రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | one died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Feb 1 2017 12:47 AM | Updated on Aug 30 2018 4:10 PM

నగర శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

కర్నూలు(అర్బన్‌) : నగర శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిమెంట్‌ లారీని ఐచర్‌ ఢీకొంది. దీంతో ఐచర్‌ వాహనంలో నిద్రిస్తున్న కో డ్రైవర్‌ రవీంద్రరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్‌ విజయకుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన రవీంద్రరెడ్డి ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామవాసిగా గుర్తించారు. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement