కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహకరించకపోయినా రైతులకు రుణమాఫీ చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. 5 నెలల 20 రోజుల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. పట్టి సీమ నుంచి 100 టీఎంసీలు హంద్రీనీవా, గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడులకు తరలిస్తామన్నారు.