రూ. 3.36 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం
Published Fri, Dec 2 2016 6:03 PM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ యువకుడి వద్ద పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ నోట్లను గుర్తించారు. రూ. 3.36 లక్షల విలువైన రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదు మార్పిడి కోసం తరలిస్తున్నాడని గుర్తించిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement