pattiseema lift irrigation project
-
‘పట్టిసీమ’ పైప్లైన్ లీక్
పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్లైన్ లీకై 20 అడుగుల మేర నీరు ఎగసిపడింది. సమీపంలోని పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. యథావిధిగా శుక్రవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి కుడి కాలువలోకి నీరు విడుదల చేశారు. అయితే మార్గమధ్యంలో చీకడోడిమెట్ట ప్రాంతంలో భారీగా నీరు లీకై పొలాల్లోకి చేరుతోంది. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టిసీమ ఇంజనీరింగ్ అధికారులు మోటార్లను నిలిపివేసి పైప్లైన్ పరిస్థితిని పరిశీలించారు. చీకడోడిమెట్ట ప్రాంతంలో ఎయిర్ వాల్ ప్లేట్ లేకపోవడంతో నీరు ఎగసిపడినట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం నీటి విడుదలను పునరుద్ధరించారు. గతంలో పైప్లైన్ ఎయిర్ వాల్ ప్లేట్ను తొలగించి రైతులు సాగునీటిని వినియోగించుకున్నారని, ఆ తర్వాత ప్లేట్ సరిగా బిగించకపోవడం వల్ల నీటి ఒత్తిడికి అది ఎగిరిపోయి నీరు ఎగసిపడినట్టు డీఈ ఆర్.పెద్దిరాజు తెలిపారు. కాగా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల రెండో తేదీన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి హడావుడిగా కుడి కాలువకు నీటిని విడుదల చేశారని, పైప్లైన్ను పూర్తిగా పరిశీలించి మరమ్మతులు చేపట్టే అవకాశం కూడా ఇవ్వలేదని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నామినేషన్పై అడ్డగోలు లూటీ!
సాక్షి, అమరావతి: అటు పేదలకు పథకాలు అందకూడదు.. ఇటు ప్రాజెక్టుల పనులు ముందుకు సాగకూడదు!! ఇదీ ఈనాడు దుర్బుద్ధి! ఇదే లక్ష్యంగా అస్మదీయులకు అడ్డగోలుగా.. అంటూ ఓ బురద కథనాన్ని పాఠకులపైకి వదిలింది. ఓ నిర్మాణ కంపెనీకి ప్రభుత్వం అంతులేని మేలు చేస్తోందంటూ రామోజీ అక్కసు వెళ్లగక్కారు. గత సర్కారు హయాంలోనూ ఇదే కంపెనీ కాంట్రాక్టు పనులు చేసిన విషయం ఆయనకు గుర్తులేదా? రామోజీ, యనమల బంధుగణం నవయుగ, పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్పై పనులను దక్కించుకుని అంచనాలు పెంచేసి బిల్లులు కాజేయడం నిజం కాదా? నాటి సీఎం చంద్రబాబు అండతో ప్రజాధనాన్ని కొల్లగొట్టడం రామోజీకి తప్పుగా తోచలేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులు చేపట్టినా వ్యతిరేకించడం దివాళాకోరుతనం కాదా? అయినా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలుంటాయి. అందుకు అనుగుణంగా పనులు చేపడతాయి. అది కూడా తప్పుబట్టే వారిని ఏమనుకోవాలి? ఈనాడు ఆరోపణ: బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ గ్యారెంటీలా? వాస్తవం: మీడియా ముసుగులో బురద చల్లుతున్న ఇదే రామోజీ గతంలో మధ్యవర్తిత్వం నడిపి పట్టిసీమ, పురుషోత్త పట్నం లాంటి పథకాలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా + 22 శాతంతో అధిక రేట్లకు కట్టబెట్టారు. అప్పుడు ఇదే గుత్తేదారు చంద్రబాబుకు అస్మదీయుడని ఆయనకు ఎందుకు అనిపించలేదు? పోలవరంలో రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్కి నిబంధనలకు విరుద్ధంగా రూ.1,333 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెట్టినప్పుడు రామోజీకి ఫైనాన్స్ కోడ్ గుర్తు రాలేదా? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అదే పనిని రివర్స్ టెండర్ల ద్వారా 12.60 శాతం తక్కువ వ్యయంతో మేఘా సంస్థకు పారదర్శకంగా కేటాయించి రూ.660 కోట్లను ఆదా చేసింది. 22 శాతం అదనంతో రూ.257.39 కోట్లను చంద్రబాబు లూటీ చేస్తే అది తప్పుకాదా రామోజీ? ఈనాడు ఆరోపణ: అస్మదీయుల బిల్లుల చెల్లింపులకు అడ్డగోలుగా గ్యారెంటీలు వాస్తవం: గత ప్రభుత్వంలోనూ ఇదే కాంట్రాక్టు సంస్థ పట్టిసీమ సహా వివిధ ప్రాజెక్టుల్లో పనులు చేసింది. మరి రామోజీకి అప్పుడు అంతా సవ్యంగానే కనిపించింది కదా? మేఘా ప్రతిపాదనలకు అధికారులు సై.. వాస్తవం: మేఘా కంపెనీ పోలవరంతోపాటు కీలకమైన వెలిగొండ టన్నెల్ పనులు చేస్తోంది. పోలవరం కోసం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖజానా నుంచి రూ.1,319 కోట్లు పోలవరం పనులకు వ్యయం చేసింది. మేఘా దాదాపు రూ.1,200 కోట్ల మేర పనులు చేసింది. పోలవరం పనులు పునఃప్రారంభించే సీజన్ ఆరంభం కావడంతో డబ్బులు రీయింబర్స్ చేయాలని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించేలోగా పనులను వడివడిగా చేపట్టి కొలిక్కి తేవాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఈ నేపథ్యంలో మేఘా నిధుల కోసం బ్యాంకుల నుంచి లోన్ తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి కోరింది. ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా షరతులతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బ్యాంకు విధించే వడ్డీ తదితర రుసుములను పూర్తిగా మేఘానే భరించాల్సి ఉంటుంది. న్యాయపరమైన అన్ని అంశాలకు సైతం కంపెనీనే బాధ్యత వహించాలి. ఇటువంటి కఠిన షరతుల మధ్య మేఘా ప్రతిపాదన పరిశీలనలో ఉంది. -
అవసరం లేకపోయినా ఎత్తిపోయాలా!?
సాక్షి, అమరావతి: పట్టువదలని వక్రమార్కుడు (రామోజీ) ఎప్పటిలాగే మళ్లీ తన అభూత కల్పనలతో ఓ సత్యదూరమైన కథనాన్ని అల్లారు. ఈసారి ఆయన రాతల గాలి పట్టిసీమ గోదావరి జలాలపై మళ్లింది. ‘పట్టిసీమ నీరూ తేలేరా’ అంటూ శనివారం ‘ఈనాడు’లో పాఠకుల మీద తన పైత్యాన్ని రుద్దిన తీరుచూస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదజల్లడానికే ఈ తప్పుడు రాతలు అని మరోసారి తన మనస్సులో మాటను చెప్పకనే చెప్పుకున్నారు. నిజానికి.. పులిచింతల, పట్టిసీమ ఎత్తిపోతల జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ కృష్ణా డెల్టా చివరి ఆయకట్టుకూ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందిస్తుంటే.. పది లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని రామోజీ.. తన కథనంలోని ప్రతి అక్షరంలో జగన్పై అక్కసు వెళ్లగక్కారు తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అప్పట్లో ఏనాడైనా సకాలంలో నీళ్లిచ్చారా? అసలు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో ఏనాడూ కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఏటా జూన్ మొదటి వారంలోనే నీళ్లందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 7న కృష్ణా డెల్టాకు నీళ్లందిస్తే సకాలంలో నీళ్లందించలేదంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో పులిచింతలలో 38 టీఎంసీలు నిల్వ ఉండేవి. గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభం కానంత వరకూ కృష్ణా డెల్టాకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను విడుదల చేశారు. బేసిన్లో వర్షాలు కురవడం.. గోదావరిలో వరద ప్రారంభమవడంతో జూలై 21న పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్చేసి.. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి జలాలను తరలించి డెల్టాకు విడుదల చేశారు. జూలై ఆఖరు, ఆగస్టు ప్రథమార్థంలో తెలంగాణలో కురిసిన వర్షాలవల్ల మూసీ నుంచి పులిచింతలలోకి 19 టీఎంసీలు చేరాయి. సీజన్ ప్రారంభంలో పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు 18 టీఎంసీలను విడుదల చేయకపోతే.. మూసీ వరద నుంచి వచ్చిన 19 టీఎంసీలు కడలి పాలయ్యేవి. ఇది ప్రస్తుత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. ప్రజాధనాన్ని వృథా చేయమంటారా? గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజ్కి పట్టిసీమ ద్వారా ఒక టీఎంసీని ఎత్తిపోయాలంటే రూ.2.65 కోట్లు వ్యయమవుతుంది. అయినా.. పులిచింతల, పట్టిసీమ జలాలతో కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకూ నీళ్లందించాలని విద్యుత్ ఛార్జీలు ఎంతైనా భరిస్తామని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల నిర్వహణకు రూ.15.80 కోట్లను విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురవడంవల్ల ఉప నదులు, వాగులు, వంకల ద్వారా ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు చేరింది. కృష్ణా డెల్టాలో మూడు దఫాలుగా భారీ వర్షాలు కురిసిన సందర్భాలలోనూ నీటి అవసరం తక్కువగా ఉంది. అలాంటి సందర్భాల్లోనూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేయడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయాలా రామోజీ? పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిపోసిన 54.35 టీఎంసీలను పులిచింతల నీటికి జతచేసి డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందించింది. డెల్టా ఎగువ ప్రాంతాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. కాలువల ద్వారా నీటి సరఫరా మీద ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం పులిచింతలలో నిల్వ ఉన్న 13.61 టీఎంసీలను తాగునీరు, అత్యవసర సాగునీటి అవసరాలకే ఉపయోగిస్తారు. అదే చంద్రబాబు హయాంలో పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోసినా కృష్ణా డెల్టాలో ఏటా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు నష్టపోయారు. అయినా రామోజీ పెన్ను ఏనాడూ పెగల్లేదు. దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే రోతరాతలుఅంతకుముందు.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తానంటూ 2014, జూలై 28న శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు.. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ధరల సర్దుబాటు (జీఓ–22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు (జీఓ–63)ల ద్వారా కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. రాబట్టుకున్న కమీషన్లను చంద్రబాబు ముఠా పప్పుబెల్లాల్లా పంచుకుంది. అందులో రామోజీకి వాటా దక్కింది. నిజానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే పులిచింతలలో 45.77 టీఎంసీలు నిల్వచేసుకోవచ్చునని.. కృష్ణా డెల్టాకు అది వరమని అప్పట్లో సీఎం వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో దాదాపుగా ఒకేసారి వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలే. అలాంటప్పుడు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తే.. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయాల్సిందే. పట్టిసీమకు పెట్టే వ్యయాన్ని పోలవరంపై పెట్టి పూర్తిచేస్తే.. గ్రావిటీపై కృష్ణా డెల్టాకు నీళ్లందించవచ్చునని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చెప్పారు. దీన్ని సాగునీటిరంగ నిపుణులు, అధికారులు అప్పుడూ, ఇప్పుడూ బలపరుస్తున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే నిర్వాసితుల సమస్యను పరిష్కరించి 2019 నుంచి పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వచేస్తున్నారు కాబట్టే.. ఏటా కృష్ణా డెల్టాకు సకాలంలో సమృద్ధిగా నీళ్లందించగలుగుతున్నారు. -
నీళ్లపై రామోజీ విషం
-
నీళ్లపై రామోజీ విషం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రారంభించారు కాబట్టి అందులో ఎంత అవినీతి జరిగినా పట్టించుకోకూడదు!! గత సర్కారు హయాంలో కమీషన్లు కాజేసినా సరే అది నిరాటంకంగా సాగిపోవాల్సిందే!! అవసరం ఉన్నా లేకున్నా అమలై తీరాల్సిందే!! ఇదీ రామోజీ తీరు!! అందుకు తాజా తార్కాణమే ‘పట్టిసీమ నాపై పగబట్టిందే..!’ శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనం. చంద్రబాబు జేబులో డబ్బులతోనే టీడీపీ నిధులతోనే పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించినట్లుగా చిత్రీకరిస్తూ బురద చల్లేందుకు యత్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల్లో బోనస్ రూపంలో రూ.257.55 కోట్లు, కమీషన్ల రూపంలో మరో రూ.200 కోట్లకుపైగా టీడీపీ పెద్దల జేబులోకి వెళ్లిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు రామోజీ శతవిధాలా ప్రయత్నించారు. అవసరమైనప్పుడు పట్టిసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందిగానీ గోదావరి నీళ్లను ప్రకాశం బ్యారేజ్లోకి ఎత్తిపోసి సముద్రంలోకి వదిలేసేందుకు కాదనే విషయాన్ని ఇకనైనా రామోజీ గుర్తిస్తే మంచిది!! ఈనాడు ఆరోపణ: పట్టిసీమను ఇన్నాళ్లూ పక్కనపెట్టినా ఇప్పుడు అదే దిక్కు అయింది వాస్తవం: సాధారణంగా కృష్ణా, గోదావరికి ఒకేసారి వరదలు వస్తాయి. గత నాలుగేళ్లుగా జూలై నుంచే కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీటిని విడుదల చేస్తూ ప్రకాశం బ్యారేజ్ నుంచి 2019లో 797, 2020లో 1278, 2021లో 501, 2022లో 1331 టీఎంసీల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేశారు. పట్టిసీమను గత నాలుగేళ్లలో పెద్దగా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకపోయింది. కమీషన్ల కోసం చంద్రబాబు రూ.1,621.72 కోట్లు పోసి కట్టిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసి సముద్రం పాలు చేయలేదనే రీతిలో రామోజీ అక్కసు వెళ్లగక్కారు. ఆరోపణ: గోదావరి నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా పట్టిసీమ ద్వారా తరలించకుండా చోద్యం చూశారు వాస్తవం: పులిచింతలలో నిల్వ చేసిన నీటితోపాటు పట్టిసీమ నుంచి అవసరమైన మేరకు నీటిని ఎత్తిపోస్తూ కృష్ణా డెల్టాకు సమర్థంగా నీళ్లందించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దాని ప్రకారమే నీటిని సరఫరా చేస్తోంది. ఈ సీజన్ ఆరంభంలో పులిచింతలలో 38 టీఎంసీల నిల్వ ఉంది. గోదావరిలో వరద రానంతవరకూ కృష్ణా డెల్టా అవసరాల కోసం పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. పులిచింతలలో నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో గోదావరికి వరద రావడంతో పట్టిసీమ పంపులను జూలై 21న ప్రారంభించి ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డె ల్టాకు నీళ్లందించింది. ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ప్రణాళికను అమలు చేయడం వల్లే పులిచింతలలో వినియోగించుకున్న మేరకు 19 టీ ఎంసీలను తిరిగి నిల్వ చేయగలిగింది. అదే పులి చింతలలో నీటిని ముందుగా కృష్ణా డెల్టాకు విడుదల చేయకుంటే మూసీ నుంచి వచ్చిన వరద సముద్రం పాలయ్యేది. పులిచింతలకు దిగువన మున్నేరు, కట్టలేరు, పాలేరులో వరద తగ్గాక మళ్లీ పట్టి సీమ పంపులను ప్రారంభించి గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్కు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ పట్టిసీమ ద్వారా 3.14 టీఎంసీలను కృష్ణా డెల్టాకు ప్రభుత్వం సరఫరా చేసింది. రైతుల ప్రయోజనాల పరిరక్షణే ఈ ప్రభుత్వానికి పరమావధి. ఆరోపణ: పోలవరాన్ని కుళ్లబొడిచి కోలుకోకుండా చేశారు. పట్టిసీమ మాత్రం ప్రభుత్వాన్ని వదలడం లేదు వాస్తవం: పోలవరాన్ని కమీషన్ల కోసం సర్వనాశనం చేసింది చంద్రబాబే. కమీషన్ల కోసం ఆయన పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే చెప్పిన విషయం రామోజీకి గుర్తు లేదా? 2014 జూన్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 వరకూ రెండున్నరేళ్లు చంద్రబాబు పోలవరంలో తట్టెడు మట్టి కూడా తవ్వకుండా కాలక్షేపం చేశారు. దివంగత వైఎస్సార్ హయాంలో చాలావరకూ పూర్తయిన పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తూ కమీషన్ల కోసం చంద్రబాబు 2015లో పట్టిసీమ ఎత్తిపోతల చేపట్టారు. 21.99 శాతం అధిక ధరలకు (ఏడాదిలోపు పూర్తి చేస్తే 16.99 శాతం బోనస్ ఇచ్చే నిబంధనతో) కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. గడువులోగా అన్ని పనులు పూర్తి కాకున్నా రూ.257.55 కోట్లను బోనస్గా ఇ చ్చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. పట్టిసీమ ఎ త్తిపోతల్లో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ తేల్చి చెప్పడమే అందుకు తార్కాణం. ఈలోగా పోలవ రం నిర్మాణ బాధ్యతలు దక్కించుకుని 2018 నాటి కే పూర్తి చేస్తామని అసెంబ్లీలో బాబు శపథం చేశారు. జీవనాడిని జాప్యం చేస్తూ రూ.1,930 కోట్ల తో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టారు. ప ర్యా వరణ అనుమతి లేకుండా చేపట్టడం వల్ల పురు షోత్త పట్నం ఎత్తిపోతలపై రూ. 24.90 కోట్లను పరి హా రంగా చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో రూ. 1,900 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. -
పట్టిసీమ ప్రాజెక్ట్పై మంత్రి అంబటి కీలక ప్రకటన
-
పరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో నిర్మాణమైన పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ సిఫార్సు చేసిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ ఆదేశించిన రూ.120 కోట్ల పరిహారం చెల్లింపుపై తరువాత విచారిస్తామని తెలిపింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల పర్యావరణ ఉల్లంఘనలపై జమ్ముల చౌదరయ్య, పెంటపాటి పుల్లారావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు సంయుక్త కమిటీ పోలవరం ప్రాజెక్టును మినహాయించి పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.2.48 కోట్లు పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1.90 కోట్లు నష్టపరిహారంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.38 కోట్లు భారం పడింది. ఎన్జీటీ ఆదేశాలు సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రతివాదుల న్యాయవాది శ్రావణ్కుమార్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని, పురుషోత్తపట్నం రైతులకు పరిహారం ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రెండువారాల సమయం ఇవ్వాలని ఏపీ న్యాయవాది కోరారు. రెండువారాల్లో జరిమానా చెల్లించారా లేదా అనే అంశంపై నివేదిక అందజేయాలని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ మూడువారాల తర్వాత చేపడతామని తెలిపింది. -
తెలంగాణ వాదనపై ఏపీ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. గోదావరి జలాలపై తెలంగాణ నీటిపారుదల అధికారులు వాదనకు ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపించాలని ఏపీ అధికారులు నిలదీశారు. కాగా గోదావరి నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వర్కింగ్ మాన్యువల్ ఖరారు, బడ్జెట్, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్లోని జలసౌధలో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. (డీపీఆర్లు ఇవ్వాల్సిందే) బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం గోదావరి బోర్డు సమావేశంలో భాగంగా గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదననలు ఏపీ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగా గోదావరిలో 967 టీఎంసీలు వాటా ఉంటుందని తెలంగాణ బోర్డు దృష్టికి తీసుకురాగా.. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్లో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చూపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికంగా తీసుకోవాలని ఏపీ అధికారులు బోర్డు చైర్మన్కు విన్నవించారు. కొత్త ప్రాజెక్టులకు బ్రేక్.. అలాగే బచావత్ ట్రిబ్యునల్లో ఎక్కడా కూడా తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న బోర్డు చైర్మన్ చంద్రశేఖర్.. నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోగా ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. బోర్డు సూచనకు ఇరు ప్రభుత్వాల అధికారులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్ వాదనలు విపించారు. కేంద్రం ఆదేశాలతో.. కాగా విభజన చట్టానికి విరుద్ధంగా, ‘అపెక్స్ కౌన్సిల్’ అనుమతి లేకుండా గోదావరిపై తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు, నీటి మళ్లింపు ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచుతుండటాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతించే వరకూ ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా తెలంగాణ సర్కార్ను ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గోదావరి బోర్డు చైర్మన్కు దిశానిర్దేశం చేశారు. ఈ దృష్ట్యా వాటిని నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్ను గోదావరి బోర్డు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. గురువారంమే కృష్ణా బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. -
పట్టిసీమ ఎత్తిపోతల వద్ద అగ్నిప్రమాదం
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎత్తిపోతల పథకానికి కరెంటు సప్లై చెయ్యడానికి మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 220 కె.వి ఉండగా అందులో ఒకటవ నెంబర్ ట్రాన్స్ఫార్మర్ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని సబ్ స్టేషన్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రం కొవ్వూరులో ఉండడంతో అగ్నిమాపక ఆలస్యం కావడంతో వాహనం రావడం ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. సబ్స్టేషన్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా ఎన్ని అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి అన్నది ఇంకా నిర్ధారించ లేకపోతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి నీటి విడుదలను గత 15 రోజుల నుండి ఆపివేయడంతో మోటార్లు జరగడం లేదు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టిసీమ ఎత్తిపోతల వద్ద అగ్నిప్రమాదం
-
‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’
సాక్షి, కడప: గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించే ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలను స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి అన్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలతో కలిసి మైసూరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని 7 ప్రాజెక్ట్లకు నీటిని తరలించాలని ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు. రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మైసూరా రెడ్డి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరుగుతున్న అన్యాయంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్లకు పుష్కలంగా నీరు చేరాలంటే కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగును త్వరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలన్న అంశంలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. -
నదుల అనుసంధానం ఎవరికోసం?
పట్టిసీమతో దేశంలోనే నదుల అనుసంధానానికి తొలి కర్తగా తన్నుతాను పొగడుకుంటున్న బాబు కొత్తగా గోదావరి–పెన్నా అనుసంధానం కూడా తానే పూర్తిచేస్తానని హోరెత్తిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయినా దాని కుడికాల్వద్వారా తరలించగలిగే నీరు 11.65 క్యూసెక్కులు మాత్రమే. గోదావరి నీటిని కృష్ణానదికి తరలించే ప్రయత్నం చేయకుండానే నీటి లభ్యత లేకుండా దాదాపు రూ.6 వేల కోట్ల వ్యయంతో గోదావరి పెన్నా అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడం మోసపూరితం. పర్యావరణ అనుమతులు లేని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టని ఈ ప్రాజెక్టును ఇప్పటికైనా నిలిపివేసి పోలవరం కుడికాల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నించడం ఏపీకి మంచిది. ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం అనే అంశాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి నీటిని కృష్ణా నదిలోనికి తరలించడం ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం ఇప్పటికే జరిగిపోయినట్లుగా పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆధునిక కాలంలో అపర భగీరధుడుగా టీడీపీ నేతలు కీర్తించడంలో పోటీపడుతున్నారు. కానీ ఈ అనవసర కీర్తి కండూతి యావలో పడి.. ముప్పై సంవత్సరాల క్రితమే ఇదే కృష్ణానది నుంచి పెన్నానది లోనికి తెలుగుగంగ భారీ ప్రాజెక్టు ద్వారా నీరు తరలించిన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని మరచిపోవటం భావ్యమా? పట్టిసీమ తర్వాత కొత్తగా గోదావరి పెన్నా అనుసంధానంపై గత రెండు మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ వారు 2016 అక్టోబరులో రూపొందించిన గోదావరి–పెన్నా అనుసంధానానికి నాలుగు ప్రత్యామ్నాయాలు సూచించారు. అందులో నాల్గవదానిని దాదాపు ఆమోదించారు. ఆ నాల్గవ ప్రత్యామ్నాయ వివరాలు : పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఆ రిజర్వాయర్ (45 మీటర్లు) నుండి 80 మీటర్ల లెవల్కు కనీసం 60వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి 280 కి.మీ. కాలువలో 24 కి.మీ. వరకు సొరంగాల ద్వారా కృష్ణానదిని 4.5 కి.మీ. ఆక్విడెక్టు ద్వారా దాటించి, తిరిగి 56 కి.మీ.కాల్వను 10 కి.మీ. పంపింగ్ మెయిన్ల ద్వారా ఎత్తిపోసి ప్రకాశంజిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మించబోయే 360 టిఎంసీల జలాశయం (240 మీటర్ల లెవల్కు) ఎత్తిపోస్తారు. ఆ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నిర్మించే అత్యంత భారీ స్థాయి కాల్వలకు గాను 28 గిరిజన గ్రామాల నుంచి మాత్రమే కాకుండా, వేలాది ఎకరాల అటవీ భూమిని కూడా సేకరించవలసి ఉంటుంది. దీనికి గానూ 6 నుంచి 7వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం ప్రధాన కాల్వల పొడవు 720 కి.మీ. 2017 మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అనుసంధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తరువాత వార్తాపత్రికలలో దీనిపై అనేక కథనాలు వచ్చాయి. 2017 సెప్టెంబరులో గోదావరి నుంచి 6,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి చింతలపూడి లిఫ్ట్ ఫేజ్ 2కు శంఖుస్థాపన చేశారు. దీనిద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద 2.8 లక్షలఎకరాల స్థిరీకరణకు ఈ నీటిని వినియో గిస్తామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. మొత్తం నీటి వినియోగం 63 టీఎంసీలు. అంచనా విలువ 4,908 కోట్లు. 2019 జూన్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. దరిమిలా గోదావరి–పెన్నా నదుల అనుసంధానం మొదటి దశగా పేర్కొంటున్న పథకానికి 2018 నవంబరులో ఏపీ ముఖ్యమంత్రి నకి రేకల్ వద్ద శంఖుస్థాపన చేశారు. కృష్ణా నదిలోని హరిశ్చంద్రాపురం (ప్రకాశం బ్యారేజికి 23 కిలోమీటర్ల ఎగువన) వద్ద 7వేల క్యూసెక్కుల నీటిని 56.35 కి.మీ.కాల్వతో 10.25 కి.మీ. మేరకు పైపులైన్ల ద్వారా మొత్తం 73 టీఎంసీల నీటిని సాగర్ కుడికాల్వ (80 కి.మీ.) వద్దకు తరలి స్తారు. దీని అంచనా 6,020 కోట్లు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిర్దేశిం చిన కాలం జూన్ 2019. అయితే గోదావరి పెన్నా అనుసంధానం మొదటి ప్రతిపాదనలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. పట్టిసీమ ద్వారా వచ్చే 8వేల క్యూసెక్కుల నీటితో పాటు చింతల పూడి లిఫ్ట్ద్వారా వచ్చే 6వేల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదికి తరలిస్తామని ఆ నీటిని కృష్ణాడెల్టా వద్ద కొత్తగా ఏర్పాటుచేసే ఈ అనుసంధానం ద్వారా నాగార్జున సాగర్ కుడికాల్వ ఆయకట్టులోని 9.6 లక్షల ఎకరాల భూమికి సాగునీటి అవసరాలు తీరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాని పోలవరం కుడికాల్వ చివర (174 కి.మీ వద్ద) ప్రవాహ సామర్ధ్యం 11,165 క్యూసెక్కులు మాత్రమే. ఈ నీరు డెల్టా అవసరాలకు కూడా ఏమాత్రం సరిపోదు. ఒకవైపున చింతలపూడి లిఫ్ట్ స్కీము ద్వారా 4.8 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెబుతూ పట్టిసీమ ద్వారా డెల్టా అవసరాలు పూర్తిగా నెరవేరుస్తామని చెబుతూ ఇంకొకవైపు అదే నీటిని సాగర్ కుడికాల్వకు తరలిస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే. పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పటికీ కుడికాల్వ ద్వారా తరలించగ లిగే నీరు 11.165 క్యూసెక్కులు మాత్రమే అని ఈ సందర్భంగా గమ నించాలి. తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే గోదా వరిలోని మిగులు జలాలు లభ్యమయ్యే కాలం బాగా తగ్గిపోతుంది. పైగా కృష్ణా నదిలో సాగర్ దిగువన లభించే నీరు అంతంత మాత్రమే. సాగర్ నుండి నీటి విడుదలకు అవకాశం దాదాపుగా లేదు. అదే సమ యంలో పులిచింతలలోనికి సరిపడా నీరు చేరదు. పోలవరం కుడి కాల్వ ద్వారా వచ్చే నీరు కూడా పరిమితం. మరి అందుబాటులో లేని ఏ నీటిని ఎత్తిపోయడానికి సుమారుగా 6వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు? నీటి లభ్యత లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి అనేది ప్రశ్న. ఈ సందర్భంగా ఒకసారి గత 10 సంవత్సరాల కాలంలో నీటి లభ్యత వినియోగం గురించి పరిశీలిద్దాం. శ్రీశైలం వద్దకు చేరిన నీరు 2009–10 నుండి వరుసగా (టీఎంసీలలో) 1222, 1028, 736, 197, 848, 614, 59, 345, 489 ఈ సంవత్సరం 562 టీఎంసీలు. దీనినుండి పోతిరెడ్డిపాడు హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు, చెన్నైకు లభించిన నీటి వినియోగం. 2009–10 సంవత్సరాలS నుండి వరుసగా. 60, 84, 84, 30, 106, 76, 9, 105, 126.5, 145 టీఎంసీలు, అలాగే నాగార్జున సాగర్ కుడి కాల్వకు 2015–16లో 17.5 టీఎంసీలు, 2016–17లో 59.7 టీఎంసీలు, 2017–18లో 89.9 టీఎంసీలు, 2018–19లో 91 టీఎంసీలు కేటాయించారు. సాగర్ కుడికాల్వ ఆయకట్టుకు గత 3 సంవత్సరాల కాలంలో సాగుకు అనుమతించలేదు. ఈ సంవత్సరం అంటే 2018–19కి గాను శ్రీశైలం వద్దకు అదనంగా 200 టీఎంసీల నీరు చేరినప్పటికీ, ఈ లెక్క ప్రకారం కుడికాల్వ ఆయకట్టుకు 132 టీఎంసీలు పొందే హక్కు ఉన్న ప్పటికీ కేవలం 91 టీఎంసీలు (70శాతం) మాత్రమే కేటాయించి వివక్ష చూపారు. నీరు లేక వంతులవారీగా నీరు విడుదల కావటం వలన కాల్వల చివర ఉన్న వేలాది ఎకరాల భూమికి తీవ్ర నీటి కొరత ఏర్పడింది. తెలంగాణ విడిపోయిన తరువాత నీటి కేటాయింపులు కృష్ణా రివర్ బోర్డు ఆదేశానుసారం ఉంటాయి. ఈ కేటాయింపు ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299 టీఎంసీల దామాషాలో ఉంటుంది. సాగర్లో నీరు ఉన్నప్పటికీ కుడికాల్వ ఆయకట్టుకు అదనంగా నీరు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో గోదావరి నీటిని కృష్ణా నదిలోనికి తరలించే ప్రయత్నం చేయకుండానే నీటి లభ్యత లేకుండా అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడం దురదృష్టకరమే కాకుండా, మోస పూరితం కూడా. ఇక్కడ గుర్తించవలసిన మరొక ప్రధాన విషయం ఏమిటంటే, అత్యంత భారీ వ్యయం, భారీస్థాయిలో భూసేకరణ, 360 టీఎంసీల బృహత్ జలాశయం నిర్మాణం, 700 కి.మీ. పొడవైన కాల్వ, దానిలో భాగంగా 24 కి.మీ. సొరంగాలు, భారీగా విద్యుత్, అవసరాలు వగై రాలతో కూడిన గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేపట్టి దాన్ని పూర్తి చేయడానికి దీర్ఘకాలం పడుతుంది. దీనికోసం అత్యంత భారీగా వ్యయం అవుతుంది కూడా. అందువలన ముందుగా పోలవరం కుడికాల్వ ప్రవాహ సామర్ధ్యాన్ని 27,500 క్యూసెక్కులకు పెంచాలి. దీనిని త్వరితగతిన పూర్తిచేయడానికి కూడా అవకాశం ఉంది. పోలవరం పూర్తయిన తరు వాత సాగునీటి పారుదల ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజి వద్దకు తరలించవచ్చు. ఆ నీటినుంచి కృష్ణాడెల్టా అవసరాలకు పోను మిగులు జలాలను వైకుంఠపురం వద్ద నిర్మించబోయే బ్యారేజి ఎగువకు ఎత్తిపోసి, ఆ నీటిని తిరిగి పులిచింతలలోనికి ఎత్తిపోయడం ద్వారా కృష్ణానదిలో 15 నుంచి 18 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నవంబరు తరువాత కూడా నిల్వ చేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజి, పులిచింతల మధ్య దూరం 87 కి.మీ. పూర్తిస్థాయి నీటిమట్టం ప్రకాశం బ్యారేజి వద్ద 17 మీటర్లు, వైకుంఠపురం వద్ద 25 మీటర్లు, పులిచింతల వద్ద 54 మీటర్లు, సాగర్ కుడికాల్వ వద్ద 135 మీటర్లుగా ఉంటుంది. సాగర్ కుడికాల్వ ఆయకట్టుకు నీరు సప్లిమెంట్ చేయాలంటే పులిచింతలకు 32 కి.మీ.దూరంలో గల సాగర్ కుడికాల్వకు ఈ లింకు ఏర్పాటు చేసి దీనిద్వారా సుమారు 10వేల క్యూసెక్కుల నీటిని 90 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయాలి. దీనివలన కుడికాల్వ ఆయకట్టుకు నీరు అందించే భరోసా ఏర్పడుతుంది. పైగా ఇప్పుడు చేపట్టిన ఈ అనుసంధానానికి ఇంతవరకు పర్యావరణ అనుమతులు లేవు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగలేదు. ఈ రెండు అంశాల ప్రాతిపదికన చూస్తే ఇది పూర్తిగా చట్ట ఉల్లంఘన కిందికే వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇప్పటికైనా నిలుపుదల చేసి పోలవరం కుడికాల్వ సామర్ధ్యాన్ని పెంచడానికి సమాయత్తమవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం. వ్యాసకర్త : యెర్నేని నాగేంద్రనాధ్, రైతాంగ సమాఖ్య అధ్యక్షులు మొబైల్ : 98495 59955 -
పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నదుల అనుసంధానంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు జాతీయ హరిత ట్రెబ్యునల్(ఎన్జీటీ) అదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్త పట్నం, చింతలపూడి, గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా? అనే విషయంపై కూడా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్జీటీ కోరింది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకొని నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను పిబ్రవరి 22కు వాయిదా వేసింది. ఏపీలో నదుల అనుసంధానం పేరిట అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఎన్జీటీలో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, త్రినాథ్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గోదావరి డెల్టాకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నదులు అనుసంధానం చేస్తున్నారని పిటీషనర్లు తమ వాదన వినిపించారు. పిటీషనర్ల వాదనలు విన్న ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా వీటిపై పిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘వైకుంఠపురం’లో పట్టిసీమ వ్యూహం
సాక్షి, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ‘బోనస్’ పేరుతో కాంట్రాక్టర్తో కలిసి రూ.376.14 కోట్లు దోచేసిన తరహాలోనే వైకుంఠపురం బ్యారేజీ పనుల్లోనూ రూ.500 కోట్లకుపైగా కాజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే ఐదు శాతం ఎక్కువ ధర కోట్ చేస్తూ కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. జీవో 94 ప్రకారం ఆ టెండర్లను రద్దు చేయాలి. కానీ, ఎంపిక చేసిన కాంట్రాక్టర్తో 24.99 శాతం అధిక ధర (ఎక్సెస్) కోట్ చేస్తూ దాఖలు చేసే షెడ్యూల్ను ఆమోదించాలని సోమవారం సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు జలవనరుల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో 4.99 శాతం ఎక్సెస్.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తే 20 శాతం బోనస్(ప్రతి ఆరు నెలలకు లక్ష్యం మేరకు పనులు చేస్తే 5 శాతం చొప్పున బోనస్) ఇచ్చేలా షరతు విధించి.. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలోనే వైకుంఠపురం టెండర్నూ కేబినెట్లో ఆమోదిస్తామని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజధాని అమరావతిలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణ పనులకు రూ.801.8 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది జూలై 9న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వైకుంఠపురం బ్యారేజీ పనులను తనకు బాగా కావాల్సిన నవయుగ సంస్థకే అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ సంస్థకే పనులు దక్కేలా నిబంధనలతో అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అంచనా వ్యయం పెంచకపోతే గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ పేచీ పెట్టారు. ఉన్నతస్థాయి ఒత్తిళ్ల మేరకు నవయుగను కాదని ఇతర కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్ను రద్దు చేశారు. అంచనా వ్యయం పెంచేసినా.. ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన జలవనరుల శాఖ అధికారులు బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకాన్ని కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.1,025.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేసి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో 2018 ఆగస్టు 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ధరలకు కూడా కాంట్రాక్టర్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. అంచనా వ్యయాన్ని మరింతగా పెంచేయాలంటూ మొండికేశారు. దాంతో ఆ టెండర్ను రద్దుచేసి, అంచనా వ్యయాన్ని రూ.1,075.15 కోట్లకు పెంచేసి, అక్టోబర్ 25న ముచ్చటగా మూడోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినా కాంట్రాక్టర్ కనికరించలేదు. తాజా ధరల మేరకు అంచనా వ్యయాన్ని సవరించాలని పట్టుబట్టారు. ముఖ్యమంత్రి ఎంపిక చేసిన కాంట్రాక్టర్ అడ్డం తిరిగిన నేపథ్యంలో ఆ టెండర్ను కూడా రద్దు చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా.. వైకుంఠపురం బ్యారేజీ పనులను నవయుగ సంస్థకు కట్టబెట్టి, భారీగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి వ్యూహం రచించిన సీఎం చంద్రబాబు.. ఆ పనులకు తక్షణమే టెండర్లు పిలవాలంటూ 20 రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో వారం రోజుల గడువుతో స్వల్పకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీచేసి, తాను సూచించిన కాంట్రాక్టర్కే పనులు కట్టబెట్టాలని అంటున్నారు. ఈ మేరకు అంతర్గత అంచనా విలువను రూ.1,459 కోట్లకు పెంచేస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ధరలతో కూడా సీఎం చంద్రబాబు, కాంట్రాక్టర్ తృప్తి పడలేదని సమాచారం. బోనస్ పేరుతో బొక్కేద్దాం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులకు 2015లో రూ.1,170.25 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం మేరకు కాంట్రాక్టర్ 21.9991 శాతం అధిక ధరలు కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేశారు. జీవో 94 ప్రకారం ఈ టెండర్ను రద్దు చేయాలి. కానీ, చంద్రబాబు జోక్యం చేసుకుని.. జీవో 94 ప్రకారం 5 శాతం అధిక ధరలతోపాటు ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే 16.9991 శాతం బోనస్ ఇస్తామని ఆఫర్ ప్రకటించి, టెండర్కు ఆమోముద్ర వేశారు. దాంతో పనుల అగ్రిమెంట్ విలువ రూ.1,427.70 కోట్లకు పెరిగింది. ఇందులో 16.9991 శాతం బోనస్ విలువ రూ.199 కోట్లు కావడం గమనార్హం. వీటితోపాటు డిజైన్లు మార్చేయడం ద్వారా పట్టిసీమలో రూ.376.14 కోట్లు దోచేశారు. పట్టిసీమ స్ఫూర్తితో వైకుంఠపురం బ్యారేజీ పనుల టెండర్ను ఖరారు చేయాలని సోమవారం సాగునీటి ప్రాజెక్టుల పనులపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. సమీక్ష ముగిసిన తర్వాత అధికారులను బయటకు పంపించి.. కాంట్రాక్టర్, జలవనరుల శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులతో చంద్రబాబు రహస్య మంత్రాంగం జరిపారు. 24.99 శాతం అదనపు ధరలకు కాంట్రాక్టర్ షెడ్యూల్ దాఖలు చేస్తారని.. ఇందులో 4.99 శాతం అదనపు ధరగా పరిగణించాలని, మిగతా 20 శాతాన్ని బ్యారేజీ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తే బోనస్గా ఇస్తామని నిబంధన పెట్టి, టెండర్లను ఆమోదించాలని దిశానిర్దేశం చేశారు. అంటే అంచనా వ్యయం పెంచడం ద్వారా రూ.657.12 కోట్లు, 24.99 శాతం అధిక ధరలకు అంటే.. రూ.364.60 కోట్లు వెరసి రూ.1,021.72 కోట్ల మేర కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చి.. అందులో రూ.500 కోట్లకు పైగా కమీషన్ల రూపంలో రాబ్టుకోవాలన్నది సీఎం చంద్రబాబు ఎత్తుగడ. -
తెలంగాణ తరహాలో ఏపీలోనూ టీడీపీకి బుద్ధిచెప్పాలి
సాక్షి, కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిననాటినుంచి రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. రైతు సమస్యలపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి వ్యక్తి ఆయన అని మండిపడ్డారు. చంద్రబాబు తన ఆదాయం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. రైతులు బాగుడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని ఎలా తన్ని తరిమేశారో అదే రీతిలో.. రానున్న ఎన్నికల్లో ఏపీలోనూ టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘మొన్న మోదీ, నిన్న రాహుల్ కాళ్లు పట్టుకున్నావ్’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతీ మాట అబద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓవైపు రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడిపోతుంటే.. పట్టిసీమ వల్ల రాయలసీమ బాగుందంటూ బాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం లోటస్పాండ్లో విలేకరులతో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ ఇచ్చిన నివేదిక నిజం కాదా అని ప్రశ్నించారు. ‘2014లో అధికారంలోకి రాగానే 17 వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 67 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని మంత్రి దేవినేని చెబుతున్నారు. అంటే దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర టీడీపీ అవినీతికి పాల్పడింది’ అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనుసంధానం వల్ల ఏం లాభం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ మహానేత వైఎస్సార్ హయాంలోనే జరిగాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన పాలనా కాలంలోనే 80 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయలేక చంద్రబాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. గోదావరి- పెన్నా లింకేజీ అంటూ టెండర్లను పిలిచేది మరోసారి దోపిడీ చేయడానికే బాబు సిద్ధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గతంలో కంటే సాగు విస్తరణ 2లక్షల హెక్టార్లలో తగ్గిందన్న శ్రీకాంత్ రెడ్డి.. మరి నదుల అనుసంధానం చేసి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ‘రాష్ట్రంలోనే ఏమి చేయలేని వాడివి. కేంద్రంలో ఏం సాధిస్తావ్. మొన్న మోదీ, నిన్న రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నావ్. పదవి కోసం ఇన్ని కుట్రలు, మోసాలు చేయాలా’ అని చంద్రబాబును విమర్శించారు. -
నా వాదన తప్పని నిరూపిస్తే క్షమాపణ చెబుతా
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి బాండ్లు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ఇళ్ల నిర్మాణాలు, రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు తదితర అంశాలపై చర్చకు రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మరోసారి సవాల్ విసిరారు. తన వాదన తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెబుతానని పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటాల్లోనే.. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వండి... - అమరావతి బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల అప్పుకు 10.36 శాతం వడ్డీ ఎలా ఇస్తారు? ఆరు నెలల ముందు 8 శాతం కన్నా ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోకూడదని మీరే జీవో నంబర్ 68 జారీ చేశారు. మరి 10.36 శాతం వడ్డీకి ఎలా రుణం తీసుకుంటారు. అమరావతి బాండ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అధిక వడ్డీకి బాండ్లు జారీ చేసే కన్నా బ్యాంక్ ఇచ్చే వడ్డీకి పావలా అధికంగా ఇచ్చినా రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తారు కదా. అధిక వడ్డీకి అప్పులు చేయడమే కాకుండా బీఎస్ఈలో గంట కొట్టేందుకు రూ.1.8 కోట్లు ఖర్చు చేస్తారా? - పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారని గతంలోనే చెప్పా. ఇప్పుడు అదే విషయంపై గొడవ జరుగుతోంది. పనులు లేకుండానే, ఎం బుక్స్లో రాయకుండానే బిల్లులు చేసుకున్నారు. - పట్టిసీమ ప్రాజెక్టులో 22% అదనపు చెల్లింపులు ఎలా చేస్తారు? వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి హయాంలో అదనపు చెల్లింపులు 5 శాతం కన్నా ఎక్కువ చేయలేదు. ఎత్తిపోతల పథకాల్లో చెల్లింపులపై చర్చించేందుకు సిద్ధమా? - పేదలకు అపార్ట్మెంట్లలో నిర్మించి ఇచ్చే ఇళ్ల చదరపు గజం ధర రూ.2,939ని మంత్రి నారాయణ చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరేమో చదరపు గజానికి రూ.1,500తో హై క్లాస్లో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. మరి పేదలకు ఇచ్చే ప్లాట్లకు అంత పెద్ద మొత్తం ఎలా ఇస్తున్నారో చెప్పండి. - విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.18 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అవి ఎక్కడ ఉన్నాయో చూపించండి. - మీరు ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై చర్చిద్దాం రండి. వైఎస్ ఎక్కడ అవినీతి చేశారో చూపించండి. అప్పు కోసం ప్రత్యేక విమానాల్లో వెళతారా? అప్పు కోసం ఆడీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో వెళతారా? అలా వెళితే ఎవరైనా అప్పిస్తారా? సీఆర్డీఏను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థగా కాదు, కంపెనీగా పేరు మార్చుకోండి. కుటుంబరావు చెప్పినట్లు మార్గదర్శిలో తప్పులేకపోతే డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చారు? కోర్టులో ఉన్న మార్గదర్శి కేసును మళ్లీ కదిలిస్తా. 30 ఏళ్లలో హెరిటేజ్ విలువ ఎప్పుడెప్పుడు పెరిగిందో నేను చెబుతా. ఆయా సమయాల్లో ఏఏ ప్రభుత్వ డెయిరీలు మూత పడ్డాయో కూడా చూపిస్తా. చర్చకు రావాలి’ అని కుటుంబరావుకు ఉండవల్లి సవాల్ విసిరారు. సమావేశంలో అశోక్కుమార్ జైన్, చెరుకూరి రామారావు, అల్లుబాబి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వట్టిసీమ
-
సీమకు కన్నీరే!
‘దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత మాదే. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సమృద్ధిగా సాగునీరు ఇచ్చి, సాగర్ ద్వారా డెల్టాకు ఇవ్వాల్సిన కృష్ణా జలాలను శ్రీశైలం డ్యాం నుంచి రాయలసీమ జిల్లాలకు తరలిస్తాం. అందులో చుక్కనీరు కూడా కిందకు తీసుకెళ్లం.’ – ఇవీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు రెండేళ్లుగా చెబుతున్న మాటలు. అయితే.. వారి మాటల్లో చిత్తశుద్ధి లేదని తేలిపోతోంది. శ్రీశైలం డ్యాం నుంచి నీటిని యథేచ్ఛగా దిగువకు తీసుకెళ్తున్నారు. నాలుగేళ్ల నుంచి కనీస నీటి మట్టం అనే నిబంధనను సైతం ఉల్లంఘించి మరీ నాగార్జున సాగర్కు తరలిస్తున్నారు. ఇక్కడి అధికార పార్టీ నేతలకు ఈ వాస్తవం తెలిసినా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మాట రావడం లేదు. కర్నూలు సిటీ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ జిల్లాలకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అయినా సీమకు చెందిన టీడీపీ నేతలు ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. ఈ ఏడాది జిల్లాతో పాటు వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా, తుంగభద్ర బేసిన్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా నదులకు వరద జలాలు పోటెత్తాయి. ఫలితంగా శ్రీశైలం డ్యాంకు సుమారు 151 టీఎంసీల నీరు చేరింది. ఈ నీటిని సైతం దిగువకు తీసుకెళుతున్నారు. కృష్ణా డెల్టా ప్రాంతాలైన గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో తాగునీటి అవసరాల పేరుతో గత నెలలో 52 టీఎంసీలకు, తాజాగా మరో 12 టీఎంసీల నీటికి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు నుంచి అనుమతులు తీసుకుంది. అదే రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని, 21 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రతిపాదనలకు కృష్ణాబోర్డు నుంచి అనుమతులు ఇప్పించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఇదే తరుణంలో ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరు జిల్లాకు 9 టీఎంసీల నీటిని తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల నీరు వస్తుందన్న భావనతో గత నెల 28న ఎలాంటి ముందస్తూ ప్రణాళికలు లేకుండా నీరుపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. ఖరీఫ్లో స్థిరీకరించిన ఆయకట్టుకు మొత్తం నీరు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. దీంతో రైతులు వరి సాగుకు నారు పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీశైలం డ్యాంలో నీరు తక్కువగా ఉందని, ఆయకట్టుకు ఇవ్వలేమని ఇంజినీర్లు తాజాగా ప్రకటించడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. కరువు జిల్లాలకు కృష్ణా జలాలేవీ? రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర, కృష్ణా జలాలే ఆధారం. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగు,తాగునీరు, చెన్నై తాగునీటి అవసరాలకు కలిపి వంద టీఎంసీలకు పైగా నీరు కావాలి. గత నెల 28న ఐఏబీ సమావేశంలో కర్నూలు జిల్లాలో తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, సిద్దాపురం స్కీమ్ కింద 2.51 లక్షల ఎకరాలకు, వైఎస్సార్ జిల్లాలో 1,67,000 ఎకరాలకు కృష్ణా జలాలు అందిస్తామని తీర్మానాలు చేశారు. అలాగే తుంగభద్ర జలాలను కేసీ కాలువ కింద కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు 29.9 టీఎంసీల మేర ఇస్తామన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన నీటిని మొదటి ప్రాధాన్యత కింద కరువు ప్రాంతమైన సీమకు ఇవ్వాల్సి పోయి.. ప్రభుత్వం తాగు నీటి పేరుతో శ్రీశైలం నుంచి సాగర్కు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 871.30 అడుగుల నీటి మట్టం, 147 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇందులో సాగర్కు ఇంకా 41 టీఎంసీలు (ముందు అనుమతించిన 52 టీఎంసీలలో 23, ప్రస్తుతం అనుమతించిన 12 టీఎంసీలు కలిపి) విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం అనుమతించిన 12 టీఎంసీల నీటిని ఈ నెల 18లోపు విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులిచ్చింది. అలాగే గతంలో అనుమతించిన 52 టీఎంసీల నీటిని సైతం ఈ నెల 23లోపు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 147 టీఎంసీలలో 41 టీఎంసీల నీటిని విడుదల చేస్తే మిగిలేది 106 టీఎంసీలు మాత్రమే. అలాగే నీటిమట్టం 856.8 అడుగులకు తగ్గిపోతుంది. 854 అడుగులకు పైగా నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. ఈ స్థాయికి తగ్గితే చుక్క నీరు కూడా రాదు. 21 టీఎంసీలు అడిగాం జూలైలో 9 టీఎంసీలు, ఆగస్టు నెలకు 21 టీఎంసీల నీరు కావాలని ప్రభుత్వాన్ని అడిగాం. అయితే జూలైకు అనుమతిచ్చారు. ఆగస్టు అవసరాల కోసం అనుమతి రావాల్సి ఉంది. నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగకు కొంత నీటిని వెలుగోడు నుంచి విడుదల చేయనున్నాం. వర్షాలు వస్తేనే సాగునీటి విడుదల సాధ్యమవుతుంది. – నారాయణరెడ్డి, సీఈ, జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు ఆ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇస్తామని జల హారతులు పట్టిన నేతలు ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. గత మూడు ఐఏబీ సమావేశాల్లో సీఎం వల్లే రాయలసీమకు సాగునీరు వచ్చిందని అభినందన తీర్మానాలు చేయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నీటిని విడుదల చేయించాలి. మాయమాటలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. తీర్మానాలపై ఉన్న ధ్యాస రైతులపై జిల్లా నేతలకు లేకుండా పోయింది. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నా ..ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది – బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ పట్టిసీమ పేరుతో నిలువునా ముంచుతున్నారు. కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా నీటిని ఇస్తామని, డెల్టాకు ఇచ్చే నీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పుకుంటూ టీడీపీ నేతలు ఆయకట్టుదారులను నిలువునా మోసం చేస్తున్నారు. దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం వైఎస్సార్ జిల్లాలో (60 శాతం), ఆ తరువాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నమోదైంది. అయినా రాయలసీమకు నీళ్లివ్వడం లేదు. ఈ రోజు శ్రీశైలంలో నీరున్నా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పూర్తి స్థాయిలో తగ్గించారు. తాగునీటి అవసరాల పేరిట సాగర్కు నీటిని తీసుకెళుతున్నా.. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. – వంగాల భరత్కుమార్రెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
పొలిటికల్ కారిడర్ 17th July 2018
-
వారం రోజుల్లో పట్టిసీమ నుంచి నీరు విడుదల
ఏలూరు (మెట్రో) : గోదావరిలో నీటి మట్టం పెరుగుతోందని, ఎగువున భారీ వర్షాలు కురుస్తున్నందున వారం రోజుల్లో పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో వ్యవసాయాధికారుల సమావేశంలో ఖరీఫ్ పంటకు నారుమడులు, కౌలు రైతులకు రుణాలు, శివారు ప్రాంత భూములకు సాగునీరు వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. గోదావరిలో ఇప్పటికే 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని మన అవసరాలకు పదిహేను వేల క్యూసెక్కుల నీరు సరిపోతుందని మిగిలిన 15వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేసి కృష్ణా డెల్టా రైతులను ఆదుకుంటామని కలెక్టర్ చెప్పారు. కృష్ణా కాలువ నుంచి పట్టిసీమ నీరు రావడానికి ఆలశ్యమవుతున్న దృష్ట్యా తూర్పు లాకుల వద్ద గురువారం సాయంత్రంలోగా మోటార్ల ద్వారా దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల పరిధిలో వరి నర్సరీలు పెంచుకునేందుకు వీటిని మళ్లించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మూడు మండలాల పరిధిలో 440 హెక్టార్లలో వరి నర్సరీ పెంచాల్సిన అవసరం ఉన్నదని రేపు సాయంత్రానికల్లా తూర్పు లాకుల ప్రాంతాన్ని తనిఖీ చేస్తానని మోటార్లు అన్ని పని చేస్తూ ఉండాలన్నారు. 18.55శాతం పామాయిల్ దిగుబడి సొమ్ము ఇవ్వాల్సిందే జిల్లాలో పామాయిల్ రైతులకు 18.55శాతం ఆయిల్ దిగుబడి చొప్పున ఇకపై సొమ్ము చెల్లించాల్సిందేనని జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆయిల్ఫెడ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రాధాన్యతా రంగాల ప్రగతితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఎన్నో ఏళ్లుగా స్థానిక ఆయిల్పామ్ రైతులకు 16.4 శాతం దిగుబడి మాత్రమే వస్తుందంటూ సొమ్ము చెల్లిస్తుండటంతో పలువురు రైతులు ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణలోని సత్తుపల్లిలో 18.55 శాతం ఆయిల్ దిగుబడి వస్తుండటంతో అక్కడే ఆయిల్పామ్ గెలలు క్రషింగ్ చేయించడంతో నిరూపితమైందన్నారు. ఇకనుంచి ఆయిల్పామ్ రైతులకు 18.55 శాతం వంతున సొమ్ము చెల్లించాలని, దీన్ని అన్నిక ంపెనీలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో వాస్తవాలతో కూడిన నివేదికలు సమర్పించకపోతే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. పరిశ్రమలకు 24 గంటల్లో అనుమతులు పరిశ్రమలకు అవసరమైతే 24 గంటల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పా. స్థారునిక కలెక్టరేట్లో జిల్లాస్థాయి పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేసి భారీ పరిశ్రమలకు కూడా 48 గంటల్లో అనుమతులు ఇచ్చి రికార్డు సృష్టించాలని అంతే తప్ప చిన్నచిన్న అంశాలను సాకుగా చూపించి అనుమతులను జాప్యం చేయొద్దని కలెక్టర్ సూచించారు. ఆన్లైన్ విధానం అమల్లో ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఎప్పటికప్పుడు ఆన్లైన్ పరిశీలిస్తూ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. దీనివల్ల నూతన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు పశ్చిమ వైపు ఎదురుచూస్తారని ఆయన చెప్పారు. వట్లూరు బ్రిడ్జి ఆలస్యంపై ఏఈ సస్పెన్షన్ వట్టూరు బ్రిడ్జి దశాబ్దం దాటుతున్నా నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందని కలెక్టర్ ఆర్అండ్బీ అధికారులను ప్రశ్నించారు. దీనికి బాధ్యులని తక్షణం సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఆర్అండ్బీ ఏఈ శేషుకుమార్ను బుధవారం సాయంత్రానికి సస్పెండ్ చేయాలని ఆశాఖ ఎస్ఈ నిర్మలను ఆదేశించారు. ఈ సమావేశాల్లో అదనపు జేసీ షరీఫ్, డీఆర్వో సత్యనారాయణ, వ్యవసాయశాఖ జేడీ గౌసియాబేగం, ఆర్అండ్బీ ఎస్ఇ నిర్మల, పరిశ్రమల శాఖ జీఎం త్రిమూర్తులు, జిల్లాలోని ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పర్సంటేజీలు మానుకుంటే నాణ్యమైన రోడ్లు పర్సంటేజీలు మానుకుంటేనే నాణ్యమైన రోడ్లు దర్శనమిస్తాయని లేకపోతే ఎన్నాళ్లు అయినా ఆధ్వానస్థితి తప్పదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఆర్అండ్బీ అధికారులతో రోడ్లు పరిస్థితిపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని ఆర్అండ్బీలో అవినీతి రాజ్యమేలుతోందని ఏ రోడ్డు చూసినా నిర్మించిన ఆరు నెలలకే గతుకులమయం అవుతోందని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి ఆర్అండ్బీ సిబ్బంది, అధికారులు పర్సంటేజీలు వదులుకుంటే నాణ్యమైన రోడ్లను ప్రజలు చూడగలుగుతారని ఆయన చెప్పారు. ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డుపై గర్భిణి ప్రయాణిస్తే రోడ్డుపైనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉందని కలెక్టర్ చెప్పారు. -
పొలిటికల్ కారిడర్ 12th June 2018
-
ఏపీలో అవినీతిపై ఇదివరకే కాగ్ నివేదిక ఇచ్చింది
-
‘వైఎస్సార్ క్రెడిట్ను సైతం చంద్రబాబు తన ఖాతాలోకా’
సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు జాతీయ స్కాంలా తయారైందని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమార్జనకు ఈ ప్రాజెక్ట్ సంజీవనిలా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం పనులు 39 శాతం పూర్తయ్యాయని, కానీ ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు తనఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని స్కామ్ల ప్రాజెక్టులా చంద్రబాబు మార్చివేశారని, ఏ రోజు కూడా ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదన్నారు. మరోవైపు చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో గమనిస్తే కర్ణాటకలో ఆలమట్టి లాంటి ఎన్నో ప్రాజెక్టులొచ్చాయని, కానీ ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. ప్రాజెక్టులు, నీటి ఆవశ్యకత గురించి చంద్రబాబు ఉపన్యాసాలు దంచి కొడతారని.. కానీ పని మాత్రం చేయరని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేయడం తన జీవిత ఆశయమని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు. 2018 నాటికి పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏంతో సాధించానని చంద్రబాబు చెబుతారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు పునాది వేసిన స్థలంలో నిలబడి ప్రాజెక్టు మొత్తం పూర్తయిందని, అయితే భూగర్భంలో ఉన్నందున కనిపిస్తలేదని చంద్రబాబు చెప్పడం సబబు కాదన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని నీటిని సరఫరా చేస్తామంటున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్టణం ప్రాజెక్టులకు రూ.3,400 కోట్లు ఖర్చు చేశారు. అందులో 350 కోట్లు అవినీతి జరిగిందని కాగ నివేదిక ఇవ్వడం నిజం కాదా అని ఈ సందర్భంగా సజ్జల ప్రశ్నించారు. తన అవినీతి కోసమే చంద్రబాబు శాశ్వత ప్రాజెక్టులను ఎప్పుడూ పూర్తి చేయరని.. కేవలం కమీషన్ల కోసమే తాత్కాలిక ప్రాజెక్టులు కడుతున్నాడరంటూ మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపులకు, పోలవరం అంచనాలకు సంబంధమే లేదన్నారు. -
టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి..
సాక్షి, విజయవాడ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు. దేవినేని ఉమ హుందాతనాన్ని మరిచి వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా దేవినేని వ్యాఖ్యలను టీజేఆర్ సుధాకర్ బాబు ఖండించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు దొంగల పార్టీని నడుపుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వచ్చిన జన సమూహంతో కనకదుర్గ వారధి వణికినప్పటి నుంచి టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి. పట్టిసీమలో దోచుకున్నారని నివేదిక ఇచ్చింది కాగ్... వైఎస్సార్ సీపీ కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ అన్నయ్య దేవినేని చనిపోయిన రోజు సాయంత్రం మీ వదినగారు చనిపోయారు. ఆమె మృతిపై ఇప్పటికీ చాలా అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో టీడీపీ మొదటిగా ఓడిపోయేది మైలవరం నియోజకవర్గమే. కనీస రాజకీయ మర్యాదలు పాటించని కుంకలు మీరు. దమ్ము, ధైర్యం ఈ రెండు పదాలు తెలుగుదేశం నాయకులు వాడకూడదు. బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి నోరు జారితే దేవినేని ఇంటిని ముట్టడిస్తాం. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని తెలంగాణలో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దద్దమ్మలు మీరు. మా నాయకుడు... మీ నాయకుడి చరిత్రపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ సవాల్ విసిరారు. -
పట్టిసీమపై మంత్రి దేవినేని అసత్య ప్రచారం
-
45 టీఎంసీల కోటా పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటి వాటాను వచ్చే జూన్ వాటర్ ఇయర్ నుంచి అమలు చేయాలని పట్టుబట్టేందుకు తెలంగాణ సిద్ధమైంది. వాటాల విషయమై ఇప్పటికే కృష్ణా, గోదావరి బోర్డులు చేతులెత్తేయడం, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యేవరకు పాత విధానమే అమల్లో ఉంటుందని కేంద్రం సంకేతాలు పంపిన నేపథ్యంలో దీనిపై కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. బచావత్ అవార్డు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. అయితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే బచావత్ అవార్డులో పేర్కొ న్న మేరకు, పోలవరానికి అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాల ని తెలంగాణ అంటోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉండటంతో కర్ణాటక తన వాటా మేరకు 21 టీఎంసీల వినియోగం మొదలుపెట్టింది. అయితే తెలంగాణకు దక్కే వాటాల అంశం మాత్రం పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను పేర్కొంటూ ఈ వాటర్ ఇయర్లో తెలంగాణకు 45 టీఎంసీల మేర కోటా పెంచాలని పట్టుబట్టనుంది. ఇవే అంశాలతో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. వాటర్ ఇయర్ ఆరంభానికి కేవలం 40 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో ముందు నుంచే ఈ అంశంపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. -
అవినీతి జరగలేదంటే.. ఏ శిక్షకైనా నేను సిద్ధం
-
అవినీతి జరగలేదంటే.. ఏ శిక్షకైనా నేను సిద్ధం
సాక్షి, అమరావతి: పట్టిసీమలో అవినీతి జరిగింది.. జరగలేదంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసే ఏ శిక్ష కైనా తాను సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్సీ విష్ణు కుమార్ రాజు సవాల్ విసిరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే పట్టిసీమపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోషూట్ కోసమే సీఎం పార్లమెంటు మెట్లకు మొక్కారని ఎద్దేవా చేశారు. రోజూ ఇసుక కుంభకోణంలో కోట్లు కొల్ల గొడుతున్నారని, పట్టిసీమ, ఇసుక కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘సింగపూర్లో సీఎం చంద్రబాబు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఇది భారత దేశ ప్రజలను అవమానించడమే. సీఎం 40 సంవత్సరాల అనుభవం ఏమైంది. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని మంత్రి గంటా శ్రీనివాస రావు బీజేపీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులతో ఉద్యమానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు’ అని విష్ణు కుమార్ వ్యాఖ్యానించారు. -
పట్టిసీమ పనులపై సీబీఐ విచారణ జరిపించాలి
-
చంద్రబాబు గతాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు..
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదట్నుంచీ చెబుతోందని ఆపార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగ్ తన నివేదికలో పట్టిసీమలో అవినీతి జరిగిందని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. కానీ, కాగ్ చెప్పినంత మాత్రాన విచారణ జరిపించలేమని చంద్రబాబు చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరిని మరోసారి స్పష్టం చేసిందని ఎమ్మెల్యే సురేష్ ఎద్దేవా చేశారు. 2జీ, బొగ్గు కుంభకోణం కేసుల్లో కాగ్ చెప్తేనే సీబీఐ విచారణ జరిగిందన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల పచ్చపార్టీ... కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లను మారుస్తున్నారనీ.. వాటి అంచనా వ్యయాల్ని ఇష్టారీతిన పెంచుతున్నారని సురేష్ ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టు వ్యయం రూ.495 కోట్ల నుంచి 1012 కోట్లకు పెంచారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి రూ.2844 కోట్లు అవసరం కాగా కేవలం 334 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు సింహభాగం నిధుల కేటాయింపులు జరిగాయని అన్నారు. -
ఆంధ్రప్రదేశ్ని కేంద్రానికి అమ్మేశారా..!!
సాక్షి, విజయవాడ: రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారధి విమర్శించారు. ప్రజా సంకల్పం వల్లే జాతీయ రహదారుల దిగ్భందం విజయవంతం అయ్యిందన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పార్థసారధి, పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్లు మాట్లాడారు. 2016లో కేంద్రం, హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటే స్వాగతించి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పార్థసారధి ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో ఎన్నడూ హోదా కోసం పనిచేయని ఆయనకు వైఎస్సార్ సీపీని విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్ల అవినీతిని వారి రాజకీయ భాగస్వామి పవన్ కల్యాణ్ ఎండగట్టడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ మీద యుద్ధం..ఆంధ్రుల ఆత్మ గౌరవం’ వంటి భారీ డైలాగులతో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి తన హుందాతనాన్ని కోల్పోతున్నారని చురకలంటించారు. కాగ్ పెట్టిన వాతలు.. పోలవరం నిర్మాణం పూర్తయితే పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని కాగ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు. కానీ పట్టిసీమ డీపీఆర్ (డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)లో దాని జీవిత కాలం 20 ఏళ్లు అని పేర్కొన్నారని టీడీపీపై ధ్వజమెత్తారు. పట్టిసీమ కాంట్రాక్టర్కు 22 శాతం అదనంగా చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రజాపద్దుల కమిటీ కూడా బయటపెట్టిందనీ.. అందుకనే ఆ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారని విమర్శించారు. ఈ కమిటీలో వైఎస్సార్ సీపీ ఒక్కటే లేదని ఇతర అన్ని పార్టీల సభ్యులు ఉన్నారని అన్నారు. ఒకపైపు దేశం పురోగమిస్తుంటే.. చంద్రబాబు విదేశీ సాంకేతికత, జపాన్ తరహా పోరాటం అనడం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ రెండు నాల్కల ధోరణి ప్రశ్నిస్తారనే భయంతో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలను చూసి టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
పట్టిసీమపై బీజేపీ, టీడీపీ మాటల యుద్ధం
-
బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..
సాక్షి, అమరావతి : ఏపీ శాసనసభలో బుధవారం పట్టిసీమ ప్రాజెక్ట్పై బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్పై బుధవారం సభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు...ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. మొత్తం రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని, కాగ్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు. 30 పంపులు ఏర్పాటు చేస్తామని 24 పంపులే ఏర్పాటు చేశారని, ప్రాజెక్ట్ వ్యయం రూ.1170 కోట్లు అంచనా వేసి చివరకు రూ.1487 కోట్లు చెల్లించారన్నారు. ఆధారాలు లేకుండా తాము ఆరోపణలు చేయడం లేదని, వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని అన్నారు. దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. దీంతో మంత్రులు...విష్ణుకుమార్ రాజుపై ఎదురుదాడికి దిగారు. ఓ దశలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టిసీమపై బీజేపీ చవకబారు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేయండి.. ఇలాగైతే ప్రజల్లోకి వెళ్లలేరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేయడంతో...దమ్ముంటే రాజీనామాలు చేద్దాం రండి అంటూ విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడకపోతే మంత్రులకు భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఎవరితోనూ కుమ్మక్కు కాలేదని, ఆ అవసరం తనకు లేదని అన్నారు. కాగ్ నివేదికను చదివే మాట్లాడుతున్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. మంత్రుల భాష సరిగా లేదు ఏపీ మంత్రుల తీరును మంత్రి మాణిక్యాలరావు తప్పుబట్టారు. పట్టిసీమపై విష్ణుకుమార్ రాజు ఆధారాలతోనే మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు తప్పు చేయకపోతే విచారణకు సిద్ధంగ కావాలన్నారు. మంత్రుల భాష సరిగా లేదని, ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే ప్రజా ద్రోహులవుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. -
స్నేహితురాలిని కాపాడబోయి యువతి మృతి
పోలవరం: గోదావరిలో ప్రమాదవశాత్తు పడి మునిగిపోతున్న స్నేహితురాలిని కాపాడబోయి ఓ యువతి మరణించింది. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన ర్యాలి సాయిరమ్య(18) గూటాల పంచాయతీ కొత్తపట్టిసీమ గ్రామం వద్ద ఆదివారం గోదావరిలో మునిగిపోయి మరణించింది. కొవ్వూరులోని ఏబీఎన్పీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్య స్నేహితులతో కలసి కొత్తపట్టిసీమలోని మరో స్నేహితురాలైన వలవల శ్రీవల్లి ఇంటికి శనివారం సాయంత్రం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు చూడాలని రాత్రి వారంతా అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం స్నేహితులైన శ్రీవల్లి, ఊనగట్లకు చెందిన గూడపాటి సాయిభవాని, కొవ్వూరుకు చెందిన ప్రత్యూషలతో కలిసి గోదావరినదికి స్నానానికి వెళ్లింది. నది ఒడ్డున నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా, సాయిభవాని తలపై నీళ్లు చల్లుకునేందుకు నదిలోకి వంగింది. ఆమె నిలబడిన రాళ్లు నాచుపట్టి ఉండటంతో నదిలోకి జారిపడింది. ఆమెను కాపాడేందుకు సాయిరమ్య ప్రయత్నించగా, ఇద్దరూ నదిలో మునిగిపోయారు. కేకలు వేయటంతో దగ్గరలో ఉన్న యువకులు వచ్చి సాయిభవానీని కాపాడారు. ఈమె పోలవరం వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకుంది. సాయిరమ్య మృతి చెందింది. పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు స్బిబందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దొమ్మేరులో విషాదఛాయలు కొవ్వూరులో విషాదఛాయలు సాయిరమ్య మృతితో ఆమె స్వగ్రామం దొమ్మేరులో విషాదఛాయలు అలముకున్నాయి. ర్యాలి శ్రీనివాసరావు ప్రథమ కుమార్తె ఆమె. అపురూపంగా చూసుకునే రమ్య మృతితో కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. సర్పంచ్ ముదునూరి జ్ఞానేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకుడు ముదునూరి నాగరాజు సాయిరమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సాయిరమ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇన్నాళ్లకు గుర్తొచ్చె.. నిర్మాణ వ్యయానికి రెక్కలొచ్చె..
కొవ్వూరు: తాడిపూడి ఎత్తిపోతల పథకంపై సర్కారు సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోంది. కృష్ణా జిల్లాకు నీళ్లు తరలించడం కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగ మేఘాలపై పూర్తి చేసిన ప్రభుత్వం తాడిపూడిని విస్మరించింది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్దేశించిన ఈ పథకంను పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు రెట్టింపయ్యింది. ఈ పథకం నిర్మాణ వ్యయం మొదట్లో రూ.467.70 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ వ్యయం కాస్తా రూ.885.53 కోట్లకు పెరిగింది. ఇటీవలే ప్రభుత్వం అదనపు అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే సుమారు రూ.417.83 కోట్ల వ్యయం అదనంగా పెరిగింది. చంద్రబాబు ప్రారంభించారు.. వైఎస్ పూర్తి చేశారు 2003 నవంబర్ 12న అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు ఈ పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేశారు. 2007 అక్టోబర్ 25న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి పంట పొలాలకు నీళ్లు అందించారు. అయితే చివరి ఆయకట్టు వరకూ సాగునీరందించాలని చేపట్టిన భూ సేకరణలో సమస్యలు ఎదురయ్యాయి. రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఈ పథకంపై కన్నెత్తి చూడకపోవడం విశేషం. అసంపూర్తి పనులు పూర్తయితే.. తాళ్లపూడి మండలంలోని తాడిపూడిలో ప్రారంభమైన ఈ ఎత్తిపోతల పథకం వల్ల తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల తదితర మండలాల్లోని 2,06,600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నది లక్ష్యం. వైఎస్ చలవ వల్ల ఈ పథకం ద్వారా ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 1,57,454 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వాస్తవానికి లక్ష ఎకరాలు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. తాడిపూడి వద్ద గోదావరి జలాలను ఎత్తిపోసి కాలువల ద్వారా సుమారు 74 కిలోమీటర్ల దూరంలోని నల్లజర్ల మండలంలోని పొలాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం అసంపూర్తిగానే నిలిచిపోయింది. ఇంకా మెయిన్ కెనాల్పై 154 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా వీటిలో 141కి పూర్తి చేశారు. 31 పంపిణీ కాలువలు పూర్తి చేయాల్సి ఉండగా 29 పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా రెండు పంపిణీ కాలువలు తవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఐదు సబ్లిఫ్ట్లుంటే మొదటి సబ్ సబ్ లిఫ్ట్ పూర్తి చేశారు. 2, 3, 4, సబ్లిఫ్ట్లతో పాటు ఐదు సబ్లిఫ్ట్లో కొన్ని చోట్ల అసంపూర్తి పనులు ఉన్నాయి. మొత్తం మీద సుమారు 70 పనులు పూర్తి కావాల్సి ఉంది. ఐదో సబ్లిఫ్ట్ ద్వారా 12,915 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా గత ఏడాది నాలుగు వేల ఎకరాలకు నీరు అందించారు. అసంపూర్తి పనులు పూర్తి చేస్తే తప్ప ఆయకట్టు అంతటికీ సాగునీరు అందే పరిస్థితి లేదు. 420 ఎకరాల భూసేకరణకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీని నిమిత్తం రూ.80 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో అంచనా వ్యయం రెట్టింపు ముడుపుల కోసం, పర్సంటేజీల కోసమే టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించింది. తాడిపూడిని మూడున్నరేళ్లుగా విస్మరించింది. స్వయంగా చంద్రబాబే శంకుస్థాపన చేసిన పథకం ఇన్నాళ్లకు ఆయనకు గుర్తుకు రావడం శోఛనీయం. అసంపూర్తి పనులను అధికారంలోకి రాగానే పూర్తి చేసి ఉంటే అంచనా వ్యయం పెరిగేది కాదు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా అంచనా వ్యయం రెట్టింపైంది. ఇప్పటికైనా అసంపూర్తి పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకూ సాగునీరు అందించాలి. –తానేటి వనిత, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్, కొవ్వూరు -
‘పట్టిసీమ’పై తేలని పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాటాలపై అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే కృష్ణాబోర్డు చేతులెత్తేయగా.. గోదా వరి నదీ యాజమాన్య బోర్డు వద్ద కూడా పంచాయితీ ఎటూ తేలలేదు. పట్టిసీమ మళ్లిం పు జలాలపై ఎలాంటి అభ్యంతరాలు, విజ్ఞప్తు లు ఉన్నా.. వాటిని లిఖితపూర్వకంగా తమకు అందజేయాలంటూ గోదావరి బోర్డు చేతులు దులుపుకొంది. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు, వర్కిం గ్ మాన్యువల్, మళ్లింపు జలాల అంశాలపై చర్చించేందుకు మంగళవారం హైదరాబాద్లో ని జల సౌధలో గోదావరి బోర్డు సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ సాహూ, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్కే జో షి, శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. మళ్లింపు జలాలపైనే ప్రధానంగా చర్చ సమావేశంలో మళ్లింపు జలాల అంశంపై చర్చించారు. పట్టిసీమ ద్వారా ఏపీ ఇప్పటికే 106 టీఎంసీల మేర గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించిందని, అందులోంచి ఎగువ రాష్ట్రాలకు దక్కే 45 టీఎంసీల వాటాను తేల్చి తెలంగాణకు కేటాయింపులు చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. దీనిపై కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోనందున గోదావరి బోర్డు నిర ్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై ఏపీ విభేదిం చింది. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో తెలం గాణకు చుక్క నీటి వాటా కూడా దక్కదని.. పోలవరం ప్రాజెక్టు ఫలాలను ముందుగా అందుకోవాలన్న లక్ష్యంతోనే పట్టిసీమ చేపట్టా మని పేర్కొంది. తెలంగాణ సర్కారు గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరు ద్ధంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రెండో దశ, వరద కాల్వ, దేవా దుల, కాళేశ్వరం, సీతారామ, మంజీరా, ఎల్లం పల్లి, సింగూరుల నుంచి 163 టీఎంసీల గోదా వరి జలాలను కృష్ణా పరీవా హక ప్రాంతానికి మళ్లిస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. మళ్లింపు జలాలతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధికారం గోదావరి బోర్డుకు, బ్రిజేశ్ ట్రిబ్యునల్కుగానీ లేదని, ఆ అధికారం గోదా వరి ట్రిబ్యునల్కే ఉందని ఏపీ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరాలు తెలపగా.. లిఖితపూర్వ కంగా ఇవ్వాలని బోర్డు చైర్మన్ సాహూ సూచించారు. డీపీఆర్లు ఇస్తామన్న ఏపీ.. గోదావరిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం లేదని, రాష్ట్ర విభజనకు ముందు నాటి ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేస్తున్నం దున కొత్త డీపీఆర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ లిఖిత పూర్వకంగా తెలిపిం ది. ఏపీ పరిధిలో చేపట్టిన పురుషోత్తమ పట్నం, పట్టిసీమ, చింతపూడి ప్రాజెక్టుల డీపీ ఆర్లను 15 రోజుల్లో ఇస్తామని పేర్కొంది. వర్కింగ్ మాన్యువల్కు ఓకే! సమావేశంలో గోదావరి బోర్డు వర్కింగ్ మాన్యువల్కు ఆమోదం తెలిపారు. ఇక పలు ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానిం చారు. ఇక ఒడిశా నిర్మిస్తున్న కోలాబ్ ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ అభ్యంతరా లను 15 రోజుల్లోగా అందజేయాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. -
పట్టిసీమపై కట్టుకథలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల విషయంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో తన వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే గోదావరి డెల్టాకే కాదు, కృష్ణా డెల్టాలోనూ రెండో పంట సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, పోలవరం నిర్మాణం విషయంలో తాత్సారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన పోలవరం కుడికాలువ మీదుగా కృష్ణా డెల్టాకు నీళ్లందించే ముసుగులో కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. పట్టిసీమ పేరుతో రూ.372.07 కోట్లు దోచేశారని సాక్షాత్తూ కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో బహిర్గతం చేసింది. దీంతో జనం కళ్లు గప్పేందుకు చంద్ర బాబు నిత్యం అబద్ధాల దండోరా వేస్తున్నారు. ముఖ్య మంత్రి మాటలు విని కృష్ణా డెల్టా రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులు అప్పుడే ఇచ్చి ఉంటే.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలు ఆలస్యంగా సాగు చేయడం వల్ల కోతల సమయంలో తుఫాన్ల దెబ్బకు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. జూన్లోనే ఖరీఫ్ సాగుకు నీళ్లం దించడంతోపాటు రబీ పంటలకూ నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యం తో.. తెలంగాణ ప్రాంతం నేతలు అడ్డుపడినా ఖాతరు చేయకుండా పులిచింతల ప్రాజెక్టును దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆగమేఘాలపై ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కేవలం రూ.193.14 కోట్లు పరిహారం చెల్లిస్తే.. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం 2015 సెప్టెంబరు 24న రూ.78.12 కోట్లు తెలంగాణ సర్కార్కు ఇచ్చింది. గతేడాది ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద జలాలు వచ్చాయి. పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో 2016 ఆగస్టు 31న ఏపీ ప్రభుత్వం రూ.66.02 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.49 కోట్లు విడుదల చేయకపోవడంతో పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీలకు మించి నిల్వ చేయడానికి తెలంగాణ సర్కార్ అంగీకరించలేదు. దీంతో గతేడాది 55.21 టీఎంసీల కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. తెలంగాణ సర్కార్ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఏడాది మార్చి 17న మిగతా రూ.49 కోట్ల పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను గత ఏడాదే విడుదల చేసి ఉంటే పులిచింతలలో 45.77 టీఎంసీలను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. నిధుల ఎత్తిపోతల పథకాలు ఏటా కృష్ణా, గోదావరి నదులకు ఇంచుమించుగా జూలై నుంచి అక్టోబర్ వరకూ దాదాపు 90 రోజులపాటు ఒకేసారి వరద వస్తుంది. గోదావరి నీటిని నిల్వ చేసే జలాశయం లేకపోవడం, పులిచింతలకు దిగువన కృష్ణా నదిపై నీటిని నిల్వ చేసే జలాశయం కూడా లేకపోవడం వల్ల ఏటా వందలాది టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయి. వరదను ఒడిసి పట్టి గోదావరి డెల్టాలో రెండో పంటకు పుష్కలంగా నీటిని అందించడం.. కొత్తగా 7.21 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీరు, విశాఖపట్నం ప్రజల తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడం, కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించడం, తద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయడమే ధ్యేయంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. పోలవరం రిజర్వాయర్లో 194.1 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. వైఎస్ హయాంలో పోలవరం కుడి కాలువ దాదాపుగా పూర్తయ్యింది. ఎడమ కాలువ 161 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. జలాశయం పనులను పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాతోపాటు విశాఖకూ గోదావరి జలాలను తరలింవచ్చు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్ హయాంలో పూర్తయిన పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తరలించి.. నదుల అనుసంధానం చేశానంటూ గొప్పలు పోయారు. ఇందుకోసం రూ.1,647 కోట్లు వ్యయం చేశారు. ఇదే ఊపులో పోలవరం ఎడమ కాలువ మీదుగా ‘ఏలేరు’కు గోదావరి జలాలను తరలించడానికి రూ.1,660 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలతో అవసరమే ఉండదు. 2018 నాటికి పాక్షికంగా, 2019 నాటికి పూర్తిగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టడంలో ఆంతర్యం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. రైతులపై పెనుభారం కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. డెల్టా తూర్పు, పశ్చిమ కాలువల ఆయకట్టుకు నీళ్లందించాలంటే 16,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయాలి. కానీ, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 8,500 క్యూసెక్కులను ఎత్తిపోసినా.. ప్రకాశం బ్యారేజీకి 7,000 క్యూసెక్కులు చేరుతాయి. దీనివల్ల కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయని దుస్థితి నెలకొంది. దాంతో పులిచింతలలో నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేసి.. కాలువలకు 8,000 నుంచి 8,500 క్యూసెక్కులు విడుదల చేశారు. పొట్ట దశలో ఉన్నప్పుడు పంటలకు అధికంగా నీళ్లు అవసరం. కాలువల్లో నీళ్లందకపోవడంతో రైతులు వేలాది రూపాయలు వెచ్చించి డీజిల్ మోటార్ల ద్వారా పొలాలకు నీటిని తోడుకోవాల్సి వచ్చింది. ఇక పట్టిసీమ ఫలాలను రాయలసీమకూ అందించామని చంద్రబాబు చెబుతున్న మాటల్లో వీసమెత్తు వాస్తవం లేదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఆరు తడి పంటలకే నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచే పనులు రూ.45 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతాయి. కానీ, ఆ పనులను పూర్తి చేయకపోవడం వల్ల గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించలేకపోతున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులు చేయకుండా రూ.1,100 కోట్లతో ప్రధాన కాలువ విస్తరణ పనులు చేపట్టి సీఎం రమేశ్ వంటి కోటరీలోని కాంట్రాక్టర్లకు వాటిని అప్పగించి చంద్రబాబు కమీషన్లు జేబులో వేసుకున్నారు. -
పట్టిసీమలో చుక్క వాటా ఇవ్వం
ఏపీ సర్కారు కొత్త మెలిక ► పట్టిసీమ పోలవరంలో భాగమేనంటూ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖ ► తెలంగాణే గోదావరి నుంచి కృష్ణాకు 163టీఎంసీలు మళ్లిస్తోందని వాదన ► వాటిలో తమకు వాటా ఇవ్వాలని పేచీ ► గోదావరి నీటిని మళ్లిస్తూ పట్టిసీమలో వాటా అడగడంపై అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చురేగేలా ఆంధ్రప్రదేశ్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో ఎగువన ఉన్న తెలంగాణకు చుక్క నీటి వాటా దక్కదని స్పష్టం చేసింది. పోలవరంలో అంతర్భాగంగానే పట్టిసీమ చేపట్టామని స్పష్టం చేసింది. తెలంగాణనే ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరు ప్రాజెక్టుల ద్వారా ఏకంగా 163 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాశారు. పాతవాదనతోనే లేఖలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80, పోలవరం కుడి కాలువ ద్వారా 80 వెరసి 160 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు మళ్లిస్తోందని, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తమకు కృష్ణా జలాల్లో 90 టీఎంసీలు అదనంగా ఇవ్వాలని గతంలో తెలంగాణ సర్కార్ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాసింది. దీనిపై స్పందించిన కృష్ణా, గోదావరి బోర్డులు వివరణ కోరుతూ జూలై 14న ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశా యి. వీటిపై స్పందించిన ఆ ప్రభుత్వం ఇప్పటివరకూ చేస్తున్న వాదననే వినిపిస్తూ ఇటీవల రెండు బోర్డులకు లేఖలు రాసింది. ఆ నీటిని వాడుకుంటున్నారుగా! ‘పోలవరం ప్రాజెక్టుపై సరిహద్దు రాష్ట్రాలతో ఆగస్టు 4, 1978లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ మహారాష్ట్ర 14, కర్ణాటక 21, నాగార్జునసాగర్కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకునే వెసులుబాటును కల్పిస్తూ గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఫలా లను ముందుగా అందుకోవాలన్న లక్ష్యంతోనే కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాం.పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గ్రావిటీ ద్వారానే కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తరలిస్తాం. ఇదే అంశాన్ని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంటే పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టులు రెండు వేర్వేరు కాదన్నది స్పష్టం అవుతోంది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు వెలువడే నాటికి కృష్ణా నదిపై జూరాల, గోదావరి ఉప నది అయిన మంజీరపై సింగూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కర్ణాటకలో భూమి ముంపునకు గురైంది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కర్ణాటకకు నష్ట పరిహారం చెల్లించింది. జూరాల, మంజీరల నిర్మా ణంలో కర్ణాటకతో సమైక్య ప్రభుత్వం కుదర్చుకున్న ఒప్పందం మేరకు పోల వరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే గోదా వరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనపు వాటా కోరే అధికారం తెలంగాణకు లేదు.’ అని ఏపీ సర్కార్ తన లేఖల్లో స్పష్టం చేసింది. కృష్ణా జలాల్లో 163 టీఎంసీలు ఇవ్వాలి.. ‘గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ సర్కార్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ ద్వారా 24, శ్రీరాంసాగర్ వరద కాలువ ద్వారా 6.6 టీఎంసీలు, దేవాదుల ఎత్తిపోతల ద్వారా 20.6, ప్రాణహిత–చేవెళ్ల(మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు) ద్వారా 78, సీతారామ ఎత్తిపోతల ద్వారా 22, మంజీర, ఎల్లంపల్లి ద్వారా 8.1, సింగూరు ద్వారా 4 మొత్తంగా 163 టీఎంసీల జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో 14(బీ) క్లాజ్ ప్రకారం తెలంగాణ సర్కార్ కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించిన 163 టీఎంసీల గోదావరి నీళ్లల్లో అదే స్థాయిలో మాకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలి’అని తన లేఖల్లో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. -
‘అది డబ్బులు తోడే ప్రాజెక్ట్’
రాజమహేంద్రవరం: పట్టిసీమ నీళ్లు తోడే ప్రాజెక్టుకాదని, డబ్బులు తోడే ప్రాజెక్టు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, కనీసం ఆఫీస్ అటెండర్ నుంచి కూడా సమాధానం రాలేదని వాపోయారు. ప్రభుత్వ పనితీరును అంచనా వేసేందుకు కాగ్ నివేదికే సరైన ఆయుధమన్నారు. కాగ్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందని వెల్లడించారు. వైఎస్ రాజశేఖరెడ్డి చేపట్టినన్ని సాగునీటి ప్రాజెక్టులు ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని తెలిపారు. ‘రాజా ఆఫ్ కరప్షన్’పై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని ఇంతకుముందు ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన సవాల్పై ప్రభుత్వం తోకముడిచిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో బహిరంగ చర్చ కోసం మంగళవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. -
ఆ హక్కు బ్రిజేశ్ ట్రిబ్యునల్కు లేదు
పట్టిసీమ, పోలవరం వాటాల పంపిణీపై ఏపీ కొత్త వాదన వాటాలు రావాల్సిందేనంటున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై ఏపీ మరో కొర్రీ పెట్టింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్కు లేదని.. ఆ అధికారం గోదావరి ట్రిబ్యునల్కే ఉందని కొత్త వాదన మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ పట్టిసీమ, పోలవరం వాటాల్ని బ్రిజేశ్ ట్రిబ్యు నలే తేల్చుతుందంటూ కేంద్ర కమిటీలు, బోర్డుల ముందు చెప్పిన ఏపీ.. ఇప్పుడు పూర్తి విరుద్ధమైన వాదన చేస్తుండడం గమనార్హం. అఫిడవిట్ దాఖలు కృష్ణా జలాల విషయంగా తామిచ్చిన తీర్పు పై అఫిడవిట్ దాఖలు చేయాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్ గత నెలలోనే తెలంగాణ, ఏపీ లను ఆదేశించింది. ఈ మేరకు ఏపీ గురు వారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరు నుంచి హైదరాబాద్కు నీటి సరఫరా పేరుతో తెలంగాణ గోదావరి జలాలను కృష్ణాబేసిన్కు తరలిస్తోందని.. కర్ణాటక, మహారాష్ట్రలు సైతం అదే తరహాలో కృష్ణా నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తున్నా యని అందులో వివరించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ జలాలపై గోదావరి ట్రిబ్యునల్ మాత్రమే పునః సమీక్ష చేయ గలదని.. బ్రిజేశ్ ట్రిబ్యునల్కు ఆ అధికారం లేదని పేర్కొంది. ఇక తెలంగాణ మైనర్ ఇరిగేషన్ కింద ఎక్కువ నీటిని వినియోగిం చుకుంటూ లెక్కల్లో తక్కువగా చూపుతోం దని ఆరోపించింది. ఆ లెక్కలను తేల్చి ఏపీకి కృష్ణా జలాల్లో వాటా పెంచాలని కోరింది. తెలంగాణకు వాటా పెరగాల్సిందే.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఏపీ 160 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలిస్తున్నందున.. అందులో తెలం గాణకు 73 టీఎంసీలు దక్కాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేయనుంది. దీనిపై త్వరలో అఫిడవిట్ సమర్పించనుంది. -
పట్టిసీమా... వట్టిసీమా?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘‘ఎంతైనా సెందరబాబు గ్రేటురా’’ అన్నాడు ఏకాంబరం. ‘‘అది నిజవే కానీ... ఇపుడు హఠాత్తుగా ఆయనెందుకు గుర్తుకొచ్చాడు’’ అన్నాడు చిదంబరం. ‘‘పట్టిసీమతో నీళ్లిస్తానన్నాడా ఆ బాబు. ఇచ్చేశాడు. ఆ నీటితో రైతులంతా పంట పండించేసి... ఆ బియ్యంతో పరమాన్నం వండేసి సెందరబాబుకి ఓ గిన్నెలో తీసుకొచ్చి పెట్టార్రా... సెందరబాబంటే మజాకేంటి?’’ అన్నాడు ఏకాంబరం పూనకం వచ్చినట్లు.‘‘అరేయ్... నాకు తెలీక అడుగుతాను ఆ పాయసం వండిన బియ్యం పట్టిసీమ నీళ్లతోనే పండించారేట్రా?’’ అని ఆరా తీశాడు చిదంబరం.‘‘అరే వాళ్లే చెప్పారు కదరా బాబూ! నువ్వు టీవీల్లో చూడనేదా ఏటి?’’ అని ప్రశ్నించాడు ఏకాంబరం. ‘‘టీవీల్లో చాలా చూపిస్తార్రా బాబూ. అక్కడకొచ్చిన వాళ్లసలు రైతులో కాదో కూడా డౌటే’’ అన్నాడు చిదంబరం.‘అదేంట్రా నీకన్నీ అనుమానాలే... అయినా నీకెందుకొచ్చింది అనుమానం’’ అన్నాడు ఏకాంబరం.‘‘ఎందుకంటే... అసలు పట్టిసీమ ప్రాజెక్టే ఓ బొంగులో ప్రాజెక్టని కాగ్ చెప్పేసింది కదేటి. అసలు పట్టిసీమ నుండి తీసుకెళ్లిన నీళ్లని కృష్ణా నీటితో కలిపి సముద్రంలో కలిపేశారట. ఇంతోడి దానికి వందల కోట్లు ఉత్తి పుణ్యానికి తినేశారని కాగ్ ఏకి పారేసిందనుకో’’ అన్నాడు చిదంబరం. ‘‘ఏకాంబరానికి ఒళ్లు మండింది. అరే అపోజిషన్ వాళ్లు అలాగే చెబుతార్రా, అవి నమ్మద్దు’’ అన్నాడు. చిదంబరం పగలబడి నవ్వి... ‘‘కాగ్ అంటే పెతిపక్షం కాదెహె... అది గౌర్మెంట్ సంస్థే. పెబుత్వం ఖర్చు పెట్టే పెతీ పైసాకీ లెక్కలూ గట్రా సరి చూసి ఎంత తగలేశారో... ఎంత తినేశారో వివరంగా చెబుతూ పుస్తకాలు రాస్తారన్నమాట వాళ్లు’’ అన్నాడు చిదంబరం.‘‘ఏకాంబరానికి ఓడిపోవడం ఇష్టం లేదు. అయితే కాగ్ వాళ్లు పెతి పక్షంతో కలిసిపోయి ఊరికే బురద జల్లుతున్నారేమో ఎవరికి తెలుసు?’’ అన్నాడు.‘‘ఛస్ ఊరుకోయేస్. ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే పళ్లు రాలిపోతాయి నోటికెంతొస్తే అంతా వాగేయడమేనేటి?’’ అని చిదంబరం సీరియస్ అయ్యాడు. ఏకాంబరానికి ఏమనాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. -
తెలంగాణను అడ్డుకొనే శక్తి ఏపీకి లేదు: తుమ్మల
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్త రామదాసు ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. భక్త రామదాసు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన పట్టిసీమకు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో భక్తరామదాసు ప్రాజెక్టు ఆగదని, తెలంగాణకు రావలసిన 299 టీఎంసీలలోనే వాడుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టులు ఆపే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకుంటుందన్నారు. కృష్ణా జలాల్లో తమకు రావలసిన వాటా ఎలా తీసుకోవాలో తమకు తెలుసునని తుమ్మల స్పష్టం చేశారు. రైతుల విషయంలో అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఏపీకి సూచించారు. -
కమీషన్లకోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం
ఆనాడు జగన్మోహన్రెడ్డి చెప్పిందే నిజమైంది రూ.387 కోట్ల అవినీతిని తప్పుపట్టిన కాగ్ తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నబాబు కరప (కాకినాడ రూరల్) : కమీషన్ల కోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని ఆనాడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిందే నిజమైందని ఆ పార్టీ తూర్పుగోదారి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా కరప మండలం కొంగోడు గ్రామంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జేబులు నింపే ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఎత్తిపోతల పథకాలను విస్మరిస్తున్నారని కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై తమ పార్టీ అధినేత అసెంబ్లీలో, బయట మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగి బురద జల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుడి, ఎడమ కాలువలు నిర్మిస్తే ఆ కాలువలపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి టీడీపీ ప్రభుత్వం అవినీతి గేట్లు ఎత్తారన్నారు. నిధులు దుర్వినియోగమయ్యాయన్న కాగ్కు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి లింగం రవి, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కర్నాసుల సీతారామాంజనేయులు, జి.భావారం సర్పంచి రొక్కాల గణేష్, మాజీ సర్పంచులు కోట వెంకటేశ్వరరావు, బొమ్మిడి శ్రీనివాస్, గొల్లపల్లి ప్రసాదరావు, మారెళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసీమ.. ఆద్యంతం దోపిడీ పర్వం
కాంట్రాక్టర్తో సర్కారు పెద్దల కుమ్మక్కును కడిగిపారేసిన కాగ్ - అప్పనంగా రూ.199 కోట్లు బోనస్ ఇచ్చారని ఆక్షేపణ సాక్షి, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో కాంట్రాక్టర్తో కుమ్మక్కై ప్రభుత్వం సాగించిన దోపిడీ పర్వాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఏకిపారేసింది. ముందస్తు ప్రణాళిక లేకుండా, పోలవరం కుడి కాలువ డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టకుండా.. గృహ, పారిశ్రామిక లబ్ధిదారులను గుర్తించకుండా పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టడాన్ని తప్పుబట్టింది. రూ.372.02 కోట్లు కాంట్రాక్టర్కు అనుచితంగా లబ్ధి చేకూర్చిందని ఎత్తి చూపింది. ఇంత చేసినా పోలవరం ముందస్తు ఫలాలు నిర్దేశించిన వారికి అందించలేకపోయిందని పేర్కొంది. 2015 – 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్.. శాసనసభకు సమర్పించిన నివేదికలో ‘పట్టిసీమ’ బాగోతాన్ని స్పష్టంగా వివరించింది. టెండర్ల నిబంధనలు సడలించి అక్రమాలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల అంచనా విలువ టెండర్లలో పేర్కొన్న ప్రకారం రూ.1,170.25 కోట్లు. జీవో 94 ప్రకారం ఐదు శాతానికి మంచి అదనపు ధరకు పనులను కాంట్రాక్టర్కు అప్పగించకూడదు. కానీ, 21.999 శాతం అదనపు ధరతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మేఘా) సంస్థ షెడ్యూలు దాఖలు చేసింది. ఐదు శాతం అదనపు ధరకు.. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే 16.999 శాతం బోనస్ ఇచ్చేలా నిబంధనలు సడలించి మేఘాకే పనులు అప్పగించిందని, దీని వల్ల అంచనా వ్యయం పెరిగిందని కాగ్ తేల్చింది. కానీ.. ఒప్పంద కాలంలోనే భూసేకరణ పూర్తి చేయడంతో పాటు డిజైన్లను సత్వరమే ఆమోదించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జల వనరుల శాఖ పట్టిసీమ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసింది. దీని వల్ల పనులు ఏడాదిలోగా పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గడువులోగా పూర్తి చేసిన కాంట్రాక్టర్కు రూ.199 కోట్లను బోనస్ రూపంలో ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. అవసరం లేకున్నా డయాఫ్రమ్ వాల్ పట్టిసీమ ఎత్తిపోతలకు సంప్రదాయ పద్ధతుల్లో రూ.147 కోట్లతో పంప్ హౌస్ నిర్మించాలని అంచనాల్లో సర్కార్ పేర్కొంది. కానీ.. డయా ఫ్రమ్ వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో పంప్ హౌస్ నిర్మాణానికి అనుమతించడం వల్ల అంచనా వ్యయం రూ.253.17 కోట్లకు పెరిగింది. పంప్ హౌస్ నిర్మాణంలో బేసిక్ పెరామీటర్లలో మార్పేమీ లేకున్నా కాంట్రాక్టర్కు అదనంగా రూ.106.17 కోట్లను అనుచితంగా లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని జలవనరుల శాఖను ప్రశ్నించగా, తప్పును అంగీకరించిందని పేర్కొంది. కానీ.. కేవలం రూ.100 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్కు అదనంగా చెల్లించామని జల వనరుల శాఖ వివరణ ఇచ్చిందని, ఈ వివరణ కూడా ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేసింది. పన్ను మినహాయించినా దోచిపెట్టారు.. సాగు, తాగునీటి పథకాలకు వినియోగించే పైపులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును పూర్తిగా మినహాయించింది. కానీ.. పట్టిసీమ ఎత్తిపోతల కాంట్రాక్టర్కు పైపులపై రూ.32.01 కోట్లను ఎక్సైజ్ పన్నుల రూపంలో సర్కారు చెల్లించడాన్ని కాగ్ తప్పుబట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయంలోనే ఒక శాతం కార్మిక సంక్షేమ పన్నును చేర్చారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ నుంచి రూ.14.22 కోట్లను జల వనరుల శాఖ వసూలు చేయాలి. కానీ.. కార్మిక సంక్షేమ పన్ను రూపంలో కాంట్రాక్టర్కు రూ.14.22 కోట్లను అక్రమంగా తిరిగి చెల్లించి.. అనుచిత లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చింది. మొత్తంగా కాంట్రాక్టర్కు రూ.372.02 కోట్ల మేర అనుచితంగా లబ్ధి చేకూర్చిందని కాగ్ స్పష్టం చేసింది. ముందస్తు ఫలాలు దక్కిందెక్కడ? పట్టిసీమ ఎత్తిపోతలను 2016 మార్చి నాటికి పూర్తి చేసినా పోలవరం కుడి కాలువ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేయలేదు. దీని వల్ల 24 పంపులతో నీటిని తరలించాల్సి ఉండగా.. కేవలం 11 పంపుల ద్వారానే నీటిని ఎత్తిపోయగలిగారని కాగ్ ఎత్తి చూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులు చేయకపోవడం వల్ల పోలవరం కుడి కాలువ కింద 1.2 లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోయారని స్పష్టం చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం 20 ఏళ్ల(లైఫ్ టైమ్)పాటు పని చేస్తుందని ప్రభుత్వం పేర్కొంటూనే.. మరోవైపు 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. ఇది పూర్తయితే పట్టిసీమ ఉపయోగించమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో పట్టిసీమ పథకం పనిచేసేది కేవలం మూడేళ్లేనని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఇది అనవసరమని కాగ్ స్పష్టం చేసింది. -
‘పట్టిసీమ’లో అవినీతి బట్టబయలు
రూ.370 కోట్ల దుర్వినియోగంపై వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు కాగ్ నివేదికపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ మండపేట : సాగునీటి ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు సర్కారు సాగిస్తున్న అవినీతి భాగోతాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.370 కోట్లు అవినీతి జరిగినట్టు కాగ్ వెల్లడించడంపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయోజనం లేని పట్టిసీమ పేరుతో ప్రజాధనాన్ని సీఎం చంద్రబాబు, ఆయన అనుచరగణం దిగమింగారని ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, మండపేట నియోజకవర్గ కోఆరి్డనేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు) విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు వలన ప్రయోజనం లేదని వైఎస్సార్ సీపీ, రైతు సంఘాలు ఎంత మొర పెట్టుకున్నా వినకుండా ప్రజాధనాన్ని దోచుకునేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని త్రినాథరెడ్డి విమర్శించారు. మొదట రెండు టీఎంసీలు, తర్వాత 48 టీఎంసీల నీరు కృష్ణా బ్యారేజీ ద్వారా సముద్ర జలాల్లో కలిసిపోయాయన్నారు. పుష్కర, పురుషోత్తపట్నం టెండర్లలోను అక్రమాలు జరిగినట్టు కాగ్ బహిర్గతం చేసిందన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ బూటకమని విమర్శించారు. రూ.42 వేల కోట్లు ప్రస్తుత అంచనా వ్యయంగా చంద్రబాబు చెబుతుండగా 2013 అంచనాల ప్రకారం మాత్రమే ఇస్తామని కేంద్రం చెబుతోందన్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు చేసిన చెల్లింపులు పోగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చేది రూ.ఐదు వేల కోట్ల లోపే ఉంటుందన్నారు. పట్టిసీమ అవినీతిపై చంద్రబాబు, ఇరిగేష¯ŒSశాఖ మంత్రి సమాధానం చెప్పాలని, లేకుంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజుబాబు మాట్లాడుతూ రుణమాఫీకి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరం కాగా మూడు విడతల్లోను ఇచ్చింది కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమేనన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పట్టిసీమపై చర్చకు రాకుండా ప్రగల్భాలా?
– ఎమ్మెల్యే బుచ్చయ్యపై ఉండవల్లి మండిపాటు – తనది తప్పని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకు సిద్ధమని వెల్లడి సాక్షి, రాజమహేంద్రవరం : పట్టిసీమ శుద్ధ దండగ ప్రాజెక్టని, రూ.1,650 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నుంచి కృష్ణా నదికి తీసుకెళ్లి సముద్రంలో కలుపుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పునరుద్ఘాటించారు. శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ వల్ల ప్రయోజనం శూన్యమని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న తన సవాల్ను స్వీకరించిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ తర్వాత ఆ విషయం మరచిపోయి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కొట్టించుకోవడం బుచ్చయ్యకు అలవాటే.. కృష్ణా బ్యారేజ్పై చర్చ పెడితే అక్కడి రైతులు తనపై దాడి చేస్తారని బుచ్చయ్య చెప్పడం హాస్యాస్పదమని ఉండవల్లి అన్నారు. కొట్టడం, కొట్టించుకోవడం బుచ్చయ్యకు బాగా అలవాటైన పనేనన్నారు. రాజమహేంద్రవరం కంబాలచెరువులో ప్రజలు బుచ్చయ్యను కొట్టిన విషయం నగరవాసులు ఇంకా మరచిపోలేదన్నారు. పట్టిసీమపై తన వాదన అబద్ధమని నిరూపిస్తే బహిరంగ క్షమాపణలు చెబుతానన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఉండవల్లి చెప్పారు. పట్టిసీమ నుంచి కోట్ల రూపాయల విద్యుత్ ఉపయోగించి 45 టీఎంసీలను కృష్ణాలో పోశారని చెప్పారు. అదే సమయంలో కృష్ణా నుంచి 55 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని జలవనరులశాఖ వెబ్సైట్ నుంచి సేకరించిన సమాచారం చూపించారు. మంత్రి దేవినేని ఉమా ఆ నీరు పులిచింతల నుంచి వెళ్లిందని చెబుతున్నారని, పులిచింతల నుంచి సముద్రంలోకి వెళ్లింది కృష్ణా జలాలు కాదా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పడం సరి కాదన్నారు. బుచ్చయ్యకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని స్పష్టం చేశారు. సమావేశంలో అల్లుబాబి, పి.అచ్యుత్దేశాయ్, చెరుకూరి రామారావు, నక్కా నగేష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లాలో వేధింపులకు కేరాఫ్గా మారిన బాస్
-
గోదావరి జిల్లాల్లో మూడో పంట కోసమే పట్టిసీమ
పట్టిసీమలోని అవినీతినే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది – సీమ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి – వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గుంటూరు, గోదావరి జిల్లాల్లో మూడో పంటకు నీరు ఇవ్వడం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారని, ఈ విషయాన్ని ముందు నుంచి వైఎస్ఆర్సీపీ చెబుతుంటే ఎవరూ నమ్మలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం స్వయంగా సీఎం చంద్రబాబునాయుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడో పంటకు నీరు ఇవ్వాలని, జూన్లో రైతులు నారు పోసుకునేందుకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మేక తోలు కప్పిన పులిలాంటి వారని, ఆయన నైజమే మోసమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, ఇన్నాళ్లు పట్టిసీమ ప్రాజెక్టును గోదావరి జలాలను రాయలసీమకు వినియోగించడం కోసం నిర్మిస్తున్నామని చెప్పి ఇక్కడి రైతుల్లో ఆశలు రేకెత్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అవినీతినే తమ పార్టీ ప్రశ్నించిందన్నారు. మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన ప్రాజెక్టుకు రూ.1600 కోట్లు ఖర్చు చేయడం దారుణమన్నారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడం చూస్తే ఈ ప్రాంత ప్రజలపై వారికున్న అభిమానం ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, కర్నూలు, కొడుమూరు సమన్వయకర్తలు హఫీజ్ఖాన్, మురళీకృష్ణ, కేంద్ర పాలిక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం వాటాలు తేల్చేలా ఆదేశాలివ్వండి
కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శితో విద్యాసాగర్రావు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పరి ష్కరించేందుకు ఏర్పాటైన ఏకే బజాజ్ కమిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చి పోలవరం, పట్టిసీమ వాటాలు తేల్చేలా చూడాలని కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్సింగ్ను రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు ఆర్.విద్యాసాగర్రావు కోరారు. శుక్రవారం ఢిల్లీలో అమర్జీత్సింగ్తో భేటీ అయిన ఆయన.. బజాజ్ కమిటీ విధులపై చర్చించారు. పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలిస్తున్న నీటిలో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలను కమిటీ తేల్చాలని పేర్కొన్నా, ఆ అంశం తమ పరిధిలోకి రాదంటూ కమిటీ ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భం గా చేసిన వ్యాఖ్యలను అర్జీత్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రిబ్యునల్ కేటాయింపులు చేసేందుకు చాలా సమయం పడుతున్నందున ఈలోగా తాత్కా లిక కేటాయింపులు చేసి, నిర్దిష్ట వాటా చెప్పాల్సిన బాధ్యత కమిటీపై ఉందని.. అది పట్టించుకోకుండా విధివిధానాలంటే కమిటీ ఏర్పాటుకు అర్థం లేదని వివరించారు. అమర్జీత్సింగ్ స్పందిస్తూ.. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, కమిటీ పెద్దలతో మాట్లాడతానని స్పష్టం చేసినట్లుగా సమాచారం. -
‘కృష్ణా’లో అన్యాయాన్ని సరిదిద్దండి
-
‘కృష్ణా’లో అన్యాయాన్ని సరిదిద్దండి
ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి జలాల కేటాయింపు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల కింద 78 టీఎంసీలు రావాలి పులిచింతల, సుంకేశులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చలేం: ఏకే బజాజ్ హైదరాబాద్ కృష్ణా జలాల కేటాయింపులు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దానిని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు నీటి కేటాయింపులు, పంపిణీ విషయంలో వివక్షే ఎదురవుతోందని పేర్కొంది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 98 టీఎంసీల వాటాలో.. తెలంగాణకు గరిష్టంగా 78 టీఎంసీలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో పోలవరానికి సంబంధించి 43 టీఎంసీలు (96శాతం వాటా), పట్టిసీమకు సంబంధించి 35 టీఎంసీలు (65శాతం వాటా) ఇవ్వాలని విన్నవించింది. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా నీటి యాజమాన్యం, నీటి వాటాలపై చర్చించేందుకు ఏకే బజాజ్ కమిటీ సోమవారం హైదరాబాద్లోని జలసౌధలో తెలంగాణ సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించింది. ఇందులో కమిటీ చైర్మన్ ఏకే బజాజ్తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్పీ పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్ఎన్ రాయ్, కేఆర్ఎంబీ చైర్మన్ ఎస్కే హల్దర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు, పంపిణీలో అన్యాయంపై జోషి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందున్న పరిస్థితి, సాగునీటి రంగంలో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు, పథకాలను వివరించారు. ఏపీ ఆవిర్భావం తర్వాత ఆయా పథకాలను తుంగలో తొక్కిన వైనాన్ని తెలిపారు. 811లో 450 టీఎంసీలైనా రావాలి హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో రూపొందించిన అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ 174 టీఎంసీలను కోల్పోయిందని ఎస్కే జోషి వివరించారు. బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి ఏపీ సర్కారు సమర్థంగా వాదించలేదన్నారు. అంతర్జాతీయంగా సాగునీటి కేటాయింపులు, పంపిణీకి సంబంధించి అమల్లో ఉన్న సహజ న్యాయసూత్రాలను ఉమ్మడి ఏపీ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. క్యాచ్మెంట్, సాగుయోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాలతో చూసినా.. ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 450 టీఎంసీలు రావాల్సి ఉందని వివరించారు. కమిటీకి విజ్ఞప్తి చేసిన మరిన్ని అంశాలు.. ⇒ నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద తెలంగాణ వాస్తవ ఆయకట్టు 6.6 లక్షల ఎకరాలుకాగా.. ఉమ్మడి ఏపీలో దాన్ని 6 లక్షల ఎకరాలకు తగ్గించారు. అందులోనూ 5 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారు. ఏపీ ప్రాంతంలో మాత్రం ఎడమ కాల్వ కింద ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.7 లక్షల ఎకరాలకు పెంచారు. కుడి కాల్వ కింద 7.9 లక్షల నుంచి 11.74 లక్షల ఎకరాలకు పెంచుకున్నారు. ⇒1956లో ఏపీలోని కేసీ కెనాల్కు, తెలంగాణలోని ఆర్డీఎస్కు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతరం ఉమ్మడి ఏపీలో కేసీ కెనాల్ కింద ఆయకట్టును 2.78 లక్షల ఎకరాలకు పెంచారు. అదే ఆర్డీఎస్ కింద మాత్రం 37 వేల ఎకరాలకు నీళ్లివ్వలేదు. ⇒ఇక ఏపీ తనకు కేటాయించిన నీటిలో 350 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు కలిపి మొత్తం 500 టీఎంసీలు బేసిన్ అవతలే వినియోగిస్తోంది. ⇒తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగి మూడేళ్లు కావస్తున్నా కృష్ణాలో తెలంగాణలో వాటా తేలలేదు. 299:512 నిష్పత్తి ప్రకారం 2015లో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా అంగీకారం కుదిరింది. దాని ప్రకారం కృష్ణా ప్రాజెక్టుల ’ఆపరేషనల్ ప్రోటోకాల్’ను రూపొందించాలి. ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలోకి జూరాలను చేర్చడం ఆక్షేపణీయం. ⇒పులిచింతల, సుంకేశుల ప్రాజెక్టులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చలేం ‘‘కృష్ణా జల వివాదాలపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటాం. కృష్ణా బోర్డు నిర్వహణ, ఆపరేషనల్ ప్రొసీజర్స్, గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా మళ్లిస్తున్న జలాల అంశాన్ని పరిశీలించాలని మాకు కేంద్రం సూచించింది. ఇరు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని బోర్డుకు సరైన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ కోరింది. నదీ జలాల మళ్లింపునకు సంబంధించి ఉమ్మడి ఏపీ సమయంలో ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉన్న 299ః512 టీఎంసీల నిష్పత్తిని ఎవరూ మార్చలేరు. మేం నివేదిక ఇచ్చేందుకు 90 రోజుల సమయం సరిపోకపోవచ్చు, గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరుతాం. తదుపరి పర్యటనలో ప్రాజెక్టులను కూడా సందర్శిస్తాం..’’ – ఏకే బజాజ్, కృష్ణా జల వివాదాలపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ -
‘పట్టిసీమ’పై చర్చకు సిద్ధమే
సమయం, స్థలం చెప్పండి అన్ని వివరాలతో వస్తా... వివరిస్తా మంగళవారం రావల్సిన కమిటీ పర్యటన ఎందుకు రద్దు చేసుకుందో ఆ లెక్కా తేలుస్తాఅదే రోజు జరగాల్సిన అంచనా కమిటీ ఎటుపోయిందో కూడా చెబుతా ఎమ్మెల్యే గోరంట్ల చేసిన సవాల్కు మాజీ ఎంపీ ఉండవల్లి ప్రతి సవాల్ సాక్షి, రాజమహేంద్రవరం : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిరుపయోగమైందా? లేకా ఉపయోగమైందా? అన్న అంశంపై జరిగే చర్చకు సమయం, స్థలం నిర్ణయించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సవాల్ విసిరారు. గతంలో పలు విలేకర్ల సమావేశాల్లో ‘పట్టిసీమ’ బోగస్ పథకమని, ప్రత్యేక ప్యాకేజీ ఒక బ్రహ్మ పదార్థమని ఉండవల్లి సాదాహరణంగా ఆరోపించారు. తన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే టీడీపీ నేతలకు బహిరంగ క్షమాపణలు చెబుతానని ప్రకటించారు. సోమవారం విలేకర్ల సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ‘పట్టిసీమ’ ‘ప్రత్యేక ప్యాకేజీ’లపై ఉండవల్లి ఆరోపణలను ఖండిస్తూ ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటిస్తూనే ఉండవల్లిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోరంట్ల సవాల్పై మంగళవారం ఉండవల్లి స్పందించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, ప్రత్యేక ప్యాకేజీపై చర్చకు సమయం, స్థలం చెప్పాలని కోరుతూ గోరంట్లకు బహిరంగ లేఖ రాశారు. పట్టిసీమ ప్రాజెక్టు ఏవిధంగా నిరుపయోగమైనదో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలతో సహా మీ ముందుంచడానికి సిద్ధంగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇవే కాకుండా పోలవరం ప్రాజెక్టు విషయమై మంగళవారం జరగాల్సిన ‘అంచనా కమిటీ’ సమావేశాన్ని, మంగళవారం ప్రాజెక్టు పరిశీలనకు రావాల్సిన కమిటీ పర్యటనను రద్దు చేయాడానికి గల కారణాలను కూడా గోరంట్ల బుచ్చయ్య ముందు ఉంచడానికి తాను రెఢీగా ఉన్నానని సవాల్ విసిరారు. -
అవినీతి కోసమే పట్టిసీమ
- ఎర్రకోట చెన్నకేశవరెడ్డి - వైఎస్సార్సీపీలోకి 30 మంది చేరిక ధర్మాపురం(నందవరం) : అవినీతి అక్రమార్జన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు పెంచిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు. ధర్మాపురంలో ఆదివారం ఆ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమకు మొదట్లో రూ. వెయ్యి కోట్లు అవసరమని చెప్పి ఆ తర్వాత అమాంతంగా రూ. 3 వేల కోట్లకు పెంచి సీఎం అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమని, వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోకి 30 మంది చేరిక ధర్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీకు చెందిన విద్యాకమిటీ చైర్మన్ చిన్నమద్దిలేటి, వార్డు మెంబర్ రంగస్వామి, చిన్ననాగన్న, గోవిందు, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీకు చెందిన నరసింహులు, కాశిం, వడ్డేనరసన్నలతో పాటు ఆయా పార్టీలకు చెందిన మరో 23 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీఏ ధర్మకారి నాగేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు కేఆర్ రాఘవరెడ్డి, ధర్మాపురం రాఘవరెడ్డి, సుధాకర్, బందేనవాజ్, కడిమెట్లతిమ్మప్పాచారి, సయ్యద్చాంద్, జగ్గాపురం నరసరాజు, జయన్న, శ్రీనివాసులు, రాఘవేంద్ర, ఆదోని భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
పట్టిసీమ తరహాలోనే పురుషోత్తపట్నం
డిప్యూటీ సీఎం చినరాజప్ప సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన పిఠాపురం టౌన్ : పట్టిసీమ తరహాలోనే పురషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురువారం నాటి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బుధవారం పిఠాపురం వచ్చిన రాజప్ప విలేకరులతో మాట్లాడారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఎస్వీఎస్ఎన్ వర్మ వెంట ఉన్నారు. చంద్రబాబు పిఠాపురంలో పాల్గొనే కార్యక్రమాల వివరాలు రాజప్ప వెల్లడించారు. రూ.1638 కోట్లతో చేపట్టే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పిఠాపురంలో ముఖ్యమంత్రి శుంకుస్థాపన చేస్తారన్నారు. ఈ పథకం పూర్తయితే ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) ఆయకట్టు భూములు సస్యశ్యామలం అవుతాయని తెలిపార. ఏడాదిలోగా పూర్తయ్యే ఈ పథకం వల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. చంద్రబాబు పర్యటన సాగేదిలా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మధ్యాహ్నం పిఠాపురం చేరుకుంటారు. బైపాస్ రోడ్డులోని ఇల్లింద్రాడ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆయన హెలికాప్టర్ దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పాదగయ జంక్షన్ వద్దకు వచ్చి సామర్లకోట రోడ్డులోని వైభవ వెంచర్స్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని, అక్కడ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ను సందర్శిస్తారని చినరాజప్ప తెలిపారు. భారీ బందోబస్తు పిఠాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచే పట్టణాన్ని పోలీసులు మొహరించారు.డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బైపాస్ రోడ్డు, సామర్లకోట రోడ్డు, ఇల్లింద్రాడ జంక్షన్, వై జంక్షన్ ప్రాంతాల్లో పోలీసుల పహారా కాస్తున్నారు. సుమారు 1500 మంది పోలీసులను భద్రాతా విధులు నిర్వహిస్తారని డీఎస్పీ తెలిపారు. -
'చంద్రబాబు అవినీతి పాలనకు 100 మార్కులు'
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి పాలనకు చంద్రబాబుకు 100 మార్కులు వేయొచ్చని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. ముఖ్యమైన మూడు రంగాల్లో కనీసం ఒక శాతం అభివృద్ధి కూడా జరగలేదని బొత్స ధ్వజమెత్తారు. దోపిడీ కోసమే పట్టిసీమ ప్రాజెక్ట్ను కట్టారని ఆయన ఆరోపించారు. వ్యవసాయంపై అసలు కార్యాచరణే రూపొందించలేదని, ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా రాష్ట్రానికి రాలేదని, లక్షల కోట్ల ఎంఓయూలు ఏమయ్యాయని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. 2016 ఏడాదిలో చంద్రబాబు పాలన అవినీతి మిన్నగా ఉందని బొత్స ధ్వజమెత్తారు. అభివృద్ది సున్నా రెండేళ్ల పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. చంద్రబాబు రెండంకెల వృద్ది రేటు అని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, రాష్ట్రంలో అభివృద్ది, వృద్ది రేటు లెక్కల్లో తప్ప వాస్తవంగా ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో పంచ భూతాలను టీడీపీ నేతలు పంచుకు తింటున్నారని, కేవలం అయిదు శాతం మాత్రమే వృద్ది రేటు ఉందన్నారు. అయితే12 శాతం అంటూ దొంగ లెక్కలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. వృద్ది రేటు ప్రకటనలు అన్నీ బోగస్ అని దానిపై తాము బహిరంగ చర్చకు సిద్దమన్నారు. మంత్రులు, టీడీపీ నేతల వృద్ది రేటు పెరిగింది కాని రాష్ట్రం వృద్ది రేటు పెరగలేదని బొత్స అన్నారు. దోపిడీ కోసమే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని,వ్యవసాయం అంటే దండగ అనే భావన ముఖ్యమంత్రికి ఉంది కాబట్టే వ్యవసాయంపై చిన్న చూపు చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతృప్తి చెందడం లేదని,రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని అన్నారు. వృద్ది రేటు కాదని, క్రైమ్ రేటు పెరుగుతుందని బొత్స అన్నారు. ఎక్కడ చూసినా కల్తీ మాఫియాలే అని వ్యాఖ్యలు చేశారు. మహిళా ప్రజాప్రతినిధిని మంత్రి రావెల కిశోర్ బాబు వేధిస్తే చర్యలు తీసుకోలేదని అన్నారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలచే దమ్ముంటే రాజీనామా చేయించాలని బొత్స సవాల్ విసిరారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో వంగవీటి రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
పట్టిసీమ నీటిలో వాటా ఇవ్వండి
- కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ విన్నపం - తాత్కాలిక కేటాయింపుల్లో నిష్పత్తి మార్చరాదని వినతి సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటిలో తమకు తాత్కాలిక ప్రాతిపదికనైనా నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల వనరులశాఖను కోరింది. ఈ కేటాయింపులపై కేంద్రం నియమించిన కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇస్తుందని, అయితే అప్పట్లోగా తాత్కాలికంగా కొంత వాటాను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల సలహాదారు ఆర్.విద్యాసాగర్రావు బుధవారం ఇక్కడ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్సింగ్ను కలసి కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావు కూడా ఉన్నారు. అలాగే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంతవరకు కృష్ణా జలాలను తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య పంచుతూ కేంద్ర జల వనరుల శాఖ నిర్ధారించిన కేటాయింపులను మారుస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. అలాగే పట్టిసీమ ద్వారా మళ్లించే జలాలపై శాశ్వత వాటా తేల్చేందుకు వీలుగా కృష్ణా ట్రిబ్యునల్లో సంబంధిత అంశాన్ని ప్రస్తావించాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందించారని విద్యాసాగర్రావు తెలిపారు. -
చంద్రబాబుపై హర్షకుమార్ ఆగ్రహం
-
చంద్రబాబుపై హర్షకుమార్ ఆగ్రహం
రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ ఎంపీ హర్షకుమార్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పట్టిసీమ విషయంలో చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పట్టి సీమకు ఎలాంటి గుర్తింపు లేదని అన్నారు. నదుల అనుసంధానం తానే చేశానంటూ చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా కల్లబొల్లి మాటలని హర్ష కుమార్ చెప్పారు. పట్టి సీమకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్పష్టం చేసిందని హర్ష కుమార్ తెలిపారు. -
ఏటయిందే గోదారమ్మా..!
డిసెంబర్ మొదట్లోనే కనిష్ట స్థాయికి పడిపోయిన ప్రవాహం గోదావరి డెల్టాలో రబీ పంటల సాగుపై రైతుల్లో ఆందోళన కనీసం 90 టీఎంసీలు అవసరమంటోన్న జలవనరుల శాఖ సీలేరు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్నది 30 టీఎంసీలే సాక్షి, అమరావతి: ఈ ఏడాది రబీ ప్రారంభంలోనే గోదావరి నదిలో ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోవడం డెల్టా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. డెల్టాలో రబీలో పంటల సాగుకు కనిష్టంగా 90 టీఎంసీలు అవసరం. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోదావరిలో సహజ సిద్ధంగా ఉండే ప్రవాహాల నుంచి 60 టీఎంసీలు వస్తే డెల్టాలో రబీ పంటలు చేతికందుతాయి. కానీ.. డిసెంబర్ ప్రారంభంలోనే గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో.. డ్రైయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసినా 60 టీఎంసీల నీటి లభ్యత అసాధ్యమని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఇది పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 10,13,161 ఎకరాల్లో ఖరీఫ్లోనూ, రబీలోనూ పంటలు సాగు చేస్తారు. పంటల సాగుకు కనిష్టంగా ఖరీఫ్లో 102, రబీలో 90 టీఎంసీలు అవసరం. డెల్టాలో ఖరీఫ్ పంటల కోతలు పూర్తయివడంతో రబీ పంటలకు నారుమళ్లు పోసుకుని.. పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీకి 5,633 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. ఐదు వేల క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేసి, 633 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఇదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 5,600 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు మళ్లించారు. వీటిని కలుపుకున్నా గోదావరిలో ప్రవాహం 11,233 క్యూసెక్కులేనని స్పష్టమవుతోంది. ఆందోళనలో రైతన్నలు.. గోదావరి డెల్టాలో రబీలో డిసెంబర్ 15 నుంచి వరి నాట్లు వేస్తారు. ఏప్రిల్ నెలాఖరుకు పంట నూర్పిళ్లను ప్రారంభిస్తారు. డిసెంబర్ 15 నాటికి పట్టిసీమ పంపులను నిలిపేస్తామని సర్కార్ చెబుతోంది. వరి నాట్ల సమయంలో డెల్టాకు కనిష్టంగా 13 వేల క్యూసెక్కులు అవసరం. పంట పొట్ట దశలో ఉన్నప్పుడూ ఇదే స్థాయిలో అవసరం. డిసెంబర్ ప్రారంభంలోనే 11 వేల క్యూసెక్కులకు నీటి ప్రవాహం పడిపోయిన నేపథ్యంలో.. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కనీసం 2,500 నుంచి మూడు వేల క్యూసెక్కులు కూడా వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే డెల్టాకు విడుదల చేసే అవకాశం ఉంది. సీలేరు రిజర్వాయర్ల నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినా.. గోదావరి సహజ ప్రవాహాలతో కలిపి 7,500 క్యూసెక్కులకు మించి డెల్టాకు విడుదల చేసే అవకాశం ఉండదు. ఇది రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలేవీ? గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన నేపథ్యంలో కాలువల పరిస్థితి దయనీయంగా ఉంది. ఖరీఫ్లో ఆయకట్టు భూములకు నీళ్లందక ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రబీలో సమర్థంగా డెల్టా కు నీళ్లందించడానికి ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చ ర్యలూ తీసుకోలేదు. రైతులకు అవగాహన కల్పించే రీతిలో సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదు. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ చివరి నిముషంలో డ్రెయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసి హడావుడి చేసినా పంటలను రక్షించే అవకాశం ఉండదు. రైతులు వేలాది కోట్ల రూపాయలను పెట్టుబడుల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా రైతులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
పట్టిసీమపై సర్కారు మాటలన్నీవట్టిమాటలే
-
గ్రూప్-1 మెయిన్స్లో అడిగిన ప్రశ్నలివే..
హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది. ప్రశ్నలన్నీ దాదాపుగా ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఓ ప్రశ్న ఇచ్చారు. ‘భారత ప్రభుత్వం ఆం ధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రస్తుత ప్యాకేజీతో పోల్చితే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా? వివరించండి?’ అని ప్రశ్నించారు. అలాగే నదుల అనుసంధానం ఏపీలో నీటి కొరత ఎలా తీర్చగలదో తెలపండి? పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించం డి? అని మరో ప్రశ్న ఇచ్చారు. దళితులపై దాడుల నేపథ్యం లో.. భారతదేశంలో దళితుల ప్రస్తుత పరిస్థితేమిటి? అనేక పథకాలు, రక్షణ కోసం కఠిన చట్టాలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గణనీయమైన అభివృద్ధి ఎందుకు లేదు? అంటూ ప్రశ్నించారు. ‘దేశద్రోహ చట్టాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. మన దేశం లో ఇటీవలి సంఘర్షణల నేపధ్యంలో పైన పేర్కొన్న వాక్యంపై చర్చించండి?’ అని మరో ప్రశ్న ఇచ్చారు. కాశ్మీర్లోయలో ఆందోళనల నేపథ్యంలో.. భారత్ చేస్తున్న ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించాలని ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపైనా ప్రశ్న సంధించారు. తొలి రోజు పరీక్షకు 3,128 మందే హాజరు: కాగా, రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 8,760 మందికి గాను 3,128 మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి పేర్కొన్నారు. హైదరాబాద్లో 1,082 మంది, విశాఖలో 833 మంది, విజయవాడలో 654 మంది, తిరుపతిలో 559 మంది హాజరయ్యారని చెప్పారు. ఇదిలాఉండగా పరీక్ష ఉదయం 10 గంటలకే అయినా 8.30కల్లా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ నిబంధన పెట్టింది. అనేక మంది అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో వారిని పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. ఇలా అవకాశాలు కోల్పోయిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఈసారి పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. గదుల్లో సీసీ కెమెరాలు ఉన్న భవనాలనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసింది. అభ్యర్థులకు బయోమెట్రిక్, ఐరిష్తో పాటు ప్రత్యేకంగా మళ్లీ ఫొటోలు తీశారు. వీటిని ఆయా అభ్యర్థుల దరఖాస్తుల్లోని ఫొటోలు ఇతర అంశాలతో సరిపోల్చిన తర్వాతే పరీక్ష హాల్లోకి అనుమతించారు. కాగా, ఈ పరీక్షను ఏపీ, తెలంగాణలు ఒకేరోజు నిర్వహించడంతో అభ్యర్థులు ఏదో ఒక్క రాష్ట్రానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలంటూ పలువురు అభ్యర్థులు బుధవారం హైదరాబాద్లోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకున్నామని, కానీ 9 గంటలకే బయోమెట్రిక్ పూర్తరుుందంటూ పరీక్షకు అనుమతించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. -
పట్టిసీమ, హోదాలపై ఏపీ గ్రూప్-1లో ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది. పలు ప్రశ్నలను ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఓ ప్రశ్న ఇచ్చారు. పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించండి? అని మరో ప్రశ్న ఇచ్చారు. తొలిరోజు పరీక్షకు 3,128 మంది హాజరయ్యారు. -
పట్టిసీమ ఒక బోగస్ ప్రాజెక్ట్ : ఉండవల్లి
-
ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదు
- వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టీకరణ - హోదా వచ్చేంతవరకూ వైఎస్సార్సీపీ పోరాడుతుంది సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో నిధులు, రాయితీలు వస్తాయని, వాటి విలువ రూ.1.45 లక్షల కోట్లని చెప్పారు. హోదా ఇవ్వకుండా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఈ నిధులకు సమానం కాదని పేర్కొన్నారు. దీనిపై బహిరంగ చర్చకు వచ్చే వారెవరైనా ఉంటే తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. విశాఖకు రైల్వేజోన్, విద్యా సంస్థలను కూడా ప్రత్యేక హోదా బిల్లులో పొందుపరిచారని, వాటిని సాధించేవరకూ వదిలేది లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ర్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు మోసం చేశాయని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ను స్వాగతిస్తాం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆచితూచి విమర్శలు చేశారని, అయితే, ప్రత్యేక హోదాపై ఆయన పోరాడతాననడాన్ని తాము స్వాగతిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన వైఎస్సార్సీపీతో కలసి పోరాటం చేయడానికి ముందుకొస్తే తాము స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉండదు ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసిన ద్రోహుల పార్టీ కాంగ్రెస్తో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. రాష్ర్ట ప్రజల అభిమతానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేసి, జనానికి తీరని ద్రోహం చేసిన ద్రోహుల పార్టీతో తాము కలిసేది లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్థమైందని, అందుకే రాష్ర్టంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేం దుకు సాహసించడం లేదన్నారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో దీక్ష చేశారని, ఇకపైనా ఇదే ఒరవడి కొనసాగుతుందని తెలిపారు. ఏపీ అప్పుల వాటా రూ.1.50 లక్షల కోట్లు రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటుతో ఉన్న ఏపీకి రూ.1.50 లక్షల కోట్ల అప్పులు వాటాగా వచ్చాయని వి.విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా అనకాపల్లిలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. -
కృష్ణా డెల్టాను నాశనం చేయొద్దు: నాగిరెడ్డి
తెనాలి: పట్టిసీమ పేరుతో కృష్ణా డెల్టాను నాశనం చేయవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు. చిత్తశుద్ధి ఉంటే కృష్ణాబోర్డు నుంచి ఏమేరకు నీటిని తీసుకుంటారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరు అందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను నాగిరెడ్డి పరిశీలించారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. -
పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టా నాశనం చేయెద్దు
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్.నాగిరెడ్డి తెనాలి పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టాను నాశనం చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు. చిత్తశుద్ధి వుంటే కృష్ణాబోర్డు నుంచి ఏ మేరకు నీటిని తీసుకొంటారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను మంగళవారం నాగిరెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగుభూమి 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. తెలంగాణలో సాగుభూమి 38.58 లక్షల హెక్టార్ల నుంచి 43 లక్షల హెక్టార్లకు విస్తరించిందని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్లో ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో పంటల సాగు 69 శాతం కాగా, గుంటూరు జిల్లాలో 59 శాతం మాత్రమేనని చె ప్పారు. ఇదే జిల్లాలో 1.89 లక్షల హెక్టార్లకు 76 శాతమే సాగు చేయగలిగినట్టు నాగిరెడ్డి వివరించారు. ఏరువాక పేరుతో పండుగలు చేసిన ప్రభుత్వం, జులై 10వ తేదీనుంచి నారుమళ్లు పోసుకోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాడెల్టా రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నాగిరెడ్డి ఆరోపించారు. పట్టిసీమ నీటిని నెల్లూరు, పెన్నావరకు తీసుకెళతామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం కృష్ణాడెల్టాలో నారుమళ్లకు కూడా ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. వెదజల్లిన చేలల్లో పంటలు ఎండిపోతున్నా, పుష్కరాల కోసమని అక్కడే వుంటున్న ముఖ్యమంత్రి పట్టించుకోలేదనీ, సుభిక్షమైన కృష్ణాడెల్టాను బీడుగా మార్చారని ఆరోపించారు. పంటకాలువల నుంచి ఇంజిన్లతో బ్రాంచి కాలువలకు, అక్కడ్నుంచి మళ్లీ ఇంజిన్లతో పొలాలు తడువుకోవాల్సిన దుస్థితిని రైతులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టిసీమ నీటిని తరలిస్తున్న పోలవరం కాలువను కాంక్రీట్ లైనింగ్తో సహా 130 కి.మీ వైఎస్ హయాంలో పూర్తిచేస్తే తర్వాత 42 కి.మీ దూరం కాలువను సక్రమంగా నిర్మించని కారణంగానే గండి పడిందన్నారు. మళ్లీ గండ్లు పడతాయన్న భయంతోనే పట్టిసీమకు గల 24 పంపులను వినియోగించే ధైర్యం చేయలేకపోతున్నట్టు చెప్పారు. మరోవైపు గత రెండేళ్లలో ప్రకటించిన కరువు మండలాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇంతవరకు అందించలేదని గుర్తుచేశారు. 2003లో కరువు సమయంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. పుష్కరాల కోసం తీసుకున్న నీటిని గత రెండుమూడు రోజులుగా ఇస్తున్న ప్రభుత్వం, ఇదే పరిమాణంలో కంటిన్యూగా సరఫరా ఇస్తామని హామీనివ్వాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగం కోసం ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా వుందన్నారు. వీరితో పార్టీ రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పెరికల కాంతారావు, యలవర్తి రామమోహనరావు, యలవర్తి నాగభూషణం, గాదె శివరామకృష్ణారెడ్డి, ఉయ్యూరు అప్పిరెడ్డి, రాపర్ల నరేంద్ర ఉన్నారు. -
పట్టిసీమలో భక్తుల పాట్లు
పోలవరం : పట్టిసీమ పుష్కరఘాట్లో పుణ్యస్నానాలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి వరద పెరగడంతో భక్తుల రాకపోకల కోసం నదిలో వేసి ఇసుక బస్తాలు మునిగిపోయే దుస్థితి నెలకొంది. అయినా వాటిపైనే భక్తులు స్నానాలకు నడిచి వెళ్తున్నారు. మండలంలోని పట్టిసీమతోపాటు గూటాల, పోలవరం ఘాట్లలో జనం పలుచగా కనిపిస్తున్నారు. పట్టిసీమ శివక్షేత్రంలో భక్తులకు పులిహార ప్రసాదం అందజేశారు. వృద్ధులు, చిన్నారుల కోసం పట్టిసీమ రేవులో జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. -
'మరో ప్రాజెక్టు కడితే గోదావరి డెల్టా ఎడారే'
కాకినాడ: గోదావరి డెల్టాను ఎడారి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పట్టిసీమ మాదిరిగానే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని విమర్శించారు. బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన కురసాల.. ఇప్పటికే పట్టిసీమ వల్ల గోదావరి డెల్టా అన్యాయమయ్యే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇక గోదావరి నదిపై మరో ప్రాజెక్టు కడితే డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్న టీడీపీ మళ్లీ ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి డెల్టాను ఎడారిగా చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుందని కురసాల కన్నబాబు అన్నారు. -
‘వ’ట్టిసీమే!
పట్టిసీమపై ప్రభుత్వం ఆర్భాట ప్రచారం ఆచరణలో నీరందని వైనం కంటితుడుపు చర్యలతో అన్నదాతల్లో అయోమయం పశ్చిమ డెల్టా రైతుల్లో ఆందోళన ‘పట్టిసీమ నుంచి నీటిని విడుదల చే శాం.. నారుమళ్లు పోసుకుని వరినాట్లు వేసుకోవచ్చు.. తుపాన్లు రాకముందే పంట చేతికొస్తుంది.. డెల్టా రైతులకు ఎలాంటి సమస్యలూ లేకుండా నివారించాం..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన కు, వాస్తవానికి పొంతన లేకుండా పోయింది. పట్టిసీమ నుంచి వస్తున్నాయని చెబుతున్న గోదావరి జలాలు పశ్చిమ డెల్టాకు అరకొరగానే ఉన్నాయి. నారుమళ్ల సంగతలా ఉంచితే వెదlపద్ధతిలో వరిసాగుకు శ్రీకారం చుట్టిన అన్నదాతలు సాగునీటిపై బెంగటిల్లుతున్నారు. శ్రీశైలం, సాగర్ జలాశయాలకు త్వరితగతిన నీరు చేరుకోవాలని కోరుకుంటున్నారు సాక్షి, అమరావతి / తెనాలి: డెల్టాలో ఏటా జూన్లో ఆరంభమయ్యే ఖరీఫ్ సీజను, ప్రతికూల పరిస్థితుల కారణంగా జూలై, ఆగస్టు నెలలకు మారి, చాలా కాలమైంది. గతేడాదిలానే ఈసారీ వర్షాలు జూన్లో వచ్చేసి ఆశ్చర్యపరిచాయి. నీటిని ఒడిసిపట్టేందుకు పులిచింతల సిద్ధం కాలేదు. పట్టిసీమ నుంచి ఈ నెల ఆరున నీరు విడుదల చేసినా పది రోజులకు కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుకోలేదు. ఆ తర్వాతా అరకొరే. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు గత రెండు రోజులు కేవలం 500 క్యూసెక్కులనే ఇస్తున్నారు. 2.50 లక్షల ఎకరాలున్న కొమ్మమూరు కాలువకు కేవలం 55 క్యూసెక్కులట. రేపల్లె బ్యాంక్ కాలువకు 146 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 206, నిజాంపట్నం కాలువకు 110 ఇస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పరిమాణాన్ని 1016 క్యూసెక్కులకు పెంచారు. అయినా కాలువ ఎగువ భూముల్లోనే నారుమళ్లకు నీరు ఎక్కటం లేదని రైతులు చెబుతున్నారు. గతేడాదీ ఇదే స్థితి... గతేడాది ఖరీఫ్ సీజనులో కృష్ణాడెల్టాకు కేవలం 35.17 టీఎంసీలే ఇచ్చారు. పట్టిసీమతో డెల్టా అవసరాలు తీరతాయని ఊదరగొట్టిన పాలకులు మాట నిలుపుకోలేకపోయారు. వరిపైరు కీలక దశలో నీటి తడులు ఇవ్వలేకపోయారు. దీంతో రెండు లక్షల ఎకరాల్లో సాగు వదిలేయాల్సి వచ్చింది. 20 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఆయిల్ ఇంజిన్లతో నీరు పెట్టినా, సగటున 21–22 బస్తాల ధాన్యానికి మించి రాలేదనే విషయం తెలిసిందే. జిల్లాలో ధాన్యం దిగుబడి ఐదు లక్షల టన్నులు తగ్గింది. గత ఏడాది చేదు అనుభవంతో ప్రస్తుత ఖరీఫ్కు జాగ్రత్తపడాల్సిన పాలకులు, నారుమళ్లకు కూడా సరిపడా నీరివ్వలేకపోతున్నారు. పోలవరం కుడికాలువ పనులు పూర్తిస్థాయిలో జరగనందునే గోదావరిలో నీరున్నా, తీసుకోవటం సాధ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గతేడాది వర్షాల కరువుతో వరి నారుమళ్లు వదిలేసి, రైతులు వెద పద్ధతిలో వరిసాగుకు మొగ్గుచూపారు. జిల్లాలో రెండు లక్షల 50 వేల ఎకరాల్లో వెదజల్లారు. ప్రస్తుతం ఆ పరిస్థితులే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాలు లేకపోవటం, కాలువలకు సరిపడా నీరు రాకపోవటంతో ఆయిలింజిన్లతో నీరు పెడుతున్నారు. ఎకరం తడిపేందుకు కనీసం రూ.2 వేల వరకు ఖర్చవుతోంది. ఇలా తడులిచ్చినా వర్షాలు కురిసి, పంట కాలువల్లో సాగునీరు అందితేనే దిగుబడులు బాగుండే అవకాశముంటుంది. జిల్లాలో సాగునీటి విడుదల ఇలా.. గుంటూరు పశ్చిమ డెల్టాకు సంబంధించి నాలుగు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బ్యాంకు కెనాల్ సామర్థ్యం 2700 క్యూసెక్కులు కాగా 150, ఈస్ట్ కెనాల్ 770 క్యూసెక్కులకుగాను 182, నిజాంపట్నం కాలువ 440 క్యూసెక్కులకు గాను 110, కొమ్మమూరు 3600 క్యూసెక్కులకు గాను 203 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాలువలకు తక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేయడంతో కొన్ని చోట్ల స్లూయిస్కు నీరు అందడంలేదు. దీంతో పంట పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. వరినారు పోసుకొనేందుకు ఇబ్బందిగా మారింది. -
గోదావరిపై మరో ఎత్తిపోతలు
- ఎడమ గట్టుపై పురుషోత్తమపట్నం వద్ద నిర్మాణానికి ప్రణాళిక - పోలవరం ఎడమకాల్వ ద్వారా 35 టీఎంసీల మళ్లింపు లక్ష్యం సాక్షి, హైదరాబాద్ : గోదావరి కుడిగట్టుపై పట్టిసీమ పథకాన్ని చేపట్టిన తరహాలోనే ఎడమగట్టుపై మరో ఎత్తిపోతల స్కీమును చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నం వద్ద దీన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గోదావరి నదికి జూన్ నుంచి సెప్టెంబరు మధ్య వరదొచ్చే వంద రోజుల్లో రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 35 టీఎంసీలను పోలవరం ఎడమకాల్వ ద్వారా తరలించి ఏలేరు ఆయకట్టుకు చెందిన 53 వేల ఎకరాలకు నీళ్లందించడంతోపాటుగా విశాఖ నగర తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే పేరుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం పనులకు రూ.954 కోట్లతో ఆగస్టు మొదటివారంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసేందుకు జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఎడమకాల్వను ఇందుకోసం ఉపయోగించుకోవాలని చూస్తుండడం గమనార్హం. 181.5 కిమీల పొడవైన పోలవరం ఎడమకాల్వ పను ల్లో 75 శాతం వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. తక్కిన 25 శాతం పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. పోలవరం ఎడమకాల్వ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, 540 గ్రామాలకు, విశాఖ ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాల్ని తీర్చాలనే లక్ష్యం సాకారం కావాలంటే హెడ్వర్క్స్ సత్వరమే పూర్తి చేయాలి. అయితే హెడ్వర్క్స్ పనుల్ని పక్కనపెట్టి ఎడమగట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తమపట్నం వద్ద రూ.954 కోట్లతో యుద్ధప్రాతిపదికన ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. పురుషోత్తమపట్నం వద్ద 325 క్యూసెక్కుల సామర్థ్యంతో 12 పంపుల్ని ఏర్పాటు చేసి నీటిని తోడి మూడు కిలోమీటర్ల పొడవైన పైపులైను ద్వారా తరలించి.. పోలవరం ఎడమకాల్వ 1.7 కిలోమీటర్ వద్ద కలపాలని భావిస్తున్నారు. ఎడమకాలువపై 57 కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్ నిర్మించి ఏలేరు ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు విశాఖకు నీటిని తరలించవచ్చనేది యోచన. -
'మా వాట మాకు ఇవ్వండి'
-
'మా వాట మాకు ఇవ్వండి'
హైదరాబాద్: విద్యుత్ ఉత్పాదన పేరుతో నీళ్లు దిగువ ప్రాంతాలకు వదలొద్దని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు తగ్గకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సర్కారు నిర్వాకం వల్లే గతేడాది రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయని చెప్పారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు వద్దని, తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుందన్నందున ఈ నీటి విషయంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని సూచించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించి రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి దేవినేని ఉమా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టును మూడుసార్లు ప్రారంభించిన ఇప్పటికీ గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలవలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. -
రాయలసీమకు నీళ్లెప్పుడిస్తావు బాబూ
ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విజయవాడ సెంట్రల్ : పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఎప్పుడిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమతో రాయలసీమ నీటి అవసరాలను తీరుస్తామని పదేపదే చెప్పిన చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వెల్లడించాలన్నారు. కృష్ణా– గోదావరి జలాల అనుసంధానం జరిగినట్లు చెబుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే మూడుసార్లు పట్టిసీమకు ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. రాయలసీమ పేరు చెప్పి పబ్బం గడుపుకుందామనుకుంటే కుదరదని హెచ్చరించారు. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రంలో సాగునీటి రిజర్వాయర్లు ఒట్టికుండల్లా మారాయని చెప్పారు. రిజర్వాయర్ల నీటితో సాగు, తాగు అవసరాలు తీర్చుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం నేపథ్యంలో రాష్ట్రంలో జలాశయాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా అక్రమ ప్రాజెక్టుల్ని ప్రభుత్వం అడ్డుకోవాలని సూచించారు. -
వట్టిసీమ.
-
ఎక్కడి పనులు ఇంకా అక్కడే..
- పట్టిసీమ నుంచి పూర్తి సామర్థ్యంతో విడుదలకాని నీరు - పూర్తిగాని అండర్ టన్నెల్స్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసి 10 రోజులైనా గోదావరి జలాలు ఇంకా కృష్ణమ్మను చేరలేదు. ఇప్పటివరకూ కేవలం 0.75 టీఎంసీల నీరు మాత్రమే దిగువకు వచ్చింది. శనివారం సాయంత్రానికి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్దకు జలాలు చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పట్టిసీమ నుంచి కృష్ణాజిల్లా సీతారామపురం బ్రిడ్జి వరకూ పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువను ‘సాక్షి’ బృందం పరిశీలన జరిపింది. పూర్తి సామర్థ్యంతో ఇస్తారా? ► ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న పట్టిసీమలోని 24 మోటార్లు ఆన్ చేశారు. ► అప్పటి నుంచి ఇప్పటి వరకూ రెండు మోటార్లు మాత్రమే నడుస్తున్నాయి. ►గురువారం వరకూ రోజుకు 700 క్యూసెక్కులు విడుదల చేయగా, శుక్రవారం నుంచి 2,450 క్యూసెక్కులు ఇస్తున్నారు. పూర్తిసామర్థ్యంతో నీటిని విడుదల చేయడం లేదు. ► భవిష్యత్లో కూడా 4వేల క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీరు ఇచ్చే అవకాశం కనబడటం లేదు. అసంపూర్తిగా పనులు ► గోపాలపురం మండలం గుడ్డిగూడెం-గోపాలపురం మధ్య నాలుగు ప్రదేశాల్లో అండర్ టన్నెల్స్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ► గోపాలపురం, చిట్యాల వద్ద పైపులతో తాత్కాలికంగా వంతెనల నిర్మాణం చేపట్టారు.►యూటీలు నిర్మించవలసిన ప్రదేశాల్లో మట్టితో గట్లు పూడ్చే పనులు జరుగుతూనే ఉన్నాయి. ► దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో 12 కిలోమీటర్ల మేర ఏటిగట్ల పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. ► ముండూరు నుంచి జానంపేట వరకూ పనులు సాగుతూనే ఉన్నాయి. ► తాత్కాలిక వంతెనలు పైపులతో వేశారు. ప్రస్తుతం 2,450 క్యూసెక్కుల నీరు వస్తేనే అవి పూర్తిగా మునిగిపోయాయి. ► ఒకవేళ పూర్తి సామర్థ్యం 8,400 క్యూసెక్కుల నీరు వస్తే తాత్కాలిక వంతెనలు పూర్తిగా మునిగిపోవడంతో పాటు కొట్టుకుపోయే అవకాశం ఉంది. ► కృష్ణాజిల్లాలోనూ అదే పరిస్థితి కనపడుతోంది. పల్లెర్లమూడి వద్ద రామిలేరుపై అండర్ టన్నెల్ పనులు కూడా పూర్తి కాలేదు. సీతారామపురం వద్ద రాష్ట్ర రహదారిపై వంతెన పనులు పూర్తి కాలేదు.►వందలాది టీఎంసీ నీళ్లు ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తున్నా.. పట్టిసీమ నుంచి వదిలింది కేవలం 0.75 టీఎం సీలు. ► రోజుకు పూర్తి సామర్థ్యంతో విడుదల చేసినా కనీసం 120 రోజులపాటు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా పంపితేగాని ఖరీఫ్లో ముఖ్యమంత్రి చెప్పినట్లు 80 టీఎంసీల నీటిని తరలించడం సాధ్యం కాదు. -
గోదావరి జలాలకు పూజలు
రంగన్నగూడెం (హనుమాన్జంక్షన్ రూరల్) / గన్నవరం రూరల్ : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు పోలవరం కుడికాలువ ద్వారా శుక్రవారం బాపులపాడు మండలానికి చేరాయి. మండల పరిధిలోని రంగన్నగూడెం వద్ద ఉదయం ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు నీటికి హారతులిచ్చారు. జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణారావు, ఎంపీపీ తుమ్మల కోమలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.వీర్రాజు పూజలు నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వీర్రాజు మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం కాలువలో 2400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, ఎన్ఎస్పీ నూజివీడు ఓ అండ్ ఎం ఈఈ అర్జునరావు, జగ్గయ్యపేట ఎన్ఎస్పీ ఈఈ శ్రీనివాసరావు, పోలవరం డీఈఈ జె.ప్రసాద్, ఏఈ శ్యామ్కుమార్, సర్పంచి ప్రసన్నరావు పాల్గొన్నారు. కొత్తగూడెం చీమలవాగు యూటీ వద్ద.. కొత్తగూడెం(గన్నవరం రూరల్) : మండలంలోని కొత్తగూడెం చీమలవాగు అండర్ టన్నెల్ వద్ద శుక్రవారం పోలవరం కాలువ నీటికి రాష్ర్ట జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు పూజలు చేశారు. నీరు శుక్రవారం ఉదయం 11 గంటలకు బల్లిపర్రు గ్రామానికి నీరు చేరాయి. బల్లిపర్రు, తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చింతగుంట, గొల్లనపల్లి, గోపవరపుగూడెం, కట్టుబడిపాలెం దాటి సూరంపల్లి వద్దకు పోలవరంలో నీరు మధ్యాహ్నం 3 గంటలకు చేరాయి. -
ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు...:అంబటి
-
ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు...:అంబటి
హైదరాబాద్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...'చంద్రబాబు సర్కార్ ప్రచార ఆర్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా ప్రయోజనాలకు ఇవ్వడం లేదు. అందుకు పట్టిసీమే ఉదాహరణ. ఎన్టీఆర్ సుజల స్రవంతిని గాలికొదిలేశారు. నారావారి సారా స్రవంతిని మాత్రం దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు...అవినీతి ప్రదేశ్. చంద్రబాబు విజన్ 2020 అంటే ఇదేనా?. కమీషన్ల కోసం కాపురాలు కూల్చొద్దు. చంద్రబాబుని మందుబాబు అని పిలిచే పరిస్థితులు వస్తున్నాయి' అని అన్నారు. -
తూర్పు’న మరో పట్టిసీమ ‘పథకం’!
విశాఖపట్నానికి నీరు తరలించేందుకే? ‘పుష్కర’ను పరిశీలించిన కలెక్టర్ అరుణ్కుమార్ పురుషోత్తపట్నం : మరో పట్టిసీమ ఎత్తిపోతల ‘పథకానికి’ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? తూర్పు గోదాకరి జిల్లా అధికారుల హడావిడి చూస్తే అవునన్నట్టుగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం లాగే, పురుషోత్తపట్నం –రామచంద్రపురం మధ్య ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, పోలవరం కాలువ ద్వారా విశాఖపట్నానికి నీరు తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషోత్తపట్నంలో ఉన్న తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని గురువారం కలెక్టర్ అరుణ్కుమార్ పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువను పరిశీలిందచేందుకు వచ్చిన ఆయన వెంట పుష్కర ఎల్ఎంసీ సర్కిల్ ఎస్ఈ సుగుణాకరరావు కూడా ఉన్నారు. పోలవరం ఎడమ కాలువ ఏడు ప్యాకేజీలుగా ఉండగా, ఇందులో ఐదు కలెక్టర్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో సోమా కంపెనీ నూరు శాతం పనులు చేయగా, మిగిలిన నాలుగు కంపెనీలు కేవలం 60 నుంచి 80 శాతం పనులు మాత్రమే చేసినట్టు సమాచారం. ఆయా పరిస్థితులపై కలెక్టర్ ఆరాతీసినట్టు తెలిసింది. కాగా వీటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయగలరా లేక కొత్త కంపెనీలకు ఇవ్వాలనే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అందుకే వీటిని పరిశీలిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.