షల విలువైన ఒక కిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నాగరాజుకు సంబంధించి ఇది రెండో లాకర్ కాగా, మూడో లాకర్లో రూ.4.5 లక్షల విలువచేసే 7.29 కిలోల బరువున్న 35 వెండిబిస్కట్లు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొదటి లాకర్ అల్వాల్లోని సౌత్ ఇండియన్ బ్యాంకులో నాగరాజు సమీప బంధువు నరేందర్ పేరిట ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సెప్టెంబర్ 2న ఈ లాకర్ను తెరిచిన ఏసీబీ రూ.57.6 లక్షల విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నాగరాజు లాకర్లలో భారీగా బంగారం
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూసుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల ఆయన ఆత్మహత్యకు పాల్పడటంలో కేసును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్లో దాదాపు కేజీకిపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. బినామీ పేరుతో పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి ఏసీబీ... ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజలు క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతకుముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. -
మాజీ తహసీల్దార్ నాగరాజు వీడియో కాల్?!
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతి కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆయన చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారని తెలిసింది. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి. అన్నీ రికార్డ్స్ పరిశీలించాకే చేశాం. న్యాయవాదికి ఈ విషయాలు చెప్పి కోర్టులో తెలపాలి’అని నాగరాజు ఆ వీడియో కాల్లో కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. బెయిల్పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన నాగరాజు కుటుంబ సభ్యులు, అతను ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు వాదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని శుక్రవారం తెలిపారు. కాగా, కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును నెలరోజులుగా ఏసీబీ విచారించింది. ఈక్రమంలోనే చంచలగూడ జైల్లో ఉన్న ఆయన గత బుధవారం ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. నాగరాజు మృతిపై కస్టోడియల్ డెత్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) (చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య!) -
కీసర నాగరాజా మజాకా!
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కె.ధర్మారెడ్డి అతని మనుషులకు అక్రమంగా ధారాదత్తం చేశాడన్న ఆరోపణలపై ఇటీవల విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీబీ డీజీని ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినిæయోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామపరిధిలో సర్వేనం 621లో కందాడి లక్ష్మమ్మ పేరిట 14 గుంటలు, సర్వే నం.623లో కందాడి బుచ్చిరెడ్డికి 33 గుంటలు, సర్వే నం.625లో కందాడి మీనమ్మ పేరిట 19 గుంటలు, సర్వే నం 633/ఏలో కందాడి ధర్మారెడ్డి పేరిట ఎకరం రెండు గుంటలకు జూలై 9వ తేదీన అప్పటి తహసీల్దార్గా ఉన్న నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ సైన్లతో పాసుబుక్కులు జారీ చేశాడు. నాగరాజు మరికొందరితో కలిసి మొత్తంగా 24 ఎకరాల 16 గుంటల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ విషయం కీసర ఆర్డీవో వద్ద ఇప్పటికే పెండింగ్లో ఉన్నా అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. ఈ భూముల ధర రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో విలువ రూ.48.8 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. -
ఆ లంచం కేసుతో నాకు సంబంధం లేదు
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదన్నారు. కీసర తహసీల్దార్ విచారణ సమయంలో తనపై తప్పుడు ప్రచారం కొనసాగటంపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. ‘మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్ పరిధిలోనే ఉంటుంది. కలెక్టర్ వద్దకు కనీసం ఫైలు కూడా రాదు.. ఈ కేసులో నా పాత్ర ఉందనే ఆరోపణలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు సమస్యల తో వచ్చినప్పుడు విచారణ చేసి, నిబంధనల ప్రకారముంటేనే వాటిని పరిష్క రించాలని చెబుతాను. రోజూ విజిటింగ్ సమయంలో కలసిన ప్రతి ఆర్జీదారుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఆ అధి కారులూ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది’అని అన్నారు. -
ఆన్లైన్ సెక్స్ రాకెట్.. నిర్వాహకుడిపై పీడీయాక్ట్
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆన్లైన్లో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవాడు. నచ్చిన అమ్మాయిను వారి వద్దకు పంపించి రూ.వేలల్లో డబ్బు తీసుకునేవాడు. ఈ వ్యవహారం మొత్తం ఆన్లైన్లోనే సాగిపోయేది.(ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతం!) దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.(పీఎన్బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు) -
వృద్ధాశ్రమం పేరిట చిత్రహింసలు
కీసర: మానసిక పరిస్థితి సరిగ్గా లేని వారు కొందరు.. మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలైనవారు మరికొందరు.. పిల్లలకు దూరమైన వృద్ధులు ఇంకొందరు.. ఇలా 85 మందిని వృద్ధాశ్రమం పేరిట ఓ భవనంలో ఉంచి యజమానులు చిత్రహింసలు పెట్టేవారు. అనుమతి లేకుండానే నడుపుతున్న ఈ ఆశ్రమంలో ఇరుకు గదుల్లో అందరినీ కలిపి ఉంచి ఇబ్బందులకు గురి చేసేవారు. స్థానికుల ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో సాగుతున్న ఈ ఆశ్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. నాగారంలోని శిల్పానగర్ కాలనీలో రెండు చిన్న భవనాలను జాన్ రతన్పాల్, కె.భారతి, అరుణాచలం, భాను అద్దెకు తీసుకొని నాలుగేళ్ల క్రితం మమత వృద్ధాశ్రమం ఆశ్రమం ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. మానసిక వికలాంగులతో పాటు మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులను వారి తల్లిదండ్రులు, బంధువులు.. నిర్వాహకులకు నెలకు రూ.4,000 నుంచి 15,000 వేల వరకు ఇచ్చి ఈ ఆశ్రమంలో చేర్పించారు. అయితే వీరికి సరిపోయే వసతులు ఇక్కడ లేకపోగా మానసిక పరిస్థితి సరిగా లేని వారిని గొలుసులతో నిర్బంధిం చారు. ఎవరైనా చెప్పినట్లు వినకుంటే నిర్వాహకులు కొట్టేవారని ఆరోపణలున్నాయి. అధికారుల విచారణ... రెండ్రోజుల క్రితం ఆశ్రమం నుంచి కేకలు వినిపించాయి. పక్కనే ఉన్న మోడీ అపార్ట్మెంట్వాసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిం చగా నిర్వాహకులు అడ్డుకున్నారు. అక్కడి కాలనీవాసులు వారిని పక్కకు నెట్టి లోపలికి వెళ్లి చూడగా, గదుల్లో వృద్ధులు, మానసిక దివ్యాంగులు కనిపించారు. కొందరి శరీరంపై గాయాలుండటం గమనించి నిర్వాహకులను నిలదీశారు. పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి, కుషా యిగూడ ఏసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్గౌడ్తోపాటు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి, జిల్లా సఖి కేంద్రం అధికారి పద్మావతి ఆశ్రమానికి చేరుకుని విచారణ జరిపారు. ఓ భవనంలో 22 మంది మహిళలను, మరో భవనంలోని ఇరుకు గదుల్లో 63 మంది పురుషులను ఉంచడాన్ని అధికారులు పరిశీలించారు. ఆశ్రమాలకు తరలింపు... మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎంవి. రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆశ్రమంలోని వారిని శుక్రవారం ఇతర ఆశ్రమాలకు తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.నారాయణ, మండల వైద్యాధికారి డా.సరిత వైద్య బృందంతో ఆశ్రమంలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐదుగురి మానసిక స్థితి బాగానే ఉండటంతో వారిని బంధువులకు అప్పగించా రు. ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని సీఐ నరేందర్గౌడ్ తెలిపారు. -
చెత్తకుప్పలో 10 సంచుల ఉత్తరాలు
సాక్షి, హైదరాబాద్ : నమ్మకంగా ఉత్తరాలను బట్వాడా చేయాల్సిన పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆప్తులకు, అభ్యుర్థులకు చేరాల్సిన ఉత్తరాలను చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. కీసరలోని బండ్లగూడ సమీపంలో ఉన్న ప్రజాసాయి గార్డెన్స్ గేట్ పక్కన వేలకొద్దీ ఉత్తరాలు చెత్తకుండీలో లభ్యమయ్యాయి. 10 సంచుల్లో ఉన్న లెటర్స్ను రాజిరెడ్డి అనే వ్యక్తి ముందుగా గుర్తించాడు. ఆయన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఉత్తరాల్లో ఎక్కువ భాగం కూకట్పల్లి, షాద్నగర్, బాలానగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల అడ్రస్లతో ఉండటం గమనార్హం. ఎవరైనా కావాలని చేశారా, డ్యూటీ చేయలేక పోస్టల్ సిబ్బందే నిర్లక్ష్యంతో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. లెటర్స్ను బట్వాడా చేయకపోవంతో కొందరు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని సీఐ నరేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. -
ఫారెస్ట్ అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం
సాక్షి, కీసర: కీసరగుట్ట అటవీప్రాంతాన్ని దత్తత తీసుకొని ఎంపీ సంతోష్కుమార్ హరితహారంలో భాగంగా ఇటీవల పెద్దఎత్తున మొక్కలు నాటిని విషయం తెలిసిందే. మంగళవారం కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆ ప్రాంతాన్నిపరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్టు అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొక్కలు నాటి 15 రోజులు కావొస్తున్నా వాటికి సపోర్టు కర్రలు ఎందుకు నాటలేదని, చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ ఎందుకు నాటలేదని అటవీశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మొక్కలను నాటినప్పటి నుంచి ఫీల్డ్ఆఫీసర్ ఇటు పక్కకు రాలేదని, నాటిన మొక్కలను సంరక్షించనందుకు కీసర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్రెడ్డిని ఆదేశించారు. అనంతరం గుట్టలో గల ఆర్అండ్బి అతిథిగృహంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కీసరగుట్ట అబివృద్ధికి ప్రణాళికను తయారు చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కీసరగుట్టలోని ఎంట్రెన్స్లో గల సిమెంట్ నంది విగ్రహాన్ని మార్చి, దానిస్థానంలో రాతితో చెక్కించి నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కీసరగుట్ట జాతర సందర్భంగా పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడకుండా స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్ నాగరాజుకు సూచించారు. జెడ్పీ వైస్చైర్మన్ బెస్త వెంకటేష్, డీఆర్డీఏ పీఓ కౌటిల్యారెడ్డి, సీపీఓ సౌమ్య, ఎంపీపీ ఇందిర వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, సర్పంచ్ మాధురి, ఉపసర్పంచ్ కందాడి బాలమణి పాల్గొన్నారు. -
స్కూటీపై వెళ్తుండగా చేతిని ‘ముద్దాడిన’ నాగుపాము..
సాక్షి, హైదరాబాద్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నాగుపాము హల్చల్ చేసింది. స్కూటీలో దూరి ఓ వ్యక్తికి చెమటలు పట్టించింది. యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్సీఐలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూమాదిరిగానే మంగళవారం ఉదయం స్కూటీ తీసుకుని ఉద్యోగానికి బయలుదేరాడు. రాంపల్లి మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టుగా అనిపించింది. దాంతో స్కూటీని ఆపి చూడగా హెడ్లైట్లో నక్కి ఉన్న నాగుపాము పిల్ల కనిపించింది. ఒక్కసారిగా షాక్కు గురైన రాములు స్కూటీని పక్కనపడేసి.. అక్కడే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోగ్గౌడ్కు విషయం చెప్పాడు. వినోగ్గౌడ్ పాములు పట్టే ఎరుకలి మైసయ్యను పిలిపించాడు. స్కూటీ హెడ్లైట్లో దాగున్న పామును బయటకు తీయించి అడవిలో వదిలేశారు. రాములుకు ప్రథమ చికిత్స చేయించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
అడవి నవ్వింది!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. తన పుట్టినరోజు (జూలై 24) సందర్భంగా దుబారా ఖర్చులు చేయకుండా సమాజహితం కోసం సాయం చేయాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ చాలెంజ్కు స్పందనగా ఎంపీ సంతోష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మారుస్తామని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలో పర్యటించి అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు ఇవి తోడ్పాటునిస్తాయని ఆయన పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలు, అర్బన్ లంగ్ స్పేస్ల అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ఛాలెంజ్ విసిరారు. తన ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవిత, హీరోలు విజయ్ దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామికవేత్త ముత్తా గౌతమ్లను ట్యాగ్ చేశారు. మంచి నిర్ణయంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కుమా ర్కు వంశీ పైడిపల్లి కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ
సాక్షి, నాగారం: స్వచ్ఛంద సంస్థ ‘బీ ద చేంజ్’ సౌజన్యంతో ఆషీ ఫౌండేషన్ సభ్యులు శనివారం నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. వీటితో పాటు వాటర్ బాటిళ్లు, పెన్నులు కూడా ఇచ్చారు. దాదాపు వంద మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డితో పాటు స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు పవిత్ర, కావ్య, సౌమ్య, జయ, భార్గవ్, రామకృష్ణ పాల్గొన్నారు. పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వలంటీర్లు తెలిపారు. జూపార్క్, చార్మినార్, గోల్కొండ కోట ప్రదేశాలకు పేద విద్యార్థులను తీసుకెళ్లి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నామని చెప్పారు. వలంటీర్లు వచ్చిన వచ్చిన వారంతా కాలేజీ విద్యార్థులే కావడం విశేషం. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరిని పాఠశాల సిబ్బంది అభినందించారు. తమకు ఉచితంగా బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసినందుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. -
చెరువు పరిరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ
సాక్షి, నాగారం: అన్నరాయని చెరువును కాపాడాలని కోరుతూ నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి చెరువు వరకు ఈ ర్యాలీ సాగింది. చెరువును రక్షించుకుందామంటూ దారిపొడవునా విద్యార్థులు నినదించారు. చెరువు కట్ట మీద విద్యార్థులను కూర్చొబెట్టి అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు అవగాహన కల్పించారు. చెరువును కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, నీటి ప్రాముఖ్యాన్ని వివరించారు. గత వారం కూడా ఇదే రోజున ర్యాలీ నిర్వహించామని, వరుసగా రెండో వారం విద్యార్థులు తరలిరావడం సంతోషంగా ఉందని అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేశ్, కృష్ణమాచార్యులు, శాంప్రసాద్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 14న చక్రీపురం నుంచి చెరువు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నాగారం వాసులతో పాటు పర్యావరణ ప్రియులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కొనసాగుతున్న ఆక్రమణలు ఒకపక్క చెరువు పరిరక్షణ కోసం పాటుపడుతుంటే మరోపక్క ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఎస్వీ నగర్ రోడ్డు నంబర్ 7 వద్ద దుండగులు ఆక్రమణలకు తెర తీశారు. దీనిపై కీసర ఎమ్మార్వో, స్థానిక వీఆర్ఓలకు ఫిర్యాదు చేసినట్టు ఎస్వీనగర్ కాలనీ వాసి కొమిరెల్లి సుధాకర్రెడ్డి తెలిపారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి చెరువును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
ఔటర్ రింగ్ రోడ్డుపై టైర్ పేలి.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మహేంద్ర మ్యాక్సీ ట్రక్ వాహనం టైర్ పేలి ఇద్దరు మృతిచెందారు. బుధవారం ఉదయం కూలీలను మ్యాక్సీ ట్రక్లో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓఆర్ఆర్పై మ్యాక్సీ ట్రక్ వాహనం రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో ఆ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న కూలీలు రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఒక మహిళ ఘటన స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్యుత్సాహం అరెస్ట్కు దారితీసింది
సాక్షి, హైదరాబాద్: ఓ పోలింగ్ ఏజెంట్ ప్రదర్శించిన అత్యుత్సాహం అతని అరెస్ట్కు దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లో ఫొటో దిగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి ఆ పార్టీకి చెందిన నాయకుడు వెంకటేశ్ పోలింగ్ ఏజెంట్గా ఉన్నారు. అయితే గురువారం పోలింగ్ ముగిశాక అధికారులు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను భోగారంలోని హోలీమేరి కళాశాలలో భద్రపరిచారు. అయితే పోలింగ్ ఏజెంట్గా అధికారులతో కలిసి అక్కడికి వెళ్లిన వెంకటేశ్ స్ట్రాంగ్ రూమ్లోని ఈవీఎంలు, వీవీప్యాట్ల వద్ద నిలుచుని ఫొటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కీసర పోలీసులకు ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కాగా, వెంకటేశ్పై క్రిమినల్ కేసు నమోదైనట్టు కీసర సీఐ నరేందర్గౌడ్ తెలిపారు. -
అడుగంటిపోతున్నాయి
సాక్షి,మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ మహానగరంలో భాగమైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ఫిబ్రవరి‡లో జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 9.88 కాగా, ఈ ఏడాది భూగర్భ జల మట్టంతో పోలిస్తే 4.44 మీటర్ల మేర నీటి మట్టం తగ్గింది. ఈ సారి పాతాళ గంగ 14.32 మీటర్లు లోతుకు పడిపోయింది. నగరానికి నీటిని అందించే జలశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవటంతో తాగునీటికి ఇబ్బందులు తçప్పక పోవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే శివారు ప్రాంతాల్లో ఉండే ప్రైవేట్ నీటి సరఫరాదారులు, ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లకు చెందిన కొందరు అక్రమదారులు భూగర్భ జలమట్టాలను విచక్షణ రహితంగా తోడి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందన్న అందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని భావిస్తున్న పలు ప్రాంతాలను గుర్తించిన అధికార యంత్రాంగం అవసరమైన ప్రాంతాలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 104 గ్రామాలకు గోదావరి జలాలను అందించే మిషన్ భగీరథ పనులు పూర్తవటంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సమస్యలకు ఇబ్బందులు ఉండకపోవచ్చునని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. రోజూ భారీగా తాగునీటి ఖర్చు మేడిపల్లి మండలంలో గత ఫిబ్రవరితో పోల్చితే ఈ ఫిబ్రవరిలో భూగర్భ జలమట్టం 6.48 మీటర్ల లోతుకు పడిపోగా, మల్కాజిగిరిలో 7.15 మీటర్ల లోతుకు పడిపోయింది. అలాగే, కుత్బుల్లాపూర్లో 9.08 మీటర్లు, కాప్రాలో 6.76 మీటర్లు, దుండిగల్లో 8.22 మీటర్లు, మేడ్చల్లో 3.88 మీటర్లు, కీసరలో 3.87 మీటర్లు, అల్వాల్లో 3.65 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో జిల్లాలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలకు తాగునీరందించే మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కాకపోవటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లోని పలు కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలో నివసిస్తున్న కుటుంబాలు రోజు వారీ అవసరాలకు వినియోగించే వాటర్ను కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో 120 అపార్టుమెంట్లు ఉండగా, ఒక్కొక్క అపార్టుమెంట్కు రోజుకు రెండు ట్యాంకర్ల చొప్పున నీటి వినియోగం అవసరం. ఈ లెక్కన ఒక ట్యాంకర్ నీటికి రూ.500 చొప్పున రెండు ట్యాంకర్లకు రూ.1,000 ప్రతి రోజు ఒక అపార్టు మెంట్ వాసులు వెచ్చిస్తున్నారు. 120 అపార్టుమెంట్స్ వారు తాగునీరు కాకుండానే ఇతర అవసరాల కోసం వినియోగించే నీటి కోసం రోజుకు రూ.1.20 లక్షల చొప్పున నెలకు రూ.36 లక్షలు వెచ్చిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన నాగారం, జవహర్నగర్, దమ్మాయిగూడ, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది. -
కుప్పకూలిపోయారు!
సాక్షి, కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో జరుగుతున్న డబుల్బెడ్రూం నిర్మాణపనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని రాష్ట్రం దాటి వచ్చి పనిచేస్తున్న వీరు ఒక్కసారిగా విగతజీవులుగా మారడం తోటికూలీలను కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని పేదల కోసం రాంపల్లిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో 52 బ్లాక్ల్లో 6,240 డబుల్బెడ్రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. గత ఏడాది అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ , ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు రెండువేల మంది కూలీలు షిప్టులవారీగా పనిచేస్తున్నారు. టైరాడ్ సరిగా బిగించకపోవడం వల్లే... రోజూలాగే గురువారం ఉదయం తొమ్మిది గంటలకు దాదాపు 1,500 నుంచి 2,000 మంది కూలీలు పనిమొదలెట్టారు. సుమారు 11 గంటల సమయంలో 12వ బ్లాక్లోని పదో అంతస్తులో ఫ్లాట్ఫాంపై నిలబడి ఆరుగురు కూలీలు పనిచేస్తున్నారు. అది ఒక్కసారిగా కుప్పకూలింది. వారు కూడా దాంతోపాటే కిందపడిపోయారు. ఈ ఘటనలో బిహార్కు చెందిన యాష్కుమార్చౌదరి(20), పశ్చిమ బెంగాల్వాసులు సుభాల్రాయ్(32,) సైపుల్హాక్(26), అభిజిత్రాయ్(22)లు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలొదిలారు. మిలాన్షేక్(20) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరొకరు విబ్లవ్రాయ్(18) తీవ్రగాయాలతో ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కోపోద్రిక్తులైన తోటి కూలీలు ఆగ్రహంతో డబుల్బెడ్రూం ఇళ్ల సముదాయంలోని కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం అద్దాలు, కంప్యూటర్లు, కుర్చీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఉద్యోగులు, సిబ్బందిపై దాడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు... ఇంతపెద్ద సంఖ్యలో పనిచేసే కూలీలకు అక్కడ ఎలాంటి సౌకర్యాలుగాని, రక్షణ చర్యలుగాని లేవని, పనిచేసే సమయంలో ప్రమాదం జరిగితే కనీసం చికిత్స అందించేందుకు వసతులు కూడా లేవని కూలీలు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అంబులెన్స్కూడా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలతోపాటు గాయపడినవారిని ఆటోట్రాలీలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న చోట కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, ఇటీవల ఓ కూలి బహి ర్భూమికని రాత్రివేళలో సమీపంలోని రైల్వేట్రాక్ దాటి వెళ్లడంతో రైలు ఢీ కొని మృతిచెందాడని చెప్పారు. ఏఈ సస్పెన్షన్.. రాంపల్లి దుర్ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఏఈ ఎస్.నర్సరాజును సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రతాచర్యలు చేపట్టడంలో విఫలమైనందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 15 లక్షల చొప్పున పరిహారం రాంపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందడంపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. కానరాని భద్రత... ప్రమాద సమయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడింది. ప్లాట్ఫామ్కు టైరాడ్ సరిగా బిగించారా...లేదా... భద్రంగా ఉందా లేదా అని పరీక్షించే ఇంజనీరింగ్ విభాగ అధికారులెవరూ అక్కడ లేరు. కూలీలకు కనీసం హెల్మెట్లు, సేఫ్టీ బెల్ట్లు కూడా అందించలేదు. కూలీల పనులను పర్యవేక్షించే సూపర్వైజర్లు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. ప్రమాదవశాత్తూ కిందపడినా గాయాలబారిన పడకుండా జాలీలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారని సహచర కూలీలు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఘటనాస్థలాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ సుధీర్బాబు, మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన డబుల్బెడ్రూమ్ ఇళ్ల సముదాయం ఇదే -
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని కీసర మండలం రాంపల్లి గ్రామ ప్రధాన చౌరస్తాలో గుర్తుతెలియని దుండగులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహ తలను పూర్తిగా తొలగించి కిందపడేశారు. ఈ సమాచారం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు సంఘటనా స్ధలానికి చేరుకొని దుండగులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళను దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కీసర సీఐ సంఘటన స్థలానికి అందోళకారులను శాంతింపజేశారు. దుండగులను అదుపులోకి తీసుకున్నామని సీఐ ప్రకాష్ పేర్కొన్నారు. -
చెరువులో దూకి విద్యార్థిని ఆత్మహత్య
మేడ్చల్: కీసర మండలం చీర్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసముంటున్న నిత్యానంద్ కుమార్తె సోనీ(24) ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఓ విషయంలో తండ్రి మందలించాడని మనస్తాపం చెంది..ఐ యామ్ గోయింగ్ టు డై అని స్నేహితురాలికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఉదయం కాలేజీకి వచ్చి బ్యాగ్ను కాలేజీలోనే సోనీ వదిలి వెళ్లిపోయింది. సోనీ, స్వగ్రామంలోని గీతాంజలి కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో రిటైర్డ్ ఎస్ఐ దుర్మరణం
కీసర : రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఎస్.ఐ మృతిచెందిన సంఘటన మంగళవారం కీసర రింగ్రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటకు చెందిన రిటైర్డ్ ఎస్.ఐ నర్సింహ్మారావు(62) మంగళవారం యాదాద్రిజిల్లా చికడిమామిడి గ్రామానికి వెళ్లి బైక్పై తిరిగివస్తుండగా కీసర అవుటర్ రింగ్రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కీసర సీఐ సురేందర్గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు నర్సింహ్మారావు చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో ఎస్.ఐ పనిచేస్తూ ఇటివలై రిటైరైనట్లు తెలిపారు. -
ఆడపిల్లల్ని కన్నందుకు వేధింపులు.. కుటుంబం ఆత్మహత్య
సాక్షి, కీసర: కుటుంబసభ్యుల వేధింపులు పచ్చని సంసారంలో చిచ్చు రేపాయి. సొంత అమ్మానాన్నలే వేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేని ఓ యువకుడు భార్యాపిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కీసరలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మణిపడిగ రమేశ్ (30), మానస (26), గీతశ్రీ (3), దివిజశ్రీ (ఆరు నెలలు)లుగా పోలీసులు గుర్తించారు. అయితే మానస చీర కొంగులోనే చిన్నారి దివిజశ్రీ చనిపోయి ఇద్దరి శరీరాలు అతుక్కొని ఉండటం అందరినీ కలచివేసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... శామీర్పేట మండలం ఉద్దెమర్రికి చెందిన శ్యామల అలియాస్ మానస(22)తో రమేశ్కు 2014 మార్చి 23న వివాహమైంది. ఘట్కేసర్ మండలం కొండాపూర్లో తమకున్న ఎకరం భూమిలో రమేశ్ బర్రెలకు కావాల్సిన దాణా పెంచుతూ, పాల వ్యాపారం చేస్తున్నాడు. మానసకు మూడేళ్ల కిందట ఓ ఆడపిల్ల (గీతశ్రీ) పుట్టింది. మళ్లీ ఆరు నెలల క్రితం రెండోసారి ఆడపిల్ల (దివిజశ్రీ) పుట్టింది. ఆరు నెలలుగా పెరిగిన వేధింపులు రెండో పిల్ల పుట్టినప్పటి నుంచీ ఆమెకు అత్త అంజమ్మ, మామ రాములు వేధింపులు ఎక్కువయ్యాయి. వీరితో పాటు ఆడపడుచులు పద్మ, లక్ష్మి కూడా ఈమెను వేధించసాగారు. అయినా అటు తల్లిదండ్రులకు నచ్చజెబుతూ, ఇటు భార్యను ఓదారుస్తూ రమేశ్ సంసారాన్ని ముందుకు సాగిస్తున్నాడు. అయితే ఆడపడుచు పద్మ సోమవారం మరదలు మానసను కొట్టి, అన్న రమేశ్ను అసభ్యపదజాలంతో తిట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లమని గెంటేసింది. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్.. భార్య మానస, ఇద్దరు ఆడపిల్లలు గీతశ్రీ, దివిజశ్రీలను తీసుకొని రెండు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ విషయం తెలిసి అక్కడే సమీపంలో ఉండే మానస బంధువులు వారి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో కీసర పెద్దచెరువు కట్ట సమీపంలో రమేశ్ స్కూటర్తో పాటు మానస, గీతశ్రీ చెప్పులు కనిపించాయి. మానస తల్లిదండ్రులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో తేలియాడుతున్న రమేశ్, కొద్దిదూరంలో పడి ఉన్న గీతశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. చెరువు మధ్యలో మానసతో పాటు ఆమె చీర కొంగులోనే ఆరు నెలల పాప దివిజశ్రీ విగతజీవురాలై కనిపించింది. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్లలు పుట్టారని అత్తింటివారు వేధించడంతోనే ఈ ఆత్మహత్యలు జరిగాయని మృతురాలు మానస తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఫోన్ రీచార్జ్ చేయించుకొస్తానని వెళ్లి..
కీసర: ఫోన్ రీచార్జ్ చేయించుకొస్తానని వెళ్లిన వ్యక్తి చెరువులో మృతదేహమై తేలాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో జరిగింది. పొలగోని రమేష్ గౌడ్ (28) కీసర వాసి. ఫోన్ రీఛార్జ్ చేయించుకుని వస్తానని వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. అయితే కీసర గుట్టకు వెళ్లే మార్గంలో చెరువు వద్ద అతని బైక్ ఉంది. చెప్పులు, దుస్తులు కనిపించాయి. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాన్ని చెరువు లోంచి బయటికి తీయించారు. యాదాద్రి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కీసరలో కూలిన శిక్షణ విమానం
సాక్షి, కీసర : మేడ్చల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన జిల్లాలోని కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కిరణ్ శ్రేణికి చెందిన శిక్షణ విమానం హకీంపేట్ శిక్షణ కేంద్రం నుంచి విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం శకలాలు కిందపడ్డ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఏం జరగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో శిక్షణ ఇస్తున్న పైలట్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అంకిరెడ్డిపల్లి శివారులో ఎస్ఎల్ఎస్ ఫ్యాక్టరీ సమీపంలో విమానం కూలింది. అయితే ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపల విమానం పూర్తిగా దగ్ధమైంది. -
కీసరలో కూలిన శిక్షణ విమానం
-
కీసరలో భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశాం
-
సీఎం పర్యటనతో కీసరలో భారీ బందోబస్తు
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
కీసర : మేడ్చల్ జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లె క్రాస్రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. తిమ్మాయిపల్లి నుంచి కీసర వైపు స్కూటర్ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్పై ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు బాలాజీ నగర్కు చెందిన డి. హనుమంతు(26), బి. హనుమంతు(25)గా గుర్తించారు. మరొకరు సంగారెడ్డి జిల్లా బూరుగుపల్లికి చెందిన శ్రీనివాస్(25)గా తేల్చారు. ఈ ఘటనతో ప్రమాదస్థలంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఘటన అనంతరం ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కీసరలో యువకుడి బలవన్మరణం
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలకేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రాజీవ్గృహ కల్పలో నివాసం ఉండే వెంకటేశ్(19) సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరుగుతున్న గొడవల కారణంగా అతడు మృతిచెంది ఉంటాడని సమాచారం. -
రిజిస్ట్రార్ ఆఫీసులో చోరీ
కీసర(రంగారెడ్డి జిల్లా): కీసర రిజిస్ట్రార్ ఆఫీసులో గురువారం చోరీ జరిగింది. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు వచ్చిన దంపతుల వద్ద నుంచి దుండగులు చాకచక్యంగా నగదు దొంగిలించారు. నాగారం గ్రామానికి చెందిన సంతోష్, లక్ష్మి అనే ఇద్దరు దంపతులు గురువారం ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు కీసర రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.1.57 లక్షలు తీసుకొచ్చారు. దస్తావేజులకు రూ. 44 వేలు చెల్లించారు. మిగతా సొమ్మును బ్యాగులో ఉంచారు. బ్యాగు జిప్పు సరిగా వేయకుండానే రిజిస్ట్రార్ ఆఫీసులో వేరొక ప్రభుత్వ ఉద్యోగితో మాట్లాడుతున్నారు. ఇది గమనించిన గుర్తుతెలియని దుండగులు అందులోని రూ.73 వేల నగదు తస్కరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ గురువారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీ కొడుకు అదృశ్యం
కీసర: ఇంట్లోంచి వెళ్లిన ఓ తల్లీకొడుకు కనిపించకుండా పోయారు. సీఐ గురువారెడ్డి కథనం ప్రకారం.. కీసర మండల కేంద్రానికి చెందిన చాకలి పోచయ్య, పద్మ(30) దంపతులు తమ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు శివరాం(11) ఉన్నాడు. ఇదిలా ఉండగా, గత ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో పోచయ్య, పద్మ దంపతులు గొడవపడ్డారు. దీంతో మనోవేదనకు గురైన పద్మ తన కుమారుడు శివరాంను తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శనివారం సాయంత్రం పోచయ్య కీసర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. -
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
- యువకుడికి గ్రామస్తుల దేహశుద్ధి కీసర (రంగారెడ్డి జిల్లా) : అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేయగా గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన కీసర మండలం హైమత్గూడలో మంగళవారం జరిగింది. హైమత్గూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిని అజయ్(18) అదే కాలనీకి చెందిన ఓ చిన్నారిని ఆడుకుందాం రమ్మని పిలిచాడు. అమాయకంగా వెళ్లిన ఆ చిన్నారికి తన సెల్లోని అసభ్య ఫొటోలు చూపిస్తూ అత్యాచారం చేయబోయాడు. ఈ సంఘటనను అదే కాలనీకి చెందిన సమీ, రహీంలు చూసి కాలనీ వాసులను పిలిచారు. చిన్నారిపై అత్యాచారం చేయబోయిన అజయ్కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గాయాలు
కీసర : రంగారెడ్డి జిల్లా కీసరలో శనివారం ఉదయం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో 8 మంది సాఫ్టవేర్ ఉద్యోగులు గాయపడ్డారు. సాఫ్ట్ వేర్ ట్రావెల్ లో ఉద్యోగం చేస్తున్న యువకులు భోగారం నుంచి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని కీసర ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సాఫ్ట్ వేరో్ ఉద్యోగులు ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. -
వివాహిత అదృశ్యం
కీసర (రంగారెడ్డి) : ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. కీసర ఎస్.ఐ విష్ణువర్థన్ రెడ్డి తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. చీర్యాల గ్రామానికి చెందిన కరినే మాధవి(25) ఈ నెల 13 వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేదు. బంధువులను విచారించినా, చుట్టుపక్కల ప్రాంతాలను గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం సాయంత్రం మాధవి భర్త రాముడు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు. మాధవికి ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. -
మిషన్ భగీరథ పనుల్లో అపశృతి
కీసర (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్పల్లి గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. శనివారం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతిచెందాడు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కొండలు(38) యాద్గార్పల్లి సమీపంలో కీసర వరకు కొనసాగుతున్న మిషన్ భగీరథ పథకం పనుల్లో పాల్గొంటున్నాడు. శనివారం ఉదయం రోడ్డుపక్కన గుంతల్లో క్రేన్తో పైపులను దించుతున్నారు. కొండలు క్రేన్ డ్రైవర్కు సాయంగా ఉంటూ పైప్లను దించేందుకు సైడ్ చూపించసాగాడు. ఈ క్రమంలో కొండలును గమనించకుండా క్రేన్ డ్రైవర్ క్రేన్ను ముందుకు నడిపాడు. దీంతో క్రేన్ బలంగా తగిలి కొండలు అక్కడికక్కడే మృతి చెందాడు. కొండలుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కల్తీ పాల తయారీ ముఠా అరెస్ట్
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్పల్లి, చేర్యాల గ్రామాల్లో కల్తీ పాలు తయారుచేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూరియాతో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. -
కీసరలో వ్యక్తి దారుణ హత్య
కీసర: రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కీసర మండలం తిమ్మాయిపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తిమ్మాయిపల్లిలోని శ్రీ బాలాజీ మెటల్ ఇండస్ట్రీస్ యజమాని కృష్ణమోహన్ రావు(45)గా గుర్తించారు. తలపై రాడ్తో కొట్టిడం వల్ల చనిపోయినట్లు తెలుస్తుంది. అనంతరం శవాన్ని రోడ్డు పక్కన పడేసి దుండగులు పరారయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బైక్ రేసర్ల అరెస్ట్
కీసర (రంగారెడ్డి): కీసర ఓఆర్ఆర్ జంక్షన్ రహదారిలో బైక్ రేసింగ్కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘట్కేసర్ మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు, మూడు బైకులపై ఆదివారం ఉదయం కీసర ఓఆర్ఆర్ జంక్షన్కు చేరుకుని రేసింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చూసి నలుగురు విద్యార్థులు పరారు కాగా, ఇద్దరు పట్టుబడ్డారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, ర్యాష్ డ్రైవింగ్ పేరిట జరిమానా వసూలు చేసి విడుదల చేశారు. -
సబ్స్టేషన్ నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
కీసర (రంగారెడ్డి జిల్లా) : రాంపల్లి గ్రామంలోని ఆర్ఎల్ నగర్ సమీపంలోగల పాత చెరువు వద్ద కొత్తగా నిర్మించనున్న సబ్స్టేషన్ పనులను శనివారం ఆ గ్రామ దళితులు అడ్డుకున్నారు. సబ్స్టేషన్ నిర్మించేందుకు గ్రామంలోని సర్వే నెం.388లో గల ప్రభుత్వ స్థలంలో సుమారు అరఎకరం స్థలాన్ని కేటాయించిన సంగతి విధితమే. ఈ మేరకు శనివారం ట్రాన్స్కో అధికారులు ఈ స్థలాన్ని జేసీబితో చదును చేయించేందుకు యత్నించగా విషయం తెలుసుకున్న గ్రామ దళితులు అక్కడకు చేరుకుని తాము ఈ స్థలంలో ఏళ్లతరబడి వ్యవసాయం చేసుకుంటున్నామని, ఈ స్థలంలో సబ్స్టేషన్ నిర్మిస్తే తమ పరిస్థితి ఏమిటని ట్రాన్స్కో అధికారులను ప్రశ్నించారు. తమ తాతల కాలం నాటి నుండి ఈ స్థలంలో తాము వ్యవసాయం చేసుకుంటున్నామని.. ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్న దళితుల భూములను లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో చేసేది ఏమీలేక అధికారులు అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయారు. -
నిశ్చితార్థం రోజే నేవీ ఇంజనీర్ దుర్మరణం
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో ఘోరం జరిగింది. మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆ యువకుడికి మరి కొద్ది గంటల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే ఇంట్లో భారీ పేలుడు సంభవించి అతడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం సత్యనారాయణ కాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలో నివసిస్తున్న రైల్వే ఉద్యోగి విన్నకోట హరగోపాల్, దమయంతిల కుమారుడు రాజా(26) మంగళవారం రాత్రి అనూహ్యంగా మరణించాడు. నౌకాదళం(నేవీ)లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజాకు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. బుధవారం ఉదయం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కార్యక్రమానికి కావల్సిన వస్తువులు షాపింగ్ చేసేందుకు నిన్న సాయంత్రం హరగోపాల్, దమయంతి దంపతులు నగరానికి వచ్చారు. ఇంట్లో రాజాతోపాటు అమ్మమ్మ ఉంది. ఇంతలోనే ఉన్నట్లుండి ఫ్రిజ్ చెడిపోయింది. దీంతో రాజా.. మెకానిక్ ను పిలిపించాడు. ఫ్రిజ్ ను ఊడదీసి పరిశీలించిన మెకానిక్.. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల స్థానంలో కొత్తవి కొనుక్కొస్తానని వెళ్లాడు. ఈలోగా అమ్మమ్మకు కాఫీ పెట్టిద్దామని వంట గదిలోకి వెళ్లిన రాజా గ్యాస్ స్టౌ వెలిగించాడు. అంతే! క్షణంలో గది నిండా మంటలు వ్యాపించాయి. సిలిండర్ పేలడంతో మంటలు ఎక్కువయ్యాయి. ఆ వెంటనే పక్కనున్న మరో సిలిండర్ కూడా పేలింది. అగ్నికీలల ధాటికి వంటగది అమాంతం కూలిపోయింది. మంటల్లో చిక్కుకున్న రాజా తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఇంట్లోని సోఫాలు, ఎల్ఈడీ టీవీలతో పాటు వంట సామగ్రి, తదితరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ఇంటి బయట కూర్చున్న రాజా అమ్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది.. అతికష్టం మీద మంటలను ఆర్పి రాత్రి 10 గంటల సమయంలో రాజాను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఒంటి గంట సమయంలో రాజా కన్నుమూశాడు. ఒక్కగానొక కొడుకు నిశ్చితార్థం జరగాల్సిన రోజే అంత్యక్రియలు జరగడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఫ్రిజ్ రిపేర్ సమయంలో అందులో ఉండే నైట్రోజన్ గ్యాస్ లీకవ్వడం వల్లనే గ్యాస్ సిలిండర్ అంటుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
గెస్ట్హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు
కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ అధికారిక వసతి గృహంలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదు జంటలను అరెస్ట్ చేసి కీసర పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు కిలోల గంజాయి పట్టివేత
కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రాంపెల్లి గ్రామంలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. గంజాయి అక్రమంగా నిల్వ చేస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
కడుపు నొప్పి తాళలేక...
కీసర: రంగారెడ్డి జిల్లాలో కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కీసరకు చెందిన భవాని(22)కి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్తో రెండేళ్ల కిందట వివాహమైంది. ఈ క్రమంలో భవాని గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేక శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటన గమనించిన స్థానికులు ఆమెని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. -
చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లకు టోకరా
-
చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లకు టోకరా
కీసర: చిట్టీలు, అప్పుల పేరుతో జనం నుంచి రూ. 2.50 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యాపారి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన రాకుల మల్లేశ్ గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అందరితోనూ ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు. చిట్టీలు, రుణం రూపేణా డబ్బులు మొత్తం కలసి రూ.2.50 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో బాధితులంతా ఆరా తీయగా పరారీలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై దాదాపు 85 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ గురవారెడ్డి మల్లేశ్ భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఏటీఎంలో చోరీకి యత్నం
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో సోమవారం రాత్రి దుండగులు దొంగతనానికి విఫలయత్నం చేశారు. మిషన్ను పగులగొట్టి, డబ్బులు తీసుకునేందుకు చేసిన ప్రయత్నం సఫలం కాకపోవటంతో వెనుదిరిగారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాపలా లేని ఈ ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరా ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. -
రాజకీయ నేతపై లైంగిక వేధింపుల కేసు
కీసర (రంగారెడ్డి): తెలంగాణలో ఓ ప్రముఖ పార్టీకి చెందిన ఓ యువనేతపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన సంతోష్గౌడ్ (35) అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతోష్ గౌడ్ తెలంగాణలోని ఓ ప్రముఖ పార్టీకి కీసర మండల యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడలో సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలోని పుస్తెల తాడును దుండగుడు అపహరించుకుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మంజుల(30) అనే వివాహిత ఇంట్లో టీవీ చూస్తుండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ దుండగుడు తలుపు తట్టాడు. మంజుల తలుపు తీయడం ఆలస్యం ఆమె ముఖంపై మత్తుమందు చల్లి, మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకుని పరారయ్యాడు. అయితే అదే సమయంలో ఇంట్లో ఉన్న మంజుల భర్త భాస్కర్రెడ్డి, మామ రాజారెడ్డి అప్రమత్తమై దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినా అతడు చిక్కలేదు. దీనిపై బాధితులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మూకుమ్మడి బహిష్కరణ
రంగారెడ్డి జిల్లా కీసరలో సోమవారం జరగాల్సిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. మండలంలోని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. ఎంపీపీ సుజాత, ఎండీవో విజయ్కుమార్ మండల పరిషత్ ఆదాయ వ్యయాలపై వివరాలు ఇవ్వడం లేదంటూ 14 ఎంపీటీసీలు ఆరోపించారు. ఒక స్థాయిలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు. -
కీసరలో భారీ చోరీ
కీసర: అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భార్య భర్తలను కట్టేసి ఇంట్లో ఉన్న బంగారంతో ఉడాయించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందనపల్లి, వికలాంగుల కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి భార్యాభర్తలను బంధించి.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే సమయంలో సాయం కోసం అరవడానికి ప్రయత్నించిన శ్రీనివాస్ రెడ్డిని తీవ్రంగా గాయపరిచారు. దుండగులు పరారయ్యాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
చిర్యాలకు పొటెత్తిన భక్తులు
కీసర (రంగారెడ్డి) : శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి సందర్భంగా రంగారెడ్డి జిల్లా చిర్యాల లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయంలో సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి పల్లకీసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి విశేష అలంకరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ చెర్మైన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కండక్టర్ ఇంట్లో చోరీ
రంగారెడ్డి : ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని సిద్ధార్థ పాఠశాల సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కుషాయిగూడ ఆర్టీసీ డిపో పరిధిలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్.. సమీప బంధువులు మృతి చెందడంతో అక్కడికి వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. లోపలికి వెళ్లి చూసేసరికి ఇంట్లో దాచి ఉంచిన లక్ష రూపాయల నగదుతో పాటు కొద్ది మొత్తంలో బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మంద నుంచి 60 గొర్రెలు అపహరణ
కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని ఓ కాపరికి చెందిన 60 గొర్రెలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రాంపల్లి గ్రామానికి చెందిన రేగు స్వామి గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. కాగా సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చిరు జల్లులు కురుస్తుండటంతో గొర్రెలను దొడ్డిలో ఉంచి ఇంట్లో నిద్రించాడు. అయితే మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో మంద వద్దకు వెళ్లి పరిశీలించగా 60 గొర్రెలు కనిపించలేదు. గుర్తుతెలియని దుండగులు గొర్రెలను తస్కరించుకెళ్లినట్లు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ రూ.4 లక్షలుంటుందని పేర్కొన్నాడు. -
ఆటో బోల్తా : 25 మందికి గాయాలు
కీసర: రంగారెడ్డి జిల్లా కీసరలో శనివారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రంగా గాయలు కాగా, మరో 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు.. కీసరలోని ఒక ప్రైవేట్ దుస్తుల కంపెనీలో పని చేసేందుకు ఆ సంస్థ యాజమాన్యం ఆటోలో 30 మంది మహిళలను తరలిస్తుంది. ఈ క్రమంలో ఆటో బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అక్రమ కట్టడాల కూల్చివేత: ఉద్రిక్తత
కీసర: అక్రమ కట్టడాలపై రంగారెడ్డి జిల్లా కీసర రెవెన్యూ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. మండలంలోని దమ్మాయిగూడ గ్రామం, భవానీనగర్లో ప్రభుత్వ స్థలాల్లోని సుమారు 70 ఆక్రమ నిర్మాణాలను శనివారం జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. కాగా, ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారికి గ్రామ సర్పంచ్ అనురాధ మద్దతుగా నిలిచారు. ఇక్కడ పేదలు ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారని, నిర్మాణాలను కూల్చవద్దని కోరారు. అయితే, అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని రెవెన్యూ సిబ్బంది సర్పంచ్కు వివరించారు. అనంతరం గట్టి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. -
బైక్ ను ఢీకొన్నకారు..ఇద్దరికి తీవ్ర గాయాలు
కీసర : వేగంగా వచ్చిన లారీ, కారుని ఢీకొట్టడంతో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కారు డ్రైవర్ ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కరీంగూడ నుంచి రాంపల్లి వైపు అతివేగంగా వస్తున్న లారీ కుషాయిగూడ నుంచి వెళ్తున్న కారును రాంపల్లి చౌరస్తా వద్ద ఢీకొట్టింది. దీంతో ప్రమాదం నుంచి తప్పించడానికి డ్రైవర్ చేసిన ప్రయత్నంలో కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్నభార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు ఘట్కేసర్ మండలం ఎన్నంపేట గ్రామానికి చెందిన బహదూర్ అలి, ముంతాజ్ బేగం గా గుర్తించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
మరోసారి కిందకు దిగిన ఎన్ హెచ్ బ్రిడ్జ్!
-
మరోసారి కిందకు దిగిన ఎన్ హెచ్ బ్రిడ్జ్!
హైదరాబాద్: హైదరాబాద్ టూ విజయవాడ మార్గాన్ని కలిపై జాతీయ రహదారి (ఎన్ హెచ్) బ్రిడ్జిలో మరోసారి కదిలిక వచ్చింది. గత కొన్నేళ్లుగా ఏదో సమయంలో ఈ బ్రిడ్జి కొద్ది కొద్దిగా కిందకు దిగుతూనే ఉంది. తాజాగా కీసర 6వ బ్లాక్ బ్రిడ్జి స్వల్పంగా కదలడంతో కలవరం మొదలైంది. ఆ బ్రిడ్జి అర అంగుళం మేర కిందకు దిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లలో ఈ బ్రిడ్జి మూడో సారి కిందికి దిగినా టోల్ ప్లాజా అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పుణ్యమా అని ఈ బ్రిడ్జి క్రమేపీ కిందకు దిగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. -
కీసరలో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం
జిల్లాలోని కీసరలో ఓ స్వీట్హౌస్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు సజీవ దహనమైయ్యారు. బాలాజీ స్వీట్హౌస్లో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. -
9వ తరగతి విద్యార్థిని అదృశ్యం
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలోని సాంఘిక సంసక్షేమ పాఠశాల వసతిగృహం నుంచి భవాని అనే 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. రాజు అనే వ్యక్తిపై భవాని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజు, భవాని ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి వెళ్లిపోయివుంటారని భావిస్తున్నారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కీసరలో బాలయ్య సందడి
కీసర: కీసర మండలంలోని కరీంగూడా- కీసర ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో గల ఓఆర్ఆర్పై ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ శనివారం కూడా కొనసాగింది. సత్యదేవ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఓఆర్ఆర్పై బాలకృష్ణ , రౌడీల మధ్య ఫైటింగ్ సన్నివేశాలు.. బాలకృష్ణ బైక్పై రౌడీలను తరమడం, ఆకాశంపై నుండి హెలీకాప్టర్ వెంబడించడం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. ఫైటర్స్ రామ్లక్ష్మణ్ల ఆధ్వర్యంలో పైటింగ్ సన్నివేశాలను షూట్ చేశారు. బాలకృష్ణను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. బాలయ్య బాబు షూటింగ్ విరామంలో పలుమార్లు అభిమానులను పలుకరించారు. ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తుండగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. -
కీసరలో బీటెక్ విద్యార్ధిపై అత్యాచారం
కీసర: ఆస్పత్రికి తీసుకు వెళ్తానని నమ్మించి ఓ యువతిపై యువకుడు అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రాజీవ్ గృహకల్ప నివాస సముదాయం వద్ద చోటు చేసుకుంది. బాధితురాలు బీటెక్ చదువుతున్నట్టు తెలిసింది. నిందితుడిని నరేష్ గా గుర్తించారు. బాధితురాలి కుటంబం ఫిర్యాదు మేరకు నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కీసర ఎంపీపీ ఎన్నిక వాయిదా
కీసర: కీసర మండల మండలాధ్యక్షుడి ఎన్నిక నాటకీయ పరిణామల మధ్య శుక్రవారం వాయిదా పడింది. మండల పరిషత్లో 20 ఎంపీటీసీ సభ్యులకు 15 మంది మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిని ఎకగ్రీవంగా ఎంపిక చేయడంలో పార్టీ అధిష్టానం పూర్తిగా విఫలమైంది. సీల్డ్కవర్ ద్వారా ప్రతిపాదించబడ్డ అభ్యర్థి రామారం సుజాతకు వ్యతిరేకంగా పార్టీ విప్ను ధిక్కరిస్తామని, ఎంపీపీ అభ్యర్థిగా యాద్గార్పల్లి ఎంపీటీసీ మల్లేష్కు మద్దతు ఇస్తామని దమ్మాయిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు, అహ్మద్గూడా గ్రామానికి చెందిన ఇద్దరు, కీసర-3 ఎంపీటీసీలు ప్రకటించారు. మరోవైపు ఎంపీపీ పదవిని ఆశించిన మరో ఎంపీటీసీ గోధుమకుంట ఎంపీటీసీ మంచాల పెంటయ్య, చీర్యాల ఎంపీటీసీ సంగీత సైతం కొమ్ము మల్లేష్కు మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందనుకుంటుడగా బోగారం ఎంపీటీసీ మారారం సుజాత వెళ్లిపోయారు. తనను ఎంపీపీగా చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు మాట తప్పిందని నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అక్కడున్న వారికి ఫోన్ ద్వారా సమాచారమందించారు. దీంతో కంగారు పడ్డ పార్టీ నేతలు ఎట్టకేలకు రామారం సుజాతను తిరిగి మండల పరిషత్కు తీసుకువచ్చారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై పార్టీలో తిరిగి వాదోపవాదాలు జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జి తోట కూర జంగయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కౌకుట్ల చంద్రారెడ్డి తదితరులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమయ్యారు. ఎంపీపీ ఎన్నిక వాయిదా పడేలా కోరం లేకుండా చూసుకున్న టీడీపీ నేతలు అక్కడి నుంచి ఎంపీటీసీలను తిరిగి క్యాంప్నకు తరలించారు. ఎన్నిక నేటికి వాయిదా.. కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నికను శనివారం నాటికి వాయిదా వేస్తున్నట్లు మండల ప్రత్యేకాధికి విద్య, ఎంపీడిఓ నిరంజన్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి కోరం సభ్యులు ఉంటే సమావేశాన్ని నిర్వహిస్తామని, అది కూడా వీలుకాని పక్షంలో ఎన్నికల కమిషన్కు నివేదిక సమర్పించి, వారి ఆదేశాల మేరకు తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీటీసీలు.. కీసర మండలంలో 20 మంది ఎంపీటీసీలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకాధికారి విద్య ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కో ఆప్షన్ సభ్యుడిగా మహ్మద్గౌస్.. మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్గా దమ్మాయిగూడ గ్రామానికి చెందిన ఎండి.గౌస్ ఎన్నికయ్యారు. -
చనిపోతున్నాను..
మిత్రుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు డబ్బుల విషయమై గొడవ.. మనస్తాపంతో బలవన్మరణం మృతుడు మెదక్ జిల్లావాసి కీసరలో ఘటన కీసర, న్యూస్లైన్: డబ్బుల విషయమై గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ యువ కుడు స్నేహితుడికి ఫోన్ చేసి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. మృతుడు మెదక్జిల్లా వాసి. ఈ సంఘటన సోమవారం కీసరగుట్ట సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా ములుగు మండలం తుంకిబొల్లారం గ్రామానికి చెందిన అక్కిరెడ్డి భాస్కర్రెడ్డి (25) ఆర్నెల్లుగా కీసర గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్లో మేనేజర్గా పనిచేస్తూ స్థానికంగా అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం డబ్బుల విషయమై పెట్రోల్ బంక్లో క్యాషియర్కు, భాస్కర్రెడ్డికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో భాస్కర్రెడ్డి ములుగులోని తన మిత్రుడు మహేందర్కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ‘జీవితంపై విరక్తి కలిగింది.. నేను చనిపోతున్నా..’ అని తెలిపాడు. సోమవారం ఉదయం తిరిగి 10:30 గంటల సమయంలో కూడా మరోమారు మహేందర్కు ఫోన్ చేసి తను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పి అనంతరం ఫోన్ స్విఛాఫ్ చేశాడు. మహేందర్ సమాచారంతో సోమవారం ఉదయం భాస్కర్రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు కీసరకు చేరుకొని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా బంక్ మూసేసి భాస్కర్రెడ్డి కోసం గాలించసాగారు. భాస్కర్రెడ్డి సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు, కుటుంబీకులు కీసరగుట్ట సమీపంలో వెతికారు. మొండిగుట్ట దగ్గర ఆయన పురుగుమందు తాగి విగతజీవిగా పడి ఉన్నాడు. ఎస్ఐ శ్రీహరి ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. భాస్కర్రెడ్డి అవివాహితుడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో భాస్కర్రెడ్డి తండ్రి ఎల్లారెడ్డి, కుటుంబీకులు ఘటనా స్థలంలో గుండెలుబాదుకుంటూ రోదించారు. ‘ ఈ చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకున్నవారా..?’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కీసరగుట్టలో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
వేదపండితుల ఆధ్వర్యంలో భేరీపూజ, ధ్వజారోహణం నేటిరాత్రి శ్రీరామలింగేశ్వరస్వామివారి కల్యాణం కీసర, న్యూస్లైన్: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శంభో శంకర, హరహర మహాదేవ అంటూ భక్తుల నామస్మరణతో కీసరగుట్ట మార్మోగింది. టీటీడీ వేద పాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, ఆచార్య పుల్లేటికుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తటాకం రమేష్ దంపతులచే మహామండపంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ చైర్మన్ దంపతుల సహా యాగశాల ప్రవేశం చేసిన వేదపండితులు అగ్నిప్రతిష్ఠాపన గావించారు. భేరీ పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు. బ్రహోత్సవాల ప్రారంబోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున జేసీ చంపాలాల్, పీడీ సుధాకర్రెడ్డి హాజరయ్యారు. ఆలయ వేదపండితులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం జే సీ చంపాలాల్, పీడీ సుధాకర్రెడ్డిలకు వేద పండితులు స్వామివారి ఆశీర్వచనంతోపాటు మహాప్రసాదాన్ని అందజేశారు. మొదటి రోజు పూజా కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్రెడ్డి, తహసీల్దార్ జయమ్మ, ఆలయ ఫౌండర్ట్రస్టీ సభ్యులు తటాకం నారాయణ శర్మ, వెంకటేష్ శర్మ, ఉమాపతి శర్మ, శ్రీనివాస్ శర్మ, నాగలింగం శర్మ తదితరులు పాల్గొన్నారు. నేటి పూజా కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన బుధవారం ఉదయం రుద్ర స్వాహాకార హో మం, వేదపారాయణం, సాయంత్రం బి ల్వార్చన, రాత్రి ప్రదోషకాల పూజ, హా రతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద విని యోగం జరుగుతాయి. కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు శ్రీస్వామివారు విచ్చేసిన అనంతరం రాత్రి 10 గంటలకు శ్రీ భవాని శివదుర్గాసమేత రామలింగే శ్వరస్వామివార్ల కల్యాణం నిర్వహిస్తారు. -
నేటి నుంచి కీసర బ్రహ్మోత్సవాలు
పూర్తయిన ఏర్పాట్లు వచ్చేనెల 2వ తేదీ వరకు జాతర కీసర, న్యూస్లైన్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కీసరగుట్ట దేవాలయంలో మంగళవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, ఆచార్య పుల్లేటీకుర్తి గణపతిశర్మ ప్రధాన సంధానకర్తగా వైదిక కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం ఉదయం 11గంటలకు ఆలయ చైర్మన్ తటాకం రమేష్శర్మ దంపతులచే విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విక్పరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్ఠాపనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతిరాగాలాపన, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం, పరాకస్తవం, రాత్రి 8 గంటలకు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి స్వామివారి ఊరేగింపు ఉంటాయి. పకడ్బందీ ఏర్పాట్లు.. కీసరగుట్ట జాతరకు ఆరులక్షలమంది యాత్రికులు వస్తారని అధికారులు, ఆలయ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. జాయింట్ కలెక్టర్ చంపాలాల్ ఆధ్వర్యంలో జాతర కోఆర్డినేషన్ కమిటీ సోమవారం సాయంత్రం మరోసారి జాతర ఏర్పాట్లను సమీక్షించింది. మహాశివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వీవీఐపీ పాస్లు లేవు.. ఈ ఏడాది జాతరలో వీవీఐపీ పాస్ల విధానాన్ని ఉపసంహరించారు. ఈ పాస్ల జారీపై ఆలయ చైర్మన్, జిల్లా అధికారులు ఎన్నోసార్లు చర్చించి చివరికి పాస్లు ఇవ్వరాదని నిర్ణయించారు. దర్శనానికి వచ్చే ముఖ్యులను రిసెప్షన్ కమిటీ ద్వారా వీవీఐపీ ప్రత్యేక గేటు ద్వారా పంపనున్నారు. రూ.250, రూ.100 ప్రత్యేక దర్శనాలతో పాటు అభిషేక భక్తులకు అదనంగా మరో క్యూలైన్ ఏర్పాటు చేశారు. భక్తులకు లోటు రాకుండా చర్యలు .. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి దర్శనం కోసం కీసరగుట్టకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆలయ చైర్మన్ తటాకం రమేష్శర్మ తెలిపారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కలిగేలా ప్రధానంగా దృష్టి సారించామన్నారు. -
పల్లెల గుండెల్లో పేలుళ్లు
కీసర, న్యూస్లైన్: ఉదయం సాయంత్రం తేడా లేదు.. భీకరమైన శబ్దాలు.. పిల్లలు ఉలిక్కిపడి లేస్తున్నా.. పగలూరాత్రి అని ఆలోచించరు. పల్లెలన్నీ తల్లడిల్లుతున్నా.. మైనింగ్ ఆపరు. చరిత్రాత్మక ఆలయానికి పగుళ్లు వస్తు న్నా.. వారికేం పట్టదు. అక్రమార్కులు, అధికారులు ఒక్కటిగా సాగిస్తున్న బ్లాస్టింగ్ల పర్వం కీసర ప్రాంత ప్రజ లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఉదయం, సాయంత్రం మాత్రమే జరిగిన బ్లాస్టిం గ్లు ఇప్పుడు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కీసర మండలంలోని కీసరగుట్ట, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి సమీప ప్రాంతాల్లోని గుట్టలను యధేచ్చగా పేల్చేస్తున్నారు. అడ్డూఅదుపు లేకుం డా ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ బ్లాస్టింగ్లకు పరోక్షంగా అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పెద్దపెద్ద బండరాళ్లను పేల్చేయడానికి పరిమితికి మించి పేలుడు పదార్థాలను ఉపయోగించి 20 అడుగుల వరకు డ్రిల్లింగ్ చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. సమీపంలోని నివాస ప్రాంతాలు ఈ భారీ శబ్దాలకు వణికిపోతున్నాయి. భూకంప ప్రకంపనలను పోలి ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా ఇప్పటికే కీసర, భోగారం, తిమ్మాయిపల్లి, అంకిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. పేలుళ్ల కారణంగా ప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టకు ముప్పు పొంచిఉంది. అప్పట్లో స్థానిక ప్రజలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ కీసరగుట్ట చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్లాస్టింగ్లను నిషేధించారు. కాని కొన్ని నెలలే నిషేధం కొనసాగింది. ఆ తర్వాత అధికారుల అండతో మళ్లీ వ్యాపారులు బ్లాస్టింగ్లను ప్రారంభించారు. గ్రానైట్ పరిశ్రమ వల్ల వేలాది కుటుంబాలు బతుకుతున్నాయని, పరిమితులతో కూడిన పేలుళ్లు జరుపుతామని, మితంగా పేలుడు పదార్ధాలు వాడుతామని లాబీయింగ్ చేశారు. కీసరగుట్ట సమీపంలో కేవలం చేతితోనే రాళ్లకు పగులగొట్టేందుకు, గుట్టకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరిమిత పేలుడు పదార్థాలు మాత్రమే వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఆ నిబంధనలు వ్యాపారుల ఆగడాలను ఆపలేకపోయాయి. కీసరగుట్ట దిగువ ప్రాంతమైన వన్నిగూడలోనే అతిపెద్ద కంకర మిషన్ ఏర్పాటు చేసి క్రషింగ్ చేస్తున్నారు. అసైన్డ్ భూములు కలిగి ఉన్న రైతులకు అంతోఇంతో ముట్టజెప్పి వందలాది ఎకరాలను చేజిక్కిం చుకుని అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులతో మంచి ‘బంధాన్ని’ కొనసాగిస్తూ ఎవరూ అడ్డుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా మైనింగ్ జరుపుతున్నా సమీప గ్రామాలకు నామమాత్రపు రాయల్టీ చెల్లించలేదు. మైనింగ్ శాఖ బకాయి పడిన కోట్లాది రూపాయలను చెల్లించాలని గత మండల పరి షత్ పాలకవర్గం ఎంతపోరు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అనుమతులకు మించి పేలుళ్లకు పాల్పడుతున్నారని ఎన్నోమార్లు ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులెవరూ చర్యలకు ముందుకు రాలేదు. బ్లాస్టింగ్లకు సంబంధించి ప్రాథమిక నియమాల ప్రకారం శబ్దతీవ్రత ఎంతవరకు ఉండాలో నిర్ణయించారు. వీటిని క్రషర్ మిషన్ల వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఇక బ్లాస్టింగ్ సమయంలో సమీప పొలాలన్నీ రాళ్లతో నిండిపోతున్నాయి. చిన్నసైజు నుంచి పెద్ద సైజు రాళ్లను తొలగించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిమార్లు ఆ ప్రదేశాల్లో రైతులు ఉన్నప్పుడే పేలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గుడి గోపురాలకు దెబ్బ కీసరగుట్టకు అతి సమీపంలోనే క్రషర్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదకర బ్లాస్టింగ్ల మూలంగా దేవాలయ గోపురాలు దెబ్బతింటున్నాయి. గతంలో దేవాలయానికి సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి పేలుళ్లు చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు అమలు కావడంలేదు. - తటాకం వెంకటేష్. కీసర ఇళ్ల గోడలకు పగుళ్లు గ్రామాలకు అతి సమీపంలో పేలుళ్లకు పాల్పడడంతో ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయి. పేలుడు జరిగినప్పుడు ఇళ్ల కిటికీల అద్దాలు పగులుతున్నాయి. భారీ శబ్దాల మూలంగా చిన్నారులు భయపడిపోతున్నారు. సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రాళ్లు పడుతున్నాయి. - రాజలింగంగౌడ్, తిమ్మాయిపల్లి గ్రామం అక్రమాలపై చర్యలు తీసుకోవాలి కీసర మండలంలోని వివిధ గ్రామాలకు సమీపంలో వ్యాపారులు పెద్ద సంఖ్యలో క్రషర్ మిషన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, అసైన్డ్ స్థలాల్లో పరిమితికి మంచి బ్లాస్టింగ్లు చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలకు దిగాలి. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. - చినింగని గణేష్, సర్పంచ్, కీసర పంచాయతీలకు రాయల్టీ ఇవ్వాలి చాలా ఏళ్లుగా క్రషర్ మిషన్లు కొనసాగుతున్నా గ్రామ పంచాయతీలకు రాయల్టీ రావడం లేదు. మండలంలోని కీసర, భోగారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీలకు పెద్ద మొత్తంలో రావాల్సిన రాయల్టీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. - ముప్పురాంరెడ్డి, నాగారం -
ఖోఖో పోటీలకు ఏర్పాట్లు పూర్తి
కీసర, న్యూస్లైన్: కీసరలో నేటినుంచి మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్ర శేఖర్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఖోఖో పోటీలు కీసరలోని సెరినిటీ పాఠశాల ఆవరణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ మేరకు గ్రౌండ్ను సిద్ధం చేశామని చెప్పారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి అండర్ -14 విభాగంలో బాల బాలికలు పాల్గొంటారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా నుంచి 2 జట్లు (బాలురు, బాలికలు)పాల్గొంటాయని మొత్తం 552 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులకు సెరినిటీ పాఠశాల, అరుంధతి పాఠశాల్లో వసతి సౌక ర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులకు మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ ఉచితంగా భోజన వసతి కల్పించారని చెప్పారు. క్రీడల నిర్వహణలో 120 మంది పీఈటీలు పాల్గొంటారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.