దేవతలారా మన్నించండి..!
Published Sat, Aug 13 2016 8:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
స్నాన ఘాట్ల వద్ద పడేసిన దేవతల విగ్రహాలు
అమరావతి (గుంటూరు రూరల్): నిత్యం పూజలందుకునే దేవతల విగ్రహాలు ఎండకు ఎండి భక్తులు స్నానాలు చేసిన నీటితో తడిసి పోతున్నాయి. దేవాలయంలో ఉంటే నిత్యం పూజలు చేసే భక్తులు స్నానాల ఘాట్ వద్ద పడివున్న విగ్రహాలను మాత్రం పట్టించుకునే స్థితిలో లేరు. అమరావతిలోని అమరేశ్వర ఘాట్ వీఐపీ ఘాట్ వద్ద కృష్ణమ్మతల్లి, కనకదుర్గ, వినాయకుడు తదితర దేవతల విగ్రహాలు ఎర్రని ఎండలో ఎండుతున్నా అటు అధికారులు, సేవకులు, భక్తులు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో భక్తులు పుణ్య స్నానాలను అచరించి వాటి వద్దే వస్త్రాలను సైతం ఆరవేశారు.
Advertisement
Advertisement