మిడ్జిల్: గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా దోనూర్ గ్రామాన్ని మంత్రి లక్ష్మారెడ్డి దత్తత తీసుకున్నట్లు ఎంపిడిఓ తిర్పతయ్య తెలిపారు, మిడ్జిల్ను జెడ్పిటిసి హైమావతి,రాచాలపల్లిని ఎంపిపి దీప దత్తత తీసుకోగ మండలంలోని 30 గ్రామ పంచాయితిలకు ప్రత్యేకాధికారులను నియమించిన్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఊర్కోండపేట్ గ్రామంలో ఎంపిడిఓ గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈసందర్బంగా గ్రామస్థులకు గ్రామ జ్యోతి సందేశం చదివి వినిపించారు. అనంతరం గ్రామస్థుల చేత,విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ కష్ణగౌడ్ ,ఎంపిటిసి రాణి పాల్గోన్నారు. అలాగే మాధారం,బైరంపల్లి,వెలుగోమ్ముల ,కోత్తపల్లి గ్రామాలలో వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.
గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి
Published Mon, Aug 17 2015 10:58 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
Advertisement
Advertisement