seize
-
చిక్కుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం!
రంగారెడ్డి, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్య అరాచకాలపై పేదలు నిరసన గళమెత్తారు. ఆక్రమించుకున్న తమ ఇళ్ల స్థలాలను తిరిగి అప్పజెప్పాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పోరాటానికి దిగారు. ఈ ఆందోళనకు వామపక్ష సీపీఎం తమ మద్దతు ప్రకటించింది. దివంగత మహానేత వైఎస్సార్(YSR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంచింది. ఇందుకుగానూ ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి సర్వే నెంబర్ 189, 203లో 20 ఎకరాలను 577 మందికి పంపిణీ చేశారు. అయితే.. 2007 నుంచే ఆ స్థలాలను రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యం తమ గుప్పిట్లో ఉంచుకుంది. అప్పటి నుంచి వాళ్ల పోరాటం కొనసాగుతూనే వస్తోంది. అయితే.. లబ్ధిదారులను తమ ప్లాట్ల వద్దకు వెళ్లకుండా గేట్లు, ప్రహరీ గోడలు నిర్మాణం చేసుకుంది ఫిల్మ్ సిటీ యాజమాన్యం. దీంతో.. సీపీఎం(CPM) ఆధ్వర్యంలో బాధితులు ఇవాళ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వైఎస్సార్ హయాంలో కేటాయించిన.. ఆ ఇళ్ల పట్టాల స్థలాలను చూపించాలంటూ కలెక్టర్ను డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
సీజ్ ద ఆటో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరుకు చెందిన ఆటో డ్రైవర్ పంజా దుర్గారావుపై రెచ్చిపోయారు. ఆటోపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫొటోలను చూసి ఆటోను వెంబడించి మరీ రోడ్డుపై ఆపి డ్రైవర్పై బూతు పురాణంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటోకు అడ్డంగా కారు పెట్టి, తణుకు పోలీసులను పిలిపించి స్టేషన్కు తీసుకెళ్లమని ఆదేశించారు. ఆటోను సీజ్ చేయించారు. ఎలాంటి కేసు లేకున్నా, రాత్రి ఎనిమిది గంటలైనా ఆటో డ్రైవర్ను స్టేషన్లోనే ఉంచడం తణుకులో చర్చనీయాంశమైంది. దుర్గారావు ప్రతిరోజూ కానూరు నుంచి తణుకుకు సర్వీస్ ఆటో నడుపుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. అభిమానంతో ఆటోపై వైఎస్ జగన్, కారుమూరి ఫొటోలను వేసుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉండ్రాజవరం రోడ్డులోకి ఆటో ప్రవేశించింది. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన వాహనంలో వస్తున్నారు. ఎమ్మెల్యే కారును గమనించి దుర్గారావు దారి ఇచ్చాడు. అయినా ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్లకుండా దుర్గారావు నడుపుతున్న ఆటోను అనుసరించింది. ఈ క్రమంలో ఆటోను పూర్తిగా పక్కకు నిలిపి, దారి ఇచ్చినా ఎమ్మెల్యే కారు ముందుకు వెళ్లలేదు. ఒక కిలోమీటరు దాటిన తర్వాత తణుకులోని రాష్ట్రపతి రోడ్డులో ఆటోను ఓవర్టేక్ చేసి, ఎదురుగా కారు నిలిపి.. ఎమ్మెల్యే కిందకు దిగారు. అసభ్య పదజాలంతో దుర్గారావుపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులపైనా బూతు పురాణంతో రెచ్చిపోయారు. తణుకు టౌన్ సీఐ కొండయ్యకు ఫోన్ చేసి రప్పించారు. రావాలని ఆదేశించిండంతో సీఐ ఆగమేఘాల మీద వచ్చి ఆటో డ్రైవర్ను పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. ఎంఈఐ శ్రీనివాస్ను కూడా రప్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఆటో.. పశ్చిమగోదావరిలోకి వచ్చిందంటూ.. ఆటోను సీజ్ చేసి రూ.3,400 జరిమానా విధించారు. ఆ తర్వాత ఆటోకు విధించిన చలానా మొత్తాన్ని చెల్లించినా, ఎమ్మెల్యే చెబితేనే వాహనం ఇస్తామని రవాణా శాఖా«ధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటలైనా దుర్గారావును విడిచి పెట్టలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా అనుమతించ లేదు. స్థానిక టీడీపీ నేతలతో దుర్గారావుపై ఫిర్యాదు చేయించేందుకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.ఎమ్మెల్యేది నీతిమాలిన చర్య ఎమ్మెల్యే రాధాకృష్ణ తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిని మరచి సామాన్య ఆటో డ్రైవర్పై ప్రతాపం చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎస్ఐని కింద కూర్బోబెట్టడం, కానిస్టేబుల్ను దుర్భాషలాడటం, మహిళ ఛాతీపై గుద్దుకుంటూ వెళ్లిపోవడం లాంటి దిగజారుడు పనులు చేశారని గుర్తు చేశారు. దుర్గారావును ఇబ్బంది పెడితే పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని కారుమూరి హెచ్చరించారు. -
ఫిషింగ్ బోట్లలో వందల కిలోల డ్రగ్స్.. పట్టుకున్న నేవీ
ముంబయి: అరేబియా సముద్ర జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో రెండు ఫిషింగ్ బోట్లలో ఏకంగా 500 కిలోల డ్రగ్స్ను అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో శుక్రవారం నేవీ ఒక పోస్టు చేసింది.‘శ్రీలంకకు చెందిన రెండు ఫిషింగ్ బోట్లలో అక్రమరవాణా చేస్తున్న 500 కిలోల డ్రగ్స్ను ఇండియన్ నేవీ సీజ్ చేసింది. శ్రీలంక నేవీ,ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఎప్పికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ నేవీ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న బోట్లను అడ్డుకుంది.డ్రగ్స్ ఉన్న బోట్లను గుర్తించడానికి విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించాం. డ్రగ్స్ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులో ఉన్న సిబ్బందిని శ్రీలంకకు అప్పగించాం’అని ఇండియన్ నేవీ ట్వీట్లో తెలిపింది. ఈ ఆపరేషన్ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో భారత్,శ్రీలంక మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియజేస్తోందని పేర్కొంది. Narcotics Seizure - Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF— SpokespersonNavy (@indiannavy) November 29, 2024 -
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇసుక టిప్పర్లు సీజ్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో కుందూనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 టిప్పర్లు, జేసీబీని రూరల్ పోలీసులు సీజ్ చేశారు. జేసీబీ సాయంతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం వేకువజామున దాడులు చేశారు. 8 టిప్పర్లు, జేసీబీని పోలీసులు సీజ్చేసి స్టేషన్కు తరలించారు. సీజ్ చేసిన టిప్పర్లు, జేసీబీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి చెందినవిగా భావిస్తున్నారు. టిప్పర్లపైన ఎన్వీఆర్ఆర్ అని పెద్ద అక్షరాలతో పేర్లు వేయించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్లు, జేసీబీని వదిలేయాలని పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో కొన్నిరోజుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దాడుల్లో రూరల్ ఎస్ఐలు మహమ్మద్ రఫి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల స్వా«దీనం పెన్నానది పరీవాహక ప్రాంతంలో రెండు ఇసుక ట్రాక్టర్లను రూరల్ పోలీసులు సీజ్ చేశారు. రామాపురం, పెద్దశెట్టిపల్లె గ్రామాల వద్ద ట్రాక్టర్లను స్వా«దీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నల్లచెరువు: శ్రీసత్యసాయి జిల్లా, నల్లచెరువు మండలం, పెద్దయల్లంపల్లి వద్ద శనివారం రాత్రి 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రరెడ్డి ఆదేశాల మేరకు పెద్దయల్లంపల్లి జాతీయరహదారిపై అటవీశాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మదనపల్లి నుంచి కదిరి వెళ్తున్న కారును గుర్తించారు.అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారని గమనించిన ఇద్దరు దుండగులు కొద్దిదూరంలో కారు ఆపి పరారయ్యారు. అధికారులు కారును తనిఖీ చేయగా.. 13 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో డిప్యూటీ రేంజ్ అధికారి రామచంద్ర నాయక్, సెక్షన్ అధికారి రామచంద్రారెడ్డి, ఎఫ్బీఓలు నాగరాజు, హరిప్రసాద్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.Officials of Mumbai Customs at Chhatrapati Shivaji Maharaj International Airport have seized goods worth a total of Rs 8.37 crores including 12.74 Kg Gold across 20 cases. Gold was found concealed in various forms like gold dust in wax and gold layered cloths, crude jewellery and… pic.twitter.com/4OQlYsATIE— ANI (@ANI) May 4, 2024 -
లోక్సభ ఎన్నికల్లోనే రికార్డు.. రోజుకు రూ. 100 కోట్లు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారి రికార్టు స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న సొమ్ము అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మార్చి 1 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ 45 రోజుల్లో కోట్ల నగదుతోపాటు డ్రగ్స్, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు పేర్కొంది. మొత్తం సొత్తులో రూ.395.39 కోట్ల నగదు, రూ.489.31 కోట్ల విలువైన మద్యం, రూ.2,068.85 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.562.10 కోట్ల విలువైన లోహాలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.1,142.49 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించింది. మార్చి 1 నుంచి ఇప్పటివరకు రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకుసీజ్ అయిన రూ.778 కోట్లతో రాజస్థాన్ తొలి స్థానంలో ఉండగా.. అత్యల్పంగా లద్ధాఖ్లో రూ.11,580 మాత్రమే పట్టుబడింది. 2019 ఎన్నికల సమయంలో రూ.3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 మధ్యకాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు పేర్కొంది. -
ఒక్క ఫోన్ కాల్.. భారీగా దొరికిన నగదు
చెన్నై, సాక్షి: తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రూ. 1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో లోక్సభకు పోలింగ్కు ముందు ఒకే ఇంట్లో అదీ కూడా ఓ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారని, ఒక బ్యాగ్లో నింపిన మొత్తం రూ.1 కోటి కరెన్సీ నోట్లు దొరికాయని జిల్లా కలెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూంకి ఫోన్ కాల్ వచ్చిందని, ఫలితంగా నగదు రికవరీ అయ్యిందని ఆయన చెప్పారు. ఓ ఇంట్లో కరెన్సీ నోట్లు భద్రపర్చినట్లు సమాచారం అందడంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గ్రామానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎవరు ఉంచారు.. ఎన్నికలలో ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సిద్ధం చేశారా అనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
జియో మాల్పై పోలీసుల దాడి: లగ్జరీ కార్లు సీజ్.. స్టోరీ ఏంటంటే?
విలాసవంతమైన జీవితానికి, ఖరీదైన కార్లకు పెట్టింది పేరు రిలయన్స్ అధినేత బిలియనీర్ అంబానీ కుటుంబం. తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్పై పోలీసుల దాడి వార్తల్లో నిలిచింది. ఈ మాల్లో 41 ఖరీదైన కార్లతో పాటు ఫెరారీస్, లంబోర్గినీ లాంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే..? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అంబానీకి చెందిన మాల్ పార్కింగ్ స్థలంలో ముంబై పోలీసులు 41 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షెస్ తదితర అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మాల్స్లో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ దేశంలోనే యాపిల్ స్టోర్ ఉన్న తొలి మాల్ కూడా ఇదే. తాజా వార్తలపై రిలయన్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్, ర్యాలీకిగా ను ముంబై పోలీసుల ముందస్తు అనుమతి పొందలేని కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కారు అంబానీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ చెందకపోవడం గమనార్హం. ముంబైలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ర్యాలీలో ఫెరారీలు, లంబోర్గినిలు, పోర్షెస్, మెక్లారెన్స్, బిఎమ్డబ్ల్యూలు, జాగ్వార్లు, ఆడి, మెర్సిడెస్తో సహా 100కి పైగా కార్లు పాల్గొన్నాయని అంచనా. దీంతో పబ్లిక్ సర్వెంట్ అండ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 ద్వారా సక్రమంగా ప్రకటించిన ఆర్డర్ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కార్ల యజమానులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రూ.4.55 కోట్ల బంగారం పట్టివేత
జహీరాబాద్/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దులో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టు వద్ద కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుజరాత్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న స్కార్పియో వాహనంలో 6,986 గ్రాముల బంగారు నగలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.55 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్లో శుక్రవారం చేసిన తనిఖీల్లో రూ. 2,56,84,671 నగదును సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
78,678 బాక్స్ల బీర్ల వృథా.. ఆ ఒక్క పని చేసుంటే ఇలా జరిగేది కాదు
మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడులో ఉన్న యునైటెడ్ బ్రువరీస్ కర్మాగారంలో తయారవుతున్న బీరు నాణ్యత ప్రశ్నార్థకమైంది. జిల్లా అబ్కారీ అధికారులు సుమారు రూ. 25 కోట్ల విలుచ చేసే 78,678 బాక్స్ల బీర్లను సీజ్ చేశారు. ఈ కంపెనీ తయారుచేసే ప్రముఖ బీర్ల సీసాల్లో అవక్షేపం పేరుకుపోయిందని, ఇటువంటి బీర్లను తాగరాదని తెలిపారు. జూలై 15వ తేదీన ఈ సీసాలు నింపారని తెలిపారు. కొన్ని సీసాల్లో గసి పేరుకుపోయినట్లు మందుబాబుల ద్వారా తెలుసుకున్న అధికారులు బీర్ల శాంపిళ్లను తీసుకుని ల్యాబ్కు పంపించారు. దీనిపై ఆగస్టు 2వ తేదీన నివేదిక రాగా, ఈ బీర్లు తాగడానికి పనికిరావని అందులో హెచ్చరించారు. దాంతో ఆ బ్యాచ్లో సిద్ధమైన 78,678 పెట్టెల బీర్లను సీజ్ చేశారు. ఇవి అప్పటికే మద్యం షాపులకు వెళ్లిపో గా మళ్లీ వెనక్కి తెప్పించినట్లు తెలిపారు. సీసాల్లోకి నింపేముందు బీర్ను సక్రమంగా ఫిల్టర్ చేయకపోతే అవక్షేపం చేరుకుంటుందని చెప్పారు. చదవండి ఫోన్ ఛార్జింగ్పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు! -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్దేవ్పల్లిలోని ఓ జిమ్లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో తరలిస్తుండగా..
కొచ్చిన్: భారత సముద్ర జలాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.12 వేల కోట్ల విలువైన సుమారు 2,500 కిలోల మెథాంఫెటమైన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్(ఎన్సీబీ) స్వాధీనం చేసుకుంది. కేరళ తీరంలోని భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి ఈ మత్తు పదార్థం ఉన్న 134 సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్(ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు. అఫ్గానిస్తాన్ నుంచి అక్రమంగా తరలించే డ్రగ్స్ను పట్టుకునేందుకు ఆపరేషన్ సముద్రగుప్త్ పేరుతో నేవీ, ఎన్సీబీ కలిసి చేపట్టిన ఆపరేషన్లో ఒక పాకిస్తానీని అదుపులోకి తీసుకున్నామన్నారు. అఫ్గానిస్తాన్ నుంచి డ్రగ్స్తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మక్రాన్ తీరం వెంబడి పాక్, ఇరాన్ల మీదుగా డ్రగ్స్ను చిన్న పడవల్లోకి పంపిణీ చేసుకుంటూ వస్తోందని చెప్పారు. మట్టన్చెర్రీ వద్ద ఈ ఓడను అడ్డగించినట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక, మాల్దీవులకు డ్రగ్స్ను చేరవేయడమే స్మగ్లర్ల లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 3,200 కిలోల మెథాంపెటమైన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషిష్ను పట్టుకున్నట్లు తెలిపారు. చదవండి: గగన్యాన్.. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం -
కర్ణాటక ఎన్నికల్లో విచ్చలవిడిగా మద్యం, డబ్బు.. ఎన్ని కోట్లు దొరికాయంటే?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయి. కొందరికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాయి. ఎన్నికల సంఘం చేసిన విస్తృత సోదాల్లో మొత్తం రూ.375 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్, నగదు, వస్తువులు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు విడుదల చేసిన అధికారిక గణాంకల ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని కోట్లు సీజ్ అయ్యాయంటే.. ►నగదు రూ.147.46 కోట్లు ►దొరికిన మద్యం విలువ రూ.83.66 కోట్లు ►దొరికిన డ్రగ్స్ విలువ రూ.23.67 కోట్లు ►దొరికిన వస్తువుల విలువ రూ.96.6 కోట్లు ►ఉచితంగా పంపిణీ చేసిన వాటి విలువ రూ.24.21 కోట్లు దీంతో ఎన్నికల సంఘం సోదాల్లో ఇప్పటివరకు మొత్తం రూ.375.61 కోట్లు పట్టుబడినట్లయింది. అధికారికంగా సీజ్ చేసిన మొత్తమే ఇన్ని కోట్లు ఉంటే.. ఇక అనధికారంగా ఎంత ఖర్చు చేసి ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.83.93 కోట్లు పట్టుబడితే ఈసారి ఆ మొత్తం నాలుగు రెట్లకు పైగా పెరగడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న(బుధవారం) జరగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: యాద్గిర్... బరాబర్.. కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లాలో రసవత్తర పోరు -
కర్ణాటక ఎన్నికలు: బడా నిర్మాత కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు సీజ్!
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఎన్నికల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను కూడా ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు అధికారులు జరుపుతున్న తనిఖీల్లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దావంగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఓ బీఎండబ్ల్యూ కారులో లక్షలు విలువైన వెండి వస్తువులను ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు బాక్సల్లో వెండి వస్తువులను ఉంచి ఐదు చెన్నై నుంచి ముంబయి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కారులోని వ్యక్తులు సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉండగా.. వాటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉండచ్చని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో, కారు బోనీ కపూర్కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రిజిస్టర్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. హరి సింగ్ను విచారించగా.. ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనని చెప్పినట్లు సమాచారం. ఆ వస్తువులకు సరైన పత్రాలు చూపించని కారణంగానే వాటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనా? కాదా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్యూనెట్ స్కాంపై ఈడీ కొరడా.. రూ.137 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: క్యూనెట్ స్కాంకు సంబంధించి వీహాన్ డెరెక్ట్ సెల్లింగ్ సంస్థపై ఈడీ కొరడా ఝులిపించింది. ఈ కంపెనికీ చెందిన రూ.137కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరులోని 8 భవనాలను జప్తు చేసింది. సైబరాబాద్లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఈమేరకు హైదరాబాద్ విభాగం ఈడీ చర్యలు తీసుకుంది. 58 బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా క్యూనెట్పై మొత్తం 38 చోట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ 9 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంది. చదవండి: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్! -
'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్ను మార్చుకోండి'
పాట్నా: జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు చేసిన ముడు రోజలు తర్వాత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ స్కాం ద్వారా పొందిన రూ.600 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు ఈడీ చేసిన ప్రకటన పచ్చి అబద్దమన్నారు. ఈడీ అధికారులు తన ఢిల్లీ నివాసంలో అరగంటలోనే సోదాలు పూర్తి చేశారని తేజస్వీ చెప్పారు. ఈ సమయంలో తన సోదరీమణులు ధరించి ఉన్న నగలను తీసి పక్కకు పెట్టమని చెప్పారని, వాటినే ఫోటోలు తీసి సీజ్ చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2017లో కూడా తమ పార్టీ రూ.8,000కోట్ల మనీలాండరింగ్కు పాల్పడిందని చెప్పి దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. ముందు వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీలా తమది ఫేక్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాదని తేజస్వీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా క్రోనాలజీ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. తమది నిజమైన సోషలిస్టు కుటుంబం అని పేర్కొన్నారు. బిహార్లో బీజేపీని అధికారానికి దూరం చేసినందుకే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసునని తేజస్వీ అన్నారు. కమలం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈడీ సోదాల్లో ఏం సీజ్ చేశారో అధికారికంగా ప్రకటన విడదల చేయాలని, లేదంటే తానే నిజాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేయాలని బహుశా అమిత్షానే డైరెక్షన్ ఇచ్చి ఉంటారని తేజస్వీ ఆరోపించారు. ప్రతిసారి ఇలానే చేస్తే వర్కవుట్ కాదని.. వాళ్లు స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్కు రూ.2 కోట్లా? -
50 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 57 లీటర్ల బిల్లు! బంకు సీల్..!
జబల్పూర్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ పెట్రోల్ పంపు సిబ్బంది ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే టోకరా ఇచ్చారు! ఆయన కారు ట్యాంక్ సామర్థ్యమే 50 లీటర్లయితే ఏకంగా 57 లీటర్ల పెట్రోల్ కొట్టినట్టు బిల్లు చేతికిచ్చారు. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు అధికారులు పెట్రోల్ బంకును సీల్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర బంకుల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఆల్టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
షాకింగ్.. సబ్బు పెట్టెల్లో హెరాయిన్.. రూ.12 కోట్ల డ్రగ్స్ సీజ్..
ఐజ్వాల్: మిజోరాంలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఐజ్వాల్లో రెండు చోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు డ్రగ్ పెడ్లర్స్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక చోట 98,000 డ్రగ్స్ మాత్రలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.9.8 కోట్లు ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 40 సబ్బుపెట్టెల్లో హెరాయిన్ను గుర్తించారు అధికారులు. దీని విలువ రూ.2.5కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
పాకిస్తాన్లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్ను సీజ్ చేసి..
ఇస్లామాబాద్: తాలిబన్ మిలిటెంట్లు పాకిస్తాన్లో రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్ను నిర్భంధించారు. అంతేకాదు ఉగ్రవాద వ్యతిరేక శాఖ భద్రతా సిబ్బందిని స్టేషన్లో బంధించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే స్టేషన్లో ఉన్న తమవాళ్లను విడిపించుకునేందుకే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ను పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని బంధించినట్లు తాలిబన్లు ఓ వీడియో విడుదల చేశారు. వాళ్లను విడిచిపెట్టాలంటే తమను క్షేమంగా దేశం దాటించి అఫ్గానిస్తాన్ చేరుకునేందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాలిబన్లు స్టేషన్ను తమ నియంత్రణలోకి తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. తాలిబన్లు బయటి నుంచి దాడి చేశారా? లేక స్టేషన్ లోపలికి వెళ్లి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. వారి చెర నుంచి అధికారులను విడిపించేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తోంది. చదవండి: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్లో ఘర్షణలు.. -
సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లపై సాక్షి వరుస కథనాలతో వైద్యారోగ్యశాఖ యంత్రాంగంలో కదిలిక వచ్చింది. ముహూర్తపు సిజేరియన్లు చేస్తున్నారంటూ సాక్షి స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో స్థానిక దీప్తి ఆసుపత్రి అడ్డంగా దొరికిపోయింది. సాక్షి కథనాలతో డీఎంహెచ్వో ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వైద్యురాలి సంభాషణ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో, ఆసుపత్రిని సీజ్ చేసినట్టు డీఎంహెచ్వో తెలిపారు. ఈ సందర్బంగా.. సిజేరియన్లను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: నకిలీ సర్టిఫికెట్స్తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు -
చైనా బొమ్మలతో డేంజర్!
Dangerous Chemicals In China Toys: మేడ్ ఇన్ చైనా బొమ్మలకు అమెరికా చెక్ పోస్ట్ వేసింది. చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్లోనే సుమారు ఏడు బాక్స్ల బొమ్మలను అధికారులు సీజ్ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్ను గుర్తించడం!. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్లో బాగా ఫేమస్ అయిన లగోరి(స్వీట్, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. మరోవైపు హాలీడే షాపింగ్ సీజన్ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చదవండి: చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
ఆ కేసుతో విజయవాడకు సంబంధంలేదు: సీపీ
సాక్షి, విజయవాడ: గుజరాత్లో పట్టుబడ్డ డ్రగ్స్కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విజయవాడకు డగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారన్నది వాస్తవం కాదని సీపీ స్పష్టం చేశారు. గుజరాత్ ముంద్ర పోర్టులో హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. (చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) చెన్నై నివాసముంటున్న దుర్గాపూర్ణ వైశాలి పేరుతో విజయవాడ అడ్రస్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారన్నారు. కొన్నేళ్లుగా వైశాలి, ఆమె భర్త, సుధాకర్ చెన్నైలో ఉంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డీఆర్ఐ విచారణ జరుపుతోందని సీపీ వివరించారు. ఈ కేసుపై అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలలో కూడా సోదాలు నిర్వహించాయన్నారు. విజయవాడలో ఇంటి అడ్రస్తో లైసెన్స్ తీసుకోవడం తప్పితే డ్రగ్స్ ఆనవాళ్లు లేవని సీపీ తెలిపారు. చదవండి: గర్ల్ఫ్రెండ్కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు -
ఎయిర్పోర్టులో రూ. కోటి విలువైన ఐఫోన్లు పట్టివేత
శంషాబాద్: కస్టమ్స్ సుంకం చెల్లించకుండా వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చిన 80 ఐఫోన్లను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం రాత్రి షార్జా నుంచి జి9458 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులు లగేజీ బెల్టు వద్ద ఓ బ్యాగును వదిలేశారు. కస్టమ్స్ అధికారులు అనుమానించి బ్యాగును తెరిచి చూడగా అందులో సుమారు రూ. 1,00,65,000 విలువ చేసే 80 ఐఫోన్లను గుర్తించారు. బ్యాగును తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు దాన్ని తరలించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్లో భాగంగా ఐఫోన్లను తీసుకొచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. -
హోటల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ స్వాధీనం
పట్నా : బిహార్లోని ముజఫర్పూర్లో ఓ హోటల్లో సోమవారం ఉదయం ఆరు ఈవీఎంలు, వీవీప్యాట్ను అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ముజఫర్పూర్ ఎస్డీఓ కుందన్ కుమార్ ఈవీఎంలను సీజ్ చేసి తన స్వాధీనంలోకి తీసుకున్నారు. సెక్టార్ మేజిస్ర్టేట్ అవధేష్ కుమార్ తన డ్రైవర్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లడంతో ఈవీఎంలను హోటల్కు తీసుకువెళ్లినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈవీఎంలను హోటల్ నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం తెలియగానే అక్కడ గుమికూడిన స్ధానికులు మేజిస్ర్టేట్ తీరును తప్పుపడుతూ నిరసన తెలిపారు. పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారని మేజిస్ర్టేట్ అవధేష్ కుమార్కు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈవీఎంలు హోటల్కు ఎలా చేరుకున్నాయో వెల్లడించాలని ఆయనను కోరారు. తన డ్రైవర్ ఓటు వేసేందుకు వెళ్లడంతో మేజిస్ర్టేట్ ఈవీఎంలు, వీవీప్యాట్ను హోటల్కు తీసుకువెళ్లారని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్ నిర్ధారించారు. నిబంధనలను ఉల్లంఘించిన అవధేష్ కుమార్పై శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
విజయవాడలో కలకలం రేపిన ఇరీడియం బాక్స్
-
కలెక్టర్ వాహనం జప్తునకు కోర్టు ఆదేశం
ఒకటి కాదు...రెండు కాదు... ఏకంగా పాతికేళ్లుగా పరిహారం కోసం బాధితులు పోరాడుతు న్నారు. ప్రభుత్వం సేకరించిన తమ భూమికి తగిన పరిహారం ఇవ్వాలంటూ ఏళ్లుగా వేడుకుం టున్నారు. పరిహారం కోసం తొలుత కార్యాలయాల చుట్టూ తిరిగిన చాలా మంది కాలం చేశారు. కానీ ఇప్పటికీ ఆ కుటుంబాలకు పరిహారం అందనే లేదు. రెవెన్యూ విభాగంలో అంతులేని నిర్లక్ష్యంపై కోర్టు పలుమార్లు మెట్టికాయలు వేసింది. అయినా స్పందన రావడం లేదు. చివరికి కలెక్టర్ వాహనం జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 28లోగా వాహనాన్ని అటాచ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సాక్షి, పెద్దపల్లి: రామగుండం మండలం జనగామ శివారులో 1994లో వాటర్ట్యాంక్ నిర్మించారు. సర్వేనంబర్ 599లో ఎకరా పది గుంటల భూమిని వాటర్ట్యాంక్ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించింది. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం నిర్ణయించింది. అయితే ఆ పరిహారం తమకు ఆమోదయోగ్యం కాదంటూ గౌసియా బేగం తదితర కుటుంబాలు కోర్టుకు వెళ్లాయి. ఇందుకు స్పందించిన కోర్టు ఎకరాకు రూ.3.50లక్షల చొప్పున చెల్లించాలంటూ 2012 జూలై 31న తీర్పునిచ్చింది. అన్ని లెక్కలు కలిపి మొత్తం రూ.31లక్షల 24వేల 968 పరిహారం కింద చెల్లించాలని పెద్దపల్లి కోర్టు తేల్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎ లాంటి చెల్లింపులు జరపలేదు. సంవత్సరాలు గడుస్తున్నా సమస్య కొలిక్కిరాలేదు. తమకు రావాల్సిన పరిహారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే.. ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశం పరిహారం కోసం పోరాటం చేస్తున్న బాధిత కుటుంబాలకు కోర్టు బాసటగా నిలిచింది. మొ త్తం రూ.31,24,968 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారంపై రెవెన్యూ అధికారులు అదే రీతిన నిర్లక్ష్యం చేస్తుండడంతో జిల్లా కలెక్టర్ వాహనం జప్తు చేయాలంటూ పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. వరుస సెలవులు రావడంతో ఈనెల 28లోగా కలెక్టర్ వాహ నం జప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఆ లోగా నే డబ్బులు చెల్లించి, వ్యవహారం కలెక్టర్ వాహ నం జప్తు కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ రామగుండం తహసీల్దార్ కార్యాలయం లోని సామగ్రిని జప్తు చేయాలని కోర్టు 2016లో ఆదేశించింది. దీంతో కార్యాలయంలోని కంప్యూటర్, బీరువాలు, టేబుళ్లను బాధితులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేలం వేయాల్సి ఉండగా, రూ.84,500 చెల్లించి ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేసింది. సామగ్రి విలువ ప్రకారం చెల్లించి న, పరిహారం మాత్రం పూర్తిగా దక్కలేదు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఏకంగా కలెక్టర్ వాహనాన్ని పరిహారం కింద జప్తు చేయాలని కో ర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. కాగా పాతికేళ్లుగా పరిహారం ఇవ్వకుండా తమను మా నసికంగా వేధిస్తున్నారని, ఇప్పటికైన పూర్తి పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకొంటున్నారు. జప్తు కానివ్వం కలెక్టర్ వాహనం జప్తు కావట్లేదు. మేమున్నంత వరకు జప్తు కానివ్వం. ప్రజా ఆరోగ్యశాఖ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ శాఖ డబ్బులు చెల్లించకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు మున్సిపల్ (ప్రజా ఆరోగ్యశాఖ) నుంచి రూ.10 లక్షల చెక్ను కోర్టుకు పంపిస్తున్నాం. ఏ వాహనం కూడా జప్తు కాదు.–పుప్పాల హన్మంతరావు, తహసీల్దార్, రామగుండం -
ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు చెక్..
సాక్షి, న్యూఢిల్లీ : కుటుంబ వివాదాల్లో చిక్కుకుని కోర్టు సమన్లను ఖాతరు చేయకుండా తప్పించుకు తిరిగే ఎన్ఆర్ఐ భర్తలకు సర్కార్ షాక్ ఇవ్వనుంది. కోర్టు సమన్లను లెక్కచేయని ఎన్ఆర్ఐ భర్తల ఉమ్మడి ఆస్తిలో వాటాను సీజ్ చేస్తూ చట్ట సవరణలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. విలాసవంతమైన జీవనశైలితో ఆకట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలను వదిలివేస్తున్న ఎన్ఆర్ఐ భర్తల ఉదంతాలు పెరుగుతున్న క్రమంలో వీరికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. జీవిత భాగస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసుల విచారకు, సమన్లకు స్పందించకుండా దేశ విదేశాల్లో తిరుగుతూ, గుర్తింపును సైతం మార్చుకుంటూ న్యాయప్రక్రియను ఎదుర్కోని వారి పేర్లను వెబ్సైట్లోపొందుపరచాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వారిని పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో పాటు వారి ఆస్తుల స్వాధీనం, పాస్పోర్టుల రద్దు వంటి తీవ్ర చర్యలూ చేపట్టాలని యోచిస్తోంది. మరోవైపు ఇటీవల ప్రకటించిన వివాహమైన 48 గంటల్లోగా ఎన్ఆర్ఐ వివాహాలను విధిగా రిజిస్టర్ చేయించాలన్న నిబంధనను సత్వర అమలుకు ప్రభుత్వం పూనుకుంది. భార్యలను మోసం చేసి తప్పించుకుతిరిగే ఎన్ఆర్ఐలను చట్టం ముందు దోషిగా నిలిపేందుకు చట్ట సవరణలను సత్వరమే చేపట్టాలని సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, మనేకా గాంధీ వంటి సీనియర్ మంత్రులతో కూడిన మంత్రుల బృందం నిర్ణయించింది. -
దావూద్ ఫ్యామిలీకి షాక్
-
దావూద్ ఫ్యామిలీకి షాక్
న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. దావూద్ బంధువుల నుంచి ఆస్తులను స్వాధీన పర్చుకోవాలని భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు తమవేనంటూ దావూద్ తల్లి అమీనా బీ, సోదరి హసీనా పర్కార్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ముంబై నాగ్పాదలో దావూద్కి చెందిన ఆస్తులు ఉన్నాయి. దేశం విడిచి పారిపోయిన అనంతరం దావూద్ సోదరి, తల్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ‘స్మగ్లర్ల ఆస్తుల స్వాధీన చట్టం’ ప్రకారం 1998లో భారత ప్రభుత్వం.. దావూద్ సంబంధీకులు, విదేశీ సన్నిహితుల ఆధీనంలో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దావూద్ తల్లి, సోదరి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు, ట్రిబ్యూనల్ వీరి పిటిషన్ని కొట్టేయటంతో చివరకు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఆ ఆస్తులు తమ స్వార్జితమైనవేనని నిరూపించే ఆధారాలను చూపించాలని దావూద్ తల్లిని కోర్టు కోరింది. కానీ వారు సరైన ఆధారాలను ప్రవేశపెట్టలేకపోయారు. పైగా పిటిషనర్లు ఇద్దరూ మరణించటంతో.. ఆస్తుల స్వాధీనానికి లైన్ క్లియర్ అయ్యింది. వీరిద్దరి పేరిట మొత్తం ఏడు ఆస్తులు ఉన్నాయి. వాటిలో రెండు దావూద్ తల్లీ అమీనా బీ పేరున ఉండగా మిగితా ఐదు అతని సోదరి హసీనా పర్కార్ పేరు మీద ఉన్నాయి. కోట్ల విలువైన ఈ ఆస్తులను అక్రమ సంపాదనతో కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 1993 ముంబై వరుస పేలుళ్లలో 257 మంది మరణించారు. ఈ పేలుళ్ల వెనక ప్రధాన సూత్రదారి దావూద్ ఇబ్రహీం. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ దావూద్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. -
రూ.10కోట్ల విలువైన రింగ్, వాచీలు..
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులపై దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా కళ్లు చెదిరే డైమండ్ ఆభరణాలను, విలువైన వాచీలను, ఎంఎఫ్ హుస్సేన్ సహా ప్రముఖుల పెయింటింగ్స్ను అధికారులు సీజ్ చేశారు. తాజా దాడుల్లో రూ.26కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని విలాసవంతమైన నివాస ప్రాంతాల్లో ఒకటైన సముద్ర మహల్లో నీరవ్మోదీకి చెందిన భవనాల్లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులను సీబీఐ, ఈడీ సీజ్ చేశాయి. 15కోట్ల విలువైన వజ్రాల నగలు, డైమండ్లు పొదిగిన రూ. 1.40కోట్ల వాచీలు, రూ.10కోట్ల విలువైన ఎంఫ్ హుస్సేన్, హెబ్బార్, అమ్రితా షెర్గిల్ ల పెయింటింగ్స్ , ముఖ్యంగా 10కోట్ల రూపాయల విలువైన డైమండ్ రింగ్ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా దేశంలో అతపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో కీలక నిందితులుగా నీరవ్ మోదీ,ఆయన మామ, మెహుల్ చోక్సీ తదితరులపై మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈడీ ఎటాచ్ చేసిన మొత్తం ఆస్తులు విలువ రూ. 7600 కోట్లుగా నిలిచింది. -
టీడీపీ ఎమ్మెల్యేకు షాక్.. మైనింగ్ క్వారీలు సీజ్
సాక్షి, చీరాల : టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. పలు మైనింగ్, ఇసుక క్వారీలను సీజ్ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, అధికార టీడీపీలో చేరినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారంటూ పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలో ఉండటంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వదిలేశారు. కానీ ఇటీవల అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమంచి వర్గీయులు చేస్తున్న అక్రమాలు రోజురోజుకు పెరిగిపోయాయి. అంతేకాదు అదే పార్టీకి చెందిన పలువురు నేతలను సైతం బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు నేతలు సైతం ఆమంచి క్వారీయింగ్పై పలు ఆరోపణలు చేసారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమ మైనింగ్పై దృష్టిపెట్టారు. చినగంజాం మండలంలోని కడవకుదురులోని రెండు క్వారీలతో పాటు వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లిలో ఉన్న 4 క్వారీలను సీజ్ చేశారు. ఈదాడుల్లో భారీగా అక్రమ లావాదేవీలు బయటపడినట్లు సమాచారం. -
చివరకు పవర్ బ్యాంకును కూడా..
సాక్షి, ముంబై: అతి విలువైన బంగారం అక్రమ రవాణాలో వింతపోకడలు పోలీసులు సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా ట్రెండ్ మారుస్తున్న అక్రమార్కులు టెక్నాలజీ బాగా వాడేస్తున్నారు. తాజాగా ఏకంగా స్మార్ట్ఫోన్ ఛార్జింగ్నకు ఉపయోగించే పవర్బ్యాంక్ను ఎంచుకున్నారు. ఇందులో గోల్డ్ బార్స్ను చాకచక్యంగా దాచిపెట్టి తప్పించుకోవాలని ప్రయత్నించారు. కానీ, చివరకు నిఘా అధికారులకు చిక్కక తప్పలేదు. పవర్ బ్యాంక్లో గోల్డ్ బార్స్ను పెట్టి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ముంబై ఎయిర్పోర్ట్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 600 గ్రాముల బంగారం బార్లను పవర్ బ్యాంకులో తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకొని అతడిని కస్టమ్ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 18 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరో కేసులో 24 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన సిద్ధిఖి వెల్లై మీరన్ ఖాదర్ మొహిదీన్ నుంచి సుమారు 800వందల గ్రాముల పసిడిని నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అండర్ గార్మెంట్స్లో దాచి పెట్టి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నామని దీని విలువ రూ.24.36 లక్షలని కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. -
ట్రాన్స్ట్రాయ్కు మరో బ్యాంకు షాకు
-
ట్రాన్స్ట్రాయ్కు దేనా బ్యాంక్ షాక్
సాక్షి, పోలవరం: దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్ట్రాయ్కు మరో బ్యాంకు గట్టి షాకు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ రుణాలు చెల్లించకపోవడంతో దేనా బ్యాంకు అధికారులు సంస్థకు చెందిన వాహనాలను, యంత్రాలను సీజ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో చివరకు దేనా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ గతంలో తీసుకున్న రూ.87 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యకు దిగారు. వడ్డీతో సహా మొత్తం రూ. 120కోట్లు బకాయిపడడంతో శుక్రవారం పోలవరం వద్దనున్న సంస్థ కార్యాలయానికి చేరుకున్న బ్యాంకు ప్రతినిధులు కోర్టు ఆదేశాలతోనే ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా గతంలో కూడా రుణాలను (రూ.725 కోట్లు)చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ట్రాయ్పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొనడం గమనార్హం. -
గుజరాత్ పోల్స్: 9.6 లక్షల లీటర్ల లిక్కర్ సీజ్
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యనిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో ఏకంగా రూ 22 కోట్ల విలువైన 9.6 లక్షల కోట్ల మద్యం, రూ 1.71 కోట్ల నగదు, రూ 8 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల బృందాలు పెద్ద ఎత్తున నగదుతో పాటు రూ 3.11 లక్షల విలువైన 35 కిలోల డ్రగ్స్, 3650 బ్రిటన్ పౌండ్లు, రూ 60,000 విలువైన థాయ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నాయి. గుజరాత్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నల్లధనం ఉపయోగించడంపై కన్నేసేందుకు కేంద్ర పరిశీలకులతో పాటు 100 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను ఈసీ నియమించింది. మరోవైపు బంగారం వ్యాపారాల లావాదేవీలకు సంబంధించిన 311 కిలోల బంగారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు విడిచిపెట్టినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా ఈనెల 9, 14న జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 18న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
576 కిలోల గంజాయి స్వాధీనం
నర్సీపట్నం: విశాఖజిల్లాలోని నర్సీపట్నంలో పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కేడీపేట అల్లూరి పార్క్ వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 576 కిలోల గంజాయితో పాటు ఓ కారు, ఓ వ్యాను, రెండు ద్విచక్రవాహనాలు, రూ. 37 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
35 ద్విచక్రవాహనాలు, 9 ఆటోలు స్వాధీనం
ఖమ్మం: ఖమ్మం రమణగుట్టలో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన గుర్తింపు పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు స్వాదీనం చేసుకున్నారు. వీటిలో ఒకే నెంబర్ గల రెండు ఆటోలను గుర్తించారు. పదిమంది పాత నేరస్తులు, మరో పదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి దొంగిలించిన ఒక ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వికలాంగుల కాలనీ, హనుమాన్నగర్, సవరాల కాలనీ, వివేకానంద కాలనీ, జగ్జీవన్రామ్ కాలనీల్లో సోదాలు చేశారు. ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సీఐలు రెహ్మాన్, రాజిరెడ్డి, వెంకన్నబాబు, నాగేంద్రచారి, ఆంజనేయులు పాల్గొన్నారు. -
కల్తీకేది కాదు అనర్హం..!
♦ నగరంలో కల్తీ శనగపిండి తయారీ గుట్టురట్టు హైదరాబాద్: నగరంలో కల్తీ దందా రోజుకో కొత్త రూపం దాల్చుకొంటుంది. కల్తీకేది కాదు అనర్హం! అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. కల్తీ రాయుళ్లు. చివరికి పిండిని సైతం కల్తీ చేయడం నగరంలో కలకలం రేపింది. తాజాగా కర్మన్ఘాట్లో కల్తీ శనగ పిండి, పుట్నాల పిండి తయారీ గుట్టురట్టైంది. స్థానిక రోడ్ నెంబర్ 1, ప్లాట్ నెంబర్4 జానకి ఎన్ క్లేవ్లో కల్తీ శనగ పిండి, పుట్నాల పిండి తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించి శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు రూ. 6.5 లక్షల విలువైన కల్తీ సరుకు(నూకలు, శనగపప్పు, కెమికల్ఫుడ్ కలర్)ను స్వాధీనం చేసుకున్నారు. ఏవి కల్తీ ఏవి మంచివో తెలియడం లేదని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. -
అద్దె గర్భంతో అడ్డగోలు దందా
- నగర నడిబొడ్డున యథేచ్ఛగా సరోగసీ వ్యాపారం ∙సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ - హాస్పిటల్లో దారుణం - పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఉచ్చులోకి దించుతున్న వైనం - ఏకంగా 48 మంది మహిళలకు అద్దె గర్భాలు - రాష్ట్రంతోపాటు ఢిల్లీ, నాగాలాండ్, డార్జిలింగ్, నేపాల్ నుంచి మహిళల తరలింపు - ఇప్పటిదాకా 400 మందితో అద్దె గర్భాలు - ఆసుపత్రికి నోటీసులిచ్చిన అధికారులు సాక్షి, హైదరాబాద్: నిరుపేద మహిళలే వారి టార్గెట్.. ఆ మహిళల గర్భాలే వారికి కాసులు రాల్చే యంత్రాలు.. డబ్బు ఆశ చూపి అద్దె గర్భానికి ఒప్పించడం.. బిడ్డ పుట్టాక ఎంతో కొంత ముట్టజెప్పి వదిలేయడం ఆ ఆసుపత్రుల స్టయిల్! ఇలా అమాయకుల పేదరికాన్ని ఆసరా చేసుకొని అద్దె గర్భం పేరిట కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్న ఓ ఆసుపత్రి బాగోతం బట్టబయలైంది. రాజధాని నగరం నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ఆసుపత్రి ‘సరోగసీ’ దందాను కొనసాగిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అద్దె గర్భాల వ్యాపారాన్ని పోలీసులు, వైద్యాధికారులు శనివారం రట్టు చేశారు. ఢిల్లీ, నాగాలాండ్, డార్జిలింగ్తోపాటు నేపాల్కు చెందిన 48 మంది అద్దె గర్భం మోస్తున్న మహిళలను గుర్తించారు. పిల్లల్లేని దంపతులు, కొందరు ధనవంతుల అవసరాలను ఆదాయంగా మల్చుకునేందుకు నగరంలో అడ్డగోలుగా సాగుతున్న సరోగసీ వ్యాపారానికి ఈ ఆసుపత్రి ఉదంతం పరాకాష్టగా నిలిచింది. దేశమంతా నెట్వర్క్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్ సరోగసీ పేరుతో ఈ దందా నడుపుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మజ, సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఈ ఆసుపత్రిలో జరిపిన తనిఖీల్లో అనేక విస్మయకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అద్దె గర్భాలు మోసేవారి కోసం సాయికిరణ్ ఆసుపత్రి రాష్ట్రంలోనే కాదు దేశమంతటా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు. హాస్పిటల్లో అద్దె గర్భం మోస్తూ కనిపించిన 48 మంది మహిళల్లో హైదరాబాద్కు చెందినవాళ్లు 16 మంది ఉండగా.. మిగతా వారిని దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలించారు. ఢిల్లీ, నాగాలాండ్, డార్జిలింగ్, నేపాల్లోని పలు ప్రాంతాలకు చెందిన పేద మహిళలను గుర్తించి, కొంతకాలం హైదరాబాద్లో ఉంటే లక్షలిస్తామని ఆశ చూపారు. ఇలా వారందరినీ ఆసుపత్రికి రప్పించి వారి గర్భాశయాల్లో పిండాలను ఉంచారు. ఇందుకు ఒక్కో మహిళకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పిల్లలు అవసరమైన దంపతుల నుంచి భారీ మొత్తంలో బేరం మాట్లాడుకొని అందులో నామమాత్రంగా కొంత మొత్తం ఈ మహిళలకు చెల్లిస్తున్నారు. కానీ ఆ ఒప్పందం ప్రకారం కూడా డబ్బులు ఇవ్వలేదని అద్దె గర్భం మోస్తున్న కొందరు మహిళలు పోలీసుల విచారణలో వెల్లడించడం గమనార్హం. ఇప్పటిదాకా 400 మంది.. సాయికిరణ్ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఏకంగా 400 మంది మహిళలను సరోగసీ ఉచ్చులోకి దించారు. ఈ మేరకు అధికారులు ఆ మహిళల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి రికార్డులు, మహిళల చికిత్సకు సంబంధించిన కేస్షీట్లు, వారికి వాడిన మందులు తదితర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళలను నిర్బంధంగా ఆసుపత్రికి తరలించి ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పి ఈ దందా నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేవు సాయికిరణ్ ఆసుపత్రి ఎలాంటి అనుమతులు లేకుండానే సరోగసీ పేరిట దారుణమైన అక్రమాలకు పాల్పడుతోంది. ఇది మహిళలను నిర్బంధించడమే. సరోగసీ కోసం ఈ ఆసుపత్రికి మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కేవలం స్కానింగ్ చేయడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఆసుపత్రిలో గుర్తించిన మహిళల ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అధికారుల ఆదేశాల మేరకు వారిని ఎక్కడ ఉంచాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పద్మజ, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి మేం తెలియక వచ్చాం... ఆసుపత్రిలో ఇంతకాలం ఉండాల్సి వస్తుందని తమకు తెలియదని అద్దెగర్భం మోస్తున్న కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తాము తెలియకుండానే వచ్చి మోసపోయామన్నారు. డబ్బులు కూడా సకాలంలో ఇవ్వడం లేదని, విడతల వారీగా ఇస్తున్నారని పేర్కొన్నారు. కొందరు మాత్రం తమకు తెలిసే అద్దె గర్భం మోసేందుకు వచ్చామని చెప్పారు. -
భారీగా నకిలీ విత్తనాల పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్లోని ఆర్బీనగర్ లో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. సుమారు రూ. కోటి తొమ్మిది లక్షల విలువజేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రవికుమార్, శ్రీనివాస్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో పది మంది నిర్వాహకులు పరారయ్యారని, రెండు కార్లు, ఒక డీసీఎం స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ పద్మజా తెలిపారు. -
యువకుడి వద్ద 3 కిలోల బంగారం!
గువహతి: అస్సాంలోని గువహతి రైల్వే స్టేషన్లో ఓ యువకుడి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. రోజువారి తనిఖీలు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు 19 ఏళ్ల యువకుడి వద్ద 3 కిలోల బంగారాన్ని గుర్తించారు. పట్టుబడిన యువకుడు పశ్చిమ బెంగాల్కు చెందిన ఎమ్డీ సాదిద్ కమాల్ అని పోలీసులు వెల్లడించారు. మూడు కిలోల బంగారాన్ని 14 బిస్కెట్ల రూపంలో.. సరాయ్ఘాట్ ఎక్స్ప్రెస్లో తరలిస్తూ సాదిద్ పట్టుబడ్డాడు. బంగారం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాదిద్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎప్రిల్ 4న గువహతి రైల్వే పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ప్రైవేట్ బస్సులపై కొరడా
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై కొరడా ఝుళిపించారు. శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం పలు బస్సులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని 6 బస్సులను సీజ్ చేశారు. మరో 23 బస్సులపై కేసులు నమోదు చేశారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
యర్రావారిపాలెం(చిత్తూరు): చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు తమిళ కూలీలను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తలకోన అటవీ ప్రాంతంలో తమిళ కూలీలు ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసుల కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న మరో 11 మంది కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భారీ బంగారం, విదేశీ నగదు సీజ్
ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. అధికారుల సాధారణ తనిఖీల్లో భాగంగా 5 కేజీల బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తిని నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసకున్నారు. దీంతో పాటు విదేశీ కరెన్సీ ని కూడా సీజ్ చేశారు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ... ఓ ప్రయాణికుడి నుంచి ఐదు కేజీల బంగారం, భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.77 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తుకొనసాగుతుందని వెల్లడించారు. -
పోలీసుల తనిఖీలు.. 30 బైక్లు స్వాధీనం
కరీంనగర్: కరీంనగర్ నగర శివారులోని కొత్తయాస్వాడలో మంగళవారం ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో 200 పోలీసులు ఇంటింటా సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో చోరీలకు పాల్పడిన ఓ యువకుడికి ఈ సందర్భంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. -
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
జగిత్యాల రూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను తిప్పన్నపేట గ్రామ శివారులో రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. వీటిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
10 ప్రైవేట్ బస్సులు సీజ్
హైదరాబాద్: అనుమతి లేకుండా అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 ప్రైవేటు బస్సులను సోమవారం ఉదయం సీజ్ చేశారు, మరో పది బస్సులపై కేసులు నమోదుచేశారు. హయాత్నగర్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స బస్సులపై ఉప్పల్ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. -
రూ.20 కోట్ల నగదు, రూ.14 కోట్ల లిక్కర్ సీజ్
లక్నో: అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఏడు దశల ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ శనివారం ముగిసింది. నేడు జరిగిన తొలిదశ పోలింగ్లో 63 శాతం మంది ప్రజలు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ 73 నియోజకవర్గాలు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఈ తొలి దశ పోలింగ్ నేపథ్యంలో పట్టుబడ్డ నగదు, బంగారం, డ్రగ్ వివరాలను కూడా ఎన్నికల సంఘం మీడియాకు విడుదల చేసింది. మొత్తం రూ.19.56 కోట్ల నగదు, రూ.96.93 లక్షల విలువైన డ్రగ్, రూ.4.44 లక్షల లీటర్ల లిక్కర్, రూ.14 కోట్ల బంగారం, వెండిని సీజ్ చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అదేవిధంగా 13 పెయింట్ న్యూస్ కేసులను గుర్తించినట్టు పేర్కొంది. ఈ ఎన్నికల నేపథ్యంలో 3,888 డిజిటల్, వీడియో కెమెరాలను ఎన్నికల సంఘం ఏర్పాటుచేసింది. 2,8577 ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ను చేపట్టింది. -
సికింద్రాబాద్లో 142 కిలోల గంజాయి స్వాధీనం
చిలకలగూడ: సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీతాఫల్మండి చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు 142 కిలోల గంజాయిని ఇన్నోవా కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7 లక్షల 40 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశాఖ, తూర్పుగోదావరి, నల్గొండ జిల్లాలకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు,. చిలకలగూడ సీఐ కావేటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. -
అధికారుల తనిఖీలు..ఆరు బస్సులు సీజ్
హైదరాబాద్: నిబంధనలు పాటించని బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు రంగారెడ్డి జిల్లా గగన్పహాడ్ వద్ద సోమవారం ఉదయం అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పన్నులు ఎగవేస్తున్న, నిబంధనలను పట్టించుకోని ఆరు బస్సులను సీజ్ చేసి, 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. -
50 కేజీల గంజాయి స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని మణుగూరులో పోలీసులు జరిపిన తనిఖీల్లో 50కేజీల గంజాయి పట్టుబడింది. పట్టణ ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టిన పోలీసులు స్కార్పియోలో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో ఓ కత్తి, ఇనుపరాడ్తో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మణగూరు సీఐ మొగిలి తెలిపారు. గంజాయి ప్యాకెట్లను స్థానిక ఎమ్మార్వో తిరుమలాచారి పరిశీలించారు. కేసు నమోదు చేసి మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 18 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం
కాకినాడ: పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున కొత్త కొరెన్సీ నోట్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం రాత్రి తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద ఎత్తున 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మాచవరం గ్రామానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద నుంచి ఇంద్రపాలెం పోలీసులు రూ. 18 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
రూ. 3.36 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం
-
ఫిల్మ్నగర్ పార్క్లో రూ. 50 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్ ఫిల్మ్నగర్లోని ఓ పార్క్లో శుక్రవారం పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ చేతులు మారుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ బడా వ్యక్తి కోసం ఖమ్మం జిల్లా నుంచి రూ. 50 లక్షల కొత్త కరెన్సీ తీసుకొచ్చిన ముఠా సభ్యులు పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకొని బ్లాక్ మనీకి బదులు వైట్ మనీ ఇస్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ. 3.36 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ యువకుడి వద్ద పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ నోట్లను గుర్తించారు. రూ. 3.36 లక్షల విలువైన రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదు మార్పిడి కోసం తరలిస్తున్నాడని గుర్తించిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
బస్సులో 120 తాచు పాములు
హనోయ్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 120 తాచుపాములు..అన్ని బతికున్నవే. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గుట్టు చప్పుడుకాకుండా దొంగ రవాణా చేస్తున్నారు. పెద్ద బస్సులో నలుగురే వ్యక్తులు ఓ డ్రైవర్ మాత్రమే వెళుతుంటే అనుమానం వచ్చిన పోలీసులు బస్సును ఆపి చూడగా ఈ విషయం బయటపడింది. దీంతో వారందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వియత్నాం రాజధాని హనోయ్లో చోటు చేసుకుంది. విన్ పుక్ ప్రావిన్స్ నుంచి హో కి మిన్ నగరానికి విడివిడిగా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి వీటిని తరలిస్తున్నారని, వీటి మొత్తం బరువు 220 కేజీలు ఉంటుందని పోలీసులు వివరించారు. ఇలాంటి చర్యలు తమ దేశంలో తీవ్రమైన నేరంగా వస్తుందని చెప్పారు. ప్రజలకు ప్రమాదకరమైన వస్తువులను, జీవరాశులను తరలించడం నేరంకిందకు వస్తుందని స్పష్టం చేశారు. -
మీసేవా కేంద్రం సీజ్
షామీర్పేట్(మెడ్చల్): వినియోగదారుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడంతో పాటు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న మీసేవా కేంద్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మెడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలోని శ్రీ భువనేశ్వరి కమ్యూనికేషన్స్ పేరిట నడుపుతున్న మీసేవా కేంద్రంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో.. షామీర్పేట్ తహశీల్దార్ రవీందర్రెడ్డి శుక్రవారం మీసేవా కేంద్రాన్ని సీజ్ చేశారు. -
25 ఇసుక ట్రాక్టర్లు సీజ్
జగిత్యాల: అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన సబ్ కలెక్టర్ 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన సబ్ కలెక్టర్ శశాంక్ ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివారు నుంచి తరలుతున్న 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. -
17 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
తిరువళ్లూరు: అక్రమంగా ఆంధ్రాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని సెట్టిమేడు ప్రాంతంలో రేషన్ బి య్యాన్ని లారీలో తరలించడానికి సిద్ధంగా ఉంచినట్టు డీఎస్పీ సదాశివంకు రహస్య సమాచారం అందింది. డీఎస్పీ సూచన మేరకు ఇన్స్పెక్టర్ పూ మారన్ నేతృత్వం లోని పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు ని ర్వహించారు. తనిఖీల్లో అక్కడ అనుమానాస్పదంగా ఆగి ఉన్న లారీని పరిశీలించగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. విచారణలో బియ్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ రాకపోవడంతో లారీ యజమాని సెల్వకుమార్ను అరెస్టు చేసిన పోలీసులు లారీని సీజ్ చేశారు. ఈ సంఘటనపై డీఎస్పీ సదాశివం మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా బియ్యాన్ని తరలించే వారిపై నిఘా ఉంచుతామని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు వివరిస్తూ అధికారుల ఆదేశం మేరకు వాటిని ఫుడ్సెల్ గోదాములో అప్పగించినట్టు డీఎస్పీ తెలిపారు. -
స్థలం లేక వాహనాల సీజ్ లేదట!
⇒ పట్టుకున్న వాహనాలకు పార్కింగే సమస్య ⇒ రెండు నెలలుగా ‘సీజ్’ మాటే మరిచిన రవాణా అధికారులు గుంటూరు (నగరంపాలెం): నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నా రవాణా అధికారులు రెండు నెలలుగా సీజ్ చేయడం లేదు. అదేంటీ...రూల్స్ ఏమైనా మారాయా అనుకుంటున్నారా...ఏమీ కాదు... సీజ్ చేసిన వాహనాలను ఎక్కడ పెట్టాలో తెలియక.. పార్కింగ్ సమస్యతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్కు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వాహనాలను మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గుర్తిస్తే వాటిపై కేసులు నమోదు చేసి వెంటనే సీజ్ చేస్తారు. సీజ్ చేసిన ప్రాంతానికి సమీపంలోని పోలీస్ స్టేషన్లో గానీ, ఆర్టీసీ బస్ డిపోలలో గానీ వాహనాలను తరలిస్తారు. అయితే అన్ని పోలీస్ స్టేషన్ల ప్రాంగణాలలో గ్రీనరీ పెంపొందించి సుందరంగా తీర్చి దిద్దాలని రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లలో ఉన్న సీజ్ చేసిన వాహనాలు తీసుకువెళ్లాలని, కొత్తగా సీజ్ చేసిన వాహనాలు తీసుకురావద్దంటూ సంబంధిత ఎస్హెచ్వోలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సమాచారం అందించారు. ఆర్టీసీ బస్ డిపోలలో సైతం సీజ్ చేసిన వాహనాలు నిలపడానికి ఆర్టీసీ అధికారులు అనుమతించటం లేదు. స్థలాల కొరతే ప్రధాన సమస్య.. జిల్లాలో రవాణాశాఖకు గుంటూరు, నర్సరావు పేటలో ఆర్టీఏ కార్యాలయాలు.., తెనాలి, పిడుగురాళ్ళలో యూనిట్ కార్యాలయాలు.., మాచర్ల, చిలకలూరిపేట, బాపట్ల, మంగళగిరిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు కార్యాలయాలు ఉన్నాయి. గుంటూరు ఆర్టీఏ కార్యాలయం మినహా మిగతా అన్నీ అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. నర్సరావుపేటలో ఆర్టీఏ కార్యాలయం, టెస్టింగ్ ట్రాకు, సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్కు ఐదు ఎకరాల స్థలం కావాలని, తెనాలి , పిడుగురాళ్ల యూనిట్ కార్యాలయాలకు రెండు ఎకరాల స్థలం కావాలని, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని రవాణా శాఖ అధికారులు జిల్లా యంత్రాగానికి పలుమార్లు లేఖలు రాసారు. ఇప్పటికీ స్థలాల కేటాయింపుపై సూత్ర ప్రాయంగా అంగీకారం కూడా రాలేదు. రవాణా శాఖ కార్యాలయాల వద్ద సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్ చేసుకోవటానికి స్థలాలు లేకపోవటంతో రెండు నెలలుగా జిల్లాలో ఎంవీఐలు వాహనాలు సీజ్ చేయటం నిలిపివేశారు. తనిఖీలలో జరిమానాలు , కేసులూ మాత్రమే నమోదు చేస్తున్నారు. స్థలం లేక ఇబ్బంది.. తనిఖీ సమయంలో సీజ్ చేసిన వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసేందుకు రవాణాశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా రాజధాని ప్రాంతంగా మారటంతో స్థలాల లభ్యత కష్టంగా ఉంది. నరసరావుపేటలో ఆర్టీఏ కార్యాలయానికి ఐదు ఎకరాల స్థలం సేకరించేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లలలో, ఆర్టీసీ డిపోలలో తాత్కాలికంగా అయినా సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్ చేయటానికి సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో వాహనాలు సీజ్ చేయటం గత రెండునెలలుగా జిల్లాలో గణనీయంగా ఎంవీ ఐలు తగ్గించారు. జిల్లా యంత్రాంగం స్థలాల కేటాయింపుపై సానుకూలంగా స్పందిస్తే సమస్య పరి ష్కారమవుతుంది. – జీసీ రాజరత్నం, జిల్లా ఉపరవాణా అధికారి -
ఏలూరుపాడులో విజిలెన్స్ దాడులు
కాళ్ల : అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచిన దుకాణంపై ఏలూరు రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు చేశారు. ఏలూరుపాడులో సద్దిశెట్టి రాధాకృష్ణ ఆయిల్స్, తాళ్లు వ్యాపారం చేస్తుంటారు. ఆయన ఇంట్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం, అధికారులు తనిఖీలు చేశారు. సద్దిశెట్టి రాధాకృష్ణ ఏడాది నుంచి గ్రామంలోని ఓ ఏజెన్సీ నుంచి సిలిండర్లు తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆయన ఇంట్లో మొత్తం 24 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాళ్ల ఆర్ఐ అడవి కృష్ణ కిశోర్కు అప్పగించారు. అనంతరం విజిలెన్స్ ఎస్సై సీతారాం మాట్లాడుతూ.. ఓ వ్యక్తి ఇంట్లో ఇన్ని సిలిండర్లు ఉండడం ఆశ్చర్యంగా ఉందని, గ్యాస్ ఏజెన్సీ నుంచి రాధాకృష్ణ సిలిండర్లు ఎలా తెస్తున్నారో విచారిస్తామని, ఏజెన్సీని కూడా తనిఖీ చేస్తామని వెల్లడించారు. తనిఖీల్లో విజిలెన్స్ తహసీల్దార్ పి.శైలజ, సిబ్బంది, వీఆర్వోలు రాజేంద్ర ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.5 లక్షల విలువైన చక్కెర లోడు లారీ పట్టివేత
వరంగల్: వాహనాల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వరంగల్ నగరంలోని బీట్ బజారులో చక్కెర లోడుతో ఉన్న లారీని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గోడౌన్లో అన్లోడ్ చేస్తుండగా రూ.5 లక్షల విలువైన చక్కెర ఉన్న లారీని అధికారులు పట్టుకుని తదుపరి చర్యలు తీసుకునేందుకు బీట్ బజార్ సీటీఓకు అప్పగించారు. -
48 కిలోల గంజాయి స్వాధీనం
రోలుగుంట (విశాఖపట్టణం జిల్లా) : చోడవరం మండలం భోగాపురం వద్ద మంగళవారం సాయంత్రం 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు భోగాపురం శివారులో కాపుకాసిన పోలీసులు గంజాయి తీసుకెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 48 కిలోల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. -
రూ.1.44 కోట్ల నగదుతో పట్టుబడ్డ వ్యక్తి
-
రూ.1.44 కోట్ల నగదుతో పట్టుబడ్డ వ్యక్తి
హైదరాబాద్: ఎటువంటి పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును మూటల్లో తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 1.44 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి భారీ నగదు మూటలతో శనివారం అర్ధరాత్రి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు సమీపంలో పోలీసుల కంటపడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. నగదు నెల్లూరుకు చెందిన 14 మంది రైస్మిల్లుల యజమానులదని తెలిపాడు. అయితే ఈ భారీ మొత్తం నగదు ఎలాంటి పత్రాలు లేకుండా, ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా ధాన్యం తరలించడం ద్వారా సంపాదించిన డబ్బు కావడంతో వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగదును సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. -
రూ.2 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. కోల్కతా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఈ సిగరెట్లకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించకుండా తీసుకువచ్చిన ఈ ఖరీదైన విదేశీ బ్రాండ్ల సిగరెట్ల విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. సిగరెట్ల బండిళ్లను సీజ్ చేసి, సంబంధీకుల కోసం విచారణ జరుపుతున్నారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
నార్కట్పల్లి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తిరుమలగిరికి చెందిన సంతోష్ రైస్ మిల్లు యజమాని అక్రమంగా కొనుగోలు చేసిన 350 బస్తాల్లో ఉన్న 17.50 టన్నుల బియ్యాన్ని లారీలో కర్ణాటకకు తరలించేందుకు యత్నించారు. ఈ మేరకు ముందస్తు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు.. సోమవారం మధ్యాహ్నం లారీని నార్కట్పల్లి సమీపంలో అడ్డుకుని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న రేషన్ బియ్యం బయటపడింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోదాముకు తరలించారు. లారీని సీజ్ చేశారు. -
అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం
కల్లూరు (ఖమ్మం) : అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. -
నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం
మాల్దా: నకిలీ కరెన్సీ సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు రూ. 3.80 లక్షల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. కలియచక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీకి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఈ నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లు వారి వద్దకు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్న దొంగనోట్లు చలామని చేసే ముఠా మూలాలు పశ్చిమ బెంగాల్ లో ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. -
హీరోయిన్ బ్యాంక్ అకౌంట్లు సీజ్
అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్తో సంబందాలున్నాయన్న ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణికి మరో షాక్ తగిలింది. ఈ బ్యూటి ఆర్థిక లావాదేవిల మీద దృష్టి పెట్టిన పోలీసు అధికారులు మమతా కులకర్ణికి సంబందించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ను సీజ్ చేశారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేసినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క మలాద్ బ్యాంక్ ఎకౌంట్ లోనే 67 లక్షల రూపాయల నగదు ఉండగా.. ఇతర అకౌంట్లన్నింటిలో కలిపి మరో 26 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఖాతాల నుంచి ఎలాంటి లావాదేవిలు జరపలేదని తెలిపారు. త్వరలో ఇండియాలో ఉన్న మమత ఆస్తులను కూడా సీజ్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. -
పది ఇసుక ట్రాక్టర్లు సీజ్
సుండుపల్లి(వైఎస్సార్): వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని బాహుదా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పది ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. నిత్యం నది నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పడ్డబలిజపల్లి గ్రామస్తులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు. ఈ మేరకు వారు ఎమ్మార్వో సుబ్రమణ్యంరెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన వీఆర్వోను సంఘటన స్థలికి పంపారు. ఆయన అక్కడికి చేరుకుని పది ఇసుక ట్రాక్టర్లను ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
మక్కువ: శ్రీదేవి థియేటర్ సమీపంలోని మూడు రోడ్ల కూడలి వద్ద శనివారం అర్థరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పీఎస్ఐ పి.రమేష్నాయుడు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తోటవలస గ్రామం నుంచి సీతానగరం మండలానికి రేషన్ బియ్యాన్ని మేక్స్వ్యాన్లో తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో మాటువేసి పట్టుకున్నారు. వ్యాన్లో 50 కేజీల సంచుల్లో సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నింపి టార్పాలిన్ కప్పి తరలిస్తుండగా పట్టుకుని స్టేషన్కు తరలించారు. బియ్యాన్ని తహసీల్దార్కు అప్పగిస్తామని పీఎస్ఐ తెలిపారు. -
ఎరువుల కర్మాగారాన్ని సీజ్ చేయండి
మచిలీపట్నం(ఈడేపల్లి) : అనుమతులు, అక్రమ నిల్వలు ఉన్న కర్మాగారాన్ని తక్షణమే సీజ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని), కలెక్టర్ బాబు.ఎ ను డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. పేర్ని మాట్లాడుతూ రేషన్ డిపోలో ఈ పోస్ విధానాన్ని ఏర్పాటు చేసి ఒక్క బస్తా బియ్యం తేడావస్తేనే సదరు డీలరుపై క్రిమినల్ కేసు నమోదు చేసే కలెక్టర్, దాదాపు రూ.85 లక్షల విలువ చేసే నకిలీ ఎరువులు పట్టుకున్న అతనిపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలం రుద్రవరంలోనే అనుమతులు లేకుండా రెండేళ్ల క్రితం నిర్మించినకర్మాగారాన్ని ఎం దుకు పట్టించుకోలేదని ప్రశ్నిం చారు. ఈ నెల 12వ తేదీlవిజిలె¯Œæ్స దాడులు నిర్వహించగా రికార్డులను పరిశించి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ల మేరకు తిరిగి వెళ్లి మళ్లీ అధికారులు 14వ తేదీ మరోసారి దాడిచేయడంపై విస్మమయం వ్య క్తం చేశారు. అంతేకాకుండా 12వ తేదీ నుంచి 14వ తేదీ రాత్రి వరకు మంత్రి కొల్లు రవీంద్ర, 80 నుంచి వంద సార్లు విజిలెన్స్ అధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. కలెక్టర్కు ఫిర్యాదు.. రైతులను మోసం చే సి అమ్మకాలు జరిపే ఫ్యాక్టరీలో వాటా ఎంత అని మంత్రిని ప్రశ్నించారు. బ్లాక్లో ఎరువులు తయారీ, బెల్టుషాపుల వలన ఎంత కమీషన్ తీసుకుంటున్నారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని సోమవారం కలెక్టర్ను కలవనున్నట్లు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్రావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బాలజోషి, కౌన్సిలర్లు మేకల సుధాకర్ బాబు, శీలం మారుతీరావు(బాబ్జి), లంకా సురిబాబు, ఆస్గర్అలీ పాల్గొన్నారు. -
కలెక్టరేట్ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
-
కలెక్టరేట్ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల కుదింపు చర్యలను నిరసిస్తూ గురువారం విద్యార్థి సంఘాలు అనంతపురం కలెక్టరేట్ను ముట్టడించాయి. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో కుదించడంపై విద్యార్థి సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు కలెక్టరేట్ను ముట్టడించారు. కుదింపును వెనక్కితీసుకోవాలని, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని గురువారం అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరుద్యోగ ఐక్యవేదిక దీక్ష చేపట్టింది. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన ఐక్య వేదిక డిమాండ్ చేసింది. -
295 కిలోల గంజాయి స్వాధీనం
- ఏపీ నుంచి చెన్నైకి రవాణా - విశాఖవాసి సహా ఇద్దరు అరెస్ట్ చెన్నై: చెన్నైలో రెండు వేర్వేరు సంఘటనల్లో మొత్తం 295 కిలోల గంజాయి పట్టుబడింది. చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్లో 195 కిలోలు, టీపీసత్రం వద్ద మరో వంద కిలోల గంజాయిని రైల్వే పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి శిలా విగ్రహాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులు రహస్య సమాచారం అందింది. ఈ సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమై ప్రయాణికులపై నిఘా పెట్టారు. అన్ని రైల్వేస్టేషన్లలో అనుమానిత ప్రయాణికుల లగేజీ తనిఖీలు సాగించారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి చెన్నై ఎగ్మూరు స్టేషన్కు ఒక రైలు చేరుకుంది. ఆ రైలు భోగీల్లో తనిఖీలు చేపట్టగా ఒక పెద్ద పార్శిల్ సంచిలో గంజాయిని గుర్తించారు. ఆ సంచీని తీసుకువచ్చిన మధురై ఉసిలంపట్టికి చెందిన గోపాల్, విశాఖపట్టణంకు చెందిన ఉచ్చప్పన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా నుంచే ఈ గంజాయిని సేకరించి చెన్నైలో విక్రయానికి తీసుకువచ్చినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, చెన్నై టీపీ సత్రం సమీపంలో మరో వంద కిలోల గంజాయి మంగళవారం పట్టుబడింది. -
విశాఖలో భారీగా గంజాయి పట్టివేత
అరకు (విశాఖపట్టణం) : విశాఖ జిల్లాలో అధికారులు పెద్దమొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం బొర్రా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హుకుంపేట నుంచి గంజాయిని తరలిస్తున్న లారీ పట్టుబడింది. అందులోని 312 ప్యాకెట్లలో ఉన్న సుమారు 424 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా వరంగల్ జిల్లాకు చెందినవారుగా భావిస్తున్నారు. గంజాయిని లారీ సహా సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై యు.నాగేశ్వరరావు తెలిపారు. -
నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు సీజ్
శంషాబాద్: నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డిజిల్లా శంషాబాద్లోని గగన్పహాడ్ దగ్గర ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 స్కూల్ బస్సులపై కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నిలోఫర్లోనూ కల్తీ సెలైన్ బాటిళ్లు
హైదరాబాద్: సరోజనీ కంటి ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఆస్పత్రికి సరఫరా చేసే సెలైన్ బాటిళ్లలో కల్తీ జరిగిందని నిర్ధారణ కావటంతో సదరు కంపెనీని అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ కంపెనీ సరఫరా చేసే అన్ని ఆస్పత్రుల్లోనూ డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు సోదాలు జరుపుతున్నారు. గురువారం సాయంత్రం నిలోఫర్ పిల్లల ఆస్పత్రిలో తనిఖీలు చేయగా మొత్తం 39 వేల బాటిళ్లలో బ్యాక్టీరియా ఆనవాళ్లున్న 29వేల సెలైన్ బాటిళ్లు బయటపడ్డాయి. వాటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిస్తామని, వాటిని సీజ్ చేశామని డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని తెలిపారు. అయితే, ఇప్పటికే పదివేల బాటిళ్లను వినియోగించినట్లు తేలిందన్నారు.