‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’
సాక్షి, హైదరాబాద్: ‘ప్యాకేజీతో పోల్చితే ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?, పట్టిసీమ పథకం వల్ల ప్రయోజనాలేంటి?’ వంటి తాజా పరిణామాలను గ్రూప్-1 మెయిన్స్లో ప్రశ్నలుగా సంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం జనరల్ ఎస్సేపై పరీక్ష జరిగింది.
పలు ప్రశ్నలను ఇటీవలి పరిణామాలపైనే ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఓ ప్రశ్న ఇచ్చారు. పట్టిసీమ పథకం ప్రయోజనాలు వివరించండి? అని మరో ప్రశ్న ఇచ్చారు. తొలిరోజు పరీక్షకు 3,128 మంది హాజరయ్యారు.