విజయవాడ : గురునానక్ కాలనీలోని ఓ వైన్ షాపులో కల్తీ మద్యం పట్టబడింది. అక్రమంగా నిల్వ ఉంచిన 200 కేసుల మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు తనిఖీల్లో భాగంగా గురువారం పట్టుకున్నారు. అయితే విషయాన్ని బయటకు పొక్కనీకుండా చూడాలని అధికార పార్టీకి చెందిన ఓ నేత ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారులు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించేందుకు నిరాకరించారు.