నందవరం మండలం పెద్దకొత్తిలి క్రాస్ రోడ్డు వద్ద ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది.
నందవరం మండలం పెద్దకొత్తిలి క్రాస్ రోడ్డు వద్ద ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చిన్న కొత్తిలి గ్రామానికి చెందిన లక్ష్మి(40) అనే మహిళ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా..మరో పది మందికి స్వల్పగాయాలయ్యాయి. వీరంతా చిన్న కొత్తిలి గ్రామం నుంచి ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుండగా జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.