బీక్యాంపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24,25 తేదీల్లో ‘ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు’ అన్న అంశంపై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ తెలిపారు.
24,25 తేదీల్లో జాతీయ సెమినార్
Aug 31 2016 1:07 AM | Updated on Sep 4 2017 11:35 AM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బీక్యాంపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24,25 తేదీల్లో ‘ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు’ అన్న అంశంపై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సెమినార్కు సంబంధించిన బ్రోచర్ను ఆమె తన కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమానికి ఎస్కే యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ హెచ్ఓడీ ఆనందనాయుడు ముఖ్యాతిథిగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామలింగారెడ్డి, రంగారెడ్డి, సాహిత్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement