statues
-
అతడిదో ‘చెత్త’ కల(ళ) : గట్టిగా కొట్టాడు సక్సెస్!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇండోర్కు చెందిన యువకుడికి చిన్నప్పటినుంచీ ఒక అలవాటు ఉండేది. తన పరిసరాల్లో కనిపించిన పనికి రాని వస్తువుల ద్వారా ఏదో ఒక ఉపయోగపడే వస్తువును తయారు చేసేవాడు. ఆ అలవాటే అతడిని అద్భుత కళకారుడిగా తీర్చిదిద్దింది. స్క్రాప్ మెటల్తో తన కలలకు ప్రాణం పోసి, అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నాడు. దేశ విదేశాల్లో అతని కళాఖండాలకు ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఎవరా యువకుడు? అతని కథేంటి తెలుసుకుందాం ఈ కథనంలో.దేశంలో చాలా మంది కళాకారులు మట్టి , రాయి, చెక్క, ఇలా అనేక రకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడం మనకు తెలుసు. ఇండోర్లో నివసిస్తున్న ఈ కళాకారుడి విగ్రహాలు మాత్రం చాలా స్పెషల్. ఇండోర్కు చెందిన దేవల్ వర్మకు చిన్నప్పటినుంచీ ఫిక్షన్ సినిమాలు, బైక్లు అంటే ఇష్టం. చిన్నతనంలో, దేవల్ వారాంతాల్లో తన ఇల్లు ,పాఠశాల చుట్టూ దొరికిన స్క్రాప్లను ఉపయోగించి తనకు నచ్చిన విధంగా చిన్న చిన్న వస్తువులను తయారు చేసేవాడు. అదే అతణ్ని గొప్పవాడిగా మలుస్తుందని అస్సలు ఊహింఛలేదు.యువకుడిగా మారిన కొద్దీ, కాస్త విజ్ఞానం అలవడుతున్న కొద్దీ తను చేస్తున్న పనిపై మరింత ఆసక్తి పెరిగింది. కళాశాలకు చేరుకునే సమయానికి, ట్రాన్స్ఫార్మర్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల పట్ల ప్రేమతో ప్రేరణ పొంది స్క్రాప్ మెటల్తో క్లిష్టమైన నమూనాలను తయారు చేసేశాడు. దీనికి తోడు ప్రముఖ టీవీ షో M.A.D (సంగీతం, కళ , నృత్యం), దాని హోస్ట్ హరున్ రాబర్ట్ నుంచి మరింత ప్రేరణ లభించింది. అలా వ్యర్థ పదార్థాలతో కార్లు, మోటార్ సైకిళ్ల సూక్ష్మ నమూనాలను తయారు చేస్తూ ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు దేవల్ వర్మ. View this post on Instagram A post shared by Deval Verma (@devalmetalart) ఈ ఆసక్తి తగ్గట్టుగానే దేవల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు,స్థానిక గ్యారేజీలు . ఆటోమోటివ్ ఫ్యాక్టరీల దృష్టిని ఆకర్షించాయి. వారినుంచి మెటల్ స్క్రాప్ సేకరించి హార్లే డేవిడ్సన్ అధికారిక లోగో రూపకల్పన గొప్ప మైలురాయిగా నిలిచింది. వారి షోరూమ్ కోసం ఈ స్క్రాప్ ఇన్స్టాలేషన్ను ప్రత్యేకంగా రూపొందించాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత దేవల్ క్రియేటివ్ జర్నీ మరింత వేగం పుంజుకోవడమే కాదు, కీలక మలుపు తిరిగింది. తన కళను కరియర్గా మలుచుకోవాని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో తల్లిదండ్రుల నుండి ప్రారంభ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, చివరికి కుమారుడికి అండగా నిలిచారు. పూణేలోని MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ప్రోడక్ట్ డిజైన్లో కోర్సును అభ్యసించాడు. అలా దుబాయ్లో తొలి ప్రదర్శన సక్సెస్ అయింది. మెటల్ స్క్రాప్తో రూపొందించిన రెండు గిటార్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకోవడంతో మెటల్ ఆర్టిస్ట్గా వృత్తిపరమైన ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.ఈరంగంలో నిపుణుల సలహాలను తీసుకుంటూ మరింత పట్టుదల ఎదిగాడు. కళా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు పొందాడు. మినీ-రోబోట్ ప్లాంటర్ మొదలు అందమైన శిల్పాల వరకు కొలువు దీరాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. సింగపూర్, ఇటలీ, అమెరికాలోని కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి.దేవల్ వర్మ స్టార్టప్2017 నుండి ఒక సొంత స్టార్టప్ను నడుపుతున్నాడు. అతను ఇప్పటివరకు అనేక రకాల శిల్పాలు , కళాఖండాలను తయారు చేశాడు. ఏనుగు, నెమలి, చిలుక, గిటార్, డేగ, ఇండియా మ్యాప్, పువ్వులు ఇలా ఒకటేంటి అనేక రకాల జంతువులు, పక్షుల బొమ్మలను రూపొందించాడు. ముఖ్యంగా హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.అద్భుతమై హనుమాన్ విగ్రహంగుజరాత్లోని గోద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా ద్వారా దేవల్ గురించి తెలుసుకుని హనుమంతుని విగ్రహాన్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దీన్ని సవాల్గా తీసుకున్న దేవల్ 350 కిలోల స్క్రాప్ ఉపయోగించి, ఏడాది పాటు శ్రమించి హనుమాన్జీ విగ్రహాన్ని రూపొందించాడు. ఇత్తడి స్టీల్ వస్తువులు, గేర్-బేరింగ్లతో కండలు తిరిగిన దేహంతో అందమైన హనుమాన్ విగ్రహం చూస్తే ఎవరైనా చేయొత్తి మొక్కాల్సిందే. -
ఇదేం రూల్?.. విశాఖ ఎలక్షన్ కోడ్లో అధికారుల ఓవరాక్షన్
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
ఈ తరహా దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఆగ్రహం
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల అరాచకాలపై సర్వత్రా ఖండనలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఈర్ష్య, అసూయలతో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాల్లేవీ ఉండకూదని పచ్చ మూకలు దాడులకు తెగపడుతోంది. ఈ క్రమంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె ఈ దాడుల్ని ఖండిస్తూ ఓ సందేశం ఉంచారు. ‘‘రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం.రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి…— YS Sharmila (@realyssharmila) June 9, 2024.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని సందేశం ఉంచారామె. మరోవైపు.. ఏపీలో టీడీపీ శ్రేణుల దాడుల్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లంరాజు ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారారయన. -
విగ్రహాలకు స్థానచలనం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లోని ఐదో నంబర్ గేట్ దగ్గరి లాన్ వద్దకు మార్చింది. ఈ లాన్లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. గుజరాత్లో బీజేపీ ఈసారి క్లీన్స్వీప్ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ప్రశ్నించారు. విమర్శలపై లోక్సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది. -
ఇది మాయని ‘మరక’ : లైంగిక వేధింపులపై వినూత్న నిరసన
ప్రపంచవ్యాప్తంగా బాలికలు,మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నం ప్రచారాన్ని చేపట్టింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్సైలెన్స్ ది వయలెన్స్’ అని పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికపై వేధింపుల హింస ఎన్నటికీ మాయని మచ్చ అనే అంశాన్ని విగ్రహాల రూపంలోప్రదర్శించడం విశేషం. మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శన చర్చ నీయాంశంగా నిలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటు న్నారని జర్మన్ మహిళా హక్కుల సంఘం టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. ఈ లైంగిక వేధింపులపై చాలామంది మౌనంగా ఉంటారని, ఈ మౌనమే మరో మహిళ వేధింపులకు దారి తీస్తోందని సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. “ప్రతీ నేరస్థుడు వేలమందికి కారణమవుతున్నాడు ఇకపై మహిళలపై లైంగిక వేధింపులను ఉపేక్షించవద్దు అప్రమత్తంగా ఉందాం. బాధితులకు అండగా నిలుద్దాం. కలిసికట్టుగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం’’ సినా టాన్ టెర్రే డెస్ ఫెమ్మెస్ బాలికలు ,మహిళలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ-నిర్దిష్ట వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతోంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యాలని హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాల్లో పేర్కొన్న మాదిరిగా లైంగిక వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. -
భారతదేశంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
-
హైదరాబాద్ లో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాల తొలగింపు
-
రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్ట
విజయనగరం: రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్టించారు. రుత్వికులు శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. 4 నెలల్లో ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవుడి పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాముని విగ్రహం ధ్వంసం చేసిన వారికి తప్పకుండ శిక్ష పడుతుందని తెలిపారు. నెలల్లోనే ఆలయం నిర్మించి విగ్రహాలను ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవునితో రాజకీయాలు చేయడం మానుకోవాలని, దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని ఆధారాలతో నిరూపించడానికి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆగమ పండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయ ప్రతిష్ట జరిగిందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కార్యక్రమం జరిగిందని చెప్పారు. దీంట్లో రాజకీయ కోణం చూడకూడదని అన్నారు. భద్రాచలం సంప్రదాయాలతోనే రామతీర్థ ఆలయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే శ్రీ రామనవమి రామతీర్థంలో రాష్ట్ర అధికారిక నవమి ఉత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కోరుతున్నామని చెప్పారు. -
కొలనుపాకలో నాలుగడుగుల జైన పాదం
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది లేదా 9వ శతాబ్దానికి చెందిన జైన తీర్థంకరులలో ఒకరిదని భావిస్తున్న భారీ పాదాన్ని కొలనుపాకలో గుర్తించారు. ఈ పాదం దాదాపు నాలుగు అడుగుల పొడవుంది. అక్కడ గతంలో ధ్వంసమై చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలు, విగ్రహాలను సోమేశ్వరాలయం సమీపంలోని ప్రాంగణానికి చేర్చే పని ప్రస్తుతం జరుగుతోంది. అక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు చూసేందుకు వీలుగా వీటిని ఒకచోట ఉంచబోతున్నారు. ఈక్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు కుమారస్వామి, సోమిరెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శిథిల విగ్రహాల మధ్య ఈ పాదాన్ని గుర్తించారు. జైన తీర్థంకరులలో ఒకరికి సంబంధించిన పాదాల్లో ఎడమ పాదంగా వారు నిర్ధారణకు వచ్చారు. దీన్ని చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా ధ్రువీకరించారని హరగోపాల్ పేర్కొన్నారు. దీన్ని పాదంగా మాత్రమే ఏర్పాటు చేసినదా? లేదా భారీ విగ్రహానికి చెందిన భాగమా? అన్న విషయమై స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో మహబూబ్నగర్ జిల్లా గొల్లత్తగుడి జైన మందిరం వెనక ఆరు అడుగులు, ఐదు అడుగుల పొడవున్న రెండు జతల భారీ జైన పాదాలను గుర్తించారు. నిర్మల్ జిల్లా భైంసాలో కూడా 3 భారీ పాదాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో భారీ జైన పాదాలున్న మూడో ప్రాంతంగా కొలనుపాకను గుర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పాదం మీద నూపురం, కాలివేళ్లకు అలంకారాలు కనిపిస్తున్నట్టు హరగోపాల్ వెల్లడించారు. -
కట్టలు తెగిన ప్రజాగ్రహం.. నేలకూలిన విగ్రహాలు
తమ పిల్లలపై జరిగిన మారణ హోమం పట్ల అక్కడి జనాలు రగిలిపోతున్నారు. సంబురంగా జరపాల్సిన పూర్తి స్వాతంత్రోత్సవ వేడుకల్ని.. నిరసన దినంగా పాటించారు. వలస పాలనతో ఆ మారణహోమాలకు కారకులంటూ రాణుల విగ్రహాలను కూల్చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై యావత్ ప్రపంచం నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒట్టావా: నారింజ దుస్తుల్లో రోడ్డెక్కిన నిరసనకారులు.. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, కూలిన రాణుల విగ్రహాలు.. ఇది కెనడా డే నాడు కనిపించిన దృశ్యాలు. జులై 1న కెనడా డే వేడుకలపై ‘కరోనా’ ప్రభావం కనిపించింది. సంబురాలు భారీగా జరుపలేదు అక్కడి జనం. పైగా ఈ మధ్యకాలంలో స్కూళ్ల నుంచి వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాల అవశేషాలు భారీగా బయటపడడం వాళ్లలో తీవ్ర విషాదం నింపింది. అందుకే నిరసన దినం పాటించారు. అయితే బ్రిటిష్ పాలనలో జరిగిన ఆ మారణహోమాలను గుర్తు చేసుకుంటూ.. కనిపించిన రాణుల విగ్రహాలను కూల్చేశారు. తాళ్లతో లాగేసి మరీ.. కెనడా వ్యాప్తంగా ఆరెంజ్ దుస్తుల్లో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. విన్నిపెగ్లో క్వీన్ విక్టోరియా విగ్రహం దగ్గర తొలుత ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిటిష్ రాచరికపు గుర్తులు కెనడా గడ్డపై ఉండకూడదని అరుస్తూ ఆపై విగ్రహాన్ని కూల్చిపడేశారు. విగ్రహంపైకి ఎక్కి బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆపై అక్కడున్న శిలాఫలకంపై ఎర్ర చేతి గుర్తులు వేశారు. ఇక ఆ దగ్గర్లోనే ఉన్న క్వీన్ ఎలిజబెత్ విగ్రహాన్ని కూడా తాళ్లతో లాగి కిందపడేశారు. రాణి కాదు.. రాక్షసి అంటూ అభ్యంతరకర నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఒట్టవాలో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఇక ఈ ఘటనలను బ్రిటన్ ఖండించిది. ‘‘కెనడాలో జరిగిన విషాదాలకు మేం బాధపడుతున్నాం.ఈ వ్యవహారంలో కెనడాతో విచారణకు మేం సహకరిస్తాం. కానీ, విగ్రహాలు కూల్చేయడం సరికాదు’’ అని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆరువేల మందికిపైనే.. బ్రిటీష్ కొలంబియా, సస్కట్చేవాన్ లో క్యాథలిక్ చర్చల ద్వారా నడిచే స్కూళ్లలో భారీగా పిల్లల అస్థిపంజరాలు బయటపడడం తెలిసిందే. కెనడా దాదాపు 165 ఏళ్లపాటు బ్రిటిష్ కాలనీ పాలనలో ఉంది. ఆ టైంలో సంప్రదాయ మారణహోమం పెద్ద ఎత్తున్న జరిగిందని 2015లో ఓ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. బలవంతపు మతమార్పిళ్లు.. వినని వాళ్లపై వేధింపులు జరిగేవని తెలుస్తోంది. సుమారు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడ్డారు. స్కూల్ యాజమాన్యం ఆగడాలతో దాదాపు ఆరువేల మంది పిల్లలు చనిపోగా.. వాళ్లను అక్కడే ఖననం చేశారు. ఆ అస్థిపంజరాలే ఇప్పుడు బయటపడుతున్నాయి. చదవండి: మూసేసిన స్కూల్లో వందల అస్థిపంజరాలు మతం, మాతృభాష ఆ పిల్లల పాలిట శాపం! -
బాలుడి కలలో దేవుడు కనిపించి...
బాగేపల్లి : బాగేపల్లి తాలుకాలోని సీగలపల్లిలో లభించిన విగ్రహాల ఘటన కొత్త మలుపు తిరిగింది. ఈ విగ్రహాలకు ఎలాంటి చరిత్ర లేదని, ఈ విగ్రహాలను ఇటీవల తయారు చేసి పురాతన విగ్రహాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారని అధికారులు తెలిపారు. బాలుడికి కలలో దేవుడు కనిపించి పొలంలో విగ్రహాలు ఉన్నాయని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈమేరకు పొలానికి వెళ్లి చూడగా పంచముఖి అంజనేయ విగ్రహం, చౌడేశ్వరి విగ్రహాలు కనిపించాయి. దీంతో ప్రజలు పూజలు చేసి జాతరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విషయం తహసీల్దార్ దృష్టికి వెళ్లగా ఆయన పురావస్తు శాఖ అధికారులను పంపారు. వారు వచ్చి పరిశీలించగా పురాతన విగ్రహాలు కాదని, ఇటీవల తయారైనట్లు నిర్ధారించారు. అక్కడ ఎలాంటి పూజలు, జాతరలు చేయవద్దని ఆయన సూచించారు. -
దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే!
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు. 2019 ఏప్రిల్ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. గతంలో పాలక మండలి హయాంలోనే.. దుర్గగుడికి గత ఏడాది ఉగాది ఉత్సవాల నాటికి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఉంది. ఆ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్ కవర్తో కప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలా సోమినాయుడు సారథ్యంలో పాలకమండలి ఏర్పటైంది. రథం యథావిధిగా ఉందని భావించారే తప్ప రథం మీద ఉన్న సింహం బొమ్మలు మాయం అవుతాయని అనుమానించలేదు. రథాన్ని పరిశీలించలేదు. గతంలో పాలకమండలి సభ్యులకు, దేవాలయ ఈఓలకు మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో వారే ప్రతిదాన్ని వివాదస్పదం చేసుకునేవారు. వారిపై అనుమానాలు.. ఇక దుర్గగుడి పరిసరాల్లో టీడీపీ నేతలు కొంతమంది కొన్నేళ్లుగా పాగా వేశారు. వారు ఇంద్రకీలాద్రిపైనే చిరు వ్యాపారం చేసి తర్వాత రూ.కోట్లకు పడగలెత్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇరకాటంలో పెట్టాలని రథంపై సింహాల ప్రతిమలను మాయం చేసి పాపానికి ఒడికట్టారా.. అనే అనుమానాలు దేవస్థానం సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక సంస్థకు గతంలో సెక్యురిటీ బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది వారి కాంట్రాక్టు పూర్తి కావడంతో తిరిగి వేలం నిర్వహించడంతో మాక్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే గత సంస్థలో పనిచేసిన అనేక మంది సిబ్బంది మాక్స్ సంస్థలో చేరి ఇక్కడే దుర్గగుడిలో పనిచేస్తున్నారు. తమ ప్రతిష్ట దెబ్బతీయడానికి గత సంస్థలో పనిచేసిన వారు ఎవరైనా ఈ తప్పుడు పని చేశారా? అనే అనుమానం మాక్స్ సెక్యురిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే! టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రార్థనా స్థలాలపై ఏ విధమైన భక్తి భావం లేదు. తన హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారు. 2016లో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చి వేయించారు. అప్పట్లో ఈ కూల్చివేతల్లో ఎంపీ కేశినేని నాని, నాటి కలెక్టర్ అహ్మద్ బాబు కీలకపాత్ర పోషించారు. రామవరప్పాడులో ఉన్న మసీదును కూల్చివేయడంతో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను సంతోష పరచడానికే స్థానిక టీడీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడుతున్నారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. రథాన్ని పరిశీలించిన మంత్రి వెలంపల్లి ఇంద్రకీలాద్రికి ఉన్న వెండి రథాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు ఈఓ ఎన్వీఎస్ఎస్ మూర్తిని విచారణాధికారిగా నియమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘గతాన్ని గుర్తు చేస్తున్నాయి.. తొలగించండి’
లండన్: జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ప్రభావం బ్రిటన్ మీద కూడా పడింది. ‘బ్లాక్లైవ్స్ మాటర్’ నిరసన సెగ దేశవ్యాప్తంగా ఉన్న బానిస వ్యాపారులు, వలసవాదుల విగ్రహాలకు తాకింది. మంగళవారం ఆందోళనకారులు లండన్ మ్యూజియం బయట ఉన్న 18వ శతాబ్దానికి చెందిన బానిసల వ్యాపారి రాబర్ట్ మిలిగాన్ విగ్రహాన్ని తొలగించారు. ఈ క్రమంలో లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ‘మన నగరం, దేశ సంపద బానిస వ్యాపారం నుంచి ఉద్భవించిది అనేది వాస్తవం. బహిరంగ ప్రదేశాల్లో ఇందుకు సంబంధించిన వేడుకలు జరుపుకోనవసరం లేదు. ఈ విగ్రహాలు, రహదారి పేర్లు, బహిరంగ ప్రదేశాల పేర్లు పూర్వ యుగాన్ని ప్రతిబింబిస్తాయి. వీటి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ ట్వీట్ చేశారు. నిరసనల నేపథ్యంలో లండన్ వ్యాప్తంగా వలసవాదులు, బానిస వ్యాపారుల పేర్ల మీద ఉన్న విగ్రహాలు, వీధుల పేర్లను సమీక్షించేందుకు గాను ఓ కమిటిని నియమించినట్లు సాదిక్ ఖాన్ తెలిపారు. ఆదివారం నిరసనకారులు బ్రిస్టల్లోని ఇంగ్లీష్ పోర్టు సిటిలో ఉన్న ఓ బానిసల వ్యాపారి కోల్స్టోన్ విగ్రహాన్ని రేవులో పడేశారు. సోమవారం ఆక్స్ఫర్డ్లో 1,000 మందికి పైగా ప్రదర్శనకారులు వలసవాది సిసిల్ రోడ్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టవర్ హామ్లెట్స్ మేయర్ జాన్ బిగ్స్ రాయిటర్స్తో మాట్లాడుతూ.. ‘విగ్రహాలను తొలగించడం మంచి పద్దతి కాదు. కానీ నిరసకారుల ఆందోళన వల్ల ప్రస్తుతం ఈ విగ్రహాలను తొలగించి స్టోర్ రూమ్లో భద్రపరిచి.. ఏం చేయాలనే దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. (‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’) ‘ప్రజలు ఇన్నాళ్లు విగ్రహాలు నిలబెట్టిన వ్యక్తులందరిని గొప్ప వ్యాపారవేత్తలుగా భావించారు. వారంతా దేశ ఉన్నతికి తోడ్పడ్డారని అనుకున్నారు. కానీ లోతుగా తరచి చూస్తే తెలిసే వాస్తవం ఏంటంటే వారంతా బానిస వ్యాపారులు. అందుకే ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని తొలగిస్తున్న నిరసనకారులను బ్రిస్టల్ పోలీసులు అడ్డుకోలేదు’ అన్నారు బిగ్స్. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని తొలగించడాన్ని నేరంగా వర్ణించారు. -
‘నన్ను చంపేస్తారు.. అందుకే విగ్రహాలు చేయించా’
కోల్కతా : చంపేస్తారనే భయంతో తన విగ్రహాలను తయారు చేయించిపెట్టుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్. తాను చనిపోయిన తర్వాత ప్రజలు తనను మర్చిపోవద్దనే ఉద్దేశంతో విగ్రహాలను తయారు చేయించానని చెబుతున్నారు. సౌత్ 24 పర్గానాస్ జిల్లాలోని గోసాబా నియోజవర్గ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(71) మూడేళ్ల క్రితం కోల్కతాలో పేరుగాంచిన శిల్పితో రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. ఫైబర్ గ్లాస్తో తయారు చేయించిన ఈ విగ్రహాలను తన ఇంట్లో భద్రంగా దాచుకున్నారు. అయితే ఇటీవల తన నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విగ్రహాల విషయం బహిర్గతమైంది. ఈ విగ్రహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై చనిపోతే.. ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని చెప్పుకొచ్చారు. ‘గతంలో నలుగురు హంతకులు అలిపోర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ పట్టుబట్టారు. వారిని విచారించగా.. నన్ను చంపేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లోకల్ లీడర్లే నన్ను హత్య చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నాకు జిల్లా ఎస్పీ ప్రవీణ్ త్రిపతి చెప్పారు. దీంతో నాకు ‘వై’ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురికావొచ్చు. నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను మర్చిపోవద్దు. అందుకే విగ్రహాలు తయారు చేయించా‘ అని ఎమ్మెల్యే నాస్కర్ అన్నారు. తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారంతం ఇంతకు ముందు ఇతర పార్టీలో ఉండేవారని చెప్పుకొచ్చారు. జయంత్కు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. -
ఆయతనం
ఆయతనం అంటే రూపం. ఆయతనం అనే మాటకు ఆలయం, గర్భగృహం అనే పేరు కూడా శాస్త్రంలో ఉంది. ఆయతనం అనే పదంతో మనకు బాగా పరిచయమైన పదం పంచాయతనం. ఆదిశంకరులు షణ్మతాలను స్థాపించి, పంచాయతన పూజను ఆచరించమని ప్రబోధించారు. నేటికీ ఈ పంచాయతన పూజను ఆచరించే వారెందరో ఉన్నారు. శివుడు, నారాయణుడు, గణేశుడు, సూర్యుడు, దేవి. వీరైదుగురు పంచాయతన దేవతలు. వీరిలో ఎవరికి ఇష్టమైన దేవతను మధ్యలో ఉంచి పూజిస్తే అది ఆ దేవతా పంచాయతనం అవుతుంది. ఉదాహరణకు శివుణ్ణి మధ్యలో ఉంచి ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు, నైఋతిలో వినాయకుడు, వాయువ్యంలో దేవి ఉంటే అది శివపంచాయతనం. ఇలా ఈ దేవతలు స్థానమార్పులతో పూజింపబడతారు.ఇది ఆత్మార్థంగా ఎవరికి వారు ఇంటిలో చేసుకునే పూజ. ఇదే పద్ధతిని అవలంబిస్తూ నిర్మించిన ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. వీటిలో గర్భగుడిలో బ్రహ్మస్థానం(మధ్య)లో.. ఆగ్నేయం మొదలైన నాలుగు మూలాల్లో ఆయా దేవతా విగ్రహాలు ఉంటాయి. అందరికీ పరిచయం అయిన పంచాయతనాలు ప్రాసాదమండనం.. మరికొన్ని చోట్ల కనిపిస్తే.. హయశీర్షసంహిత, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర పురాణాలలో పంచాయతన దేవతలు విభిన్నంగా కనిపిస్తారు. బ్రహ్మాయతనం, చండాయతనం, రామపంచాయతనం, కృష్ణపంచాయతనం వంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆంధ్రరాష్ట్రంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రమైన అన్నవరం విష్ణు పంచాయతన దేవాలయం. తమిళనాడు కంచి కామాక్షీదేవి ఆలయం దేవీపంచాయతన ఆలయం. ఒక ఆయతనం(గర్భగుడి) నిర్మిస్తే స్వర్గఫలం, మూడు ఆలయాలతో బ్రహ్మలోకప్రాప్తి, ఐదు ఆలయాలతో శివలోకం, ఎనిమిది ఆలయాలతో విష్ణులోకం, తొమ్మిది, పన్నెండు, పదహారు ఆలయాలను నిర్మిస్తే ఇహంలో సుఖం, పరంలో మోక్షం కలుగుతుందని కపింజల సంహిత చెప్పింది. ఇక్కడ ఆలయం అంటే గర్భగుడి అని అర్థం చేసుకోవాలి. సృష్టికి మూలమైన పంచభూతస్వరూపాలనుండి ఒక్కో అంశాన్ని తీసుకుని నిర్మించిన పంచాయతన దేవతల్నీ.. వారిని ప్రతిష్ఠించిన పంచాయతన దేవాలయాల్ని దర్శించడం..పూజించడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
స్తంభాలు.. సోపానాలు
ఆలయంలో ప్రవేశించిన భక్తునికి ధ్వజస్తంభం మాత్రమే కాకుండా ఇంకా అనేక స్తంభాలు కనిపిస్తాయి. వాటి గురించిన అవగాహన కూడా వారికి ఉండాలి. వాటిలో రాతితో నిర్మించి పైన దీపం ఏర్పాటు చేస్తే దాన్ని దీపస్తంభం అంటారు. ఉత్తరాది ఆలయాల్లో చెట్టుకు కొమ్మలున్నట్లు ఒక స్తంభానికి వందకు పైగా దీపాలను అమర్చే దీపస్తంభం ప్రతీ గుడిలో ఉంటుంది. విశేష పండుగలప్పుడు భక్తులు దీపాల్ని వెలిగిస్తారు. ఒక రాతిస్తంభం పైన చిన్న గూడు చేసి అందులో నంది ఉంచితే దాన్ని నందిస్తంభం అంటారు. ఇది ప్రతి శివాలయంలో ఉంటుంది. అలాగే విష్ణ్వాలయంలో రెండు చేతులూ జోడించి నిలుచున్న గరుడవిగ్రహం పైనగానీ స్తంభం మొదల్లో గానీ ఉంచితే దాన్ని గరుడస్తంభం అంటారు. ఇంకా శూలం వంటి ఆయుధాన్ని నాటి ఏర్పాటు చేసే శూలస్తంభం... పశువుల్ని మొక్కుకుని ఆలయానికి సమర్పించేప్పుడు వాటిని కట్టే యూపస్తంభం... రాజులు, చక్రవర్తులు విజయాన్ని సాధించి, రాజ్యాలను జయించినప్పుడు నాటే విజయస్తంభాలు. కొన్ని ఆలయాల్లో కనిపిస్తాయి. సింహాచలంలో కప్పస్తంభం... హంపిలోని సప్తస్వరస్తంభాలు... తిరుమలలోని వరాహ స్తంభం ఇలా చాలా స్తంభాలు విశేషమైనవి. జైన బసదుల్లో ఉండే స్తంభాన్ని మానస్తంభం అంటారు. అక్కడే ఉండే మరోస్తంభాన్ని బ్రహ్మస్తంభం అని కూడా పిలుస్తారు. ఈ స్తంభాలను దర్శించినా... తాకినా... వీటి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా...మొక్కుకున్నా... అనుకున్న పనులు నెరవేరుతాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సోపానాలు ఆలయం అంటే సాధారణంగా చాలా ఎత్తుగా... లేక ఎత్తైనప్రదేశంలోనే నిర్మిస్తారు. అలాంటి ఆలయాల్లో దైవదర్శనం చేసుకోవాలంటే మనకు మార్గం చూపేవి సోపానాలే. మెట్లే కదా అని మనం అనుకున్నా వాటివెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి ప్రత్యేకంగా పేర్లున్నాయి. ఆలయంలోకి వెళ్లేందుకు చాలా చోట్ల ముఖమండపం,రంగమండపం ద్వారా లోపలికి వెళ్లడానికి రెండువైపుల నుండీ మెట్లు ఉంటాయి. ఆ మెట్లను సోపానమాలా అంటారు. ఇందులో మొదటి మెట్టును అశ్వపాదం అనీ.. చివరి మెట్టును ఫలకం అని పిలుస్తారు. మెట్లకు అటూ ఇటూ పట్టుకోవడానికి ఆలంబనగా ఏనుగుతల.. తొండం.. ఉంటే దాన్ని హస్తిహస్తం అంటారు. రథచక్రాలన్ని అటూ ఇటూ నిర్మిస్తే రథాంగ సోపానమంటారు. మకరముఖాన్ని...లతా మండపాన్ని కూడా నిర్మిస్తారు. ఇలాంటి నిర్మాణాన్ని కుడ్యసోపానం అంటారు.కొన్నిచోట్ల మెట్లు ఉన్నా తడిమి చూస్తే తప్ప అక్కడ మెట్లున్నట్టు మనకు తెలియదు. ఉదాహరణకు అహోబిలం.. మేల్కోట వంటి గుహాలయాల్ని దర్శించినప్పుడు భక్తులు వీటిని గమనించవచ్చు. అక్కడ మెట్లు అంత స్పష్టంగా కనపడవు. వీటిని గుహ్య సోపానాలంటారు. ఇక రెండోరకమైనవి అగుహ్య సోపానాలు. మెట్లను గుర్తుపట్టే విధంగా ఉండే వీటిలో నాలుగు రకాలున్నాయి. ఎదురుగా.. కుడివైపు ఎడమవైపు ఇలా మూడు వైపులా ఎక్కే విధంగా ఉండే దాన్ని త్రిఖండాకార సోపానం అంటారు. పైన వెడల్పుగా ఉండి కిందికి దిగుతుండగా క్రమేపీ చిన్నదవుతూ ఉన్న మెట్లమార్గాన్ని శంఖమండలం అంటారు. సగం సున్నా వంటి మెట్లను అర్ధగోమూత్రం అనీ.. ఓ స్తంభానికి చుట్టూ మెట్లు ఏర్పరచి పైకెళ్లేలా ఉంటే దాన్ని వల్లీమండల సోపానాలంటారు. ఆలయాల్లో నిర్మించే మెట్లు సరిసంఖ్యలో ఉండాలని.. మానవ గృహాలకు మెట్లు బేసిసంఖ్యలో ఉండాలని నియమం. పైగా మెట్లు పిల్లలు.. వృద్ధులు.. మిగిలిన అందరూ ఎక్కి దిగడానికి ఇబ్బంది లేకుండా ఆరంగుళాల ఎత్తు మాత్రమే ఉండాలని శిల్పశాస్త్ర నియమం. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
పట్టువదలని విక్రమార్కుడు
సాక్షి, చెన్నై: పట్టువదలని విక్రమార్కుడిలా విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ప్రత్యేక అధికారి పొన్ మాణిక్య వేల్ ముందుకు సాగుతున్నారు. తనకు అప్పగించిన బాధ్యతల్లో ఏ మాత్రం తగ్గబోనని మరో మారు చాటుకున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న రెండు విగ్రహాలను భారత్కు తెప్పించేందుకు సిద్ధం అయ్యారు. తమిళ పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో చాకచక్యంగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆ విగ్రహాలను ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశారు. ‘పొన్ మాణిక్య వేల్’ఈ పేరు వింటే చాలువిగ్రహాల స్మగ్లర్ల గుండెల్లో దడ బయలు దేరుతుంది. విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఐజీగా ఆయన స్మగ్లర్లకు ముచ్చమటలు పట్టించారు. దేశ విదేశాల్లో ఉన్న విగ్రహాలను ఇక్కడికి రప్పించే దిశగా ముందుకు సాగారు. అందుకే పదవీ కాలం ముగిసినా, ఆయన్నే ప్రత్యేక అధికారిగా కోర్టు నియమించింది. ప్రత్యేక అధికారిగా ఆయన నియమితులైనా పాలకుల నుంచి సాయం మాత్రం కరువైంది. అయితే, తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనం తాజాగా, పాలకుల నుంచి సహకారం లేకపోవడంతో ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించి రూ.నాలుగు కోట్లు విలువగల రెండు విగ్రహాలను భారత్కు రప్పించడం విశేషం. ఆ్రస్టేలియా నుంచి.. తిరునల్వేలి జిల్లా వీరనల్లూరు సమీపంలో తిరువడై మరుదూర్ గ్రామం ఉంది. ఇక్కడ పాండ్య రాజుల హయంలో (600 ఏళ్ల క్రితం) మూంగీశ్వర ముడయార్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని రెండు ద్వార పాలకుల విగ్రహాలు 1995లో అపహరణకు గురయ్యాయి. ఈ కేసు విషయంలో పోలీసులు చేతులెత్తేయగా, పొన్ మాణిక్య వేల్ రహస్యంగా విచారణ చేపట్టి, ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో గుర్తించారు. స్మగ్లర్లు లక్ష్మి నరసింహన్, అశోకన్లు తన అనుచరుల ద్వారా ఇండో నేపాల్ ఆర్ట్ గ్యాలరీకి తరలించినట్టు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాలోని ఓ ప్రముఖ గ్యాలరీలో ఉంచినట్టు గుర్తించారు. ఈ విగ్రహాల విలువ రూ.4 కోట్ల 98 లక్షలు. ఈ విగ్రహాలు తమిళనాట చోరీ చేసి, ఆ్రస్టేలియాకు తరలించినట్లు ఆ గ్యాలరీకి హెచ్చరికలతో కూడిన లేఖను ఇటీవల పొన్ మాణిక్య వేల్ పంపించారు. ఆ గ్యాలరీ వర్గాలు స్పందించి, భారత్కు తీసుకెళ్లాలని సూచించినా, వాటిని ఇక్కడికి తీసుకు రావడంలో పాలకుల సహాకారం అన్నది పొన్ మాణిక్య వేల్కు కరువైంది. దీంతో వ్యూహాత్మకంగా, పట్టువదలని విక్రమార్కుడిలా మాణిక్య వేల్ వ్యవహరించారు. విదేశీ వ్యవహారాల శాఖ సాయంతో... తమిళనాడులో దోపిడికి గురైన విగ్రహాలు ఆ్రస్టేలియాలోని కొన్ని గ్యాలరీల్లో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేమని పేర్కొంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రెండు ద్వార పాలకులతో పాటుగా అక్కడున్న అన్ని విగ్రహాల విలువ, వాటి గురించిన పూర్తి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. ఇందులో రెండు విగ్రహాలను అప్పగించేందుకు సంబంధిత గ్యాలరీ ముందుకు వచ్చినా, ఇక్కడకు తీసుకు రాలేని పరిస్థితి ఉందని, సాయం అందించాలని కోరారు. దీంతో ఆ్రస్టేలియాలోని భారత రాయబార కార్యాలయ వర్గాల ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదింపులు జరిపాయి. దీంతో ఆ విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రధాని ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదికి అప్పగించేందుకు నిర్ణయించారు. జనవరిలో ఆ్రస్టేలియా నుంచి ఈ విగ్రహాలు ఢిల్లీకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించనున్నారు. అనంతరం ఈ విగ్రహాలను పొన్మాణిక్య వేల్ బృందం తిరునల్వేలిలోని ఆలయానికి చేర్చనున్నారు. ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. ఇక, ఆ్రస్టేలియాలో ఉన్న మిగిలిన విగ్రహాలు, సింగపూర్లో ఉన్న 16 విగ్రహాలను మరి కొన్ని నెలల్లో ఇక్కడికి తెప్పిస్తానని పొన్ మాణిక్య వేల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ముసుగుకు 8 ఏళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: రాజకీయ కారణాలతో ఆవిష్కరణలకు నోచుకోకుండా ముగ్గురు మహనీయుల విగ్రహాలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిపోయే వారికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పా టు చేసిన విగ్రహాలు ఇంకా అలాగే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, జీహెచ్ఎంసీ ఏర్పాటుతో పాటు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కారకుడైన స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించి విగ్రహాన్ని సిద్ధం చేశారు. అయితే ఆవిష్కరణ జరిగేలోగా రాజకీయ సమీకరణలు మారడంతో ఆవిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. వైఎస్ విగ్రహాన్ని అక్కడ ఉంచరాదనే తలంపుతో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను కూడా రాజకీయానికి వాడుకోవడంతో ముగ్గురు మహనీయుల విగ్రహాలు దిక్కూమొక్కూ లేకుండా,ఎవరికీ పట్టనట్లుగా మిగిలాయి. వివరాల్లోకి వెళితే. పాలకమండలి పట్టుపట్టి.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం గ్రేటర్కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అప్పటి కాంగ్రెస్ కార్పొరేటర్లు పట్టుబట్టి విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించారు. 2010 జులైలో వైఎస్సార్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్లో ఆయన వర్థంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించినప్పటికీ ఆలోగా పనులు పూర్తికాక పోవడంతో వీలుపడలేదు. విగ్రహం పూర్తయ్యాక ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతుండగా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఫ్లోర్లీడర్ నేతృత్వంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను వైఎస్ విగ్రహం కంటే తక్కువ ఎత్తువి తెచ్చి వైఎస్ విగ్రహానికి దిగువన ఉంచడంతో ఆవిష్కరణలు ఆగిపోయాయి. దీంతో మూడు విగ్రహాలను ముసుగులతో కప్పేశారు. ఆ తర్వాత అప్పటి మేయర్ బండ కార్తీకరెడ్డి వైఎస్ విగ్రహావిష్కరణకు ప్రయత్నించారు. ఎవరి గౌరవానికీ భంగం వాటిల్లకుండా ఉండేందుకు మూడు విగ్రహాలను జీహెచ్ఎంసీ ఆవరణలోనే వేర్వేరు చోట్ల ప్రతిష్టించాలని నిర్ణయించి స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందారు. రోజులు గడిచినా ఆచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత 2011లో వైఎస్సార్సీపీ ఆవిర్భవించడంతో నగరానికి చెందిన అప్పటి కాంగ్రెస్ మంత్రి సైతం అక్కడ విగ్రహం ఏర్పాటు చేయరాదని భావించినట్లు ఆరోపణలొచ్చాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో రాష్ట్రంలో, జీహెచ్ఎంసీ పాలకమండలిలో టీఆర్ఎస్ కొలువుదీరింది. ఈ నెల 2న వైఎస్ పదో వర్థంతి సందర్భంగానైనా ప్రభుత్వం ,జీహెచ్ఎంసీ పాలకమండలి తెరలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. టీడీపీ రాజకీయం.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ప్రవేశద్వారం ఎదుట వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించకుండా ఉండేందుకు అప్పటి టీడీపీ ఫ్లోర్లీడర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ల విగ్రహాలను తెప్పించడమే కాకుండా జగ్జీవన్రామ్, జ్యోతిరావుపూలే, ఎన్టీఆర్, ఒవైసీలవి కూడా ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఒవైసీ పేరు ప్రతిపాదించడంతో ఎంఐఎం మద్దతిస్తుందని భావించారు. అయితే ‘రాజకీయం’ అర్థం చేసుకున్న ఎంఐఎం నేతలు ఆ ఆలోచనను సున్నితంగానే తిరస్కరించారు. ముసుగు తొలగిస్తాం.. విగ్రహాల ముసుగు తొలగించేందుకు ప్రయత్నిస్తాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, అందరి ఆమోదంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం . –బొంతు రామ్మోహన్, మేయర్ ఇంకా జాప్యం తగదు మహానేతల విగ్రహాలను ఏళ్లతరబడి ఆవిష్కరించకుండా ఉంచడం తగదు. విగ్రహాల ఎత్తు, తదితర కారణాల వల్ల మూడూ ఒకే చోట కాకుండా వేర్వేరుస్థలాల్లో ఉంచి ఆవిష్కరించవచ్చు. – బండ కార్తీకరెడ్డి , మాజీ మేయర్ -
దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు వెనుక..
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల తొలగింపు వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లు బీచ్ రోడ్లోని విగ్రహాలను సోమవారం అర్ధరాత్రి సమయంలో తొలగించారన్నారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా ఈ విధంగా చేయడం దారుణమన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను ఎన్నికల సమయంలో కలవడం, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు ఈ కుట్రకు పూనుకొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొడుకుల మీద కోపంతో వారి తండ్రుల విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. అలాగే రాజన్న రాజ్యం రాబోతోందని, వైఎస్సార్ ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాధాన్యం పెరిగిందని.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను చెప్పానన్నారు. దీంతో చంద్రబాబు తనపైనా కోపం పెట్టుకొన్నాడని.. అందుకే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను కూల్చివేయించాడని మండిపడ్డారు. బీచ్ రోడ్లో సినారే, అల్లు రామలింగయ్య, జాలాది, నేదునూరి కృష్ణమూర్తి, తిరుపతి వేంకట కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ తదితర విగ్రహాలు ఉన్నాయన్నారు. వాటికి కూడా ఎలాంటి అనుమతుల్లేవన్నారు. వాటిలో ఐదు విగ్రహాలను తానే ఏర్పాటు చేశానని చెప్పారు. వాటిన్నిటినీ వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేయాల్సి వచ్చిందో చెప్పాలని యార్లగడ్డ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలన్నారు. కాగా, విగ్రహాల ఏర్పాటుపై న్యాయస్థానం ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చినట్లు యార్లగడ్డ తెలిపారు. -
పాహిమాం సుబ్రహ్మణ్యేశ్వరా
ప్రపంచంలో ఎత్తయిన సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహాలు రెండున్నాయి. వాటిలో మొదటిది మలేషియాలో 140 అడుగుల ఎత్తులో స్వామివారి విగ్రహం రూపుదిద్దుకుంది. మరలా భారతదేశంలో అంతటిస్థాయిలో 60 అడుగుల విగ్రహాన్ని విజయనగరంలోనే నెలకొల్పడం విశేషం. ఈ అద్భుత కట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉత్తరాంధ్ర నుంచే కాక ఒడిశా, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ స్వామివారితోపాటు వినాయకుడు, మహాశివుడు, మానసాదేవి, లక్ష్మీదేవి విగ్రహాలూ కొలువై ఉన్నాయి. ఇటీవలే సరస్వతీదేవీ, రాహుకేతు విగ్రహాలను నెలకొల్పారు.శత్రు, రోగ, రుణబాధ నివారణ కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి. ప్రతి మనిషి ఈ మూడు సమస్యలతోనే ఎక్కువగా సతమతమవుతూ ఉంటాడు. వీటిని ఏకకాలంలో నివారించగలిగే దేవునిగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు కొలుస్తారు. ఆయనకు ముడుపు కట్టి మొక్కితే సకలరోగాలు పటాపంచలై అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం. ఆలయ విశిష్టత... పట్టణశివారు పూల్బాగ్ లక్ష్మీగణపతి కాలనీలో శ్రీశ్రీశ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. 1990కి ముందు ఆలయ ప్రదేశంలో పెద్ద పుట్ట ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతమంతా అభివృద్దికి నోచుకోలేదు. కేవలం నాగుల చవితి నాడు మాత్రమే పుట్టకు పూజలు చేసేవారు. అక్కడ పెద్ద నాగసర్పం ఉండేదని పరిసర ప్రాంతవాసులు చెబుతుంటారు. అప్పటి వరకూ కొత్తపేట నీళ్ల ట్యాంక్ వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేసిన కర్రి వెంకటరమణ సిద్ధాంతి కలలో ఈ ప్రాంతమంతా కనిపించింది. అక్కడ తనకు ఆలయం నిర్మించమని స్వామి చెప్పడంతో మరుసటిరోజున అక్కడికి వెళ్లిన సిద్ధాంతికి పెద్ద పుట్ట దర్శనమిచ్చింది. దీంతో ఆ ప్రాంతాన్ని దాతల సహాయంతో కొనుగోలు చేసి పుట్టను పరిశీలించగా అందులో దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. కలలో కనిపించిన స్వామివారి విగ్రహాలు .. పుట్ట మడిలో నుంచి వెలిసిన విగ్రహాలు ఒకటే కావడంతో సిద్దాంతి కొందరి సహాయంతో ఆ ప్రాంతంలో ఆలయాన్ని కట్టించారు. ఆలయంలో నిత్యారాధనలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏడాది జరిగే పూజలు... నిత్యపూజలతోపాటూ ప్రతినెలా మాస శివరాత్రినాడు రుద్రాభిషేకాలు, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జన్మదిన తిథి షష్టి. ప్రతి నెలా రెండు షష్టి తిధులలో స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. జ్యేష్ఠమాసంలో నాగదేవత మానసాదేవికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర షష్టితిథి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఐదురోజుల పాటూ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సకల దోషాలకు నివారణ ... జాతకరీత్యా, కుజ, శని, రాహు, కేతు దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు పరిహారమవుతాయి. ఆలస్యవివాహాలు, కుటుంబ కలతలు, దాంపత్య అనుకూలత లేకపోవడం, సంతానం లేనివారు, ఉన్న సంతానం సక్రమంగా ఉండాలనుకునేవారు, ఉద్యోగం లేనివారు, ఉద్యోగ సంబంధ సమస్యలు, ఉద్యోగ ప్రమోషన్లకు స్వామివారికి మొక్కుతారు. వృత్తి, వ్యాపార వ్యవహార అనుకూలతకు, కుటుంబ వృద్ది, గృహ సౌఖ్యం, రాజకీయ అభివృద్ధికి స్వామివారికి పూజలు చేయిస్తుంటారు. విద్యార్ధులకు విద్యాభివృద్ధికి, శత్రువుల నుంచి రక్షణకు, రుణ విమోచనకు, శరీర అనారోగ్య నివారణ, జాతకరీత్యా, నవగ్రహ దోష నివారణకు స్వామివారి పూజలు నిర్వహించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగిస్తుంటారని భక్తుల ప్రగాడ విశ్వాసం. బోణం గణేష్, విజయనగరం. ఇన్పుట్స్: – కంది గౌరీశంకర్, విజయనగరం టౌన్. స్వామి అనుగ్రహంతోనే... ‘‘ఎందరో భక్తులు తమ కష్టాలను ఇక్కడకు వచ్చి స్వామికి చెప్పుకుంటారు. వారి కష్టాలు తీరిన తర్వాత మరలా ఇక్కడకు వచ్చి విశేషపూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్ల కోసం కృషిచేస్తున్నాం. స్వామి అనుగ్రహంతోనే ఇవన్నీ సాధ్యపడుతున్నాయి.’’కర్రి వెంకటరమణ సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపకులు, స్వామి ఉపాసకులు, వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, విజయనగరం. -
ఈ గైడ్ ఫీజ్ అడగడు
ఈ రోజుల్లో కుర్రాళ్లు సెల్ఫోన్లలో కూరుకుపోయి చాటింగ్లలో చతికిలపడుతుంటే పకిడే అరవింద్ మాత్రం తెలంగాణా అంతా చారిత్రక ప్రాంతాలను గాలిస్తూ, వాటి గొప్పతనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. పురావస్తు శాఖకు తెలియని విశేషాలు కూడా అరవింద్కు తెలుసు అంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంzచనపల్లికి చెందిన పకిడే అరవింద్ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అరవింద్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కాలేజిలో ఇంటర్ మీడియట్, డిగ్రీ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జర్నలిజం పూర్తి చేశాడు.అరవింద్కు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అందులోనూ చరిత్ర పుస్తకాలంటే ప్రాణం. పుస్తకంలో చదివిన ప్రదేశాలకు వెళ్లి, అక్కడి చరిత్రను స్వయంగా తెలుసుకోవాలని కోరిక. తలిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతని కోరికలోని నిజాయితీని గుర్తించి ప్రోత్సహించడం మొదలు పెట్టారు. గూగుల్ మ్యాప్ ద్వారా వివిధ చారిత్రక ప్రదేశాలను గుర్తించి దానిని ఆఫ్లైన్లో సేవ్ చేసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఆరంభించాడు. అంతవరకే అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదేమో, తన పరిశోధనల్లో భాగంగా అరవింద్ ఇటీవల దట్టమైన అడవుల్లో ముళ్లపొదల మధ్య కనుమరుగవుతున్న పురాతన విగ్రహాలను వెలికి తీశాడు. పురావస్తు శాఖ శోధించని అనేక ప్రాంతాలను గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చాడు. అంతేకాదు, వివిధ ప్రదేశాల చారిత్రక అంశాలను డాక్యుమెంటేషన్ చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. దాంతో తాను కనుగొన్న వాటిని సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. కాకతీయుల కట్టడాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు! పరిశోధనలో భాగంగా అరవింద్ అనేక ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించాడు. విలువైన సమాచారాన్ని సేకరించాడు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చరిత్రను తెలుసుకున్నాడు. చరిత్రను సోషల్మీడియా ద్వారా తెలియ చెబుతుండటంతో ఇతర దేశాలకు చెందిన చరిత్ర పరిశోధకులు కూడా రావడం మొదలు పెట్టారు. ఇలా దాదాపు 10 దేశాల నుంచి చరిత్ర పరిశోధకులు వచ్చారు. ఈ క్రమంలో అరవింద్కు పలువురు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తన పరిశోధనలో భాగంగా అరవింద్ సుమారు 750 పురాతనకట్టడాలు, చారిత్రక ప్రదేశాలను గుర్తించాడు. వాటిలో కాకతీయుల కట్టడలు అధికం. వీటిపై గతంలో వెలువడిన పుస్తకాలను సేకరించాడు. వ్యాసాల ద్వారా వచ్చే డబ్బుతో... తనకు తెలిసిన చరిత్రను అందరికి చాటి చెప్పేందుకు ప్రైవేట్ వెబ్సైట్లు, పత్రికలు, సోషల్ మీడియాను వినియోగించుకున్నాడు. ప్రైవేట్ వెబ్సైట్లకు వ్యాసాలు రాయడం ద్వారా వచ్చే డబ్బును కూడా పురాతన కట్టడాలకు వెళ్ళి పరిశీలించడానికి వెచ్చిస్తున్నాడు. ఫోటో ఎగ్జిబిషన్ అరవింద్ సందర్శించిన పురాతన కట్టడాలు, ఆలయాలను ఫోటోల రూపంలో బంధించారు. ఇప్పటివరకు 30 వేల ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలలో ఎవరికీ తెలియని కట్టడాలు, దేవాలయాల ఫోటోలను ఎంపిక చేసుకున్నాడు. వాటిని ఇటీవల హైదారాబాద్లోని రవీంద్ర భారతిలో అన్టోల్డ్ తెలంగాణ పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ను ఐదు రోజులపాటు నిర్వహించారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఫోటోలతో పాటు దాని చరిత్రను రాసి బుక్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్ రూరల్ ఫోటోలు: పెద్దపెల్లి వరప్రసాద్ పురాతన కట్టడాలు, దేవాలయాలు ఎక్కడ ఉన్నా వెళ్ళి దాని చరిత్ర తెలుసుకోవడం ఇష్టం. పుస్తకాలలో ఉన్నవే చరిత్ర కాదు, అంతకు మించిన చరిత్ర తెలంగాణ గడ్డపైన ఉంది. ఒక్క కొత్త విషయం తెలుసుకుని ప్రపంచానికి చాటి చెబితే ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. 32 కిలో మీటర్ల గుట్టను సైతం ఎక్కి అక్కడికి వెళ్ళి చరిత్రను తెలుసుకుని వచ్చాను. రెండు సంవత్సరాలు కష్టపడి కాకతీయుల వంశీయులను సైతం కలిశాను. ప్రభుత్వం సాయం చేస్తే నేను మరింత లోతుగా పరిశోధిస్తాను. – అరవింద్, యువ చరిత్రకారుడు -
సకలాభీష్టాలను తీర్చే పూరీ జగన్నాథస్వామి
భారతదేశంలోని నలువైపులా నెలకొని ఉన్న చతుర్ధామక్షేత్రాలలో ఒరిస్సారాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో గల జగన్నాథస్వామి ఆలయం చాలా విశిష్టమైనది. ఈ స్వామికే పురుషోత్తముడని మరో పేరు. ఇక్కడ స్వామి దారుబింబంగా అంటే కొయ్య విగ్రహరూపంలో బలభద్రుడు, సుభద్ర, సుదర్శన మూర్తులతో కలిసి ఏకపీఠంపై దర్శనమిస్తాడు.ప్రతి పన్నెండు లేక పంతొమ్మిది సంవత్సరాలకోసారి ఈ విగ్రహాలను విడిచిపెట్టి (భూస్థాపన చేసి) నూతన మూర్తులను సిద్ధం చేస్తారు. దీనినే నవకళేబర ఉత్సవం అంటారు. నూతన ప్రతిమలను తయారు చేసేటప్పుడు ఆ కొయ్యలకు ఔషధీగుణాలున్న అనేక లేపనాలు చేస్తారు. చందనం, కర్పూరం, కస్తూరి, ఎర్రచందనం, ఎర్రటి బట్ట మొదలైన వాటిని విగ్రహం చుట్టూ అనేక సార్లు చుట్టటం జరుగుతుంది. గర్భగుడిలో రత్నవేదికపై నాలుగు విగ్రహాలతోపాటు లక్ష్మీదేవి లోహవిగ్రహం జగన్నాథస్వామికి కుడివైపు, విశ్వధాత్రి అని పిలిచే భూదేవి విగ్రహం ఎడమవైపు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాటి రథయాత్ర, జ్యేష్ట పూర్ణిమ నాటి స్నానయాత్ర చాలా విశిష్టమైనవి. జగన్నాథ స్వామి దర్శనం సకల కష్టాలనూ దూరం చేసి సకలాభీష్టాలనూ తీరుస్తుంది. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
అద్భుత శిల్పాల నెలవు
సాక్షి, హైదరాబాద్: అక్కడి శిల్పాలు చరిత్రను కళ్లకు కదలాడేలా చేస్తాయి. నాటి జీవన విధానాన్ని గుర్తుకు తెస్తాయి. శిల్పులు చెక్కిన కళారూపాలు ఔరా! అనిపిస్తాయి. సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఇలా ఎలా చెక్కారబ్బా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఇలాంటి శిల్పాలు చూడాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకకు వెళ్లాల్సిందే. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉన్న జైన దేవాలయానికి కొలనుపాక ప్రసిద్ధి. దక్షిణ భారత్లోని ప్రముఖ జైన కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి మ్యూజియంలో అరుదైన 1.5 మీటర్ల ఎత్తున్న మహావీరుడి విగ్రహం ఉంది. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల రెండవ రాజధానిగా కొలనుపాక ఉండేది. ఆ కాలంలో ఈ గ్రామం జైనుల మత కేంద్రంగా వర్ధిల్లింది. ఇక్కడ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పురాతన సంస్కృతి, వారసత్వాన్ని తెలుసుకోవాలని అనుకునే వారికి అద్భుత మ్యూజియం ఇది. వెయ్యి సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న స్మారక శిలలు లేదా వీరగల్లులుగా పిలిచే విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. హిందూ, జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, ఇతర వస్తువులున్నాయి. 6 నుంచి 16వ శతాబ్దాల కాలం నాటి మహావీర, మత్స్యవల్లభ, చాముండి, నంది లాంటి ముఖ్య శిల్పాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ శిల్పాలతో ఒక గ్యాలరీని ఏర్పాటు చేసింది. ఇందులో కొలనుపాకలోని వివిధ చారిత్రక కట్టడాల నుంచి, సమీప గ్రామాల నుంచి సేకరించిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు. చాళుక్య, కాకతీయ శైలికి సంబంధించిన 100కుపైగా శిల్పాలు కనిపిస్తాయి. ముఖ్యమైన విగ్రహాలు... క్రీ.శ.1076–1127 మధ్య కాలంలో కొలనుపాకని పరిపాలించిన త్రిభువనమల్ల రాజు వేయించిన విజయ స్తంభం. దీనికి నాలుగు వైపులా శాసనం ఉండటం విశేషం. చాళుక్యుల కాలం నాటి వినాయక, నటరాజ విగ్రహాలు, కళ్యాణి చాళుక్యుల కాలం నాటి వీరగల్లు, మహిషాసురమర్ధిని విగ్రహాలు, కాకతీయుల కాలం నాటి చాముండి విగ్రహం, నంది, వజ్రపాణి విగ్రహం, విజయ నగర కాలం నాటి కోదండ రామస్వామి విగ్రహం చూడొచ్చు. చాళుక్యుల కాలం నాటి మహావీరుని విగ్రహం యోగముద్రలో ఉంటుంది. ఎలా చేరుకోవాలి? హైదరాబాద్ నుంచి కొలనుపాక 79 కిలో మీటర్లు పర్యాటకులు హైదరాబాద్ నుంచి బస్సు లేదా రైలులో ఆలేరు వరకుచేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. మ్యూజియం ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి శుక్రవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది. ప్రవేశం ఉచితం. -
ఎట్టకేలకు పంచలోహ విగ్రహాలకు విముక్తి
గోపవరం : కారణాలు ఏవైనా గత 40 సంవత్సరాలుగా మాజీ ధర్మకర్త ఇంట్లో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలకు విముక్తి లభించింది. పంచలోహ విగ్రహాలకు సంబంధించి సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మండలంలోని రాచాయపేటలో వెలసి ఉన్న పురాతన సోమేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలైన పార్వతి, ఈశ్వరుడు, నాగపడిగ, ఇతర పూజా సామాగ్రిని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బద్వేలు ఇన్ఛార్జి ఈఓ వెంకటరమణారెడ్డి, సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలు గత 40 ఏళ్లుగా మాజీ ధర్మకర్త ఇంట్లో ఉన్నట్లు గ్రామస్తులకు గాని సంబం«ధితశాఖ అధికారులకు గాని సమాచారం లేదు. అసలు పంచలోహ విగ్రహాలు ఉన్నాయన్న విషయం కూడా గ్రామస్తులకు తెలియదు. పార్వతి, ఈశ్వరుడు, నాగపడిగ వీటి విలువ రూ.70 లక్షలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. ఇటీవల మాజీ ధర్మకర్త భార్య అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు బీరువా తెరువగా అందులో పంచలోహ విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు ఆశ్చర్యానికి గురై ఆగమేఘాల మీద సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేసి విగ్రహాలను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అయితే ఇంత విలువైన విగ్రహాలు ఆలయానికి ఉన్నట్లు దేవాదాయశాఖ రికార్డుల్లో లేవు. కేవలం భూములు ఉన్నట్లు మాత్రమే రికార్డుల్లో పొందుపరిచారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక అధికారులు విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు వెనకడుగు వేశారు. అయితే విగ్రహాలను స్వాధీనం చేసుకునే అంశంపై స్థానిక అధికారులపై మాజీ ధర్మకర్త కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు దేవాదాయశాఖ కమిషనర్ విగ్రహాలను స్వాధీనం చేసుకుని భద్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో బుధవారం రెవెన్యూ, పోలీసులు, గ్రామస్తుల సమక్షంలో పంచలోహ విగ్రహాలకు పంచనామా నిర్వహించి దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలను బద్వేలు గోవిందయ్యమఠంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో భద్రపరిచారు. విగ్రహాల వివరాలు, పంచనామా నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఈఓ తెలిపారు. పంచనామాలో గోపవరం డిప్యూటీ తహసీల్దారు మధురవాణి, బద్వేలు రూరల్ ఎస్ఐ హేమాద్రి, వీఆర్ఓలు జగదీశ్వర్రెడ్డి, నరసింహులు, జెడ్పీటీసీ రమణయ్య, మాజీ ధర్మకర్త రాజగోపాల్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గణపతి బప్పా మోరియా..
మహబూబాబాద్ రూరల్: భక్తుల విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉత్సవ మండళ్లు ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథులు కొలువుదీరారు. మానుకోట జిల్లాగా మారిన తర్వాత రెండోసారి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,160 వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు మండపాల్లో గణపతి విగ్రహాలను ఆకట్టుకునేలా సెట్టింగులు వేశారు. 6వ వార్డులో కౌన్సిలర్ గుండా స్వప్న పోతురాజు ఆధ్వర్యంలో 10 అడుగులు మట్టి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చాలామంది భక్తులు మట్టి వినాయక విగ్రహాలను ఏ ర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల పీవోపీ విగ్రహాలను కొలువుదీర్చి పూజలు చేశారు. గణపతి నవరాత్రులు ఈనెల 21 వ తేదీ వరకు జరగనున్నాయి. 22వ తేదీ న గణేషుడి నిమజ్జనం చేయనున్నారు. జీఎస్టీ ప్రభావం.. వినాయకుడి విగ్రహాల ఏర్పాటు విషయంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు జీఎస్టీ ప్రభావంతో తక్కువగా ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ పట్టణంలో గత ఏడాది 187 విగ్రహాలను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 150కు తగ్గడమే ఇందుకు ఉదాహరణ. కాగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీలు ఆంగోత్ నరేష్కుమార్, జి.మదన్లాల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత పోలీస్ బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. -
ముద్ద బొమ్మ... ముద్దుగుమ్మ
మనకు తెలిసిన తారలను చెక్కిన జక్కన్నలు ఎందరో. శక్తి చాలా విశాలమైనది. విస్తరించి ఉంటుంది. ఇందుగలదు అందులేదనే సందేహము వలదు. శిల్పంలో దైవత్వాన్ని, మాతృత్వాన్ని, దివ్యత్వాన్ని మనిషి చూసుకుంటూనే ఉంటాడు. మరి దేవుడు చేసిన బొమ్మలకు మనుషులు చేసిన బొమ్మలకు తేడా చెప్పగలరా ?మన తారలకే నచ్చిన తారలు ఈ మైనపు బొమ్మలు. కదలలేవు.. మెదలలేవు.. పెదవి విప్పి పలుకలేవు. కానీ కదిలించగలవు.. మది నింపగలవు.. కనులు కలిపి మైమరిపించగలవు. సినిమా తారలు అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంటారు. తమ రూపాన్ని వారి మనసుల్లో ముద్ర వేసుకుంటారు. అయితే ఆ రూపం కంటికి కనిపించదు. కంటికి కనిపించే విధంగా దేశవాళీ అభిమానులు కొందరు తమ అభిమాన తారల ఫొటోలను, పోస్టర్లను గోడలకు అంటించుకుంటారు. నోటు పుస్తకాలకు అట్టలుగా వేసుకుంటారు. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఈ అభిమానాన్ని శాశ్వతం చేయగలిగితే? జనం అభిమానించే నాయకులని, ఆటగాళ్లని, సినిమా తారలని.. ఇలాంటి సెలబ్రిటీలని ఒకచోట చేర్చి ఆ ఘనతను శాశ్వతం చేయగలిగితే? ఈ ఆలోచనకు రూపం ఇచ్చి దానినొక టూరిజం విశేషంగా మార్చినది లండన్లో ఉన్న ‘మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం’. ప్రపంచ ప్రముఖులు తమ నిజరూపంతో నిలబడి ఉన్నారా అన్నట్టుగా మైనపు విగ్రహాలను చేసి ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. ఆ గొప్పవాళ్లను నిజజీవితంలో కలవలేని వారు ఈ విగ్రహాలతో ఫొటో దిగి, నిజంగానే వారిని కలిసినట్టుగా థ్రిల్ అవుతారు. అమెరికన్లు, యూరోపియన్లు, బ్రిటిషర్లు ఎక్కువగా చోటు సంపాదించుకున్న ఈ మ్యూజియంలో మొదటగా చోటు చేసుకున్న భారతీయుడు మహాత్మాగాంధీ. ఆ తర్వాత ఆ ఘనత అమితాబ్ బచ్చన్కు దక్కింది. మేడమ్ తుస్సాడ్స్కు వస్తున్న విశేష స్పందన చూసి ప్రపంచంలోని అనేక చోట్ల తుస్సాడ్స్ మ్యూజియంలు స్థాపించారు. హాంకాంగ్లో, ఢిల్లీలో ఉన్న బ్రాంచీలు కొత్త విగ్రహాలకు చోటు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనపు బొమ్మగా మారనున్న సెలబ్రిటీల సంఖ్య కూడా పెరిగింది. వాళ్ల వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ ఫిల్మ్ స్టార్స్లో లండన్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న మొదటి సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. ఆసియాలోనే మొదటి ఫిల్మ్ స్టార్ కూడా అమితాబే కావడం విశేషం. 2000లో అమితాబ్ విగ్రహాన్ని మేడమ్ తుస్సాడ్స్లో ప్రతిష్టించారు. కేవలం లండన్లోనే కాదు న్యూ యార్క్ (2009), హాంగ్కాంగ్ (2011) వాషింగ్టన్ డీసీ (2012), ఢిల్లీ (2017 )లలోని తుస్సాడ్స్ మ్యూజియంలలో చోటు సంపాదించుకున్నారు ఆయన. ఆ తర్వాత ఆ ఘనతను పొందినది ఆయన కోడలు, అందాల తార ఐశ్వర్యా రాయ్ కావడం మరో విశేషం. 2003లో ఐష్ మైనపు బొమ్మను తుస్సాడ్స్లో ఏర్పాటు చేశారు. మోడ్రన్ డ్రెస్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి ఐష్ పెళ్ళి తర్వాత చీరను చుట్టారట. ఆ తర్వాత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చేత క్రికెట్ బ్యాట్తో ఆ మ్యూజియంలో కొలువు తీరారు. ఆ వరుసలో తర్వాతి పేరు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ది కావడంలో వింత లేదు కదా. షారుక్ సొట్టబుగ్గలకు బాలీవుడ్ మాత్రమే కాదు అనేక దేశాలలోని ఫ్యాన్స్ ఫ్లాట్ అయ్యారు. ఇంత అభిమానం పొందిన స్టార్ను వెంటనే తుస్సాడ్స్లో నిలబెట్టాలి అని నిశ్చయించుకున్నారు నిర్వాహకులు. అలా తన సిగ్నేచర్ డింఫుల్స్తో బ్లాక్ సూట్ వేసుకున్న షారుక్ మైనపు బొమ్మ 2007లో అక్కడ సందడి చేసింది. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్, హాంగ్కాంగ్, న్యూయార్క్, వాషింగ్టన్ లోను ఖాన్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక కండల వీరుడు సల్మాన్ఖాన్ మైనపు బొమ్మ 2013లో లండన్ తుస్సాడ్స్లో ప్రతిష్టితమైంది. బ్లాక్ బనియన్ మీద కోటు వేసుకుంటున్న పోజుతో సల్మాన్ బొమ్మ అక్కడ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ హోస్ట్గా నటించిన అనిల్ కపూర్ ఆ గెటప్లోనే మైనపు విగ్రహాన్ని సంపాదించారు. సింగపూర్లోని తుస్సాడ్స్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మేడమ్ తుస్సాడ్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఎవరు ఫేమ్లోకి వస్తున్నారో గమనిస్తూ ఉంటారు. ‘కహోనా ప్యార్ హై’తో సంచలనం సృష్టించిన హృతిక్ రోషన్కు ఉన్న అభిమానుల సంఖ్య అతడి విగ్రహాన్ని తుస్సాడ్స్లో నిలబెట్టేలా చేసింది. ‘ధూమ్ 2’ గెటప్తో హృతిక్ బొమ్మను లండన్ తుస్సాడ్స్లో పొందుపరిచారు. మ్యూజియంలో ఎక్కువసార్లు ముద్దులకు నోచుకున్న బొమ్మ గా హృతిక్ బొమ్మ రికార్డ్ సాధించింది. ఇంకా మాధురీ దీక్షిత్, కాజోల్, కరీనా కపూర్ వంటి పలువురు తారలు తుస్సాడ్స్లో ప్లేస్ సంపాదించా రు. ఇటీవల తుస్సాడ్స్లో వరుణ్ ధావన్, దిల్జిత్ జోషీ వంటి స్టార్స్ బొమ్మలను పొందుపరిచారు. ముందు ప్రభాస్.. తర్వాత మహేశ్ ‘బాహుబలి’ వంటి భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఇండియన్, ఇంటర్నేషనల్ అభిమానుల్లో కూడా క్రేజ్ సంపాదించారు ప్రభాస్. ఆ పాపులారిటీతోనే మేడమ్ తుస్సాడ్స్లో మైనంగా మారే అవకాశం పొందారు. విశేషం ఏంటంటే ఇలా మైనపు విగ్రహం సంపాదించిన తొలి సౌత్ హీరో ప్రభాసే. తనకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ గెటప్తోనే బ్యాంకాక్లోని మేడమ్ తుస్సాడ్స్లో దర్శనమిస్తున్నారు ప్రభాస్. ఆ తర్వాత మహేశ్ బాబు ఈ లిస్ట్లోకి చేరారు. మహేశ్ మైనపు బొమ్మ ఎలా ఉంటుందో చిన్న టీజర్ చూపించారు తుస్సాడ్స్ టీమ్. ఆయన ముఖానికి శిల్పి ఇవాన్ రీస్ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బొమ్మను మరికొన్ని రోజుల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. తుస్సాడ్స్ క్లబ్లో ఇంకా... ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’ వంటి చిత్రాలను అందించిన కరణ్ జోహర్ కూడా తుస్సాడ్స్లో మైనపు బొమ్మగా మారనున్నారు. దర్శకుల్లో ఈ ఘనత సాధించినది కరణ్ జోహరే. రీసెంట్గా దీపికా పదుకోన్ కూడా ఈ మ్యూజియంలో జాయిన్ అయ్యారు. అయితే బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య కాకుండా డైరెక్ట్గా ‘ఏ లిస్ట్ సెలబ్రిటీస్’ మధ్య ఈమె మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారట. అంటే ఏంజిలినా జోలీ, బ్రాడ్ పిట్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్తో పాటుగా నిలబడనున్నారు. ఏమైనా పిండికొద్దీ రొట్టె ఖ్యాతి కొద్దీ బొమ్మ. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది ఎలా చేస్తారు? మైనపు విగ్రహం కచ్చితంగా ఉండటం కోసం సుమారు 300 ఫొటోలు తీసుకుంటారట. 200 కొలతలు తీసుకుంటారని సమాచారం. కొలతలు తీసుకోలేని పాతతరం సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు గంటల కొద్దీ వీక్షించి మైనపు బొమ్మను తయారు చేస్తారట. బొమ్మ తయారు చేయడానికి తీసుకున్న కొలతలను మ్యూజియం బృందం ఎప్పడూ బయటకు రానివ్వరు. తయారు చేసే ముందే విగ్రహాన్ని ఓ రెండు మూడు అంగుళాలు పెద్దదిగా తయారు చేస్తారు. ఎందుకంటే మైనంకు కుంచించుకుపోగల గుణం ఉంది కాబట్టి. అలాగే సెలబ్రిటీలు వాడే సేమ్ కాస్ట్యూమ్స్, వస్తువులను బొమ్మతో జత చేసి రియలిస్టిక్ లుక్ను తీసుకువస్తారు. మేడమ్ తుస్సాడ్ ఎవరంటే? మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం వ్యవస్థాపకురాలు మేరీ తుస్సాడ్. మేరీ వాళ్ల అమ్మ డా. ఫిలిప్పీ కూర్సియస్ దగ్గర పని చేసేవారు. మేరీకి కూర్సియస్ మైనపు బొమ్మలు తయారు చేసే కళను నేర్పించారు. అలా చిన్నప్పటి నుంచే మైనపు బొమ్మలను తయారు చేయడం పట్ల ఆసక్తి ఏర్పరుచుకున్నారు ఆమె. 17 ఏళ్లకే తన తొలి మైనపు బొమ్మను తయారు చేసుకున్నారు. కింగ్ లూయిస్కు ఆర్ట్ ట్యూటర్గా పని చేశారు మేరీ. ఫ్రెంచ్ విప్లవం కారణంగా ఆమెను జైల్లో బంధించారు. జైలు నుంచి రిలీజయ్యాక ఫ్రాంకోయిస్ తుస్సాడ్ను పెళ్లాడి మేరీ తుస్సాడ్ అయ్యారామె. 1761లో ఫ్రాన్స్లో పుట్టిన ఆమె 1835లో లండన్లో స్థిరపడి ఓ మ్యూజియం స్థాపించారు. అదే క్రమేణా ‘మేడమ్ తుస్సాడ్స్’ మ్యూజియం అయింది. అందులో ఆమె తయారు చేసిన బొమ్మలను చూడొచ్చు. 1925లో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని బొమ్మలు ధ్వంసం అయ్యాయి. 1842లో తన సొంత ప్రతిమను తయారు చేసుకున్నారు మేరీ తుస్సాడ్. ఇప్పుడు అదే బొమ్మ మ్యూజియంలోకి వెళ్తుంటే మనల్ని పలకరిస్తుంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలువురి ప్రముఖుల మైనపు బొమ్మలు దర్శనమిస్తుంటాయి. -
రాతిని శిలగా మార్చి..
మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురువిశ్వసిస్తున్నారు. అయితే దేవుడి రూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనం కొలిచే దేవుడు ఇలాగే ఉంటాడు అని నిర్ధిష్టమైనప్రమాణాలు ఏవీ లేనప్పటికీ.. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాడు రామ్మూర్తి. అతని ఉలి దెబ్బకు ఎలాంటి రాయి అయినా దేవతా రూపం దాల్చి తీరుతోంది. శిల్ప కళతో పాటు వడ్రంగి పనిలోనూ ప్రత్యేకతనుచాటుకుంటున్న రామ్మూర్తి గురించి తెలుసుకోవాలంటే చంద్రగిరి గ్రామానికివెళ్లి తీరాల్సిందే. బొమ్మనహాళ్ : రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని చంద్రగిరి గ్రామానికి చెందిన రామ్మూర్తి ఆచారి.. రాతితో శిల్పాలు చెక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాతితో దేవతా ప్రతిమలు చేయడంలోనే కాదు చెక్కతో రథాలు, బొమ్మలు చేయడంలోనూ మంచి నైపుణ్యాన్ని కనబరుస్తూ మరి కొందరికి ఉపాధిని అందిస్తున్నారు. చిన్నప్పటి సాధనే.. రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి ఎక్కువ. ఇంటర్మీడియట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరమయ్యాడు. అప్పటి వరకు చిత్రకళపై ఉన్న మక్కువను చెక్కతో బొమ్మలు తయారు చేయడంపై మళ్లించాడు. అనంతరం రాతితో విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించాడు. తొలిదశలో రాతిని శిల్పంగా మార్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంటి వద్దనే ఉంటూ అదే పనిగా సాధన చేయడంతో తిరుగులేని నైపుణ్యాన్ని అతను సంపాదించుకున్నాడు. ముందుగా స్కెచ్ పెన్ను, పెన్సిల్తో దేవతామూర్తుల చిత్రాలను గీసుకుని అందుకు అనుగుణంగా విగ్రహాలను ఆయన తయారు చేస్తుంటారు. ఉభయ రాష్ట్రాల్లో పేరు శిలా విగ్రహాల తయారీకి రామ్మూర్తి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, గుంటూరు జిల్లా కోటప్ప కొండ నుంచి ప్రత్యేకంగా రాయిని తెప్పించుకునేవాడు. వీటితో శివుడు, పార్వతి, ఆంజనేయస్వామి, మద్దానేశ్వరస్వామి, సరస్వతీ, అయ్యప్ప, వినాయకుడు, ప్రభావతి, నాగలింగేశ్వరుడు, నంది, నవగ్రహాలు, వీరభద్రస్వామి తదితర విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేస్తుంటాడు. బళ్లారిలోని బసవ భవన్లో ఏర్పాటు చేసిన అనాది లింగేశ్వర స్వామి విగ్రహం, హిందూపురంలోని ప్రత్యంగిరాదేవి ప్రతిమ ఇతను చేసినవే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పిన వాల్మీకి, కనకదారు విగ్రహాలను కూడా రామ్మూర్తి చేసినవే కావడం గమనార్హం. తన వృత్తి నైపుణ్యంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఇప్పటివరకు వందకు పైగా విగ్రహాలు, రథాలను రామ్మూర్తి ఆచారి చేసి ఇచ్చారు. గ్రామీణ శిల్పులను ఆదుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లోని శిల్పులను ప్రభుత్వం ఆదుకోవాలి. వృత్తి నైపుణ్యతకు సహకరించాలి. శిల్పాలు చేసేందుకు ప్రత్యేక రాయితీలతో పాటు ప్రోత్సాహాకాలు అందించాలి. దేవతా విగ్రహాలను తయారు చేయడం ద్వారా రోజూ రూ. 400 ఆదాయం వస్తోంది. దీంతోనే జీవనం సాగించడం దుర్భరంగా ఉంటోంది.– బడిగే రామ్మూర్తి ఆచారి, శిల్పి, చంద్రగిరి -
వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించాలి’
సాక్షి,హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతిని ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో, గ్రామా ల్లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏర్పా టు చేసిన వైఎస్సార్ విగ్రహాలను పూలమాలతో అలంకరించి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు, అన్న దాన కార్యక్రమాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకలకు పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు, శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ఆసిఫ్నగర్లో ఉద్రిక్తత
కొత్తపల్లి(కరీంనగర్) : కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో బీ.ఆర్.అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాల ఏర్పాటు వివాదానికి దారితీసింది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆసిఫ్నగర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గల రామాలయం పక్కన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఓవర్గం గద్దెను నిర్మించారు. గ్రామపంచాయతీ సమీపంలో మరోవర్గం గాంధీ విగ్రహ నిర్మాణానికి గద్దెను నిర్మించారు. అయితే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా గ్రామపెద్దలు సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. చివరికి గురువారం ఉదయం అంబేద్కర్ విగ్రహం గద్దెపై ప్రతిష్ఠించేందుకు ఒక వర్గం ప్రయత్నించగా, మరొక వర్గం వ్యతిరేకించడంతో వివాదం మొదలైంది. దీనికితోడు కరీంనగర్, బద్దిపల్లి, ఖాజీపూర్, ఎలగందులనుంచి ఒకవర్గం నాయకులు రావడంతో ఆసిఫ్నగర్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలతో డీసీపీ సంజీవ్కుమార్, తహసీల్దార్ వి.వినోద్రావు, కరీంనగర్రూరల్, టౌన్ ఏసీపీలు టి.ఉషారాణి, పి.వెంకటరమణ సమావేశమయ్యారు. వారి సూచనలపై సానుకూలంగా స్పందించిన ఇరువర్గాలు గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండు విగ్రహాల ఏర్పాటుకు అంగీకరించారు. దీంతో వివాదానికి తెరపడింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు భూమిపూజ చేశారు. -
ఏరు మింగిన ఊరు
సాక్షి, హైదరాబాద్: మంచి నాగరికత వర్ధిల్లిందనడానికి చిహ్నంగా నాణ్యమైన వస్తువుల జాడ ఉందక్కడ. బాగా కాల్చి రూపొందించిన ఇటుకలు, నగిషీలద్ది తయారుచేసిన కుండలు, ఇంటి అవసరాలకు కావాల్సిన పనిముట్లు, అలంకరణకు వాడే రంగురంగుల పూసలే దీనికి నిదర్శనం. అవన్నీ ఒకటి రెండు శతాబ్దాల కాలానివిగా తెలుస్తోంది. కానీ ఇప్పుడక్కడ ఆవాసం జాడలేదు. మంచి పనిమంతుడి చేతిలో ఉలి విన్యాసం చేయటంతో రూపొందిన అద్భుత శిల్పకళాతోరణం, దానిపై ఉన్న ద్వారపాలకుల శిల్పాలు సౌందర్యంగా కనువిందు చేస్తున్నాయంటే వాటిని రూపొందించిన వారి చాతు ర్యం ఎంత గొప్పదో అవగతమవుతోంది. ఆ పనితనం కాకతీయుల కాలంది. కానీ ఆ దేవాలయంలో దేవతామూర్తులు లేరు. వెరసి శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల వరకు ఆ ఊరు విలసిల్లిందని ఆధారాలతో స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ తర్వాత ఊరు ఏమైంది. ఉన్నట్టుండి కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది. జీవనాధారంగా చేసుకున్న యేరే ఆ ఊరిని మింగేసిందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. పర్యావరణంలో వచ్చిన మార్పులు, వాటి పరిణామాలపై మన దేశంలో పరిశోధనలు దాదాపు శూన్యం. భావి తరాలు మరోసారి ప్రకృతి బీభత్సాల బారిన పడకుండా గతానుభవాల నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు చాలాదేశాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. కానీ మనవద్ద ఇప్పటివరకు వాటి ఊసు లేదు. వానాకాలంలో మాత్రమే కాస్త నీటి జాడలుండే ఓ యేరు ఒకప్పుడు ఉగ్రరూపాన్ని చూపిందని, దాని తాకిడికి ఊళ్లకు ఊళ్లు అంతరించాయని సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట సమీపంలో ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు ప్రాథమిక ఆధారాలు గుర్తించారు. వందల ఏళ్లు మనుగడ సాగించిన ఊరు అంతరించటానికి మెరుపు వరదలే కారణమన్న సంగతి అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బిక్క వాగు ఒడ్డున ఉన్న గాలిపల్లి–నరసక్కపేట మధ్య అంతరించిన ఊరును కొత్త తెలంగాణ చరిత్ర బృం దం తాజాగా గుర్తించింది. బృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, కరుణాకర్, చంటిలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ అంతరించిపోయిన ఊరు జాడలు గుర్తించారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇక్కడున్న వాగును బిక్క వాగుగా పిలుస్తారు. ఒకటీ, రెండు శతాబ్దాల్లో జైనం, బౌద్ధం వర్ధిల్లింది. అప్పట్లో భిక్షువులు నీటి జాడ ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారు. భిక్షువుల ప్రాంతం కావటంతో అది భిక్షువుల వాగు, కాలక్రమంలో బిక్క వాగుగా మారింది. ఆలేరు సమీపంలోని బిక్కేరు కూడా ఇదేక్రమంలో పేరు సుస్థిరం చేసుకుంది. అక్కడ బౌద్ధారామాలు, స్థూపాలు వెలుగుచూశాయి. ఇదే క్రమంలో బిక్కవాగు వద్ద కూడా బౌద్ధం వర్ధిల్లి ఉంటుంది. తర్వాత కాకతీయుల కాలంలో హైందవం విలసిల్లింది. ఆ సమయంలో నిర్మితమైనట్టు భావిస్తున్న ఆలయం ఉంది. అది చిన్నగా ఉన్నా, ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన తోరణం అత్యద్భుతంగా ఉంది. చుట్టూ గోడలు శిథిలమయ్యాయి. ఆలయంలో ఎటువంటి విగ్రహాలు కనబడటం లేదు. తోరణ ద్వారానికి రెండు వైపులా ద్వారపాలకుల విగ్రహాలు, వాటికి ఇద్దరేసి చామరగ్రాహిణులు, పరిచారికల శిల్పాలున్నాయి. పైభాగంలో లలాటబింబంగా గజలక్ష్మిమూర్తి ఉంది. అది చెన్నకేశవుడి ఆలయంగా సమీపంలోని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఆలయానికి ముందువైపు ఉన్న పొలాల్లో ఊరి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎరుపు, నలుపు రంగుల్లో ఉన్న కాల్చి రూపొందించిన పెద్దపెద్ద ఇటుకలు, మట్టి కుండల ముక్కలు, పనిముట్లు, ఆయుధాల అవశేషాలు కనిపిస్తున్నాయి. వాగులో నీటి వనరు పుష్కలంగా ఉండటంతో అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేసుకుని జీవనం సాగించారు. ఉన్నట్టుండి దానికి మెరుపు వరదలు రావటంతో ఊరు ధ్వంసమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గాలిపల్లి గ్రామానికి ఇది చేరువగా ఉంది. పాత ఊరు ధ్వంసం కావటంతో ప్రస్తుత గ్రామం కాలక్రమంలో ఏర్పడింది. ఇక్కడ చారిత్రక అన్వేషణ జరిపితే వందల ఏళ్లనాటి విషయాలు, బౌద్ధ నిర్మాణాల జాడ కూడా తెలిసే అవకాశం ఉంది. -
ఈ మహావీరుడు సరిహద్దు బాధితుడు!
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొలువుదీరిన 24 మంది తీర్థంకరులు.. రెండువైపులా వింజామరలు పట్టుకుని ఉపచారాలు చేస్తున్న గంధర్వులు.. తలపైన త్రిఛత్ర ఛాయ.. దాని దిగువన ఎనిమిది తలల శేషుడు.. ఎత్తయిన పీఠం.. దానిపై ధ్యానముద్రలో మహావీరుడు! కళ్యాణ చాళుక్యుల హయాంలో 12వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న అద్భుత విగ్రహమిది. ఇది ఏ తవ్వకాల్లో దొరికిందో, మట్టిలో కూరు కుపోయి ఉందో కాదు. ఇప్పటికీ భక్తుల పూజలందుకుంటున్న ఈ విగ్రహం ఓ దేవాలయంలో కొలువుదీరి ఉంది. ఇది జైనుల ఆలయం. మహావీరుడి ఉత్సవ మూర్తిగా వెలుగొందుతున్న మందిరం. కానీ ఆలయ ముఖద్వారంపై ‘గౌతమ బుద్ధుడు’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. భక్తులు అది బుద్ధుడి విగ్రహంగానే భావించి జ్యోతి వెలిగిస్తూ పూజిస్తున్నారు. మరి మహావీరుడిని బుద్ధుడిగా ఎందుకు ఆరాధిస్తున్నట్టు...?? రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండటమే ఆ దేవాలయానికి శాపమైంది. ఈ ఆలయ భూభాగం కర్ణాటక పరిధిలో ఉన్నా ఊరుఊరంతా తెలుగువారే. దీంతో కర్ణాటక పురావస్తు శాఖ దీన్ని గాలికొదిలేసింది. ఊరంతా తెలుగువారైనా.. భూభాగం సరిహద్దుకు కాస్త ఆవల ఉండటంతో ఇటు తెలంగాణ పురావస్తుశాఖ నిస్సహాయంగా ఉండిపోయింది. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ మందిరంపై కనీస పరిశోధనలు కూడా జరగలేదు. చుట్టుపక్కల ఎలాంటి తవ్వకాలు, ఇతర శాసనాలు, విగ్రహాల అన్వేషణ చేయలేదు. ఫలితంగా... అది మహావీర దేవాలయం అని కూడా స్థానికులకు తెలియకుండా పోయింది. విగ్రహాకృతి ఆధారంగా బుద్ధుడిదిగా భావిస్తూ వస్తున్నారు. ముందుభాగాన్ని రంగులతో అలంకరించి పండుగలప్పుడు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అరుదైన, అపురూపమైన విగ్రహంగా చరిత్రకారులు భావిస్తున్నా ‘సరిహద్దు’ శాపంతో ఆ మందిరం మరుగునపడిపోయింది. కనీసం దాన్ని రక్షిత కట్టడంగా కూడా కర్ణాటక గుర్తించటం లేదు. ఎక్కడుంది ఆ గ్రామం? వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామా నికి రెండు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ –కర్ణాటక సరిహద్దు ఉంది. అక్కడ్నుంచి కొన్ని మీటర్ల దూరంలో కర్ణాటక భూభాగంలో ఉన్న గ్రామమే మిర్యాన్. ఇది కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి తహసీల్ పరిధిలోకి వస్తుంది. పేరుకు ఈ గ్రామం కర్ణాటక భూభాగంలో ఉన్నా.. గ్రామస్తులంతా తెలుగువారే. అక్కడి పోలీసుస్టేషన్ సమీపంలో ఉన్న ఈ దేవాలయంపై ‘గౌతమ బుద్ధుడు’ అని తాటికాయంత తెలుగు అక్షరాలు కనిపిస్తాయి. అందులో కొలువుదీరిందే ఈ మహావీరుడి మూర్తి. నిజాం సంస్థానం ఉన్నప్పుడు ఈ ప్రాంతమంతా నిజాం పాలనలో ఉండేది. అప్పట్లో తెలుగువారే ఉండటంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ వారే ఉంటున్నారు. జైన ఆరాధకులైన కళ్యాణ చాళుక్యులు ఎన్నో జైన మందిరాలు నిర్మించారు. అందులో ఇది ఒకటి. ఇప్పటికీ ఓవైపు మందిర అసలు నిర్మాణం తాలూకు రాళ్లవరస కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో దాన్ని ధ్వంసం చేయటంతో స్థానికులే చిన్నగా, సాధారణ రాళ్లతో తోచిన విధంగా పునర్నిర్మించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ‘‘ఇది వందల ఏళ్లనాటి గుడి. ఇక్కడి విగ్రహం అందంగా ఉంటుంది. చాళుక్యుల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతారు. కానీ ఎప్పుడూ పురావస్తు శాఖ అధికారులు రాలేదు. కనీసం తెలంగాణ పురావస్తుశాఖ అయినా, లేదంటే కేంద్ర పురావస్తు శాఖ అయినా పట్టించుకోవాలి’’ – యాహమత్ ఖాన్, మిర్యాన్ గ్రామస్తుడు ‘‘యాభై ఏళ్ల క్రితం వరకు దేశవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ ఉత్సవాలు చేసిన తీరును నా కళ్లారా చూశాను. ఆ తర్వాత జనం రావటం తగ్గింది. అసలు ఇక్కడ గుడి ఉందనే విషయం కూడా ఇప్పుడు మరిచిపోయారు. దీన్ని అభివృద్ధి చేస్తే మా ఊరు కూడా బాగుపడుతుంది’’ – ఖాజా బీ, స్థానికురాలు -
విగ్రహాలను శుభ్రం చేస్తున్న బీజేపీ
కోల్కతా : పాలు, గంగా జలంతో బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రోడ్లపై దర్శనమిస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాల్లో కొన్ని ధ్వంసం కాగా.. కొన్నింటికి రంగులు పూసేశారు. దీంతో తాము శుభ్రం చేస్తున్నట్లు వాళ్లు చెప్తున్నారు. గురువారం కియోరటలా స్మశాన వాటిక దగ్గర ఉన్న జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అవమానించారన్నది బీజేపీ ఆరోపణ. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసానికి అతి దగ్గర్లో ఉన్న ఈ విగ్రహనికి నలుపు రంగు పూయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు తామీ విగ్రహాన్ని శుభ్రం చేస్తున్నామని బీజేపీ కార్యకర్తల మాటగా ‘ది వైర్’ కథనం ప్రచురించింది. అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. విగ్రహానికి అవమానం జరిగిందన్న వార్త తెలిసి తామూ అక్కడికి చేరుకున్నామని.. కానీ, అప్పటికే అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని ప్రత్యారోపణలు చేస్తున్నారు. మరోవైపు త్రిపురలో లెనిన్ విగ్రహానికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా వామపక్ష వర్గాలే ఈ దాడికి పాల్పడ్డాయన్నది మరో వర్గం ఆరోపణ. సెటైర్లు... అయితే ఉన్నట్లుండి తమ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శ్యామ్ ప్రసాద్ విగ్రహాలపై మమకారం ప్రదర్శిస్తున్న బీజేపీపై మిగతా విగ్రహాలు ఏం పాపం చేశాయని కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చి ఆ తలతో ఫుట్ బాల్ ఆడుకున్న బీజేపీ కార్యకర్తలు- వారిని ఆకాశానికి ఎత్తేస్తూ అభినందనలు గుప్పించిన బీజేపీ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల సంగతేటని ప్రశ్నిస్తున్నారు. గాంధీ, అంబేద్కర్, పెరియార్.. ఇలా విగ్రహాల విధ్వంసం కొనసాగుతున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది వారి ప్రధాన ప్రశ్న. కానీ, మిగతా విగ్రహాలపై కూడా కాషాయ దళాలు ఇదే రీతిలో ప్రేమను ప్రదర్శించాలని కోరుకోవటం తీరని ఆకాంక్షే అన్నది విమర్శకుల మాట. -
విగ్రహాలు కాదు, విలువల కూల్చివేత
లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. త్రిపురలో లెనిన్ విగ్రహాల కూల్చివేత దృశ్యాలను చూసినప్పుడు ఇద్దరు ఇతిహాస పాత్రలు మనసులో మెదిలారు. ఒకరు రాముడు, ఇంకొకరు ధర్మరాజు. రావణసంహారం జరిగిన తర్వాత, అన్న మరణానికి విభీషణుడు శోకిస్తున్నప్పుడు అతణ్ని ఓదార్చిన రాముడు, మృతుడైన రావణుని పట్ల తన వైఖరిని వివరిస్తూ, ‘‘విభీషణా! వ్యక్తులు జీవించి ఉన్నంతకాలమే వైరాలు ఉండాలి. ఆ తర్వాత వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు మన కార్యం నెరవేరింది కనుక ఇతనికి అంత్యక్రియలు నిర్వహించు. ఇతడు నీకెంత గౌరవనీయుడో.. ఇప్పుడు నాకూ అంతే గౌరవనీయుడు’’ అంటాడు. ఈ సందర్భంలో రాముడు అన్న ‘‘మరణాంతాని వైరాణి’’ అనే మాట ఒక గొప్ప సూక్తిగా జాతి నాలుకలపై నిలిచిపోయింది. ధర్మరాజు విషయానికి వస్తే, తన గదాఘాతానికి తొడలు విరిగి దుర్యోధనుడు పడిపోయిన తర్వాత భీముడు అతణ్ని దూషిస్తూ ఎడమ కాలితో అతని శిరస్సును తంతాడు. ఆ చర్యను ధర్మరాజు, అర్జునుడు ఏవగించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటారు. భీముడు రెండోసారి ఆ పని చేసినప్పుడు ధర్మరాజు ఊరుకోలేకపోతాడు. ‘‘ఎందుకలా తంతున్నావు? ఈ అధర్మం నీకు రోత పుట్టించడం లేదా? ఈ రాజరాజు తమ్ముళ్ళు, బంధువులు మరణించిన తర్వాత కూడా యుద్ధం చేసి పడిపోయిన గౌరవాన్ని పొందుతున్నప్పుడు నువ్వు చేసిన ఈ హీనమైన పనిని జనం మెచ్చుతారా?’’ అని తీవ్రంగా మందలిస్తాడు. విజయం కలిగించిన హర్షావేశాలతో ఉచితానుచితాలు పట్టించుకోని అల్పబుద్ధిగా ఈ ఘట్టంలో కవి భీముణ్ని వర్ణిస్తాడు. లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. అఫ్ఘానిస్తాన్లోని బామియాన్లో బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసిన తాలిబన్లను ఆదర్శం చేసుకున్నారు. ఈ విగ్రహవిధ్వంసం ఇంతటితో ఆగదనీ, అది తమ నేతలకు కూడా వ్యాపిస్తుందనే స్పృహ లోపించింది కనుక దీని వెనుక అల్పబుద్ధే కాక మందబుద్ధి కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహంపట్ల అపచారం జరిగింది. పెరియార్, అంబేడ్కర్, మహాత్మా గాంధీల విగ్రహాలకు మసిపూశారు. ఇది ఇటీవలి కాలంలో ఎరగని ధోరణి. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలకు త్రిపురను మించి పెద్ద కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ను చేజిక్కించున్న తర్వాత కూడా మమతాబెనర్జీ ఇలాంటి దురాగతానికి పాల్పడలేదు. అయినాసరే త్రిపురలో తమది గొప్ప భావజాల విజయంగా మోదీ చెప్పుకోవడం ఒక విడ్డూరమైతే, భిన్న భావజాలప్రతీకైన లెనిన్ విగ్రహాన్ని అనుయాయులు భౌతికంగా కూల్చివేయడం ఇంకొక వైపరీత్యం. లెనిన్ విదేశీయుడు కనుక అతని విగ్రహాన్ని కూల్చినా తప్పులేదని సమర్థించుకున్నారు కానీ, వాస్తవానికి తాము గురిపెడుతున్నది లెనిన్ భావజాలాన్ని నమ్మే స్వదేశీయులపైనేనన్న సంగతిని గమనించుకోలేదు. భావజాలం వ్యక్తుల ఆలోచనల్లో ఉంటుంది తప్ప విగ్రహాలలో ఉండదన్న గ్రహింపు లోపించింది. తన సమకాలీన భారతదేశ పరిణామాలపై లెనిన్ ఎలాంటి సానుకూల వైఖరి తీసుకున్నాడో ఆయనకూ, ఎం. ఎన్. రాయ్కి మధ్య జరిగిన చర్చల ద్వారా తెలుస్తుంది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న జాతీయవాద శక్తులను తిరోగమనవాదులుగా పేర్కొంటూ, వారికి సైతం వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని నిర్మించాలని ఎం. ఎన్. రాయ్ వాదిస్తే,, లెనిన్ దానిని ఖండిస్తూ కమ్యూనిస్టులు గాంధీ సహా జాతీయవాద శక్తులను బలపరచితీరాలని స్పష్టం చేశాడు. విదేశీయుడన్న కారణంతో లెనిన్ విగ్రహాన్ని కుప్పకూల్చడంలోని సంకుచితత్వం, చారిత్రిక అజ్ఞానం మాటలకు అందనిది. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడమంటే, భారత్తో ముడిపడిన ఆయన తాలూకు చారి త్రిక ఆనవాళ్లను చెరిపివేసి చరిత్రకు ద్రోహం చేయబోవడమే. ద్రవిడ ఉద్యమ నిర్మాత, సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని కూడా కూల్చివేయాలని తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఒకరు పిలుపు ఇవ్వడం, విగ్రహానికి మసిపూయడం వెనుక ఉన్నదీ; భిన్న ఆలోచనా పంథాలను తుడిచిపెట్టి, వ్యక్తుల మెదళ్లు వంచి దేశం ఆ చివరి నుంచి ఈ చివరివరకూ ఏకశిలా సదృశమైన భావజాలాన్ని రుద్దే వ్యూహమే. ఈ సందర్భంలో కంచిలోని శంకరాచార్యపీఠాన్ని, చిరకాలం పీఠాధిపత్యం వహించిన పరమాచార్యను గుర్తు చేసుకోవడం అవసరం. కంచి మఠానికి ఎదురుగా గోడలపై పెరియార్ నాస్తికప్రబోధాలు కనిపిస్తాయి. మఠానికి దగ్గరలోనే ఒక మసీదు కూడా ఉంది. శతాబ్దకాలానికి పైనుంచీ ఈ మూడింటి సహజీవనం అక్కడ కొనసాగుతూవచ్చింది. మఠం పక్కనే మసీదు ఉండడం పరమాచార్యకు అభ్యంతరం కాకపోగా, తెల్లవారుజామున అక్కడ జరిగే నమాజుతోనే తను మేలుకునేవాడినని ఆయన చెప్పుకున్నారు. భిన్న విశ్వాసాల శాంతియుత సహజీవనానికి అతి గొప్ప ప్రతీ కలలో ఇదొకటి. ఈ సహజీవన వైవిధ్యాన్ని, చెరిపివేసి ఒకే మూసభావజాలాన్ని, మూర్తులను, చరిత్రలను ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా యావద్భారతవ్యాప్తం చేసే ఎత్తుగడలో భాగంగానే లెనిన్ విగ్రహ ధ్వంసాన్ని, పెరియార్ విగ్రహంపై దాడిని చూడవలసి ఉంటుంది. ఈ దుశ్చర్యలను సమర్థించుకునే విఫలయత్నంలో బీజేపీ శ్రేణులూ, పరివార్ సంస్థల ప్రతినిధులూ చేసిన వితండవాదాలు, దొర్లించిన వికృత వ్యాఖ్యలు అంతే విస్తుగొలిపాయి. ‘ఒక ప్రభుత్వం చేసిన దానిని ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తుం’దని అంటూ త్రిపుర గవర్నర్ బాహాటంగా సమర్థించారు. మనుషులపై దాడి చేసినా, చంపినా హింస అవుతుంది తప్ప విగ్రహాలపై దాడి హింస కాబోదని ఆయన నిర్వచనం. ‘లెనిన్ విగ్రహాలను కూల్చింది రష్యాలో కాదు, త్రిపురలో! మార్పు రావలసిందే’నని మరో నేత వ్యాఖ్య. ఎప్పటిలానే ప్రధాని ఆలస్యంగా గొంతు విప్పి విగ్రహాల కూల్చివేతను ఖండించినా ఈ సమర్థింపు ప్రహసనం సాగుతూనే ఉంది. అధినేత ఖండిస్తారు. అనుయాయులు తాము చేసేది చేస్తూనే ఉంటారు. అంతిమంగా కుప్పకూలుతున్నవి ఏవో విగ్రహాలో మరొకటో కావు... వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేశ సంస్కృతీ, సభ్యతా, సంప్రదాయాలు. మనం ఎంతో అపురూపంగా పెంచి పోషించుకోవలసిన ప్రజాస్వామిక విలువలు. భాస్కరం కల్లూరి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : kalluribhaskaram9@gmail.com -
హింస నచన ధ్వంస రచన
రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, సంఘసంస్కర్తల విగ్రహాల విధ్వంసం ఈనాటిది కాదు. మతపరమైన విగ్రహాలు, పూజా స్థలాలను ధ్వంసం చేయడం వేల ఏళ్ల క్రితమే క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. కొత్త పాలకులు అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయిన నేతల చిత్రాలు, విగ్రహాలు, వారి అధికారం, సిద్ధాంతాల చిహ్నాలను పగలగొట్టడం ఫ్రెంచి విప్లవంలో విస్తృతంగా జరిగింది. ప్రస్తుత పాలకులు, వారు ఆరాధించే నాయకుల విగ్రహాలను కూలదోయడం విప్లవకారుల నుంచి అనేక రాజకీయ గ్రూపుల వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. అధికారంలో ఉన్నవారు, రాజ్యాధికారం కోసం తిరుగుబాటు చేసేవారు విగ్రహాల విధ్వంసానికి పాల్పడడాన్ని రాజకీయ అసహనంగా ప్రజాస్వామికవాదులు భావిస్తారు. దేశంలో 1960ల ఆఖరులో ఆరంభమైన నక్సలైట్ ఉద్యమకాలంలో పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కోలకత్తా నగరంలో రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి 19వ శతాబ్దానికి చెందిన సంఘసంస్కర్తలు, గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాస్చంద్రబోస్ వంటి స్వాతంత్య్రసమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో దళితులతో పేచీ పడిన ఇతర వర్గాలు బడుగువర్గాలు ఆరాధించే బీఆర్అంబేడ్కర్ విగ్రహాలను పగలగొట్టడం లేదా నల్లరంగు పూయడం ఎంతో కాలంగా జరుగుతోంది. ఎక్కడైనా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలపై దాడులు జరిపి వాటిని పగలగొట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడం రివాజుగా మారింది. కూలిన లెనిన్, స్టాలిన్ విగ్రహాలు 1991 జూన్ డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాలతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిస్టుల పాలన ముగిసినప్పుడు రాజధాని మాస్కో, ఇతర ప్రధాన నగరాల్లోని కమ్యూనిస్ట్యో ధులు వ్లాదిమిర్లెనిన్, జోసెఫ్స్టాలిన్భారీ విగ్రహాలను కూల్చివేయడం ఇతర దేశాల ప్రజలకు దిగ్భాంతి కలిగించింది. కమ్యూనిస్టుల పాలన అంతమైన పోలండ్, బల్గేరియా వంటి తూర్పు ఐరోపా దేశాల్లోనూ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు, విప్లవకారుల విగ్రహాలను బుల్డోజర్లతో తొలగించారు. 2001 మార్చిలో అఫ్ఘానిస్తాన్లోని బామియాన్లోయ ప్రాంతంలోని భారీ బుద్ధ విగ్రహాలను పాలకపక్షమైన తాలిబాన్లు తమ నేత ముల్లా మహ్మద్ఒమర్ ఆదేశాలపై కూల్చివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. దక్షిణాఫ్రికాలోని జొహనీస్ బర్గ్లో గాంధీ విగ్రహాన్ని 2015 ఏప్రిల్12న కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో ముఖ భాగం స్వల్పంగా దెబ్బతింది. దక్షిణాఫ్రికా శ్వేత జాతి పాలనపై పోరాడిన గాంధీకి నల్లజాతివారంటే చిన్నచూపని ఆరోపిస్తూ ఈ పనిచేశారు. మరో ఆఫ్రికా దేశం ఘనా రాజధాని ఆక్రాలోని యూనివర్సిటీ ఆఫ్ఘనా ఆవరణలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించిన గాంధీ విగ్రహాన్ని తొలగించాలని 2016లో దాదాపు వేయి మంది పౌరులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపారు. దాంతో ఈ విగ్రహాన్ని మరో ప్రదేశానికి మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. అమెరికాలోనూ విగ్రహాలపై ఆగ్రహం! అమెరికాను కనుగొన్న స్పెయిన్కు చెందిన అన్వేషకుడు క్రిస్టఫర్ కొలంబస్ స్మారక దినం సందర్భంగా 2017 అక్టోబర్9న ఇలినాయ్, రోడ్ఐలండ్రాష్ట్రాలు, కనెక్టికట్లోని మూడు నగరాల్లో వాటిని కొందరు ప్రదర్శకులు కొలంబస్ విగ్రహాలను స్వల్పంగా ధ్యంసం చేశారు. 19వ శతాబ్దంలో నల్లవారిని బానిసలుగా చూసే వ్యవస్థను కాపాడడానికి దక్షిణాది రాష్ట్రాలైన వర్జీనియా, నార్త్, సౌత్కరోలినా రాష్ట్రాల తరఫున పోరాడిని కాన్ఫడరేట్దళాలను నడిపించిన కమాండర్లు, సైనికుల విగ్రహాలు కొన్నింటిని కిందటేడాది తొలగించారు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా సిడ్నీలోని అన్వేషకుడు కెప్టెన్జేమ్స్కుక్విగ్రహంపై నల్ల రంగు పెయింట్పోసి కొందరు స్థానిక జాతుల ప్రదర్శకులు నిరసన తెలిపారు. ఏలూరు కాలవలోకి నీలం విగ్రహం! 1960ల చివర్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సాగిన ఆందోళన సందర్భంగా విజయవాడలోని అప్పటి కేంద్ర ఉక్కు శాఖామంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు తొలగించి ఎదురుగా ఉన్న ఏలూరు కాలువలో వేశారు. 2001 మార్చిలో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంక్ బండ్పై సాగిన మిలియన్మార్చ్సందర్భంగా కొందరు అక్కడి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. అదే కాలంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే సిద్దిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కొందరు పగలగొట్టారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్రావు వెంటనే జోక్యం చేసుకుని తెలుగువారికి ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడిన అమరజీవి విగ్రహాల జోలికి పోవద్దనీ, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని ప్రకటించాక ఇలాంటి దాడులు జరగలేదు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
విగ్రహాలపై ఆగ్రహం!
వదంతుల వల్లనో, అనుమానాల వల్లనో మనుషుల్ని కొట్టి చంపుతున్న సంస్కృతి సామాజిక మాధ్యమాల ద్వారా పరివ్యాప్తమై అందరినీ బండబారుస్తున్న తరు ణంలో విగ్రహ విధ్వంసాలు అతి సాధారణమనిపించవచ్చు. కానీ మనమొక ప్రజా స్వామిక వ్యవస్థలో ఉన్నామని... ఈ హత్యలు, విగ్రహ విధ్వంసాలు నాగరిక విలు వలకే విరుద్ధమైనవని, అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెచ్చే దురం తాలని గ్రహించినప్పుడు ఆందోళనా, ఆవేదనా కలుగుతాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడైన తర్వాత ఆ రాష్ట్రంలో రెండు మూడుచోట్ల బీజేపీ కార్యకర్తలు విజయోత్సాహంతో రష్యా విప్లవ నేత లెనిన్ విగ్రహాలను కూల్చారు. కొన్నిచోట్ల సీపీఎం కార్యాలయాల్ని ధ్వంసం చేశారు. వీటిని చూసి ఉత్సాహపడిన తమిళనాడు బీజేపీ నేత హెచ్. రాజా ‘కులోన్మాది పెరియార్ ఇ.వి. రామస్వామి విగ్రహానికి కూడా ఇదే గతి పడుతుంద’ని ఫేస్బుక్లో హెచ్చరించడం, కొద్దిసేపటికే కొందరు దుండగులు వెల్లూరులో పెరియార్ విగ్రహాన్ని కూల్చడం జరిగిపోయాయి. ఆవేశం తలకెక్కి, విచక్షణ కోల్పోయిన గుంపు ఏదో చేసిందను కోవడానికి లేకుండా త్రిపుర గవర్నర్ తథాగతరాయ్, పలువురు బీజేపీ నేతలు ఆ ఉదంతాలను సమర్థిస్తూ మాట్లాడిన తీరు విస్మయం కలిగిస్తుంది. ఈ వరస విధ్వం సాలపై ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకో మని ఆదేశించారు. కానీ ఆ పని మొట్టమొదటి ఉదంతం సమయంలోనే చేసి ఉంటే ఇవి జరిగేవి కాదు. పైగా అలా చేయడం ఘనకార్యమన్నట్టు సీనియర్ నేతలే మాట్లాడటం అగ్నికి వాయువు తోడైనట్టయింది. ఈ విధ్వంసానికంతకూ లక్ష్యంగా మారినవారు వ్యక్తిమాత్రులు కారు. తమ జీవితకాలంలో అందరిపైనా బలమైన ముద్రవేసిన నాయకులు. మార్పు కోసం తపించినవారు. మెరుగైన సమాజానికి పాటుబడినవారు. వారి భావాలతో ఏకీ భావం లేకపోవచ్చు. వారెంచుకున్న మార్గాలు సరైనవి కావన్న అభిప్రాయం ఉండొచ్చు. వారి సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు. విగ్రహాలను కూల్చినంతమాత్రాన ఆ భావాలు, సిద్ధాంతాలు మటుమాయమవుతాయని మతిమాలిన గుంపు అను కుంటే అనుకుని ఉండొచ్చు... కానీ బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు, నాయకులైన వారు అదే తరహాలో ఆలోచించడం దిగ్భ్రాంతికరం. వీరిలో కొందరైతే లెనిన్ ఈ దేశానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ఉగ్రవాది అన్నారు. విదేశీయుడన్నారు. లెనిన్ అయినా, అంతకు చాలాకాలం ముందు మార్క్స్ అయినా మన దేశంపై బ్రిటిష్ వలసవాదుల పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వివిధ రూపాల్లో ఇక్కడ జరుగు తున్న పోరాటాలను సమర్ధించారు. ప్రసార సాధనాలు అంతగాలేని 1850 సమ యంలో కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న పోరాటాలను అధ్యయనం చేసి వాటిని విశ్లేషించినవాడు మార్క్స్. 1857నాటి సిపాయిల తిరు గుబాటుపై వచ్చిన వార్తల ఆధారంగా అమెరికాకు చెందిన న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్లో మార్క్స్, ఏంగెల్స్ పలు వ్యాసాలు రాశారు. ‘పూర్ణ స్వరాజ్’ కోసం పోరాడాలని 1929 డిసెంబర్ 19న లాహోర్లో కాంగ్రెస్ తీర్మానించడానికి పదేళ్లముందే భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించాలని అభిలషిం చినవాడు లెనిన్. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో ఎంఎన్ రాయ్లాంటి వారికి తోడ్పాటునందించాడు. సమాజానికి వ్యాధిగా పరిణమించిన కులాన్ని నిర్మూలించడానికి, మహిళలకు సమాన హక్కులు సాధించడానికి, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడానికి పెరియార్ ఇ.వి. రామస్వామి చేసిన కృషి అసా ధారణమైనది. తమిళనాట ఆయన నాయకత్వంలో సాగిన ‘ఆత్మగౌరవ పోరాటం’ దక్షిణాదినంతటినీ ప్రభావితం చేసింది. నవ భారతం ఏర్పడేనాటికల్లా దేశంలో అసమానతలు పోవాలని ఆయన కలలుకన్నాడు. ఇలాంటివారి విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల ఏం సాధించవచ్చనుకుంటున్నారో అనూహ్యం. ఇదే తర హాలో అడపా దడపా మహాత్మాగాంధీ విగ్రహాలనూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలనూ ధ్వంసం చేసిన వారున్నారు. వాటిని అవమానించిన వారున్నారు. నిరుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని నిరోధించడానికి గ్రామ పెద్దలు ప్రయత్నించారు. అందుకోసం అనేక నెలలపాటు దళిత సంఘాలు, పార్టీలు పోరాడ వలసివచ్చింది. ఇంతకూ త్రిపురలో ఏం జరిగిందని అంత ఉత్సాహం? ఇరవైయ్యేళ్ల సీపీఎం పాలన అంతమై బీజేపీ అధికారంలోకొచ్చింది. పైగా గెలిచిన బీజేపీకి, ఓడిన సీపీఎంకూ మధ్య ఓట్ల వ్యత్యాసం అరశాతం కూడా లేదు. బీజేపీకి 43 శాతం ఓట్లొస్తే... సీపీఎంకు 42.7 శాతం వచ్చాయి. ఆ రాష్ట్రంలో అంతక్రితం కూడా సీపీఎం ఒకసారి ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించడమే కాక వరసగా ఇరవైయ్యేళ్లు పాలించింది. జనం మెచ్చే రీతిలో పాలన అందించలేనప్పుడు ఓడిపోవడంలో వింతేమీ లేదు. ఆ ఓటమికి మూల కారణాలేమిటో ఓడిన పక్షం విశ్లేషించుకుంటుంది. కొత్తగా అధికారంలో వచ్చిన పార్టీ తానిచ్చిన వాగ్దానాలేమిటో, వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్య లేమిటో పరిశీలించుకోవాలి. ప్రజల సంక్షేమానికి ఇంకేమి కార్యక్రమాలు చేపట్టాలో నిర్ణయించుకోవాలి. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ సాధించినప్పుడు ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలనూ గెలుచుకుంది. కానీ మరికొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో తుడిచి పెట్టుకుపోయింది. ఎన్నికల్లో గెలవడమే సర్వస్వం అనుకోవడం, విలువలకు తిలోదకాలొదిలి వీరంగం వేయడం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. గెలిచిన పక్షం ఓడిన పార్టీ కార్యాలయాలనూ, ఆ పార్టీ స్ఫూర్తిదాయకమని భావించేవారి విగ్రహాలనూ ధ్వంసం చేయడం లాంటి పనులకు పాల్పడితే అది అంతిమంగా అరాచకానికి దారి తీస్తుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. గెలుపులోనూ హుందాగా ఉండటం ఏ పార్టీ అయినా అలవర్చుకోవాల్సిన మంచి లక్షణం. -
పెరియార్ అంటే బీజేపీకి ఎందుకు మంట!
సాక్షి, న్యూడిల్లీ : త్రిపురలో రష్యా కమ్యూనిస్టు విప్లవకారుడు వీఐ లెనిన్ విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం బుల్డోజర్ పెట్టి కూల్చేసిన బీజేపీ కార్యకర్తలు తమిళనాడులోని పెరియార్ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు బుధవారం ప్రయత్నించడంతో తమిళనాడులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి పెరియార్ రామస్వామి విగ్రహంపై దాడికి కాషాయ మూకలను ఫేస్బుక్ పోస్టింగ్ ద్వారా రెచ్చగొట్టిందే బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా. ‘లెనిన్ ఎవరు? ఆయనకు భారత్కు సంబంధం ఏమిటీ? కమ్యూనిస్టులకు భారత్కు ఉన్న సంబంధం ఏమిటీ? నేడు లెనిన్ విగ్రహం, రేపు తమిళనాడులోని ఈవీ రామస్వామి (పెరియార్) విగ్రహం!’ అంటూ బీజేపీ నాయకుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దానికి స్పందించిన ఇద్దరు బీజేపీ అనుమానిత కార్యకర్తలు తమిళనాడులోని వెల్లూర్కు సమీపంలోని తిరుపట్టూర్లో ఉన్న పెరియార్ విగ్రహంపై రాళ్లు రువ్వారు. రాజాను గూండా చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్, విగ్రహాన్ని ముట్టుకున్న చేతుల్ని నరికేస్తామంటూ ఎండీఎంకే నాయకుడు వైకో హెచ్చరించారు. దీంతో హెచ్. రాజా వెంటనే ఫేస్బుక్లోని తన పోస్టింగ్ను ఉపసంహరించుకున్నారు. అయితే పెరియర్ రామస్వామి విగ్రహాలను తొలగించాలని బీజేపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని బీజేపీ తమిళనాడు ప్రతినిధి నారాయణన్ తిరుపతి చెప్పారు. బీజేపీకైనా, సంఘ్ పరివార్కైనా పెరియార్ రామస్వామి అంటే ఎందుకు కోపం? ఆయన ఎవరు ? ఆయన సిద్దాంతం ఏమిటీ ? తమిళనాడులోని ఈరోడ్లో 1879, సెప్టెంబర్లో ఈవీ రామస్వామి జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామస్వామి. ఈరోడ్లో పుట్టినందున ఈరోడ్ వెంకట రామస్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల దష్టిలో పెరియార్ రామస్వామిగా మారారు. ‘పెరియార్’ అంటే తమిళంలో గౌరవనీయులు లేదా పెద్ద అని అర్థం. పొడవాటి గుబురు గడ్డం. ముఖాన గుండ్రటి కళ్లజోడు. ఉదారత్వం ఉట్టిపడే ఆయన నవ్వును చూస్తే ఎవరైనా ఆయన్ని గౌరవనీయులని అనుకుంటారు. ఆయనలో ర్యాడికల్ సిద్దాంతం రగులుకుంటుందని ఎవరూ ఊహించరు. సమాజంలో ఆయన కుల, మత, వర్గ ఆధిపత్యాలపై తిరుగుబాటు చేశారు. కుల, మత రహిత సమసమాజం కావాలని కాంక్షించారు. మహిళలకూ సమాన హక్కులు కావాలన్నారు. స్వతహాగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ‘బలిజ’ కుటుంబానికి చెందిన పెరియార్ సమాజంలో ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ ‘స్వీయాభిమాన ఉద్యమాన్ని’ నిర్మించారు. అగ్రవర్ణాలు ఇతర వర్గాలపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం, వారిని తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం దేవుళ్లను, వారి పేరిట గుళ్లూ గోపురాలను, పనికి మాలిన పురాణాలను సష్టించారంటూ ప్రచారోద్యమాన్ని సాగించడం ద్వారా ఆయన ప్రముఖ హేతువాదిగా ముద్రపడ్డారు. ‘దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్ ఎటాల్ (దేవుడు లేడు, దేవుడు లేడూ, అసలు దేవుడే లేడు)’ పెరియార్ ఉద్యమంలో ప్రధాన నినాదం. ‘దేవుడు దుష్టుడు, దేవున్ని పూజించే వారు ఆటవికులు అని కూడా అన్నారు. కుల, మత వ్యత్యాసాలు కలిగిన భారత దేశమే తనకు వద్దని, కుల, మత రహిత దక్షిణ భారతమే తనకు దేశంగా కావాలన్నారు. కుల, మతాలకు విలువనిస్తున్న భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. 1957లో పెరియార్ మూడువేల మంది తన అనుచరులతో కలిసి భారత రాజ్యాంగం ప్రతులను తగులబెట్టి అరెస్టయ్యారు. కుల, మతాలను రాజ్యాంగం నిషేధించినప్పుడే కుల, మత రహిత సమాజం ఏర్పడుతుందని వాదించారు. హిందూత్వ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కారణంగానే బీజేపీకి ఆయన అంటే పడదు. ఈ కారణంగానే బీజేపీ ద్రావిడ రాష్ట్రాలపై ఇప్పటికీ పట్టు సాధించలేక పోతోంది. దక్షిణాదిలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం సైద్ధాంతిక వాదనలకుగాని, విగ్రహ విధ్వంసానికి గానీ బీజేపీ నేతలు ఇంతకాలం దూరంగా ఉంటూ వచ్చారు. పెరియార్ తన ఆశయాల లక్ష్య సాధన కోసం 1916లో ఏర్పడిన ‘జస్టిస్ పార్టీ’లో 1939లో చేరారు. 1944లో ఆ పార్టీని ‘ద్రావిడదార్ కళగం’గా మార్చారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజికోద్యమానికే ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల రాజకీయాలు కూడా ముఖ్యమేనంటూ అందులో నుంచి 1949లో సీఎన్ అన్నాదురై నాయకత్వాన డీఎంకే పుట్టింది. దాని నుంచి అన్నాడీఎంకే ఆవిర్భవించింది. మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగమ్, పెరియార్ ద్రావిడదార్ కళగమ్, థాంతై పెరియార్ ద్రావిడదార్ కళగమ్, ద్రావిడదార్ విద్యుత్తలై కళగమ్ పార్టీలు పుట్టుకొచ్చాయి. పుట్టుకతోనే ధనవంతుడైన పెరియార్ (తండ్రి కన్నడ వ్యాపారి) ఈరోడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1925 వరకు కొనసాగారు. తాను ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే సొంతంగా సామాజిక ఉద్యమం చేపట్టడమే మార్గం అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. -
విగ్రహాల ధ్వంసంపై స్పందించిన అమిత్షా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్షా స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అని అన్నారు. ఈ ధ్వంసానికి పాల్పడిన వారిలో తమ పార్టీ వ్యక్తి ఉన్నా మరే పార్టీ వ్యక్తి ఉన్నా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడు పెరియార్ విగ్రహాన్ని కొంతమంది కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పెద్ద మొత్తంలో ఘర్షణలు చెలరేగాయి. వీటి ధ్వంసానికి బీజేపీనే కారణం అని పలుచోట్ల చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమిత్ షా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘విగ్రహాల ధ్వంసం అనేది చాలా దురదృష్టకరం. ఒక పార్టీగా ఇలాంటి సంఘటనలకు ఏమాత్రం మద్దతు ఇవ్వబోం. తమిళనాడు, త్రిపురలోని మా పార్టీ కార్యకర్తలతో సంఘాలతో నేను మాట్లాడాను. ఒక వేళ ఎవరైనా బీజేపీకి సంబంధించిన వ్యక్తి విగ్రహాల ధ్వంసంలో ఉన్నట్లు తెలిస్తే వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అమిత్షా హెచ్చరించారు. -
కోట్ల విలువ చేసే విగ్రహాలు మాయం..
సాక్షి, తిరువొత్తియూరు: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తంజావూరు బృహదీశ్వర ఆలయంలో రాజరాజచోళన్, రాణి లోకమాదేవి కోట్ల విలువ చేసే బంగారం, పంచలోహ విగ్రహాలు అదృశ్యమైనట్లు తనిఖీల్లో తెలిసింది. రాష్ట్రంలోని పలు ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో విగ్రహాలు మాయం అవుతున్నాయి. వీటిపై ఫిర్యాదు అందడంతో మద్రాసు హైకోర్టు రాష్ట్రంలో విగ్రహాలకు సంబంధించి ఐజీ పొన్మాణిక్యవేల్ నేతృత్వంలో విగ్రహాల చోరీలపై విచారణ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విగ్రహాల తనిఖీ కోసం 250కు పైబడిన పోలీసులను నియమించారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బృహదీశ్వర ఆలయంలో ఉన్న రాజరాజచోళన్, రాణి లోకమాదేవి బంగారు విగ్రహాలు అదృశ్యమై ఉన్నట్టు తెలిసింది. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి ఆలయ నిర్వాహకులు జాయింట్ కమిషనర్ మాజీ కార్యదర్శులు సహా నలుగురిని అరెస్టు చేశారు. -
రెండేళ్లు.. రూ.6 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్కు చెందిన భల్కీ గ్యాంగ్ అది.. దేవాలయాల్లోని పురాతన పంచలోహ విగ్రహాలే దాని టార్గెట్.. రెండేళ్లలో 3 రాష్ట్రాల్లోని తొమ్మిది ఆలయాల్లో రూ.6 కోట్ల విలువైన 11 విగ్రహాలు తస్కరించింది.. కామారెడ్డిలో రూ.3 కోట్ల విలువైన 3 విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారంలోనే హైదరాబాద్ నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు ఈ ముఠా చిక్కింది. మొత్తం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. గుడి దొంగల అడ్డా భల్కీ.. కర్ణాటక బీదర్ జిల్లా సమీపంలోని భల్కీ ప్రాంతం గుడి దొంగలకు కేరాఫ్ అడ్రస్. ఢిల్లీ, మహారాష్ట్రలకు చెందిన పురాతన వస్తువుల స్మగ్లర్లు భల్కీ వాసులకు డబ్బు ఆశ చూపి దొంగలు గా మారుస్తున్నారు. చోరీ చేయడం తేలిక కావడం.. కొనేవారూ సిద్ధంగా ఉండటంతో భల్కీ గ్యాంగ్స్ ఏళ్లుగా పల్లె లు, పట్టణ శివార్లలో ని ఆలయాల్లో పురాతన పంచలోహ విగ్రహాలను దొంగతనం చేసి వాటిని ఢిల్లీ, మహారాష్ట్ర ముఠాలకు అమ్మేస్తున్నారు. భల్కీకి చెందిన ముఠాల్లో షేక్ హైదర్ గ్యాంగ్ ఒకటి. గతంలో హైదర్ చాంద్రాయణగుట్టలో దినసరి కూలీగా పనిచేశాడు. ఆ సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన ఖాసింతో పరిచయమైంది. కర్ణాటకలో చోరీలు మొదలెట్టి.. ఖాసింతో జట్టు కట్టిన హైదర్ కర్ణాటకలోని బాగల్కోట్, బీజాపూర్ల్లోని 3 దేవాలయాల్లో దొంగ తనాలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. బెయిల్పై బయటకొచ్చిన హైదర్ తమ ప్రాంతానికే చెందిన షేక్ ఎజాజ్తో జోడీ కట్టాడు. కర్ణాటకలో కేసులు ఉండటంతో ఈ ద్వయం మహారాష్ట్రను టార్గెట్ చేసుకుంది. గతే డాది ఔరంగాబాద్, లాథూర్ జిల్లాలోని ఖిల్లారీ, ఝాన్సీలో దొంగతనాలకు పాల్పడింది. ఈ విగ్రహాలను హైదరాబాద్ తీసుకువచ్చి విగ్రహాల స్మగ్లర్లకు నామమాత్రపు ధరకే అమ్మేసింది. మహారాష్ట్రలో నిఘా పెరగడంతో వీరి కన్ను తెలంగాణపై పడింది. దోమకొండలో సాధ్యం కాకపోవడంతో కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో ఓ పురాతన దేవాలయం ఉన్న విషయం తెలుసుకున్న హైదర్, ఎజాజ్ గత శుక్రవారం అక్కడకు చేరుకున్నారు. ఆలయం లోపలకు వెళ్లేందుకు అను మతి లేక తిరిగి వచ్చేశారు. కామారెడ్డిలోనే బస చేసిన ఈ ద్వయం మరుసటి రోజు రాత్రి కామారెడ్డిలోని గోపాలస్వామి ఆలయంలోని వేణుగోపాలస్వామి, రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు తస్కరించి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ దేవాలయానికి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. పాత ‘మిత్రుడి’ సమాచారంతో.. పాత నేరగాళ్లపై దృష్టి పెట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు చాంద్రాయణగుట్టలో ఉన్న ఖాసింను పిలిపించారు. సీసీ కెమెరాల ఫీడ్లోని అనుమానితుల్ని చూపించగా.. హైదర్ను గుర్తించాడు. ఈ నేపథ్యంలో ఓ లాడ్జిలో బస చేసిన హైదర్, ఎజాజ్ ఆదివారం పోలీసులకు చిక్కారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు విగ్రహాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్లు ఉంటుందని తేల్చారు. నిందితులతో పాటు సొత్తును కామారెడ్డి పోలీసులకు అప్పగించారు. -
పంచలోహ విగ్రహాల అపహరణ
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు 700 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహాలు శనివారం సాయంత్రం అపహరణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దబజార్లో గల వేణుగోపాలస్వామి (శ్రీకృష్ణుడు) ఆలయానికి దాదాపుగా 700 ఏళ్ల చరిత్ర ఉంది. శనివారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారి పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి వస్తానని గడియ వేసి వెళ్లాడు. కొద్దిసేపట్లో తిరిగి వచ్చేసరికి ప్రధాన విగ్రహాల ముందు ఉంచిన శ్రీ కృష్ణుడు, రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు కనిపించకుండా పోయాయి. దుండగులు మరే వస్తువులను ముట్టుకోకుండా కేవలం పంచలోహ విగ్రహాలను మాత్రమే అపహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఆలయం చుట్టూ గృహాలు ఉన్నాయి. సాయంత్రం వేళ ఆలయంతో పాటు కాలనీలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విగ్రహాలు అపహరణకు గురైన నేపథ్యంలో.. ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే చేసి ఉంటారని భావిస్తున్నారు. చోరీకి గురైన విగ్రహాల బరువు 75 కిలోల వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ ప్రసన్నరాణి, సీఐ శ్రీధర్కుమార్ ఆలయానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. డాగ్స్క్వాడ్ బృందాన్ని తెప్పించి తనిఖీలు ప్రారంభించారు. అపహరణకు గురైన పంచలోహ విగ్రహాల విలువ బయట మార్కెట్లో కోటికి పైగా ఉండవచ్చని ఆలయాన్ని నిర్మించిన వారి వంశీయులు చెబుతున్నారు. -
కోయంబత్తూరులో ‘అమ్మ’ విగ్రహం
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కోయంబత్తూరులో ఆదివారం తొలి విగ్రహం ఏర్పాటైంది. ఈ విగ్రహాన్ని నగరాభివృద్ధిశాఖ మంత్రి ఎస్పీ వేలుమణి ఏర్పాటు చేయించారు. ‘అమ్మ’ మరణించి ఏడాది కావస్తున్నా ఇంతవరకు అధికారికంగా ఎక్కడా ఆమెకు విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మెరీనా తీరంలో స్మారక మందిరం నిర్మాణం తర్వాత విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కోయంబత్తూరులో ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఇందుకోసం మంత్రి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయించారు. కోయంబత్తూరు–అవినాశి మార్గంలో శనివారం సాయంత్రం వరకు దివంగత సీఎం అన్నాదురై విగ్రహం మాత్రమే ఉండగా ఆదివారం ఉదయాన్నే ఎంజీఆర్, జయలలిత నిలువెత్తు విగ్రహాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన వేడుకలో ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి పళనిస్వామి ఆవిష్కరించారు. ఈ మూడు కాంస్య విగ్రహాలు ఒకే ఎత్తులో, ఒకే వర్ణంతో, ఒకే బరువుతో ఏర్పాటు చేయడం విశేషం. -
కార్తీకమాసంలో శివుడికి పరాభవం
-
అపచారం.. అహంకారం
కార్తీక మాసంలో హిందువులు శివారాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి పరమశివుడికి కార్తీక మాసంలోనే పరాభవం ఎదురైంది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఇలాకాలో ఇది జరిగింది. కొవ్వూరు రూరల్: కొవ్వూరు పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీనివాస స్నానఘట్టంలో భక్తులు ఏర్పాటు చేసుకున్న శివలింగాన్ని మంగళవారం పోలీసుల సహకారంతో అధికారులు తొలగించడం వివాదాస్పదం అయింది. చెప్పులతోనే సిబ్బంది విగ్రహాలు తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. విగ్రహాల తొలిగింపుపై ఆందోళనకు దిగిన స్థానికులకు వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన జిల్లా వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్ను, పలువురు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కి తరలించారు. సోమవారం అర్ధరాత్రే పోలీసుల సాయంతో అధికారులు విగ్రహాన్ని తొలగించడానికి వెళ్లారు. స్థానికులు ప్రతిçఘటించడంతో అధికారులు వెనుతిరిగారు. మంగళవారం గణపతి హోమం నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తరుణంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి బలవంతంగా శివలింగాన్ని, గణపతి, నంది విగ్రహాలతో పాటు, శివుడికి ప్రార్థన చేసే రావణబ్రహ్మ విగ్రహాలను తొలగించడానికి పూనుకున్నారు. తొలగించిన విగ్రహాలను వ్యాన్లో ధవళేశ్వరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయా నికి తరలించారు. రావణబ్రహ్మా విగ్రహాన్ని మాత్రం పూర్తిగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దాంతో వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో సుమారు మూడు గంటల పాటు స్టేషన్ ఎదుటే ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి మొయిన్ రోడ్డు మీదుగా ఫ్యాక్టరీ రోడ్డు నుంచి సంఘటనా స్థలం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండి పట్టాభిరామారావు (అబ్బులు)ని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. దీంతో నాయకులు ఆంధ్రాషుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వ తీరుపై నాయకులు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించారని అన్నారు. ఆర్డీవోని కలిసి సోమవారం వినతిప్రతం అందజేశామని, కనీసం పరిగణనలోకి తీసుకోకుండా విగ్రహం తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్తీక మాసంలో శివలింగం, గణపతి, నందీశ్వరుడి విగ్రహాలను తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. టూరిజం పేరుతో మంత్రి, అతని అనుయాయులు ఆక్రమించా లనుకున్న 9 ఎకరాల స్థలంలో కొద్ది సెంట్ల స్థలంలో ఉన్న శివలింగమే అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు. తక్షణమే తొలగించిన విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేయాలని డిమాండు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ మాట్లాడుతూ పవిత్రమైన గోదావరి తీరంలో 2003 పుష్కరాల్లో దొరికిన అతి పురాతన శివలింగాన్ని భక్తులు ప్రతిష్టించుకుంటే, అధికారులు తొలగించడం దారుణమన్నారు. టూరిజం అభివృద్ధి పేరుతో భక్తుల మనోభావాలను కాలరాయడం సమజసం కాదన్నారు. దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఎక్సైజ్శాఖ మంత్రి తీసుకునే నిర్ణయాలకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకవద్దని హితవు పలికారు. పర్యాటక అభివృద్ధి పేరుతో నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసేయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మండల పార్టీ అధ్యక్షుడు గురుజు బాలమురళీకృష్ణ, నాయకుడు ముదునూరి నాగరాజు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. శ్రీనివాసపురం స్నానఘట్టానికి అడ్దంగా మట్టి గుట్టలు పోయడంపై స్ధానికులు మండిపడ్డారు. మత్య్సకారులతో పాటు స్థానికులు రోడ్డుపైకి చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు గంటసేపు రోడ్డుపైనే వనితతో పాటు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసు అధికారుల సూచనలతో స్నానఘట్టానికి అడ్డుగా వేసిన మట్టి గుట్టలు తొలగించడంతో పరిస్థితి చక్కబడింది. బుధవారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని పట్టణ సీఐ ఎస్బీవీ శుభాకర్ హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. పార్టీ జిల్లా కార్యదర్శులు కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, కాకర్ల నారాయుడు, చాగల్లు, తాళ్లపూడి మండల పార్టీ అధ్యక్షులు కొఠారు అశోక్బాబా, కుంటముక్కల కేశవనారాయణ, పట్టణ అధ్యక్షుడు రుత్తల ఉదయ భాస్కరరావు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి లకంసాని శ్రీనివాసరావు, కార్యదర్శి ముళ్లపూడి కాశీవిశ్వనాధ్, జిల్లా రైతు విభాగం నాయకులు గన్నిన రత్నాజీ, నాయకులు వర్రే శ్రీనివాస్, వరిగేటి సుధాకర్, కొయ్యల భాస్కరరావు, నగళ్లపాటి శ్రీనివాస్, చిలంకుర్తి బాబి లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. -
నీరు అని తాకితే.. శిలలయ్యాయి
-
నీరు అని తాకితే.. శిలలయ్యాయి
ఓ ముని శాపం కారణంగానో లేదా ఓ మాయ ప్రయోగం చేతనో లేదా ఏదైనా తాకకూడని వస్తువును తాకడం వల్ల జీవులు శిలలుగా మారడం మనం సినిమాల్లో చూసి ఉంటాం. కానీ భూమ్మీద నిజంగానే అలా తాకగానే శిలగా మార్చేసే ప్రదేశం ఉంది. అదే ఆఫ్రికాలోని టాంజానియాలో గల నాట్రాన్ సరస్సు. అక్కడి నీటిని తాకిన ప్రతి జీవి శరీరంలోని కణ కణాన్ని రాతి శిలగా మార్చేస్తుంది ఈ సరస్సు. ఈ సరస్సును సందర్శించిన ఓ ఫోటోగ్రాఫర్ నీటిని తాకగానే అక్కడికక్కడే శిలలైపోయిన పక్షులను చూసి షాక్కు గురయ్యారు. తనకు కనిపించిన ప్రతి జీవి ఫోటోను కెమెరాలో బంధించారు. శరీరం రాతిగా మారిపోతున్న సమయంలో ఆ పక్షులు పడిన నరకయాతన ఆయన తీసిన చిత్రాల్లో కనిపిస్తుంది. ఈ ఫోటోలన్నీ తన ఫొటో పుస్తకం 'అక్రాస్ ది రవగేడ్ ల్యాండ్'లో పొందుపర్చాడు. సరస్సు ఇంత ప్రమాదకారిగా మారడానికి కారణం దానికి చేరువలో ఉన్న అగ్నిపర్వతంగా భావిస్తున్నారు. అగ్నిపర్వత అంతర్భాగం నుంచి వచ్చి సరస్సులో కలుస్తున్న సోడియం కార్బోనేట్, సోడియం బై కార్బోనేట్ల ప్రభావంతోనే జీవులు శిలలుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా సరస్సు రంగు కూడా లేత గులాబీ వర్ణంలోకి మారిపోయింది. కాగా, సరస్సులోని నీరు ఎప్పుడూ 140 డిగ్రీల వేడితో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
రూ. 500 కోట్ల విలువైన విగ్రహాలు స్వాధీనం
తండ్రీకొడుకుల అరెస్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆలయాల నుంచి రూ. 500 కోట్ల విలువైన విగ్రహాలను దొంగలించిన కేసులో నిందితులైన వల్లభ ప్రకాశ్, ఆదిత్య ప్రకాశ్ అనే తండ్రీకొడుకులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాల్లోని విగ్రహాలు చోరీకి గురవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు లు అందుతున్నారుు. 50 ఏళ్లలో తమిళనాడుకు చెందిన సుమారు వెయ్యికిపైగా విలువైన విగ్రహాలు విదేశాలకు తరలిపోయినట్లు తెలుసు కున్నారు. ఈ నేపథ్యంలో చోరీ నిరోధక ఐజీ పొన్ మాణిక్యం విగ్రహా ల అన్వేషణలో భాగంగా ముంబైకి చేరుకుని అక్కడి ఇండో-నేపాల్ ఆర్ట్ సెంటర్కు వెళ్లారు. అక్కడ ప్రదర్శి తమై ఉన్న కొన్ని విగ్రహాలు తమిళనాడుకు చెందినవిగా గుర్తించారు. ప్రత్యేక దళాలను రప్పించి మంగళవారం ఆర్ట్ సెంటర్ను ముట్టడించారు. నిర్వాహకులు వల్లభ ప్రకాశ్, ఆదిత్య ప్రకా్శ్లను అరెస్ట్ చేశారు. ఈ ఆర్ట్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ ప్రపంచ మార్కెట్లో రూ.500 కోట్లని అధికారులు చెబుతున్నారు. -
గణపతి బొప్పా మోరియా
-
వరములివ్వు గణేశా!
-
విగ్రహాల ధ్వంసం నీతిమాలినచర్య
* దుండగులను కఠినంగా శిక్షించాలి * మర్రి, బొల్లా డిమాండ్ వినుకొండ టౌన్: దివంగత ముఖ్యమంత్రి, పేదల సంక్షేమం కోసం పోరాడిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చెయ్యి విరగ్గొట్టడం దుర్మార్గపు చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని ఆశా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన మహానేత రాజన్న విగ్రహ ఎడమ చెయ్యిని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై పార్టీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం పార్టీ శ్రేణులు వెంట కదలిరాగా బొల్లా, మర్రి రాజశేఖర్లు రాజన్న విగ్రహం వద్దకు చేరుకుని ఇటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డ దుండగులను శిక్షించాలంటూ కర్నూలు– గుంటూరు రాష్ట్ర రహదారిపై ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అధికారం అండ చూసుకుని విద్రోహ చర్యలకు దిగటం, మహా నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయటం నీతిమాలిన చర్యని విమర్శించారు. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అధికార పార్టీకి చెందినవారు.. ప్రతిపక్షానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం చెయ్యిని విరగ్గొట్టిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని, లేకుంటే జిల్లా స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదని, ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తోందని చెప్పారు. పట్టణంలో మాఫియా గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోయాయన్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిందితులను అదుపులోకి తీసుకుంటాం... వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆషా థియేటర్ సెంటర్లో రెండు గంటల పాటు కొనసాగిన ధర్నాతో రాష్ట్ర రహదారిపై వాహనాలు బారులుతీరాయి. రూరల్ సీఐ టీవీ శ్రీనివాసరావు, ఎసై ్సలు నారాయణ, శివాంజనేయులు పార్టీ నాయకులకు నచ్చజెప్పి నిందితులను అరెస్ట్ చేస్తామని హామి ఇచ్చి ధర్నా విరమింపజేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు బాంధవుడు రాజన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన సమాచారం తెలుసుకున్న డీసీసీ మక్కెన అక్కడికి చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. -
సందడే సందడి
-
జై బోలో ఎకో ఫ్రెండ్లీ వినాయక్ కీ!
-
చవితికి సిద్ధమైన గణనాథులు
-
విగ్రహాలు తొలగించాలని ఆందోళన
రంగారెడ్డి జిల్లా కందుకూరు పట్టణ చౌరస్తాలో శ్రీశైలం రహదారిపై ఉన్న విగ్రహాలను తొలగించి ప్రమాదాలను నివారించాలని వ్యాపార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఆందోళన నిర్వహించారు. కందుకూరు మండల సర్వసభ్య సమావేశం జరుగున్నందున సమావేశ మందిరం వరకూ ర్యాలీగా వెళ్లి విగ్రహాలు తొలగించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తిచేశారు. విగ్రహాలను సాధ్యమైనంత త్వలో తొలగిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
దేవతలారా మన్నించండి..!
స్నాన ఘాట్ల వద్ద పడేసిన దేవతల విగ్రహాలు అమరావతి (గుంటూరు రూరల్): నిత్యం పూజలందుకునే దేవతల విగ్రహాలు ఎండకు ఎండి భక్తులు స్నానాలు చేసిన నీటితో తడిసి పోతున్నాయి. దేవాలయంలో ఉంటే నిత్యం పూజలు చేసే భక్తులు స్నానాల ఘాట్ వద్ద పడివున్న విగ్రహాలను మాత్రం పట్టించుకునే స్థితిలో లేరు. అమరావతిలోని అమరేశ్వర ఘాట్ వీఐపీ ఘాట్ వద్ద కృష్ణమ్మతల్లి, కనకదుర్గ, వినాయకుడు తదితర దేవతల విగ్రహాలు ఎర్రని ఎండలో ఎండుతున్నా అటు అధికారులు, సేవకులు, భక్తులు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో భక్తులు పుణ్య స్నానాలను అచరించి వాటి వద్దే వస్త్రాలను సైతం ఆరవేశారు. -
మొదలైన వినాయక విగ్రహాల సందడి
జోగిపేట :వినాయక చవితి పండగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాలు గ్రామాలకు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చవితి నిర్వహించనున్నారు. పండగకు 20 రోజుల ముందే విగ్రహాలను తీసుకువెళుతున్నారు. జోగిపేట, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట ప్రాంతాలకు కూడా విగ్రహాలను తీసుకువస్తుంటారు. ఈ సారి వినాయక విగ్రహాల రేట్లు బాగా పెరిగినట్లు కొనుగోలు దారులు తెలిపారు. 4, 5 అడుగుల వినాయక విగ్రహాలు రూ.14వేల వరకు పలుకుతున్నాయని కొనుగోలు దారులు తెలిపారు. -
ఇదేం న్యాయం బాబూ..!
జూలై14వ తేదీ రాత్రి... రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్నాయంటూ జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహాలను అధికారులు తొలగించారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆపార్టీ కార్యకర్తలు ప్రతిష్ఠించి, ఆవిష్కరించారు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. మండల కేంద్రమైన అమరావతి మద్దూరు డౌన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలను చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. విశేషమేమంటే.. ఎలాంటి అనుమతులు లేకుండా తెలుగు తమ్ముళ్లు శనివారం రాత్రి దిమ్మె కట్టిస్తున్నారని అధికారులకు వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సోమవారం ఉదయం హడావిడిగా టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేపట్టారు. దీంతో తమవారికో న్యాయం... ఇతరులకో న్యాయం.. అంటూ వాపోతున్నారు. ప్రజానీకం ఇదేం పాలన ‘బాబూ?’ అని ప్రశ్నిస్తున్నారు. – అమరావతి -
ఇదెక్కడి న్యాయం?
సాక్షి, విజయవాడ : విజయవాడ నగరంలో ఆక్రమణలు, విగ్రహాల తొలగింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. ఓ సామాజికవర్గంపై ప్రేమ చూపుతున్న పాలకులు, అధికారులు ఇతర వర్గాలకు సంబంధించి దారుణంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 40 ఆలయాలను కూల్చివేసిన ప్రభుత్వం తాజాగా పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లోని స్వాతంత్య్ర సమరయోధుడు టి.వి.ఎస్.చలపతిరావు విగ్రహాలను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత అమానుషంగా తొలగించింది. ఇప్పుడు నగర వాసులు ఏ ఇద్దరు కలిసినా విజయవాడలో జరుగుతున్న ఈ అరాచకంపైనే చర్చిస్తున్నారు. అరాచక పాలన విజయవాడ రూపురేఖలను సమూలంగా మార్చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆలయాల విధ్వంసం, విగ్రహాల తొలగింపు అరాచకపాలనను తలపిస్తోంది. ఒక సామాజికవర్గానికి, టీడీపీ వారికి ఒక న్యాయం, ఇతరులకు వేరొక న్యాయంలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కెనాల్ రోడ్డులోని సెంట్రల్ వాటర్ కమిషన్కు చెందిన జలభవన్ను అడ్డగోలుగా కూల్చివేశారు. చివరికి ఆ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో పని చేసేందుకు ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. గోశాల, కృష్ణాతీరంలో సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఆలయానికి హైకోర్టు స్టే ఉన్నా అడ్డగోలుగా కూల్చివేశారు. కృష్ణా నదీతీరంలో ఉన్న అనేక మంది పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు తమ ఇళ్లు కూల్చవద్దంటూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా అధికారులు పట్టించుకోలేదు. వారి ఇళ్లను కూల్చివేశారు. ఎన్టీఆర్ విగ్రహాలు కనిపించవా? ఆలయాలు, పేదల ఇళ్లు, ప్రభుత్వ భవనాలను అడ్డగోలుగా కూలుస్తున్న అధికారులు ఓ సామాజికవర్గం, టీడీపీ నాయకుల ఆస్తులవైపు మాత్రం కన్నెత్తి చూసేందుకే భయపడుతున్నారు. పటమట సర్కిల్, అజిత్సింగ్నగర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఇవి ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉండడంతో తరచూ వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాటిని తొలగించే సాహసం అధికారులు చేయడంలేదు. రామవరప్పాడు రింగ్ రోడ్డులో టీడీపీ కార్పొరేటర్కు చెందిన ఒక హోటల్ ఉంది. ఇన్నర్ రింగ్రోడ్డుకు స్థలం అవసరమైన సమయంలో అధికారులు ఆ హోటల్ భవనం తొలగించకుండా, సమీపంలోనే ఉన్న మసీదు, పూరి పాకలను తొలగించడంపై గతంలో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక బందరు రోడ్డులో ఒక ప్రయివేటు కార్యాలయ భవనం ఉంది. రోడ్డు విస్తరణ కోసం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని భవనాలను తొలగించిన అధికారులు, ఆ ప్రయివేటు కార్యాలయ భవనాన్ని మాత్రం వదిలేశారు. ఆ భవనం తొలగింపునకు కోర్టు స్టే ఇబ్బంది అయితే, కెనాల్ రోడ్డులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన జల భవన్ను స్టే ఉన్నా ఎందుకు తొలగించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే కోర్టు ఉత్తర్వులు ట్రాఫిక్ ఇబ్బందుల కంటే కక్ష సాధింపు చర్యలే కీలకంగా మారాయని నగర ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు కంటే వైఎస్సారే మేలు ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే వైఎస్సారే మేలని ఆ పార్టీకి చెందిన ఒక ఎమెల్సీ ఇటీవల బహిరంగంగానే వాపోయారు. ఆ ఎమ్మెల్సీ కుటుంబానికి గతంలో ఇంద్రకీలాద్రిపై ఆరు దుకాణాలు ఉండేవి. అప్పట్లో ఇంద్రకీలాద్రిపై దుకాణాలను తొలగించాలని అధికారులు భావించినప్పుడు వ్యాపారులంతా తమ జీవనోపాధి పోతుందని స్థానిక కాంగ్రెస్ నేతల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్తే, వాటి జోలికి వెళ్లకుండా దుకాణాలను కొనసాగించారని ఆ ప్రజాప్రతినిధి గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తాను బీసీ సామాజికవర్గానికి చెందిన వాడినని కూడా చూడకుండా తమ ఆరు దుకాణాలను ఈ ప్రభుత్వం కూలగొట్టించిందని ఆవేదన చెందారు. ఇప్పుడు కూడా తమ ఇంటి రేటు తగ్గించేందుకు అర్జున వీధిని రాజవీధిగా ప్రకటించి వాహనాలు రాకపోకలకు సర్వీస్రోడ్డు వేయడం ద్వారా ఈ ఏరియాలో భవనాలు రేట్లు తగ్గేలా ప్రభుత్వం చేస్తోందంటూ తన సన్నిహితుల వద్ద ఆ నేత పేర్కొంటున్నారు. గోశాల వద్ద పరిశీలనకు వచ్చిన బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలోనూ పై అంశాలను ఆ నాయకుడు ప్రస్తావించడం గమనార్హం. -
బాలాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ
యాదగిరికొండ: యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని బాలా లయంలో గురువారం వేద మంత్రాల నడుమ విగ్రహాలప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఉదయం 9.59 గంటలకు బంగారు కవచ మూర్తులను త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి పూజలు కొనసాగించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకారం చేశారు. స్వామి అమ్మవార్లకు తిరుమంజనస్నపనం చేసి పట్టువస్త్రాలను ధరింపజేశారు. సకల దేవతలను ఆవాహనం చేసిన కలశాలను గర్భాలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ గావించారు. చినజీయర్స్వామి చేతుల మీదుగా హవనం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం చినజీయర్ ఆధ్వర్యంలో అర్చకులు, రుత్విక్కులు, గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల అనుమతి తీసుకుని బంగారు కవచ మూర్తులను ఆలయ తిరువీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు పూజలు నిర్వహించారు. యాదాద్రి చరిత్రలో నిలుస్తుంది... యాదాద్రి దేవస్థానం చరిత్రలో నిలిచి పోతుందని చినజీయర్ స్వామీజీ అన్నారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తులకు ప్రవచనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ఆలయం నిర్మిస్తే ప్రపంచంలో నరసింహ స్వామి ఆలయం ఎక్కడా అంటే ఇదే గుర్తుకు రావాలన్నారు. భక్తులకు కొంగు బంగారంగా ఉన్న ఈ ఆలయం మున్ముందు ఎంతో మందికి ఉపాధి చూపిస్తుందన్నారు. మనకు ఎంత తోడు ఉన్నా భగవంతుడి తోడు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత వరకు దేవాలయాల నుంచి మాత్రమే డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టడమే లక్ష్యం గా ప్రభుత్వాలు పనిచేస్తే.. కేసీఆర్ మాత్రం ప్రభుత్వ డబ్బుతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించే అంశం అని పేర్కొన్నారు. ఏడాదిలోపే పనులు పూర్తి ఏడాదిలోపే యాదాద్రి పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. యాదాద్రిని సుమారు కొన్ని వందల సంవత్సరాల దాకా చెక్కు చెదరకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. -
అమ్మకానికి రాములోరి విగ్రహాలు..!
♦ జార్జియాకు ‘పంచలోహా’లు ♦ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం ♦ నేడో, రేపో శ్రీరామా నిలయం అప్పగింత భద్రాచలం: ఏళ్లుగా శ్రీరామ ప్రచారరథంలో ఊరేగుతూ, భక్తుల పూజలందుకున్న సీతారామలక్ష్మణ సమేత పంచలోహ విగ్రహాలు యూఎస్ఏలోని జార్జియాకు తరలిపోనున్నాయి. ఈ విగ్రహాలను అక్కడ నిర్మిస్తున్న రామాలయానికి అమ్మేందుకు ఆలయ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. చరిత్ర కలిగిన భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గర్భగుడిలోని సీతారామలక్ష్మణ సమేతంగా ఉన్న మూలమూర్తులను పోలిన రెండు జతల పంచలోహ విగ్రహాలను గతంలో తయారు చేయించారు. అందులో ఒకదానిని శ్రీరామ ప్రచార రథంలో ఉంచగా, మరొకటి మొన్నటి వరకు ఈవో చాంబర్లో ఉండేది. రెండేళ్ల క్రితం చింతూరు మండలంలో జరిగిన ప్రమాదంలో శ్రీరామరథం పూర్తిగా ధ్వంసమైంది. కొత్త రథాన్ని తయారు చేయించకపోవడంతో అందులోని పంచలోహ విగ్రహాలను యాగశాలలో ఉంచారు. ప్రస్తుతం ఆ విగ్రహాలు రామాలయ ప్రాంగణంలోని గోశాల పక్కన ఉన్న ఆంజేయ స్వామి ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు. కాగా, యూఎస్ఏలోని జార్జియాలో భద్రాద్రి ఆలయం ఆకృతిలోనే ‘ శ్రీ సీతారామ టెంపుల్ ఆఫ్ జార్జియా’ పేరిట ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చిన ప్రతినిధులు భద్రాచలం దేవస్థానంలో ఉన్న పంచలోహ విగ్రహాలను తమకు ఇవ్వాలని కోరారు. విగ్రహాలు ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్న 108 ప్రధాన ఆలయాల్లో వాటి కి పూజలు చేయించి, తాము నిర్మించే రామాలయంలో ప్రతిష్ఠించుకుంటామని కోరారు. అందుకు ప్రతిగా వేరే విగ్రహాలు చేయించి అందజేస్తామని, తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు. దీనిపై దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ఇక్కడి వైదిక కమిటీ సలహా కోరారు. ఈ క్రమంలో విగ్రహాలను జార్జియాకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఒక్కొక్కటీ ప్రైవేటుపరం.. భద్రాచలం రామాలయానికి ఏటా రూ.25 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. ఉత్సవాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు ఇం దులో నుంచే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆలయాభివృద్ధి జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని సాకుగా చూపుతూ దేవస్థానానికి సంబంధించిన పలు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. గతంలో భక్తరామదాసు జయంతోత్సవాలను ఐదు రోజులు కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. తాజాగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న శ్రీరామనిలయం (60 గదులతో ఉన్న సత్రం)ను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు యోచిస్తున్నారు. ఇలాంటి చర్య లు నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.. జార్జియా నుంచి ప్రతినిధులు పంచలోహ విగ్రహాలు కావాలని కోరారు. దీనిపై వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. శ్రీరామనిలయం సత్రం నిర్వహణ భారంగా ఉంది. దాని ఆదాయ వ్యయాలపై లెక్కకట్టి ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. -కూరాకుల జ్యోతి, ఆలయ ఈవో -
సమ్మక్క-సారలమ్మ వందనం అమ్మలు
మేడారం జాతర. రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నమి) రోజుల్లో జరిగే జాతర. గిరిజన సంప్రదాయాలకు పట్టం కట్టే జాతర. ఆసియాలోనే అతి పెద్ద వనజాతర. ఈ జాతర సమయంలో కోటి మందికిపైగా వచ్చే భక్తులతో అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది. మొక్కులతో ముడుపులతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఈ నెల ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది. గిరిజనుల గుడులు నిరాడంబరమైనవి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మల గుళ్లు కూడా గుడిసెలుగానే ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్తగా కప్పడం (గుడి మెలిగె) ఆనవాయితీ. ఈ ప్రక్రియతోనే జాతర తొలి పూజా కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడెసెలు లేకున్నా జాతరకు రెండు వారాల ముందు ‘గుడి మెలిగె’ను నిర్వహిస్తారు. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీన్ని ‘మండ మలిగె’ అంటారు. గుడి మెలిగె, మండ మెలిగె కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. ‘మండ మెలిగె’ మరుసటి రోజున గొర్రెను దేవతలకు బలి ఇచ్చి పూజారులు (వడ్డె), గ్రామపెద్దలు పండగ నిర్వహిస్తారు. ఇదే రోజున సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు. విగ్రహాలు లేని పూజ మేడారం జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. సమ్మక్క-సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండకపోవడమే ఆ ప్రత్యేకత. ఇక్కడున్న రెండు గద్దెల్లో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తారు. వీటి మధ్య ఉండే చెట్టు కాండాల (నారేప)నే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంకమొదళ్లు ఇక్కడ దేవతామూర్తులు. వీరు పసుపు, కుంకుమల స్వరూపాలు. దేవతల గద్దెపై లభించే కుంకుమతో మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. దేవతామూర్తులను తోడ్కొని వచ్చే వడ్డెలు తమ పైనుంచి దాటుకుంటూ వెళితే జన్మ సార్థకమవుతుందని భక్తులు సాష్టంగపడతారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు ఎత్త్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. ఇది దేవతలకు ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు. మేడారం వచ్చే భక్తుల్లో గిరిజనులు, పేదలే ఎక్కువగా ఉంటారనే భావనతో విలువైన కానుకలు, మొక్కులు ఇక్కడ లేవని చెబుతుంటారు. మొక్కులు ఫలించి సంతానం కలిగినవారు జాతర వచ్చినప్పుడు ఎత్తు బంగారం సమర్పిస్తారు. కోర్కెలు తీరితే ఎడ్ల బండ్లు కట్టుకుని జాతరకు వస్తామని అమ్మవారి రూపంలో మొహానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడి బియ్యం), ఎదురు కోళ్లు (దేవతను తీసుకు వచ్చేటప్పుడు ఎదురుగా గాల్లోకి ఎగరవేసిన కోళ్లు), లసిందేవమ్మ మొక్కు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ ఉంటాయి. వనం నుంచి వనంలోకి సమ్మక్క-సారలమ్మ జాతర నాలుగు రోజులు జరుగుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు) ఈశాన్య దిశగా ఉన్న చిలుకల గుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వరంగల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం ప్రాంతం మొత్తం శివసత్తుల శివాలుతో, భక్తిపరవశంతో ఊగిపోతుంది. మూడోరోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉంటారు. ఈ రోజు మేడారంలో లెక్కలేనంత మంది భక్తులు మేడారానికి వస్తారు. మొక్కులు సమర్పిస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. - పిన్నింటి గోపాల్, సాక్షిప్రతినిధి, వరంగల్ సమ్మక్క కథ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కోయగిరిజనుల కథనం ఇలా ఉంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం అడవికి వెళ్లినప్పుడు అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టాడు. ఆ పసిపాప గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయి. యుక్త వయసు వచ్చిన సమ్మక్క మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడింది. పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు-సమ్మక్కలకు సారలమ్మ, నాగులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజులతో పెళ్లి జరిగింది. మేడారం ప్రాంతం గోదావరి నదికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడున్న సారవంతమైన భూములును ఆక్రమించేందుకు కాకతీయరాజు రుద్రదేవుడు మేడారంపై దండెత్తాడు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు కాకతీయుల శక్తికి పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. శత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తెల మరణవార్త విన్న సమ్మక్క ధైర్యం కోల్పోకుండా, యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడింది. ఆమె దాటికి తట్టుకోలేని శత్రువర్గంలో ఒకడు వెనుక నుంచి బల్లెంతో పొడిచాడు. తన రక్తంతో తడిస్తే ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుందనే ఉద్దేశంతో తన గాయానికి కట్టు కట్టుకుని శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. గిరిజనులు సమ్మక్క కోసం అరణ్యమంతా గాలించగా నాగవృక్షపు నీడలో ఉన్న పాముపుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణె కనిపించింది. గిరిజనులు ఈ భరిణే సమ్మక్కగా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ జాతర చేసుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు. -
చైనాలో అరుదైన బౌద్ధ మ్యూజియం
బీజింగ్: అరుదైన బౌద్ధ విగ్రహాలతో వచ్చే నెలలో చైనా ఓ మ్యూజియాన్ని ప్రారంభించనుంది. ఇందులో 1500 ఏళ్లనాటి బౌద్ధ విగ్రహాలు కూడా కొన్ని ఉన్నట్లు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ లియు హైతావో తెలిపారు. హెబీ ప్రావిన్సులోని లిన్జాంగ్ కౌంటీలో ప్రారంభించనున్న ఈ మ్యూజియంలో 200కు పైగా విగ్రహాలు ప్రదర్శించనున్నారు. 2012 ప్రారంభంలో 2500 ఏళ్లనాటి చారిత్రక నగరం యెచెంగ్లో(ప్రస్తుత లిన్జాంగ్) బయల్పడిన మూడు వేల విగ్రహాల్లోనివే ఇవి అని జిన్హుమా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నాణ్యతా పరంగా, సంఖ్యా పరంగా ఈ స్థాయిలో వెలుగుచూడడం చాలా అరుదు. -
ఆలయాల్లో చోరీ
రంగారెడ్డి జిల్లాలో దొంగలు దారుణానికి తెగబడ్డారు. జిల్లాలోని వేరు వేరు గ్రామాల్లో ఆలయాల్లో దోపిడీకి పాల్పడిన దుండగులు.. నగదు దోపిడీ చేయడంతో పాటు.. విగ్రహాలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు. కీసర మండలంలోని కీసర దైర, రాంపల్లి దైర ఆలయాల్లో ఈ చోరీలు జరిగాయి. దోపిడీ గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
తెలంగాణలో ఏపీ విగ్రహాల్ని ఎందుకు ఉంచాలి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్గౌడ్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్రను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం దారుణమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మధ్య విద్వేషాలు, రెచ్చగొట్టే చర్యలను ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్రను తొలగిస్తే ఈ గడ్డమీద ఏపీకి చెందిన వారి విగ్రహాలు, కాలనీలకు, పార్కులకు పేర్లు ఎందుకుండాలని ప్రశ్నించారు. విశాలాంధ్ర కోసం కృషి చేసిన బూర్గుల రామకృష్ణారావు, గిరిజన దేవతలైన సమ్మక్క, సారక్కలతోపాటు హైదరాబాద్కు సంబంధించిన అంశాలన్నీ తొలగించాలని పేర్కొనడం దారుణమన్నారు. రెండ్రోజుల్లో ఏపీ ప్రభుత్వం తన చర్యలను ఉపసంహరించుకోకపోతే ప్రతిచర్యలకు దిగుతామన్నారు. ఆంధ్రకు చెందిన వారి పేర్లు, విగ్రహాలు తొలగించాలంటూ సీఎం కేసీఆర్కు, జీహెచ్ఎంసీలకు లేఖలు రాస్తామన్నారు. ఇక్కడున్న వారి విగ్రహాలను తీసుకెళ్లాలని, అవసరమైతే రాష్ట్ర లారీ అసోసియేషన్తో మాట్లాడి రెండున్నర లక్షల లారీలతో రెండు రోజులపాటు ఉచితంగా సర్వీస్ చేయిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై స్పందించని పార్టీల పనిపడతామని హెచ్చరించారు. -
తమిళనాడులో వైఎస్సార్ విగ్రహావిష్కరణలు
హైదరాబాద్ : తమిళనాడులోని తిరువల్లూరు, కృష్ణగిరి జిల్లాలతో పాటు రాజధాని చెన్నై నగరంలో పలుచోట్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహావిష్కరణలు చేపడుతున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలిసి ఆయా ప్రాంతాల్లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులో వైఎస్ రాజశేఖర్రెడ్డిని అభిమానించే వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని.. ఆ పెద్దాయన్ని స్మరించుకుంటూ పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారనితెలిపారు. తమిళనాడులో తెలుగు వారు బాష పరంగా, ఇతరేతరా ఎదుర్కొంటున్న పలు సమస్యలను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరినట్టు కేతిరెడ్డి చెప్పారు. -
శిలలు
కథ - ఎమ్వీ రామిరెడ్డి కర్నూలు పట్టణం దాటాక, ఓ ప్రైవేటు పాఠశాల. పది ఎకరాల విస్తీర్ణంలో స్వస్తిక్ ఆకారంలో భవన సముదాయం. ఎడమవైపు తరగతి గదులు, కుడివైపు బాలబాలికలకు ప్రత్యేక వసతిగృహాలు. ఆడుకోవడానికి విశాలమైన మైదానమూ ఈతకొలనులూ. జాతీయ రహదారి నుంచి పావు కిలోమీటరు లోపలికి ప్రయాణిస్తే, పాఠశాల ప్రధాన ద్వారం వస్తుంది. అక్కడ సెక్యూరిటీ గార్డుల్ని దాటుకుని, లోపలికి వెళ్తే, మరో పెద్దగేటు. తల్లిదండ్రులు వచ్చినా సరే, పిల్లలు ఆ గేటు దాటి, ఇవతలికి రావడానికి వీల్లేదు. గేటుకు అవతల రెండు శిలావిగ్రహాలు... సాయంత్రపు నీరెండ పడి మెరుస్తున్నాయి. గేటు వైపు దొర్లిన బంతిని తీసుకోవడానికి వచ్చిన అయిదో తరగతి కుర్రాడు ఆ విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి రెండు నిమిషాల ముందువరకూ అక్కడ ఎలాంటి విగ్రహాలూ లేవు. స్కూలు పరిసరాలన్నీ ఆ పిల్లాడికి కొట్టిన పిండి. హఠాత్తుగా అప్పటికప్పుడు, అక్కడ ఆ విగ్రహాలు ఎలా ప్రత్యక్షమయ్యాయో అర్థం కాక, అయోమయంగా చూశాడు. చేత్తో తాకి చూశాడు. నునుపైన రాతిస్పర్శ! బంతిని అక్కడే విసిరేసి, ‘‘ఒరే శ్రీకాంతూ, అశ్వినూ, భాస్వంతూ, నీరజా, వినీతా...’’ అంటూ ఆటస్థలం వైపు పరిగెత్తాడు. ఆ వార్త పెద్దపిల్లల చెవిన కూడా పడింది. బిలబిలమంటూ గేటు దగ్గరకు చేరుకున్నారు. అర్జెంటుగా వెళ్లి టీచర్లకు, వార్డెన్లకు చెప్పారు. ‘‘ఇదేంటండీ, ఇంత వింతగా ఉంది. అసలీ విగ్రహాలిక్కడికి ఎలా వచ్చాయి’’ వార్డెన్ వంక వింతగా చూస్తూ అడిగాడు ఇంగ్లిషు మాస్టారు. ఆయనకు యాభైపైనే ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. పిల్లలతో పాటు హాస్టల్లోనే ఉంటాడు. ‘‘అదే అర్థం కావటం లేదండీ’’ తల గోక్కుంటూ చెప్పాడు వార్డెన్. రూముల్లోనే ఉండిపోయిన ట్యూషన్ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాలు, కుక్లు, సెక్యూరిటీగార్డులు, అటెండర్లు... స్కూలుకు సంబంధించిన యావత్ సిబ్బందీ ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. ‘‘జాగ్రత్తగా చూడండి మాస్టారు... ఈ పెద్ద విగ్రహంలో రాముడి పోలికలు కనిపించడం లేదూ’’ ఒకరి అనుమానం. ‘‘అబ్బెబ్బే, ససేమిరా కాదు. పెద్ద విగ్రహం స్త్రీ పోలికతో ఉంది. చిన్నది పురుషుడ్ని పోలి ఉంది’’ మరొకరి ప్రకటన. ‘‘అయితే, మన స్కూల్లో దేవతలు వెలిశారంటారా?’’ ఇంకొకరి సందేహం. ‘‘ఊరుకోండి సార్. ఇవి దేవతల విగ్రహాలు కానేకాదు’’ ఒక వార్డెన్ ధ్రువీకరణ. ‘‘స్కూలుకి ఏదో కీడు జరగబోతోంది. దానికిది సంకేతం’’ ఓ సూపర్వైజర్ భవిష్యవాణి. ‘‘పోలీసులకు ఫోన్ చేస్తే?’’ ఓ ట్యూషన్ టీచర్. ‘‘సమయానికి ప్రిన్సిపల్ గారు కూడా లేరు...’’ ‘‘ప్చ్... ఏమిటోనండీ, నాలుగు నెలల నుంచీ స్కూలు స్కూల్లా లేదు. రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి...’’ దిగులుగా అన్నాడు ఇంగ్లిషు మాస్టారు. కర్నూలులో దయాకర్రావు పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్. లాభాపేక్ష లేకుండా వైద్యసేవలందించేవారు. తల్లిదండ్రుల నుండి విలువైన ఆస్తులు సంక్రమించడంతో ఆయన ఏనాడూ డబ్బుకోసం తాపత్రయపడలేదు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ అమెరికాలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నెలనెలా తండ్రికి డబ్బు పంపేవారు. ఆ డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టి, కొంత మొత్తం అయ్యాక పట్టణ శివార్లలో పదెకరాల పొలం కొన్నారు దయాకర్రావు. అది ఖాళీగా ఉండడం ఎందుకుని, బ్యాంకులోను తీసుకుని, భవనాలు కట్టారు. మంచి పాఠశాల నడపాలనే తన చిరకాల కోరికను ఆ భవనాల సాక్షిగా నిజం చేసుకున్నారు. అతి తక్కువ ఫీజులతో, సకల సదుపాయాల వసతి గృహాలతో ప్రారంభించారు. ఆదర్శ భావాలున్న ప్రిన్సిపల్ను, మంచి జీతాలతో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించారు. ఫలితంగా ఆ స్కూలు రెండు సంవత్సరాల్లోనే మంచి పేరు సంపాదించుకుంది. నాలుగేళ్లు తిరక్కుండానే రెండువేల మంది పిల్లలకు అక్షరాలయంగా మారింది. దయాకర్రావు ప్రతిరోజూ సాయంత్రం స్కూలుకు వచ్చేవారు. పిల్లలతో కలిసిపోయేవారు. సరదాగా పాఠాలు చెప్పేవారు. స్కూలు ఒంటిగంటకే అయిపోయేది. భోజనానంతరం పిల్లలందరూ ల్యాబ్లకు చేరుకునేవారు. డ్రాయింగ్, కార్పెంటరీ, టాయ్మేకింగ్... ఎవరికి ఆసక్తి ఉన్న అంశం మీద వారు పనిచేసేవారు. కథలు, కవితలు, వ్యాసరచన, ఉపన్యాసం, మిమిక్రీ, పప్పెట్రీ... పిల్లల మనసుల్ని వికసింపజేసే ఇలాంటి అంశాల్లో ప్రతివారం పోటీలు పెట్టి, ఆకర్షణీయమైన బహుమతులిచ్చి, పిల్లల మనసులు దోచుకునేవారు. సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదో ఒక ఆట ఆడి తీరాల్సిందే. జోనల్, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో జరిగే పోటీల్లో ఆ స్కూలు విద్యార్థులు బహుమతుల్ని కొల్లగొట్టేవారు. ఆడుతూ పాడుతూ చదివినా, పదో తరగతి పరీక్షల్లో ఆ స్కూలు నుంచి కనీసం ఇద్దరైనా మొదటి పది ర్యాంకుల్లోపు నిలిచేవారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల్ని చూడ్డానికి తల్లిదండ్రులు ఎప్పుడైనా రావచ్చు. గత సంవత్సరం దయాకర్రావు భార్య మరణించడంతో ఆయన ఒంటరి అయ్యారు. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కొడుకులిద్దరూ అమెరికా నుంచి వచ్చి, యుద్ధప్రాతిపదికన స్కూలును నష్టానికి అమ్మేసి, తండ్రిని తమతోపాటు అమెరికా తీసుకెళ్ళారు. కొత్త యాజమాన్యానికి వ్యాపారమే ప్రథమ ప్రాణం. స్కూలు తమ ఆధీనంలోకి రావడమే ఆలస్యం, వ్యవస్థను మార్చేశారు. కొత్త ప్రిన్సిపల్ను నియమించారు. చాలామంది టీచర్లను మార్చారు. అనేక కొత్త నిబంధనలను అమల్లో పెట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిషేధించారు. పిల్లలు ప్రతిరోజూ ఆడుకోవడానికి వీల్లేదు. పిల్లల్ని చూడాలనుకునే తల్లిదండ్రులు నెలలో మూడో ఆదివారం మాత్రమే రావాలి. అది కూడా మూడుగంటల పాటు మాత్రమే వారితో గడిపి, వెళ్లిపోవాలి. చదువు....చదువు... చదువు.... చదువుకోవడం మాత్రమే చేయాలి. సిబ్బంది బెత్తాలు పట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. పిల్లల మీద పెత్తనం చేయడం ప్రాక్టీస్ చేశారు. సిబ్బంది గాడిలో పడ్డారుగానీ, పిల్లలు మాత్రం ఆ వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారం వారం తల్లిదండ్రుల ఒడిలో సేదదీరే అలవాటున్న పిల్లలు, మూడు వారాలు గడిచేసరికి కన్నవారి కోసం అల్లాడిపోతున్నారు. నాలుగో వారంలో జరిగిందా సంఘటన. సుస్మిత నాలుగో తరగతి చదువుతోంది. అమ్మ మీద మొదలైన బెంగ, అలా అలా మర్రిచెట్టులా పెరిగిపోయి, ఊడలు దిగింది. అమ్మను చూడకుండా, అరక్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకుంది. సాయంత్రం హాస్టలు గదికి వచ్చి, దిగులుగా మంచం మీద పడుకుంది. ఆయా వచ్చి, ఏమైందని అడిగింది. ‘‘ఆయా, నాకు అమ్మను చూడాలని ఉంది. ఏడుపొస్తంది. ప్లీజ్ ఆయా, మా నాన్నకు ఫోన్ చేసి, వచ్చి తీసుకెళ్లమని చెప్పవా’’ దీనంగా అడిగిందా పాప. ‘‘లేదమ్మా, అలా ఒప్పుకోరు. ఇంకెంత, ఒక్కవారం ఓపిక బట్టు. వచ్చే ఆదివారం మీ అమ్మానాన్నలు వస్తారుగా’’ ఓదార్చడానికి ప్రయత్నించింది. ‘‘నో నో, నాకిప్పుడే మమ్మీ కావాలి’’ మారాం చేసింది. ఇంతలో ఆ ఫ్లోర్ సూపర్వైజర్ వచ్చాడు, విజిల్ ఊదుకుంటూ. ‘‘ఏం తమాషానా? ఒక్కర్ని పంపిస్తే, అందరూ అడుగుతారు...’’ సుస్మితను రెక్క పట్టుకుని లేపి కూర్చోబెట్టి, ‘‘కమాన్, ఫ్రెష్షప్ అయి, ట్యూషన్కు వెళ్లు’’ అంటూ గర్జించాడు. పాప ఏడ్చింది. అతను వెళ్లిపోయాడు, హుకుం జారీచేసి. బెడ్ల వద్ద ముగ్గురమ్మాయిలు మాత్రమే ఉన్నారు. మిగతావారంతా ట్యూషన్కు వెళ్లిపోయారు. తళుక్కున సుస్మిత చిన్నిబుర్రలో ఏదో మెరిసింది. బుక్షెల్ఫ్ ఓపెన్ చేసి, ఓ వస్తువును చేతిలోకి తీసుకుంది. ఒక్క నిమిషం తర్వాత ‘అమ్మా’ అంటూ పెద్దగా కేక పెట్టింది. ఆ కేక విని మిగతా ముగ్గురూ పరుగెత్తుకొచ్చారు. ఎడమచేతి మణికట్టు నుంచి రక్తం కారుతోంది. ఓ పాప గబగబా పరుగెత్తుతూ ఫ్లోర్ సూపర్వైజర్ దగ్గరకెళ్ళి, ‘‘సార్, సార్, సుస్మిత బ్లేడుతో చెయ్యి కోసుకుంది’’ చెప్పింది వగరుస్తూ. అతను హడావుడిగా ఆ గదికి చేరుకుని, తన కర్చీఫ్ తీసి, సుస్మిత చేతికి చుట్టాడు. ఆ తర్వాత సిక్రూముకు తీసుకెళ్లాడు. విషయం ప్రిన్సిపల్ దాకా చేరింది. ఆయనే స్వయంగా సుస్మిత తండ్రికి ఫోన్చేసి, వెంటనే రమ్మని చెప్పాడు. మహబూబ్నగర్లో ఉంటున్న సుస్మిత తల్లిదండ్రులు మూడుగంటలలోపే స్కూలు చేరుకున్నారు. తల్లిదండ్రుల్ని చూడగానే, సుస్మిత మొహం విప్పారింది. చేతిగాయం మర్చిపోయింది. పరుగు పరుగున వెళ్లి, తల్లి ఒడిలో దూరిపోయింది. ప్రిన్సిపల్ అనుమతితో సుస్మితను ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. మరుసటి నెలలో మరో సంఘటన. ఆరో తరగతి చదువుతున్న ఆశిష్కు నాయనమ్మంటే ప్రాణం. ప్రతివారం తల్లిదండ్రుల వెంట ఆమె కూడా వచ్చి మనవణ్ని చూసుకుని మురిసిపోయేది. ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేది. బోల్డన్ని ముద్దులు పెట్టేది. గత నెల మూడో ఆదివారం తల్లిదండ్రులు వచ్చారుగానీ, అనారోగ్యం కారణంగా నాయనమ్మ రాలేదు. పది రోజుల్నుంచీ ప్రతిరాత్రీ ఆమె కలలో కనిపిస్తుంటే, వెంటనే చూడాలన్న తపన పెరిగిపోతోంది. ఆశిష్కు చదువు మీద గురి కుదరడం లేదు. మనసంతా మహా దిగులు. ‘ఎలాగైనా ఇంటికెళ్లాలి. నాయనమ్మను చూడాలి’. సుస్మిత మెదిలింది అతని మనసులో. ఇంకా పెద్ద సాహసం చేయాలి. సాయంత్రం అయిదు గంటల వేళ... మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకేశాడు. అతని అరుపు ఆ మైదానంలో ప్రతిధ్వనించింది. పిల్లలూ సిబ్బందీ ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. ఆశిష్ కాలు విరిగింది. పక్కటెముకలు దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని చెప్పారు. అమ్మానాన్నలు వచ్చారు. నాయనమ్మ వచ్చింది. ఆమెతోపాటే ఆశిష్ కళ్లల్లో వెలుగు వచ్చింది. ఇంత సీరియస్ కాకపోయినా, మరుసటి నెలలోనూ రెండుమూడు చెదురుమదురు సంఘటనలు. ఇప్పుడీ విగ్రహాల ప్రహసనం! రాత్రి ఏడున్నర దాటింది. పిల్లలూ పెద్దలూ ఎవ్వరూ కదలడం లేదు, ఆ విగ్రహాల దగ్గర్నుంచి. చివరికి ఇంగ్లిషు మాస్టారు సాహసం చేసి, ప్రిన్సిపల్కు ఫోన్ చేశారు. ‘‘వ్వాట్? ఏమిటి మీరనేది?’’ ఫోన్లోనే రంకెలేశాడు ప్రిన్సిపల్. ‘‘నిజం సార్. మాకంతా అయోమయంగా ఉంది. మీరు వస్తే కాస్తంత ధైర్యంగా ఉంటుందని...’’ ‘‘ఓకే, ఐ విల్ బీ దేర్ వితిన్ టెన్ మినిట్స్’’ ఫోన్ పెట్టేశాడు. మాటమీద నిలబడుతూ, పది నిమిషాల్లోపే స్కూలు గేటులో అడుగుపెట్టాడు ప్రిన్సిపల్. ‘ముందుగా ఎవరు చూశారు? ఎలా జరిగింది? ఎందుకిలా జరిగింది?’ అంటూ రకరకాల ప్రశ్నలతో పావుగంటే సేపు సమీక్ష జరిపాడు. ఆ విగ్రహాలకు అతి సమీపంలోనే, అటెండరు తెచ్చి వేసిన కుర్చీలో కూర్చుని, కళ్లు మూసుకుని, దీర్ఘంగా ఆలోచించాడు ప్రిన్సిపల్. ‘‘అవును, పిల్లల్లో ఎవరైనా మిస్ అయినట్లుందా?’’ ప్రశ్నించాడు, కళ్లు తెరవకుండానే. ‘‘గమనించలేదు సార్’’ రెండువేల మంది పిల్లల్లో, ఒకరిద్దరు మిస్ అయినా, పసిగట్టడం అంత సులభం కాదు. ‘‘పిల్లలందరినీ క్లాసువారీగా సమావేశపర్చి, హాజరు తీసుకోండి’’ పది నిమిషాల తర్వాత ఇంగ్లిషు మాస్టారు కాస్తంత కంగారుగా, చాలా హడావుడిగా వచ్చాడు. ‘‘సార్ సార్, సెవెన్త్ క్లాస్లో చందన, ఫిఫ్త్లో కిరణ్ కనిపించడం లేదు’’ చెప్పాడు కళ్లజోడు సవరించుకుంటూ. ‘‘అదీ... ముడి వీడింది’’ తేలిగ్గా నవ్వుతూ అనేశాడు ప్రిన్సిపల్. ‘‘ఏమిటి సార్, ఏం జరిగింది?’’ మరింత అయోమయంగా అడిగాడు ఇంగ్లిషు మాస్టారు. ‘‘మాయమైన వాళ్లిద్దరూ అక్కాతమ్ముళ్లు కదూ’’ ‘‘అవును సార్’’ ప్రిన్సిపల్ ఎవరికో ఫోన్ చేశాడు, ‘‘ఆ శ్రీనివాస్గారూ, ఎక్కడిదాకా వచ్చారు’’ ఫోన్ మాట్లాడాక- ‘‘సరిగ్గా పది నిమిషాల తర్వాత ఈ విగ్రహాలు మాయమవుతాయి’’ అని చిద్విలాసంగా ప్రకటించాడు. చుట్టూ చేరినవారు మరింత అయోమయంగా చూశారు. చందన, కిరణ్ తండ్రి శ్రీనివాస్ మధ్యాహ్నం ప్రిన్సిపల్కు ఫోన్ చేశాడు. తన తండ్రి మరణించారనీ, ఒక్కరోజు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతించాలనీ అభ్యర్థించాడు. సరేనన్నాడు ప్రిన్సిపల్. చందన, కిరణ్లను తన ఛాంబర్కు పిలిపించుకుని, ‘‘మీ అమ్మానాన్నలు వస్తున్నారు. ఇంటికెళ్లి, మళ్లీ ఎల్లుండి ఉదయానికంతా ఇక్కడుండాలి’’ అని చెప్పాడు. సాయంత్రం స్కూలు వదలగానే ప్రిన్సిపల్ ఇంటికెళ్లిపోయాడు. చందన, కిరణ్లు గేటుదాకా వచ్చి, తల్లిదండ్రుల కోసం ఎదురు చూడసాగారు. ముళ్ల మీద నుంచున్నారు. అసహనంగా కదిలారు. కళ్లు విప్పార్చి చూశారు. సమయం భారంగా గడుస్తోంది. ట్రాఫిక్జామ్లో చిక్కుకున్న తల్లిదండ్రులు రావడం ఆలస్యం కావడంతో... వాళ్లలా ఎదురు చూసీచూసీ... ‘‘అదిగో కారొస్తంది...’’ పిల్లల్లో ఎవరో అరిచారు. అందరూ అలర్టయ్యారు. సెక్యూరిటీ దాటుకుని, మెయిన్గేటు దాకా వచ్చి, ఆగిన కారులోంచి శ్రీనివాస్, ఆయన భార్య దిగారు. మెల్లగా నడుస్తూ, మెయిన్గేటు దాటారో లేదో... విగ్రహాల్లో చిన్న కదలిక. చూస్తుండగానే శిలలు కరిగిపోయాయి. వాటికి ప్రాణం వచ్చింది. చందన, కిరణ్ ప్రత్యక్షమై, తల్లిదండ్రులకు ఎదురుగా పరుగెత్తుకెళ్లారు. అప్పట్నుంచీ అడపాదడపా క్యాంపస్లో విగ్రహాలు ప్రత్యక్షమవుతూనే ఉన్నా, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. -
శివ..శివా!
గుంటూరు క్రైం/నరసరావుపేటరూరల్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెతను నిజం చేయజూసిన దేవాలయ ఉద్యోగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆలయంలో దొంగిలించిన విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి.. నరసరావుపేట మండలం కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో మూలవిరాట్కు నలభై ఏళ్లుగా ఇత్తడి మండపవాహుకలు ఉన్నాయి. ప్రస్తుత నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు 2013లో వాటి స్థానంలో వెండి విగ్రహాలను సమర్పించారు. దీంతో గతంలో ఉన్న ఇత్తడి విగ్రహాలను ఆలయ అధికారులు స్టోర్రూమ్లో భద్రపరిచారు. ఈ ఆలయంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండే కొండకావూరుకు చెందిన దుర్గా కోటేశ్వరరావు స్టోరూంలో వున్న 60 కిలోల బరువుగల రెండు ఇత్తడి విగ్రహాలను దొంగిలించేందుకు పథకం వేశాడు. ఇందుకోసం మరో ఐదుగురు వ్యక్తులతో చేతులు కలిపి, విగ్రహాలను చోరీ చేశాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు కోటప్పకొండకు చెందిన ముగ్గురు, పిడుగురాళ్ళ, గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు వారం క్రితం గుంటూరులోని పాత ఇత్తడి కొనుగోలుదారుల వద్దకు వెళ్లారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అర్బన్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిండంతో విగ్రహాల చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో విషయాన్ని నరసరావుపేట రూరల్ పోలీసులకు చేరవేసి దేవాలయ ఇన్చార్జ్ ఈవోకు కబురు చేశారు. చిత్రం ఏమిటంటే దొంగలు పోలీసుల చేతికి చిక్కే వరకూ కనీసం దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం ఆలయ అధికారులు గుర్తించలేదు. నరసరావుపేట రూరల్ పోలీసులు సమాచారం అందించడంతో స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు గత నెల 28వ తేదీన ఆలయ ఈవో డి.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు సైతం రహస్యంగా ఉంచారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు ఇత్తడి విగ్రహాలనూ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులు అర్బన్ సీసీఎస్ పోలీసుల అదుపులో ఉండటంతో నిందితులను నేడో, రేపో అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది. -
విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి
సాక్షి, ముంబై: నగరంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన మహనీయుల విగ్రహాల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ రమేశ్ కాంబ్లే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హోం శాఖకు లేఖ రాశారు. గతంలో ఘాట్కోపర్లోని రమాబాయి అంబేద్కర్ నగర్, నాందేడ్, ఔరంగాబాద్, నాసిక్ తదితర ప్రాంతాల్లో గుర్తుతెలియని దుండగులు మహానీయుల విగ్రహాలకు హాని తలపెట్టిన ఘటనలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద సంఖ్యలో జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేయాలంటే మహనీయుల విగ్రహాల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంబ్లే అభిప్రాయపడ్డారు. ఈ కెమెరాల నియంత్రణను స్థానిక పోలీసు స్టేషన్లకు అనుసంధానించాలని సూచించారు. గల్లీలో, వాడల్లో, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాల బాగోగులు చూసుకునే బాధ్యత స్థానిక సంస్థలపై ఉంటుంది. దీంతో ఆ సంస్థలను విశ్వాసంలోకి తీసుకుని కెమెరాలు ఏర్పాటు చేయాలని కాంబ్లే డిమాండ్ చేశారు. -
విగ్రహాల తొలగింపు యోచన రెచ్చగొట్టడమే: కిషన్రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్లో ట్యాంక్బండ్పై ఉన్న ఆంధ్రాప్రాంత మహనీయుల విగ్రహాలను తొలగించాలనే యోచన సరికాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. సోవువారం ఆయున మీడియూతో వూట్లాడుతూ అది తెలంగాణ సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణికి నిదర్శనమన్నారు. తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టేందుకు అక్కడ బోలెడంత చోటుందని, అలాంటప్పుడు ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలను తొలగించాలని యోచించటం సరికాదని కేసీఆర్కు హితవు పలికారు. ఆంధ్రావారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తూ ఆ ప్రాంతం వారి విగ్రహాలు ఉండటంలో తప్పేంటని ప్రశ్నిం చారు. ఆంధ్రాలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్న తరుణంలో తెలంగాణ కరెంటు కోతలతో అల్లాడుతోందని, పరిస్థితిని చక్కదిద్దాలన్న ఆలోచన సీఎంకు లేదన్నారు. -
ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్కు విఘాతం
హైదరాబాద్ : ట్యాంక్బండ్పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన సోమవారమిక్కడ అన్నారు. సీమాంద్ర విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్కు విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు మాట్లాడేవారు మధ్య విద్వేషాలు మంచిది కాదని శంక్రరావు అన్నారు. -
అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం
ట్యాంక్బండ్పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఇతరుల విగ్రహాలను కూల్చబోం..గౌరవంగా పంపిస్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ హైదరాబాద్: హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు చెప్పారు. అక్కడ అక్కర్లేని విగ్రహాలను తొలగించాల్సి ఉందని.. ఆ స్థానంలో తెలంగాణ కోసం పోరాడిన వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే తమకు అవసరంలేని విగ్రహాలను కూల్చబోమని, వాటిని తీసి గౌరవంగా పంపిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో బీజేపీకి స్నేహం ఉంటే ఉండవచ్చని.. విగ్రహాల విషయంలో మాత్రం బీజేపీ తమతో సహకరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నారాయణగూడ పద్మశాలిభవన్ వద్ద ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్బంధం, వ్యతిరేక పరిస్థితులు, ఒడిదుడుకుల్లోనూ తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్లేనని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు సభలు పెట్టినా వారు వెళ్లేవారు. వాటికి వచ్చే కొద్దిమందితో ఏం చేస్తారని నేను ప్రశ్నించినపుడు.. ‘ఎవరైనా నీలాంటి వారు ముందుకొచ్చి ఉద్యమం చే యాలనుకున్నపుడు వీరంతా ఉపయోగపడతార’ని నాకు చెప్పారు. అందుకే తెలంగాణ సమాజానికి వారిద్దరిని మించిన గొప్పవారు లేరు..’’ అని ఆయన పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగా నెలకో కార్యక్రమం చొప్పున ఏడాది పాటు నిర్వహించేందుకు చర్యలు చేపడుతామన్నారు. తెలుగు యూనివర్సిటీకి లేదా మరేదైన మంచి సంస్థకు బాపూజీ పేరు పెడతామన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మిషన్ను అమలుచేస్తామన్నారు. ఆ మిషన్కు కొండా లక్ష్మణ్ పేరు పెడతామన్నారు. టీఆర్ఎస్ బాపూజీ ఇంట్లో (జల దృశ్యంలో)నే ఏర్పాటైందని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి పుట్టినిల్లు అయిన బాపూజీ ఇంటిని కక్ష గట్టి కూలగొట్టారని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ఆశ్రయం ఇచ్చినందునే ఈ పని చేశారని చెప్పారు. ఆ తరువాత పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వలేదని, ఈ విషయాలపై తాను సమీక్షిస్తానని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, దత్తాత్రేయ, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, బాపూజీ కుమార్తె పవిత్రారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్: న్యాయవ్యవస్థలో దశలవారీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల సహకారంతో పటిష్టమైన చట్టాలను రూపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ వివక్షకు గురైనట్లే న్యాయవ్యవస్థకూ అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటీ కోర్టులు ఏర్పాటు చేసి 150 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్రపై రూపొందించిన ఫొటోల ఆల్బంను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని నిజాం నవాబు ఆనాడే గుర్తించారని.. కోర్టులు ఇచ్చే తీర్పులకు తాను బద్ధుడినై ఉంటానని ప్రకటించారని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్ కోర్టుల్లో జిల్లాల వారీగా ఉత్తమ న్యాయవాది అవార్డును ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘ఉత్తమ న్యాయవాదికి రూ.లక్ష బహుమతి ఇస్తాం. న్యాయవాదుల సంక్షేమం కోసం ఇప్పటికే ప్రకటించిన రూ. 100 కోట్లను వెంటనే విడుదల చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వారికి ఆరోగ్య కార్డులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. అలాగే ఫ్లాట్లు నిర్మించుకునేందుకు వీలుగా న్యాయవాదుల సొసైటీలకు సిటీకి దగ్గరలో భూమిని కేటాయిస్తాం’ అని చెప్పారు. -
ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివి
హైదరాబాద్ : ట్యాంక్బండ్పై ఉన్న విగ్రహాలు తెలుగువారివే కానీ...ఆంధ్రులవి కావని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కొందరు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలుగువారి గౌరవానికి నిదర్శనంగా ఎన్టీఆర్ ....మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. ట్యాంక్బండ్పై ఉన్న ఆంధ్రవారి విగ్రహాలను తొలగిస్తామన్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలను శంకర్రావు ఖండించారు. కాగా ట్యాంక్బండ్పై ఉన్న అనవసర ఆంధ్రావాళ్ల విగ్రహాలను తొలగించి, వాటి స్థానంలో నూతన విగ్రహాలకు ప్రతిష్టిస్తామని నాయిని నిన్న సికింద్రాబాద్లోని వీర శైవ లింగాయత్ లింగబలిజ సమావేశంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
గణపవరంలో వైఎస్, రంగా విగ్రహాల ఆవిష్కరణ
గణపవరం(నాదెండ్ల),న్యూస్లైన్: గణపవరంలోని పోలేరమ్మ గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహనరంగా విగ్రహాలను వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ట, గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) బుధవారం రాత్రి ఆవిష్కరించారు. దీనికి ముందు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి నుంచి గ్రామంలోని పోలేరమ్మ గుడి సెంటర్ వరకు పార్టీ నాయకులు,కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, తీన్మార్ డప్పులతో సందడి చేస్తూ భారీ ప్రదర్శనగా తరలివచ్చారు. అనంతరం జరిగిన సభలో పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ మోహనరంగా హత్యతో అధికారంలో వచ్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్, వంగవీటి మోహనరంగా స్నేహానికి గుర్తుగా గణపవరంలో వారి విగ్రహాలను ఏర్పాటు చేయ టం అభినందనీయమన్నారు. కాపులను బీసీల్లో చేర్చే దమ్మున్న ఏకైక పార్టీ వైఎ స్సార్ కాంగ్రెస్ అని తెలిపారు. వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని వంచించిందని, గాంధీభవన్లో రంగా చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. తన తండ్రి బతికినంత కాలం పేదల పెన్నిధిగా ఉన్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా కుట్ర పన్నిప్పుడు వైఎస్ ఆదుకొని టికెట్ ఇప్పించారని గుర్తు చేశారు. గుంటూరు, కృష్ణాజిల్లాల సమన్వయ కర్త ఆర్కే మాట్లాడుతూ పేద ప్రజలకోసం పరితపించిన మహానాయకులు వైఎస్సార్, వంగవీటి రంగా అని కొనియాడారు. వారి స్పూర్తితో ప్రజాసేవలో ఉన్న వారి వారసులను ఆదరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతున్నదని తెలిపారు. జిల్లా కన్వీనర్ మర్రిరాజశేఖర్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగాకు చిలకలూరిపేటతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. రంగా అభిమానులు వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని విజ్ఙప్తి చేశారు. సభకు రిటైర్డ్ ఉపాధ్యాయడు గాలి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సభలో గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు తూర్పు సమన్వయ కర్త షేక్ షౌకత్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ నాయకులు చిన్నపురెడ్డి, బెనర్జీ, మాజీ ఎంపీపీ వీరారెడ్డి, గ్రామపార్టీ అధ్యక్షులు కాట్రు రమేష్, పట్టణ, వివిధ మండలాల కన్వీనర్లు ఏవీఎం సుభానీ, కాట్రగడ్డమస్తాన్రావు, చల్లా యజ్ఞేశ్వరరావు, చాపలమడుగు గోవర్ధన్, సర్పంచ్లు, వివిధ అనుబంధ సంఘాల కన్వీనర్లు పాల్గొన్నారు. -
గోవిందా..గోవిందా !
సాక్షి, గుంటూరు: దేవుడిని నమ్ముకొంటే కోరికలు నెరవేరతాయి. అదే దేవుడిని అమ్ముకొంటే లాభ పడవచ్చనే దురాలోచనతో జిల్లాలో విగ్రహాల దొంగల ముఠా సంచరిస్తుంది. పురాతన ఆలయాల్లోని పంచలోహ విగ్రహాలే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తున్నట్టు సమాచారం. గతంలో అనేక ప్రాంతాల్లో దేవుడి విగ్రహాలు మాయం కావడంపై ఫిర్యాదులు వున్నప్పటికీ, అసలు దొంగలెవరనేది పోలీసులు తేల్చలేక పోయారు. తాజాగా ఫిరంగిపురంలో ఒక ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు రోజుల కిందట ఫిరంగిపురంలో తెల్లవారుజామున అలజడి రేగింది. గ్రామంలో పోలేరమ్మ దేవాలయంలో ఉన్న భద్రకాళీ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్తున్న ఇద్దర్ని స్థానికులు పట్టుకున్నారు. భారీ బరువు ఉన్న రాతి విగ్రహాన్ని బైక్పై తీసుకు వెళ్లే ప్రయత్నంలో దొరికిపోయారు. వీరిలో సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు, మరొకరు ఫిరంగిపురం మండలం బేతపూడికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరంతా ఉదయం పోలేరమ్మ దేవాలయాన్ని సందర్శించి రాత్రికి విగ్రహాన్ని పలుగు,పారలతో పెకిలించినట్లు తెలిసింది. రెడ్డిరాజుల కాలంనాటి ఈ రాతి విగ్ర హంలో బంగారం, విలువైన వజ్రాలు (రాతి మధ్యన రంధ్రం చేసి ఉంచుతారని) ఉంటాయని ఇలాంటి విగ్రహాలను పగులకొట్టి వజ్రాలు, బంగారాన్ని కాజేయాలని ముఠా పన్నాగంగా తెలుస్తోంది. పల్నాడులో విగ్రహాలు మాయం.. మూడేళ్ల కిందట నరసరావుపేటలో బేల్దారి సామగ్రి అద్దెకిచ్చే వ్యక్తి అందించిన సమాచారంతో విలువైన పంచలోహ విగ్రహాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దులో వున్న ఓ పురాతన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని తవ్వేందుకు బేల్దారి సామగ్రి దుకాణం నుంచి పలుగులు, పారలు తీసుకెళ్లారు. చాలారోజుల వరకు వాటిని తిరిగి అప్పగించకుండా, అద్దె చెల్లించ కుండా ఆలస్యం చేయడంతో ముఠా గుట్టు పోలీసులకు తెలిసింది. అప్పట్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆ ముఠా సభ్యులను పోలీసులు వదిలేసినట్లు దుమారం రేగింది. అదేవిధంగా ఏడాది కిందట బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం సుగాలితండాలో ఒక అరుదైన పంచలోహ విగ్రహాన్ని అమ్ముకోవాలనే ప్రయత్నంలో స్థానికుల ఘర్షణ పోలీసుల దృష్టికెళ్లింది. విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ఆరాతీయగా, ఆ ఇద్దరు సత్తెనపల్లిలో మట్టిపని కెళితే పంచలోహ విగ్రహం దొరికిందని చెప్పారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి వినుకొండ కోర్టుకు సమర్పించారు. మాచర్ల, దాచేపల్లితో పాటు కోటప్పకొండ ప్రాంతంలో గతంలో రాతి విగ్రహాలు మాయమైనట్టు ఫిర్యాదులున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి పంచలోహ విగ్రహాలే లక్ష్యంగా సంచరిస్తున్నట్టు సమాచారం. 25న కాంట్రాక్ట్ అధ్యాపకుల చలో హైదరాబాద్ గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంట్రాక్ట్ అధ్యాపక సంఘ కార్యదర్శి కె.సురేష్ పిలుపు మేరకు ఈనెల 25న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ధ జరిగే సంకల్ప దీక్షకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తరలిరావాలని కోరారు. -
అన్ని ప్రాంతాల్లోనూ ఠాక్రే విగ్రహాలు
సాక్షి, ముంబై: దివంగత నాయకుడు బాల్ఠాక్రే విగ్రహాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపించనున్నాయి. వీధుల్లో కాకపోయినా శివసేన కార్యాలయాలన్నింటిలోనూ స్థాపించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికపై పనులు కొనసాగుతున్నట్టు సమాచారం. శివసేన ఎంపీ అనీల్ దేశాయి ముంబైలో శుక్రవారం జరిగిన ‘మార్మిక్’ వారపత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరికొన్ని నెలల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విగ్రహాలు ఓటర్లపై కొంతమేరకైనా ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర ప్రజల మనసులపై చెరగని ముద్రవేసిన బాల్ఠాక్రే హిందూ హృదయ సామ్రాట్గానూ గుర్తింపు పొందారు. శివసేన కార్యకర్తలతోపాటు పార్టీలకతీతంగా రాష్ట్రంలోని చాలా మంది నాయకులు కూడా ఆయన్ను అభిమానిస్తారు. కనుసైగలతోనే ఠాక్రే అందరినీ శాసించేవారని అనుచరులు చెబుతారు. ఆయన ప్రసంగాల నుంచి వచ్చే వాగ్భాణాలు ప్రత్యర్థుల గుండెల్లోకి చొచ్చుకుపోయేవని శివసేన సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. అందుకే ఠాక్రే వారసత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ శివసేన తీసుకుంటోంది. విగ్రహాలు అంతటా ప్రతిష్ఠిస్తే కార్యకర్తలకు మరింత గౌరవంతోపాటు పార్టీ బలోపేతమవుతోందని సేన నాయకత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు శివసేన శాఖల్లో కేవలం ఛత్రపతిశివాజీ మహారాజు విగ్రహాలు ఉండేవి. ఇక నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం పక్కనే బాల్ఠాక్రే విగ్రహాలు కూడా దర్శనమివ్వనున్నాయి.