రూ. 18 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం
Published Mon, Dec 5 2016 1:02 PM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM
కాకినాడ: పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున కొత్త కొరెన్సీ నోట్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం రాత్రి తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి పెద్ద ఎత్తున 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మాచవరం గ్రామానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద నుంచి ఇంద్రపాలెం పోలీసులు రూ. 18 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement