గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. గురువారం గుంటూరులో మోపిదేవి వెంకటరమణ విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు పట్టిసీమను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కమీషన్ కోసమే పట్టిసీమ తప్ప... ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదని మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. పట్టిసీమను బుధవారం చంద్రబాబు మూడోసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే.