తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 66,377 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.