జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
Published Wed, Jul 27 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
నిజామాబాద్అర్బన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎట్టకేలకు ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమయ్యింది. కొన్ని రోజులుగా ఆక్సిజన్ అందుబాటులో లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్యసేవలకు ఇబ్బంది ఏర్పడింది. బుధవారం ఆసుపత్రి సూపరిండెంట్ నరేంద్రకుమార్ ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. వెంటిలేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement